1 ENS Live Breaking News

ఈవీఎంలకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌.. క‌లెక్ట‌ర్

ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల‌ (ఈవీఎం) భ‌ద్ర‌త‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి ఎన్నిక‌లు, రెవెన్యూ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. గురువారం ఉద‌యం  కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి పరిశీలించారు. ఈవీఎంల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు సంబంధించి చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గ‌నిర్దేశాల మేర‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, స‌మ‌గ్ర నివేదిక‌ను పంపిస్తున్న‌ట్లు వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, కాకినాడ పట్టణ తాహసీల్థార్ వైహేచ్ ఎస్.సతీశ్ , క‌లెక్ట‌రేట్ ఎన్నిక‌ల డిప్యూటీ త‌హ‌సీల్దార్ ఎం.జ‌గ‌న్నాథం , త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-07-22 13:41:25

సీఎంను కలిసిన ఎస్పీ రవీంధ్రబాబు..

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రబాబు సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈమేరకు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంని కలిసిన విషయం జిల్లా కార్యాలయం ప్రకటనలో  తెలియజేసింది. రవీంధ్రబాబు ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరిన దగ్గర నుంచి జిల్లాలో చేపట్టిన సంస్కరణలు పరిపాలనపై సీఎం ఎస్పీ రవీంధ్రబాబుని అభినందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మహిళా పోలీస్ వ్యవస్థ, దిశ ను జిల్లాలో ప్రజలకు చేరువ చేయాలని ఈ సందర్భంగా సీఎం ఎస్పీకి సూచించినట్టు సమాచారం. చాలా కాలం తరువాత జిల్లాకి మంచి డేరింగ్ వున్న ఎస్పీ వచ్చి పోలీసుల వర్గాలే అదిరిపడేలా చేపడుతున్న  కార్యకలాపాలు, పోలీస్ శాఖలో చర్చనీయాంశం అవుతున్నాయి.

Kakinada

2021-07-22 13:26:08

అప్పన్నకు రూ.1,00,116 విరాళం..

 సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహస్వామి( సింహాద్రిఅప్పన్న)వారికి విశాఖ శివాజీపాలెంకు చెందిన కండ్రప ఉష, కృష్ణమూర్తి దంపతులు  లక్షా నూట పదహారు రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు పీఆర్వో ఆఫీసులోని డొనేషన్ల కౌంటర్లో  నగదు చెల్లించి రసీదు పొందారు.  శ్రీస్వామివారి నిత్య అన్నదాన పథకానికి ఈ విరాళమిస్తున్నట్లు దాతలు ప్రకటించారు. తమ పెళ్లిరోజైన జూన్ 21న భక్తులకు అన్నదానం చేయాలని దాతలు కోరారు. అనంతరం స్వామవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా దాతకు ఆలయ సిబ్బంది ప్రసాదాన్ని అందించగా, వేదపండితులు ఆశీర్వచనాన్ని అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-07-21 16:48:19

కాకినాడ రూరల్ లో విశేషంగా అభివ్రుద్ధి..

కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో 2 ఏళ్లలో రూ.66 కోట్లుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు రాష్ట్ర వ్యవసాయ, సహకార,మార్కెటింగ్,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. బుధవారం కాకినాడ గ్రామీణం కొత్త గైగోలుపాడు 49వ వార్డులో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమానికి కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి మంత్రి కురసాల కన్నబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాకినాడ గ్రామీణ నియోజకవర్గం అభివృద్ధికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి అమలు చేయడం జరిగిందన్నారు. గడిచిన రెండేళ్లలో కాకినాడ గ్రామీణ  నియోజకవర్గంలో స్మార్ట్ సిటీ, జనరల్ ఫండ్స్, 14 ,15- ఆర్థిక సంఘం నిధుల నుంచి సుమారుగా 66 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు. కాకినాడకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు రావడంలో నగరపాలక సంస్థ కమిషనర్,ఇతర అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటికే కాకినాడకు పెన్షనర్ ప్యారడైజ్ గా మంచి గుర్తింపు ఉందని అదేవిధంగా ఉత్తమ నివాసయోగ్యమైన పట్టణముగా కాకినాడకు  జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. 

