1 ENS Live Breaking News

ఎంతో ఆనందంతో వెళుతున్నాను..

పేదల దీవెనలు ఉంటేనే  మన  భవిష్యత్తు బాగుంటుందని, పేదల కోసం పని చేసే అవకాశాన్ని అదృష్టం గా  భావించాలని  బదిలీ పై వెళ్తున్న జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ తెలిపారు. సివిల్ సర్వెంట్లు  ప్రజలతో మమేకం అయితేనే  విజయం సొంతం చేసుకుంటారన్నారు.  అధికారులు వత్తిడిని అధిగమించడానికి కళలు, క్రీడలు ఉపయోగ పడతాయన్నారు. ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చినందునే అంకిత భావం తో, ఉత్సాహంతో పని చేయగలిగానని ముఖ్య మంత్రి గారికి  కృతజ్ఞతతో ఉంటానన్నారు. అవార్డుల కోసం పని చేయలేదని, చేసిన పనిని గుర్తిస్తూ అవార్డు లు  వరించాయని అన్నారు. కొత్తగా వచ్చిన జె.సి లు చాలా ఉత్సాహంగా, వివేకంగా పని చేస్తున్నారని, అయితే  దేనికి ఎంత  ప్రాధాన్యత నివ్వాలో తెలుసుకొని ముందుకెళ్లాలని సలహా ఇచ్చా రు. జిల్లాతో  ఎన్నో మధుర జ్ఞాపకాలతో వెళ్తున్నానని, సంతృప్తిగా, సంతోషంగా ఉందని అన్నారు.

Vizianagaram

2021-07-26 16:41:57

కోవిడ్ టీకా అర్హులందరికీ వేయాలి..

కోవిడ్ 19 వాక్సినేషన్ కు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వాక్సిన్ చేయించేలా సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. మోగా వాక్సినేషన్ కార్యక్రమంలో  భాగంగా సోమవారం సాయంత్రం ఫిరంగిపురం మండలం తక్కెళ్ళపాడు గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్ పరిశీలించారు. వాక్సినేషన్ జరుగుతున్న తీరును పరిశీలించి, గ్రామంలో ఇప్పటి వరకు కేటగిరిలు వారీగా వాక్సిన్ తీసుకున్న వారి సంఖ్యను జిల్లా కలెక్టర్ వైధ్యాదికారులను అడిగి తెలుసుకున్నారు. 45 సంవత్సరాలు వయస్సు దాటిన వారితో పాటు, గర్బీణీలకు, ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న మహిళలకు, ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కోవిడ్ వ్యాక్సినేషన్ నూరు శాతం అందించాలన్నారు.  వైద్యారోగ్యశాఖ అధికారలు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు  గ్రామంలో డోర్ టూ డోర్ వెళ్ళి ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారి వివరాలు సేకరించి వెంటనే వాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే  మొదటి డోసు తీసుకున్న వారికి నిర్దేశిత సమయంలో సెకండ్ డోసు వేయించాలన్నారు.  కోవిడ్–19 వాక్సినేషన్ పై ఉన్న అనవసర అపోహలు తొలగించి  ప్రభుత్వం వాక్సినేషన్కు  అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకునే స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు ప్రజలను చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసరు డా. వై సుబ్రహ్మణ్యం, ఫిరంగిపురం తహశీల్దారు సాంబశివరావు, ఎంపీడీవో శివప్రసాదు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.ఫరీన్, గ్రామ సర్పంచి ఎం విజయలక్ష్మీ, వైద్యారోగ్య, పంచాయితీ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

ఫిరంగిపురం

2021-07-26 16:12:16

3ఏళ్లలో జనరంజక పాలన అందించారు..