కాకినాడ  నగరపాలక సంస్థలో అంతర్భాగంగా ఉన్న 49 వ వార్డులో సుమారుగా రూ.80 లక్షల వ్యయంతో సిసి రోడ్లు నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టడం జరిగిందని, నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందన్నారు. సీసీ డ్రైన్లు, మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు విద్యుత్ సమస్యలు తొలగించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. చెత్తను ప్రాసెస్  చేసి తిరిగి వినియోగించే విధంగా గార్బేజ్ ట్రాన్సఫర్ సెంటర్ ను సుమారుగా రూ.ఏడు కోట్ల రూపాయలతో కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు ప్రక్రియ పూర్తయిందన్నారు. రాబోయే రెండు,మూడు సంవత్సరాల్లో కాకినాడ స్థాయిని మరింత పెంచే విధంగా ప్రజా ప్రతినిధులు ,అధికారులు సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందన్నారు. కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓపెన్ సైట్స్ కి సంబంధించి ఆక్రమణలు చేసే వారిపై నగరపాలక సంస్థ ద్వారా చట్టపరమైన  చర్యలు తీసుకోవాలని  నిర్ణయించామని మంత్రి కన్నబాబు తెలిపారు. 

అనంతరం కొత్త గైగొలుపాడు 49వ వార్డులో ఉన్న శ్మశానశాన వాటిక, రోడ్డును స్మార్ట్ సిటీలో భాగంగా ఆధునీకరించేందుకు  సంబంధించి కమీషనర్ , ఇతర ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి కన్నబాబు చర్చించారు. అదేవిధంగా 49 వ వార్డులో సమారుగా రూ.80 లక్షల వ్యయంతో నిర్మాణంలో ఉన్న పీ.హెచ్.సి భవన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించి అధికారులను  వివరాలు అడిగి తెలుసుకున్నారు.  నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ పారిశుద్ధ్యం, తడి- పొడి చెత్తను వేరు చేయడం, స్మార్ట్ సిటీ అభివృద్ధికి స్థానిక ప్రజల భాగస్వామ్యం నూరు శాతం ఉంటే ఇంకా మెరుగైన ఫలితాలు సాధించి కాకినాడను జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు అవకాశం ఉంటుందన్నారు.  ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ సత్యనారాయణరాజు ,డీఈలు ,ఏఈలు ఇతర ఇంజనీరింగ్ అధికారులు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

కాకినాడ రూరల్

2021-07-21 16:43:32

22నుంచి నూతన సర్పంచ్ లకు శిక్షణ..

నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులకు ఈ నెల 22 నుంచి 12 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్తు సీఈవో ఎన్ వివి. సత్యనారాయణ ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని జూలై 22 (గురువారం) ఉదయం 9:30 గంటలకు కాకినాడ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి ప్రారంభించడం జరుగుతుందన్నారు. తొలి రోజుల శిక్షణ కార్యక్రమానికి  కాకినాడ డివిజన్ లో ఉన్న గ్రామ సర్పంచులకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. రాజమహేంద్రవరం, అమలాపురం, పెద్దాపురం ,కాకినాడ,రంపచోడవరం ప్రాంతంలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా 5 వెలు జనాభా దాటిన 218 సర్పంచులకు సామర్లకోట ఈటీసీ కేంద్రం నందు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.మూడు రోజులపాటు సర్పంచులకు భోజనం, ఇతర అన్ని వసతులకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామ సర్పంచ్ యొక్క విధులు- బాధ్యతలు, వివిధ సంక్షేమ కార్యక్రమాల పై అవగాహన , త్రాగునీరు,గ్రామీణ రోడ్ల నిర్మాణం , తదితర అంశాలపై అవగాహన తోపాటు తమ గ్రామాలను ఉత్తమ పంచాయతీలుగా  తీర్చిదిద్దుకునేందుకు ఇది ఒక చక్కటి అవకాశం అని, సర్పంచులు విధిగా ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని జేడ్పీసీఇవో తెలిపారు.

Kakinada

2021-07-21 16:41:45

గిరిప్రదక్షిణ రద్దు..దర్శనాలుంటాయ్

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ప్యూ పొడిగింపు, కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి(సింహాద్రి అప్పన్న)వారి గిరి ప్రదక్షిణ రద్దుచేస్తున్నట్టు దేవస్థాన ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం ఈఓ మీడియాతో మాట్లాడుతూ, కర్ఫ్యూ నేపథ్యంలో గిరిప్రదక్షిణ రద్దు చేశామన్నారు. సింహగిరిపైన కూడా ప్రదక్షిణలకు అనుమతిలేదని తెలిపారు. కాగా ఈ నెల 23, 24వ తేదీల్లో స్వామివారి దర్శనాలు మాత్రం కరోనా నిబంధనలు పాటిస్తూ జరుపనున్నామని చెప్పారు. 23వ తేదీన శ్రీస్వామివారి మాస జయంతి, 24వ తేదీనే తుదివిడత చందన సమర్పణ కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆరోజు దర్శనాల కోసం  22 ఉదయం నుంచి రెండు రోజులపాటు అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యాన్ని భక్తుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఇందులో వంద, మూడు వందల రూపాయల టికెట్లు కౌంటర్లలో అడ్వాన్స్ గా  అమ్ముతున్నామన్నారు. అలాగే 300 రూపాయల టికెట్లు 2,500, వంద రూపాయల టికెట్లు 2,500 అందుబాటులో ఉంచామన్నారు.  అత్యంత పవిత్రమైన 24వ తేదీకోసం  మొత్తం 5వేల టికెట్లు అడ్వాన్స్ గా అమ్మాలని నిర్ణయించినట్టు చెప్పారు.  వీఐపీలకు కూడా లఘు దర్శనాలు మాత్రమే ఉంటాయని, వేద ఆశీర్వాదాలుండవని వివరించారు. ఉదయం6గంటల నుంచి మధ్యాహ్నం3 గంటల వరకూ విరామం లేకుండా దర్శనాలు జరిపిస్తామన్నారు. 8 లడ్డూ కౌంటర్ల ద్వారా లక్ష లడ్డూ ప్రసాదం కూడా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. తెల్లవారు జామున 3 గంటలకే సింహాచలం కొండపైకి బస్సులు నడపడంతోపాటు, టికెట్ల కౌంటర్లు, కేశ ఖండనశాల కూడా 3 గంటలకే తెరుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్యులు డా. టీపీ రాజగోపాల్, ప్రధానార్చకులు గోపాల కృష్ణమాచార్య, హవల్దార్ ఈఈలు, ఏఈఓలందరూ పాల్గొన్నారు.

Simhachalam

2021-07-21 16:37:12

నేటి నుండి సర్పంచులకు శిక్షణ..

 శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికైన సర్పంచ్ లకు ఈనెల 22వ తేదీ నుండి ఆగస్టు 14వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి,  జిల్లా వనరుల కేంద్రం ప్రిన్సిపాల్ బి.లక్ష్మీపతి తెలిపారు. ఈ మేరకు శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్ ను జిల్లా వనరుల కేంద్రంలో బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మీపతి మాట్లాడుతూ మూడు డివిజన్లలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. శ్రీకాకుళం డివిజన్ కు చిలకపాలెం శివాని ఇంజనీరింగ్ కాలేజ్ లోను, పాలకొండ డివిజన్ కు సీతంపేట యూత్ ట్రైనింగ్ సెంటర్ లోను,  టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి టెక్కలి అయితం కళాశాలల్లోనూ, మందస యూత్ ట్రైనింగ్ సెంటర్ లోను శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు.  బ్యాచ్ ల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈనెల 22వ నుండి 24వ తేదీ వరకు గార,  ఎల్.ఎన్.పేట, శ్రీకాకుళం, సీతంపేట, మందస, కోటబొమ్మాలి, టెక్కలి మండలాలకు., 20 నుండి  28వ తేదీ వరకు ఆమదాలవలస, సరుబుజ్జిలి, మెలియాపుట్టి, పాతపట్నం, కవిటి, సోంపేట, పలాస, జలుమూరు మండలాలకు., 29 నుండి 31వ తేదీ వరకు ఎచ్చెర్ల, జి.సిగడాం, పాలకొండ, వీరఘట్టం, ఇచ్ఛాపురం, కంచిలి, నందిగాం మండలాలకు., ఆగస్టు 2 నుండి 4వ తేదీ వరకు బూర్జ, పొందూరు, కొత్తూరు, రాజాం, సంతబొమ్మాలి మండలాలకు.,ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు లావేరు, నరసన్నపేట, హిరమండలం, ఆర్ ఆమదాలవలస,  వజ్రపుకొత్తూరు మండలాలకు., 9 నుండి 11వ తేదీ వరకు రణస్థలం, పోలాకి, సంతకవిటి, సారవకోట మండలాలకు.,12 నుండి 14 వ తేదీ వరకు వంగర, భామిని మండలాలకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు.