విజయనగరం, జులై 26:: జిల్లా కలెక్టర్ గా మూడేళ్లు జిల్లాలో పని చేసిన డా.ఎం.హరి జవహర్ లాల్  జనరంజక పాలనను అందించారని వక్తలు కొనియాడారు.  సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియం లో జిల్లా అధికారులు, రెవిన్యూ అసోసియేషన్ అద్వర్యం లో అభినందన  వీడ్కోలు సభ నిర్వహించారు. కలెక్టర్ దంపతులను ఘనంగా సన్మానించారు.  
ఈ సందర్బంగా జిల్లా జడ్జి జి. గోపి మాట్లాడుతూ ప్రకృతిని ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తిగా హరి జవహర్ లాల్ నిలిచిపోతారని తెలిపారు. కలెక్టర్ గా  జిల్లాలో పని చేసిన కాలం లో ఎన్నో చక్కని పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. తన కోపాన్ని ఎప్పుడూ ప్రదర్శించక  అందరితో ఫ్రెండ్లీ కలెక్టర్ గా ఉన్నారన్నారు. అహంకారం, అసూయ తెలియని వ్యక్తి అని జిల్లా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. 
జిల్లా ఎస్.పి దీపికా పాటిల్ మాట్లాడుతూ ఆయన నిరడంబరత తో,  ప్రశాంత వదనం తో  ప్రజలకు తొందరగా దగ్గరై పోతారని  అన్నారు. సంయుక్త కలెక్టర్  ఆసరా జె. వెంకట రావు మాట్లాడుతూ  కోవిడ్ కాలం లో ఆయన సమర్థతను చూశామని అన్నారు. 5వ బెటాలియన్ కమాండెంట్ విక్రమ్ పాటిల్ మాట్లాడుతూ అతి తక్కువ పరిచయం లొనే తనను స్నేహితునిగా చూసారన్నారు.  
సంయుక్త్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ మాట్లాడుతూ  ముందుండి నడిపించిన నాయకుడని కొనియాడారు. వినయం, సంస్కారం కలగలిపిన మానవతా వాది అన్నారు. ప్రతీ రోజు ఎదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే  ఉంటామన్నారు. ఏ పని ఎప్పుడు, ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి యని, అందుకే మూడేళ్ళలో జిల్లాను ఉన్నత స్థానం లో నిలిపారని పేర్కొన్నారు. తన పాలనతో ప్రజలకు, అధికారులకు ప్రీతి పాత్రులైనారని అన్నారు.  సంయుక్త కలెక్టర్లు డా.మహేష్,   మాట్లాడుతూ పరిపాలన అనేది ఒక కళ అని, ఆ కళను ప్రదర్శించి అందరి మన్ననలు పొందారని పేర్కొన్నారు. మయూ ర్ అశోక్ మాట్లాడుతూ విజయనగరం వెళ్తున్నామంటే అక్కడ హరి జవహర్ లాల్ కలెక్టర్  ఉంటారు, మీకు అన్ని విధాలా ప్రోత్సహిస్తారని చెప్పారని , వచ్చిన తర్వాత  అనేక విషయాలను తెలుసుకున్నానని అన్నారు.  ఐ.టి.డి.ఏ ప్రాజెక్ట్ అధికారి  ఆర్.కుర్మానాధ్,  సబ్ కలెక్టర్  భావన, సి.పి.ఓ విజయ లక్ష్మి, డిడి సోషల్ వెల్ఫేర్ సునీల్ రాజ్ కుమార్ తదితరులు కలెక్టర్ సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా మూడేళ్ళ కలెక్టర్ పాలన పై జిల్లా అధికారులు చిత్రీకరించిన షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ గణపతి రావు, ఆర్.డి.ఓ భవాని శంకర్, మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఎన్.నిర్మలకుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-26 15:27:14

ఈఎన్ఎస్ వార్తపై స్పందించిన ఎస్పీ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామసచివాలయాల్లో నియమించిన మహిళా పోలీసులను ముందు హోంశాఖ పోలీసులుగా గుర్తించండి..  మీరంతా వారిని మీతోపాటు సాధారణ పోలీసులుగా ఒప్పుకోండి.. మీకు ఇష్టం లేకపోయినా ఒప్పుకొని తీరాలి.. అంతే తప్పా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించవద్దు అంటూ జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ జిల్లాలోని అన్ని స్టేషన్ల ఎస్ఐలకు, కానిస్టేబుళ్లకు సూచించారు.. అంతేకాకుండా ఏ స్థాయి పోలీసు సిబ్బంది మహిళా పోలీసులను ఏ విధంగా చూస్తున్నారో తమ ద్రుష్టికి వచ్చిందన్నారు. దీనితో ఈఎన్ఎస్ ఇటీవల ప్రచురించిన న్యూస్ కార్డ్..ఖాకీ చొక్కాలేదు.. చేతిలో లాఠీ అసలేలేదు.. అనేవార్తకు స్పందన వచ్చినట్టైంది. ఈ వార్తలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net ద్వారా  ప్రస్తావించిన అంశాలన్నీ ఎస్పీ ఈ వీడియో కాన్ఫరెన్సులో ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.  సోమవారం జిల్లావ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల నుంచి ఎస్ఐలు, సచివాలయ మహిళా పోలీసులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రభుత్వం వారిని పోలీసులుగా గుర్తిస్తూ జీఓ నెంబరు 59 విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ..దాని ప్రకారం వారంతా హోం డిపార్ట్ మెంటు పోలీసులేనని స్పష్టం చేశారు. అసలు దానికంటే ముందు వచ్చిన జీఓనెంబరు 129లోని మహిళా సంరక్షణా కార్యదర్శి(జిఎంఎస్కే) అనే పదాన్ని అన్నిస్టేషన్ల ఎస్ఐలు, కానిస్టేబుళ్లు మరిచిపోవాలని ఆదేశించారు. ఆ జీఓ ద్వారా అపుడు వారంతా జీఎంస్కేలు అయితే..జీఓనెంబరు 59 ద్వారా ఇపుడు వారంతా సాధారణ పోలీసులేనన్నారు. కాకపోతే మహిళలు కనుగా ప్రభుత్వం మహిళా పోలీసు అని నామకరణం చేసిందన్నారు. అంతే తప్పా వారంతా మనకి సంబంధం లేని ఉద్యోగులుగా చూడొద్దని పోలీసులను హెచ్చరించారు. అంతేకాకుండా ప్రభుత్వం విడుదల చేసిన జీఓలపై స్టేషన్ ఎస్ఐలకు అవగాహ ఉండాలని.. దానిని వెంటనే సచివాలయ మహిళా పోలీసులకు వివరించి చెప్పాలన్నారు. విధినిర్వహణలో ఎవరు అవినీతికి పాల్పడినా..వారు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయా స్టేషన్ల  పరిధిలోని మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కొందరు మహిళా పోలీసులు వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఎస్పీ ద్రుష్టికి తీసుకెళ్లారు. మహిళా పోలీసులకు ఎలాంటి సమస్యలున్న తక్షణమే నోడల్ ఆఫీసరైన స్టేషన్ ఎస్ఐ ద్రుష్టికి తీసుకు వచ్చి పరిష్కరించుకోవాలన్నారు. ఈ కాన్ఫరెన్సులో అన్ని  డివిజన్ల డిఎస్పీలు, సిఐలు, స్టేషన్ ఎస్ఐలు, జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా పోలీసులు  పాల్గొన్నారు.

Kakinada

2021-07-26 14:25:11

మహిళల కోసమే భద్రతకే దిశ యాప్..