 శిక్షణ తరగతులకు హాజరు అయ్యే సర్పంచుల వివరాలను కేంద్ర ప్రభుత్వ పోర్టల్ లో నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.  తదనుగుణంగా వారి హాజరు, పనితీరును గమనించి నిధులు మంజూరు కూడా ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. జిల్లాలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే సర్పంచులకు ప్రయాణ, భోజన, వసతి సౌకర్యాలు కల్పస్తున్నట్లు లక్ష్మీపతి తెలిపారు. సామర్లకోట శిక్షణ కేంద్రంలో 112 మంది సర్పంచులు శిక్షణ పొందారనీ ఆయన తెలిపారు. ప్రతి శిక్షణ కార్యక్రమానికి 5 గురుతో  శిక్షణా బృందాన్ని నియమించామని ఆయన చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అభివృద్ధికి అవసరమైన శిక్షణ అందించడం జరుగుతుందని, సర్పంచులు సద్వినియోగం చేసుకావాలని కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ప్రత్యేకంగా సర్పంచులకు ఒక లేఖ రాయడం జరిగిందని లక్ష్మీపతి పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి మీ చేతుల్లో ఉందని అందుకు తగిన విధంగా మంచి పనితీరును కనబరిచాలని, శిక్షణను సర్పంచులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారని ఆయన చెప్పారు. 

Srikakulam

2021-07-21 09:50:14

రైతు సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం..

రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్ ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పోలాకి మండలంలో బుధవారం రైతు చైతన్య యాత్రలో వ్యవసాయ శాఖ కమిషనర్ హనుమంతు అరుణ్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత రైతు చైతన్య రథాన్ని ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ శాఖ ఏర్పాటుచేసిన పలు స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా, రైతాంగం అభ్యున్నతే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కే. శ్రీధర్, డిసిసిబి చైర్మన్ గా నియమితులైన కరిమి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-21 09:47:36

డిసిసిబి పాలకవర్గ ప్రమాణస్వీకారం..

శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గం గురువారం ప్రమాణ స్వీకారం చేస్తుందని డిసిసిబి ముఖ్య కార్యనిర్వహణ అధికారి డి. సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేస్తూ గురువారం ఉదయం 10.30 గంటలకు డిసిసిబి చైర్పర్సన్ గా కరిమి రాజేశ్వరరావు, సభ్యులుగా బంకి లక్ష్మణ మూర్తి,  గొండు నిర్మల,  బొడ్డేపల్లి నారాయణరావు,  దండాసి ఎండమ్మ,  మియాబిల్లీ శ్యామ సుందరరావు, నడిమింటి రామమూర్తి పదవి బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు.

Srikakulam

2021-07-21 09:46:09

78 రోజుల్లో 23 వేల మందికి అన్నదానం..