రాష్ట్ర ప్రభుత్వం ఆపదలో ఉన్న మహిళల భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ యాప్ మహిళలకు రక్షణగా నిలుస్తుందని కాకినాడ సిటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నగర  మేయర్ సుంకర పావని, జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీస్ కన్వెన్షన్ హాల్ లో దిశ యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ  ప్రత్యేకంగా మహిళలు, బాలికల పట్ల జరిగే నేరాల సత్వర దర్యాప్తు కోసం ఏర్పాటు దీనిని ఏర్పాటు చేశారన్నారు. యాప్ మహిళల వద్ద వుంటే పక్కనే రక్షణ వున్నట్టేనన్నారు. ఇప్పటికే దిశ యాప్ అనేక ఫలితాలు సాధించి ఆపదలో వున్న మహిళలను రక్షిస్తున్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. జిల్లాలో 3,44,015 మంది మహిళలు తమ ఫోన్ లలో దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారని వివరించారు. నెలాఖరు ఈ సంఖ్యను ఐదు లక్షలకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. 
రాష్ట్రం లోనే తూర్పుగోదావరి జిల్లా ను ప్రధమ స్థానం లో నిలపాలంటే అధిక స్థాయిలో మహిళలు, విద్యార్ధినిలు ఈ యాప్ ఇనిస్టాల్ చేసుకోవాలన్నారు.
 కాకినాడ సిటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి  సూచనల మేరకు నగరంలో ఉన్న అందరితో దిశ యాప్ డౌన్లోడ్స్ చేయించే కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ ఈ దిశ పోలీస్ స్టేషన్ ను కాకినాడ లో తనతోనే ప్రారంభింప చేయించారని, ఇది తనకు చాలా సంతోషకర విషయమని.. ముఖ్యంగా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇది ఎలా పనిచేస్తుందో అనే ఉద్దేశంతో తను కాల్ చేయగా వెంటనే పోలీస్ వారు ఫోన్ చేసి అమ్మ మీరు ఏమైనా ఆపదలో వున్నారా అని అడిగారని, ఇంత వెనువెంటనే స్పందన రావడం చాల అశ్చర్యం కలిగించిందన్నారు. కుడా చైర్మన్  రాగిరెడ్డి దీప్తి చంద్రకళ, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ పసుపులేటి వెంకటలక్ష్మి, ఐసిడిఎస్ అధికారి జివి సత్యవాణి, కాకినాడ స్మార్ట్ సిటీ  అల్లి రాజబాబు, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. 

Kakinada

2021-07-26 11:38:30

కాకినాడలో ప్రారంభమైన పోలీస్ స్పందన..

పోలీస్ శాఖ పరంగా వచ్చిన అర్జీల పరిష్కారంలో చొరవ చూపాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ స్సీ రవీంద్రనాథ్ బాబు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల యొక్క సమస్యలను త్వరితగతిన  పరిష్కరించాలనే సదుద్దేశంతో తలపెట్టిన స్పందన కార్యక్రమాన్ని తిరిగి  సోమవారం ఎస్పీ లాంఛనంగా పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా కార్యాలయంతోపాటు, సబ్ డివిజన్ కార్యాలయంలో కూడా స్పందన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎవరూ వ్యయప్రయాశలకోర్చి జిల్లా కేంద్రానికే రావాలనే నిబంధన పెట్టుకోవద్దన్నారు. కార్యాలయానికి వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన ఫిర్యాదు దారుల నుంచిం అర్జీలను స్వీకరించి సంబంధిత పోలీస్ అధికారులను సత్వరంగా పరిష్కరించాలని ఆదేశాలు జారీచేశారు. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన స్పందన కార్యక్రమం తిరిగి ప్రారంభం కావడంతో ప్రజలు తమ సమస్యల అర్జీలతో జిల్లాఎస్పీకార్యాలయానికి ఎక్కువ మొత్తంలో అర్జీలతో జనం వచ్చారు.

Kakinada

2021-07-26 10:56:20

5 ఏఎస్ఐల సస్పెన్సన్.. ఒకరు తొలగింపు

తూర్పుగోదావరి జిల్లా ఐదుగురు పోలీసులను డిఐజీ కెవి.మోహనరావు సస్పెండ్ చేసినట్టు ఎస్పీ ఎం.రవీంధ్రబాబు ఒక ప్రకటనలో  ఆదివారం  తెలియజేశారు. చింతూరు, రామచంద్రాపురం, అనపర్తి సబ్ డివిజన్లలో పనిచేస్తున్న ఐదుగరు పోలీసు అధికారులను సస్పెండ్ చేయగా. ఒక ఏఎస్ఐని విధుల నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు. సస్పెండ్ అయినవారంతా ఏఎస్ఐలే కావడం విశేషం. కాగా పలు అవినీతి ఆరోపణలు ఎదర్కొంటున్న వారిపై స్వయంగా ఎస్పీ విచారణ నిర్వహించి డిఐజీకి అందజేశారు. దీనితో వాస్తవాలు వెలుగు చూడటంతో వారిపై చర్యలు తీసుకున్నారు. 