విశాఖలోని పాత నగరంలో ఉన్న వివేకానంద అనాధ, వృద్ధుల ఆశ్రమం అన్నార్తులకు, వృద్దులకు బాసటగా నిలుస్తోంది. దాతలు సహాయ,సహాకారాలతో కేవలం 78 రోజుల్లో 23 వేల మందికి అన్న ప్రసాదం అంద చేయకలిగింది.  ఈ సందర్భంగా విశాఖలో బుధవారం సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక సలహాదారు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీనుబాబు మాట్లాడుతూ, విశాఖ కేంద్రంగా వేల సంఖ్యలో నిరుపేదలకు అన్నదానం చేసిన ఘనత ఒక్క వివేకానంద సంస్థకే దక్కుతుందన్నారు. అనంతరం దివ్యాంగులకు, నిరుపేదలకు దుప్పట్ల పంపిణీశారు. తదుపరి పలువురికి అన్నదానం, రిక్షా కార్మికులకు వస్త్రధానం చేపట్టారు. పాడేరు ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే చిన్నారి గత కొద్ది రోజుల క్రితం నగరంలోని వివేకానంద ఆశ్రమానికి చేరుకుంది.  ఆదరించే వారు లేకపోవడంతో లక్ష్మీ బాధ్యత ను సంస్థ సభ్యులు తీసుకున్నారు. ఇక్కడ ఆశ్రమంలో లక్ష్మీ కి ఆశ్రయం కల్పించారు. అంతే కాకుండా సంస్థ మహిళా సభ్యులు ఆధ్వర్యంలోనే రజస్వల శుభ కార్యక్రమాన్ని సైతం చేపట్టారు.  తమ పిల్లలు తో సమానం గా ఈ శుభాకార్యం జరిపించి,పలువురు కి తాంబూ లాలు లక్ష్మీ ద్వారా అందించి ఆశీస్సులు అందించారు. సంస్థ సభ్యులు తో పాటు శ్రీనుబాబు ఆశీస్సులు అందచేసి లక్ష్మికి కొంత ఆర్దిక సహాయాన్ని అందచేశారు. సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పారావు మాట్లాడుతూ, దాతలు అందరి సహకారం తో సేవా కార్యక్రమం లు కొన సాగిస్తున్నమన్నారు. సంస్థ సభ్యులు పోతు రాజు,ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-07-21 09:33:24

VMRDAచైర్మన్ కు SCRWAఅభినందన..

విశాఖ మహానగరంలో ప్రజల సమస్యలు దగ్గరుండి పరిష్కరిండచంలో ఎల్లప్పుడూ ముందుండే వైఎస్సార్సీపీ తూర్పునియోజకవర్గ సమన్వయకర్త అక్కరామాని విజయనిర్మలకు వీఎంఆర్డీఏ చైర్మన్ పదవి రావడం అభినందనీయమని SCRWA అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం విశాఖలో అక్కరమాని కార్యాలయంలో అసోసియేషన్ సభ్యులతో ఆమెకు అభినందన తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ, ప్రజలతోపాటు, నాయకులు, కార్యకర్తల సంక్షేమం చూడటంలో అక్కరామానికి ఎవరూ సాటిరారని కొనియాడారు. అలాంటి మంచి వ్యక్తి రాజున్న రోజుల్లో మరిన్ని మంచి పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి నక్కాని అజయ్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-07-21 09:00:59

వైఎస్సార్ భీమా క్లైమ్ లు క్లియర్ చేయాలి..

 వైయస్సార్ బీమా పథకానికి సంబంధించి క్లైమ్స్ పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా&సంక్షేమం) జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు.   మంగళవారం కాకినాడలో జేసీ జి. రాజకుమారి జిల్లా గ్రామీణ అభివృద్ధి  సంస్థ కార్యాలయాన్ని సంబంధిత అధికారులతో కలిసి  సందర్శించి, వైయస్సార్ బీమా క్లయిమ్స్ లాగిన్ వివరాలు,ఆన్ లైన్ లో అప్లోడ్ ,పోర్టల్ రిపోర్టులను పరిశీలించి, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.   ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వివిధ కారణాల చేత మరణించిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే వైయస్సార్ బీమా పథకానికి సంబంధించిన లబ్ది వెంటనే కుటుంబానికి అందించడం ద్వారా మరణించిన వారి కుటుంబంలో  మనోధైర్యాన్ని నింపవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల్లో వైయస్సార్ బీమా చాలా ప్రధానమైనదని ఆమె తెలిపారు. దుఃఖంలో ఉన్న వారిని స్వయంగా వెళ్లి కలుసుకోకపోయినా వారికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా కుటుంబాన్ని ఆదుకోవచ్చన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ బీమా పథకం పై ప్రత్యేక దృష్టి పెట్టినందున అధికారులు మరింత శ్రద్ధ కనబరిచి బీమా క్లయిమ్స్ ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 12 లక్షల 63వేల 303 మందిని  వైయస్సార్ బీమా లో ఎన్ రోల్ చేయడంతో  ఇప్పటివరకు సుమారు 99.65శాతం సర్వే పూర్తయిందని ఆమె తెలిపారు. జూలై 1 నుంచి ప్రారంభమైన వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించి చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద రూ. పది వేలు అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో జూలై 1 నుంచి  నేటి వరకు మొత్తం 218 మరణాలు రిజిస్టర్ కాగా 207 సహజ మరణాలు, 11 ప్రమాద మరణాలుగా నమోదైనట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఎక్కువ సంఖ్యలో మహిళలే లబ్ధిదారులుగా ఉన్నందున జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పాత్ర చాలా కీలకమైనదని గుర్తించి అధికారులు జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు సమన్వయంతో పనిచేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని జేసీ రాజకుమారి అధికారులకు సూచించారు.
    ఈ పర్యటనలో జేసీ రాజకుమారి వెంట జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వై.హరిహరనాథ్ , ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డీఎస్. సునీత, బీసీ సంక్షేమ అధికారి కె. మయూరి, అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసు,.. సోమేశ్వర రావు, ఏరియా కో-ఆర్డినేటర్ లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2021-07-20 17:47:50

సచివాలయ సిబ్బంది గ్రామాల్లో తిరగాలి..

సచివాలయాల సిబ్బంది సమయానికి కార్యాలయాలకు హాజరై వీధుల్లో ఒక్క సారి  తిరగాలని, పారిశుధ్యం, డ్రైనేజ్ వ్యవస్థ, రహదారుల పరిస్థితిని తనిఖీ చేయాలనీ  అన్నారు.   అదే విధంగా సచివాలయాల వద్ద మొక్కలు నాటాలని, వీధిలో కూడా  గృహాల వద్ద  మొక్కలు నాటేలా చూడాలని తెలిపారు. కాళిఘాట్ కాలనీ లో నున్న 50 వ సచివాలయాన్ని, కుసుమ గజపతి నగర్ లో ఉన్న 47 వ సచివాలయాన్ని  మంగళ వారం  కలెక్టర్ తనిఖీ చేసారు.   బయో మెట్రిక్  హాజరు ను, రికార్డు లను తనిఖీ చేసారు.  పెండింగ్  ఉన్న ఈ-సేవ దరఖాస్తులను, ఇన్సురన్సు క్లెయిమ్స్ ను, రైస్ కార్డ్స్, పించన్లు,  తదితర అంశాల పై ఆరా తీసారు.  కాళిఘాట్ కాలనీ లో సచివాలయం పక్కనే ఉన్న గృహం ముందు ఇసుక, కంకర రహదారి పై కుప్పగా ఉండడం తో ఆ కుటుంభ సభ్యులతో  మాట్లాడి తొలగించాలని  చెప్పారు.  మొక్కలు ఇంటి ముందు నాటాలని కోరారు. కుసుమ గజపతి నగర్ సచివాలయం లో టేబుళ్ళు దుమ్ము ధూళి తో ఉండడం తో వారి పై ఆగ్రహం వ్యక్తం చేసారు.  స్వంత ఇంట్లో ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో సచివాలయాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచాలని సూచించారు.  ఈ. దరఖాస్తులను గడువు లోగా పరిష్కరించాలని ఆదేశించారు. వీధి లో   ఎవరికైనా మొక్కలు పెంచుకునే ఆసక్తి ఉంటే సరఫరా చేయాలనీ అన్నారు.   కలెక్టర్ వెంట మున్సిపల్ హెల్త్  ఆఫీసర్  డా. సత్యనారాయణ  పాల్గొన్నారు. 

Vizianagaram

2021-07-20 17:42:47

బ్యాంకు గ్యారెంటీలు ఇప్పించండి..