Kakinada

2021-07-25 16:14:33

ఈరోజు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు385..

తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు కొత్తగా 385 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ఇన్చార్జి కలెక్టర్ లక్ష్మీశ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం కరోనా బులిటిన్ మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం 309 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారని, జిల్లావ్యాప్తంగా 225 మందికి వేక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1085 బెడ్లు వివిధ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు. ఈరోజు 481 మంది కోవిడ్ రోగులు పూర్తిగా కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకూ జిల్లాలో 15లక్షల 5502 మందికి కోవిడ్ వేక్సినేషన్ జరిపినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Kakinada

2021-07-25 15:47:21

నగర రోడ్లను తక్షణమే బాగుచేయండి..

విశాఖ మహానగరంలో ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా ఉన్న గోతుల రోడ్లను పక్కాగా వేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం అక్కయ్యపాలెం హైవే జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్లు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆటో అండ్ మోటర్ వర్కర్స్ యూనియన్, AITUCఅనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి మాట్లాడుతూ, విశాఖ మహా నగరం మాధవధార, మురళి నగర్, ఆర్అండ్ బి జంక్షన్ ,అక్కయ్యపాలెం మెయిన్ రోడ్ లను ప్రమాదకరంగా మారిపోయాయన్నారు. ఆ ప్రాంతంలో ప్రయాణాలు చేస్తున్న ఆటోలు, వ్యాన్లు తరచూ రిపేర్లకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన సర్వీసులన్నీ ఆటోల రిపేర్లకు వస్తున్నాయన్నారు. ఉన్న గోతులు పడిన రోడ్లను పక్కాగా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .గత మూడు సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ,అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు, కేబుల్ లైన్లు వేసుటకు త్రవ్విన గోతులను కప్పలేదని ఆరోపించారు.  దీనివల్ల మోటార్ బైకులు, ఆటోలు నడపాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రభుత్వం పక్కా రోడ్ల  నిర్మాణం పేరుతో లీటర్ డీజిల్ పై  రూపాయి.12పైసలు.చొప్పున పెంచి 1200కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖజానా నింపుకుంటున్నా.. రోడ్లు మాత్రం పక్కాగా నిర్మాణం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే గోతుల రోడ్లను పక్కాగా వేసి రోడ్డు ప్రమాదాలనివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ప్రజావ్యతిరేకతకు గురికావాల్సి వస్తుందన్నారు..
ఈ కార్యక్రమంలోప్రభాకర్, కేలం శివ,పి.బాలు, శ్రీనివాస్, సన్యాసిరావు, సత్తిబాబు, నందీశ్వర రావులు తదితరులు పాల్గొన్నారు .

Akkayyapalem

2021-07-25 14:44:35

పచ్చతోరణంలో ప్రతీమొక్కా బతకాలి..

జగనన్న పచ్చతోరణంలో నాటే ప్రతి మొక్క బతకాలని, ఆవిధంగా కార్యాచరణ ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం స్ధానిక మంత్రి కాంపుకార్యలయ సమావేశం మందిరంలో నరేగా డైరెక్టర్ చినతాతయ్య, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ముత్తంశెట్టి విశ్వనాధ్ , పిడి ద్వామ చంద్రశేఖర్, నరేగా లైన్ డిపార్ట్మెంట్ లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రానున్న పదిరోజుల్లో మెగా ప్లాంటేషన్ జరగాలని, ప్రస్తుతం జిల్లాలో గుర్తించిన 1100 కిమీ జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట జరుగుతున్న మొక్కల నాటడానికి జరుగుతున్న గుంతల త్రవ్వకం వేగవంతం కావాలని సూచించారు. మొక్కల పెంపకంలో ఆవెన్యూ, ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కు ప్రాధాన్యత ఉండాలని , నాటే ప్రతి మొక్క బతకాలనే లక్ష్యం తో అధికారులు పనిచేయాలని, స్థానికులు సహకారం తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నరేగా లో నిర్దేశించిన 26 కోట్ల పనిదినాలు పూర్తి చేసి వేతనరూపంలో 6 నుండి 7 వెలకోట్లు నరేగా వేతన జీవులకు అందాలని సూచించారు. చేరువుల్లో పూడిక తీతపనులు , సిల్ట్ అప్లికేషన్ వంటివి ప్రాధాన్యత గుర్తించి పనులు చేపట్టాలని సూచించారు. నిధుల కొరత లేదని అనుకున్న లక్ష్యాలను అధిగమించేలా చూడాలని అన్నారు. ఈ సమీక్షలో డ్వామా డిపార్ట్మెంట్ ఎపిడీలు , అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2021-07-25 14:32:44