తాము చెల్లించిన బ్యాంకు గ్యారెంటీల‌ను తిరిగి ఇప్పించాల‌ని, జాయింట్ క‌లెక్ట‌ర్‌(రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌కు జిల్లా రైస్‌ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్ విజ్ఞ‌ప్తి చేసింది. జాయింట్ క‌లెక్ట‌ర్ కిశోర్‌ను మంగ‌ళ‌వారం ఆయ‌న ఛాంబ‌ర్‌లో, అసోసియేష‌న్ ప్ర‌తినిధులు క‌లిసి, త‌మ బాధ‌లు మొర‌పెట్టుకున్నారు.       ప్ర‌భుత్వం ఇచ్చిన ల‌క్ష్యాల మేర‌కు జిల్లాలో ధాన్యం సేక‌ర‌ణ జ‌రిగింద‌ని,  సిఎంఆర్‌ను కూడా దాదాపు అంద‌జేయ‌డం జ‌రిగింద‌ని అసోసియేష‌న్ అధ్య‌క్షులు కొండ‌ప‌ల్లి కొండ‌ల‌రావు అన్నారు. ఇంకా కేవ‌లం 5,100 ట‌న్నుల సిఎంఆర్ మాత్ర‌మే పెండింగ్ ఉంద‌ని, దానిని కూడా కొద్ది రోజుల్లోనే పూర్తి చేస్తామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే అధిక శాతం మిల్ల‌ర్లు, చాలా రోజుల క్రిత‌మే సిఎంఆర్‌ను పూర్తిచేశార‌ని, అయిన‌ప్ప‌టికీ వారికి నేటివ‌ర‌కూ  బ్యాంకు గ్యారెంటీలు తిరిగి ఇవ్వ‌లేద‌ని అన్నారు. బిజిలు రాక‌పోవ‌డం వ‌ల్ల‌, మిల్ల‌ర్లు చాలా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే జిల్లాలోని మిల్ల‌ర్లు వివిధ కార‌ణాల‌రీత్యా, ఆర్థికంగా చితికిపోయి, తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, బిజిలు ఇప్పించి ఆదుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. మిల‌ర్లు ఎదుర్కొంటున్న ప‌లు ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు. దీనిపై జెసి కిశోర్ స్పందిస్తూ, వారి స‌మ‌స్య‌ను ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, బిజిల‌ను ఇప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని హామీ ఇచ్చారు.

Vizianagaram

2021-07-20 17:41:21

స‌మ‌గ్ర సర్వేతో ఖ‌చ్చిత‌మైన భూరికార్డులు..

స‌మ‌గ్ర భూ స‌ర్వే ద్వారా మ‌రింత‌ ఖ‌చ్చిత‌మైన భూముల రికార్డులు త‌యార‌వుతాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. రీస‌ర్వే ప్ర‌క్రియ‌ను నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిలో పూర్తి చేయాల‌ని కోరారు. వైఎస్ఆర్ జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూ హ‌క్కు మ‌రియు భూ ర‌క్ష ప‌థ‌కంపై త‌న ఛాంబ‌ర్‌లో మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ స‌మీక్షించారు. ఈ ప్ర‌క్రియ ద్వారా నాణ్య‌మైన‌, ఖ‌చ్చిత‌మైన రికార్డులు రూపొందుతాయ‌ని చెప్పారు. ప్ర‌భుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా, కాల‌వ్య‌వ‌ధిని పెట్టుకొని త్వ‌ర‌గా స‌ర్వేను పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్‌ సూచించారు. జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్ మాట్లాడుతూ,  జిల్లాలో ఆరు అంచెలుగా భూముల రీస‌ర్వే ప్ర‌క్రియ జోరుగా జ‌రుగుతోంద‌న్నారు. ఇత‌ర జిల్లాల‌కంటే మ‌న జిల్లా ముందంజ‌లో ఉంద‌ని చెప్పారు. ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌కు అనుగుణంగా తొలుత డివిజ‌న్‌కు ఒక గ్రామాన్ని, ఆ త‌రువాత మండ‌లానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, ద్రోణ్ ద్వారా స‌ర్వే ప్ర‌క్రియ చేప‌ట్టామ‌న్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 72 గ్రామాల్లో స‌ర్వేను పూర్తి చేయ‌డం జ‌రిగింద‌న్నారు. తాజాగా మూడునాలుగు మండ‌లాలు క‌లిపి ఒక క్ల‌ష్ట‌ర్‌గా నిర్ణ‌యించి, క్ల‌ష్ట‌ర్ల వారీగా స‌ర్వే చేయాల‌ని ప్ర‌భుత్వం నుంచి ఆదేశాలు వ‌చ్చాయ‌ని చెప్పారు. దీనికి అనుగుణంగా ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేసి, ఆమోదం కోసం ప్ర‌భుత్వానికి పంపించ‌డం జ‌రిగింద‌ని జెసి వివ‌రించారు.

                ఈ స‌మావేశంలో స‌ర్వే, భూ రికార్డుల‌శాఖ స‌హాయ సంచాల‌కులు కె.రాజాకుమార్‌, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.  

Vizianagaram

2021-07-20 17:39:53