ప్రత్యేక ప్రణాళికతో పనులు వేగం..

సరైన కార్యాచరణ ప్రణాళికతో పనులను ప్రగతి దిశగా వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. గ్రామ స్థాయిలో జరుగుతున్న భవన నిర్మాణ పనులలో తక్కువ ప్రగతి ఉన్న మండలాలతో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదివారం సమీక్షించారు. భవన నిర్మాణ పనులు వేగవంతం కావాలని ఆయన అన్నారు. స్థల సమస్య ఉంటే తక్షణం పరిష్కరించు కోవాలని ఆయన ఆదేశించారు. భవన నిర్మాణాలు పూర్తి కాలేదు అంటే అక్కడ పని చేస్తున్న సిబ్బందికి అన్యాయం చేస్తున్నట్లు భావించాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రగతి మెరుగు పడాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. భవన నిర్మాణాలు తమ హయాంలో పూర్తి చేయడాన్ని గర్వంగా ఫీల్ కావాలని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని దానిని సాధించాలని ఆయన పేర్కొన్నారు. బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాల నిర్మాణం కూడా జరగాలని ఆయన చెప్పారు. అవసరమైతే ఇసుకను ఎడ్ల బండ్లపై తీసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. పనులు ఎందుకు జాప్యం జరుగుతోంది అని చెప్ప వద్దని, ఏ విధంగా చేయడం వలన వేగవంతం చేయవచ్చో చెప్పాలని ఆయన అన్నారు. మొదటి మూడు స్థానాలకు చేరుటకు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. పోలాకి, పొందూరు, మెలియాపుట్టి, సరుబుజ్జిలి, కోటబొమ్మాళి, రణస్థలం, కవిటి, పలాస, ఆమదాలవలస తదితర మండలాలు భవన నిర్మాణ ప్రగతిలో చివరి స్థానాల్లో ఉన్నాయని ఆయన తెలిపారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే.శ్రీనివాసులు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, పంచాయతీ రాజ్ ఎస్ఇ కే. బ్రహ్మయ్య, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ హెచ్. కూర్మ రావు,  ఎం.పి.డి.ఓలు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-25 14:20:09

వాక్సినేషన్ నమోదు సక్రమంగా జరగాలి..

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ వేక్సినేషన్ నమోదు సక్రమంగా జరగాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఈ మేరకు వైద్యాధికారులతో కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. రెండవ డోసు పూర్తి చేసుకున్న వారి పేర్లు కూడా తిరిగి జాబితాలో చేరుతున్న సందర్బాలు వస్తున్నాయని అటువంటి పరిస్థితులు పునరాృతం కాకుండా చూడాలని ఆయన తెలిపారు. పునరావృతం అయితే వాక్సినేషన్ బృందాల పై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. వాక్సినేషన్ కు వచ్చేవారి ఫోన్ నంబర్లను రెండు డోసుల సమయంలో జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. డిజిటల్ అసిస్టెంట్ లకు నమోదు కార్య్రమంలో అనుభవం ఉందని ఆయన తెలిపారు. వాక్సినేషన్ కు వచ్చే ప్రతి 50 మందికి పర్యవేక్షణకు ఒక ఉద్యోగిని ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఉదయం 8 గంటలకు వాక్సినేషన్ ప్రారంభం కావాలని, ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎం.పి.డి.ఓలు, మున్సిపల్ కమిషనర్లు కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి పక్కాగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే.శ్రీనివాసులు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, పంచాయతీ రాజ్ ఎస్ఇ కే. బ్రహ్మయ్య, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ హెచ్. కూర్మ రావు,  ఎం.పి.డి.ఓలు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-25 10:22:08

మెగా వేక్సినేషన్ విజయవంతం చేయండి..

తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 26న  మెగా కోవిడ్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్ జ‌ర‌గ‌నుంద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తెలిపారు. ఈ మేర‌కు ఆదివారం మీడియాకి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి రెండు ల‌క్ష‌ల కోవీషీల్డ్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. అన్ని గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో 45 ఏళ్లు దాటిన వారికి మొద‌టి డోసుతో పాటు, తొలి డోసు తీసుకొని 84 రోజులు అయిన వారికి రెండో డోసు టీకాలు వేయ‌నున్న‌ట్లు జేసీ తెలిపారు. జిల్లాలో 45 ఏళ్ల‌కు పైబ‌డిన వారిలో ఇంకా నాలుగు ల‌క్ష‌ల మంది మొద‌టి డోసు తీసుకోవాల్సి ఉంద‌ని, అదే విధంగా రెండో డోసు తీసుకోవాల్సిన వారు 40 వేల మంది ఉన్నార‌ని వీరంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.  గ‌ర్భిణీ స్త్రీల‌కు, ఉపాధ్యాయుల‌కు కూడా మొదటి డోసు పంపిణీ చేయ‌నున్న‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ (డి) తెలిపారు.

Kakinada

2021-07-25 10:20:15

గ్రామ సచివాలయాల్లోనే ఇక స్పందన..

స్పందన కార్యక్రమాన్ని  జిల్లాలో సోమవారం నుండి గ్రామసచివాలయాల్లో ప్రారంభి స్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. వాక్సినేషన్, స్పందన కార్యక్రమాలపై ఆదివారం సంభందిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమం నిర్వహించుటకు ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలిపారు. గ్రామ సచివాలయాలలో స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పింఛన్లు, రేషన్ కార్డు, ఇళ్లు తదితర సమస్యలకు మొదటి సారిగా అర్జీలు సమర్పించే ప్రజలు గ్రామ సచివాలయంలోనే సమర్పించాలని ఆయన తెలిపారు. సచివాలయ స్థాయిలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన చెప్పారు. మొదటి సారిగా అర్జీలు సమర్పించుటకు మండల, జిల్లా స్థాయికి రావలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. సచివాలయం స్థాయిలో పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలకు మాత్రమే మండల, జిల్లా స్థాయికి రావాలని ఆయన సూచించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కోవిడ్ నిబంధనల మేరకు స్పందన కార్యక్రమం నిర్వహించుటకు చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొంటూ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే.శ్రీనివాసులు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, పంచాయతీ రాజ్ ఎస్ఇ కే. బ్రహ్మయ్య, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ హెచ్. కూర్మ రావు,  ఎం.పి.డి.ఓలు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-25 09:44:09

మరో నాగుపాముకి ప్రాణం దక్కింది..

విశాఖలోని పెదగంట్యాడ సత్యన్నారాయణ పురంలో నాగుపాము(కోబ్రా) ఓ ఇంట్లో దూరడంతో సమాచారం అందుకున్న స్నేక్ సేవర్ సొసటీ నిర్వాహకులు కిరణ్ ఆదివారం తెల్లవారు జామున రెండుగంటల ప్రాంతంలో పాముదూరిన ఇంట్లోకి వెళ్లి పామును చాకచక్యంగా పట్టుకున్నారు. పాము ఇంట్లోని వంటగదిలోకి దూరి బుసలు కొడుతున్న విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు స్నేక్ సేవర్ కిరణ్ ను 98491 40500 లో సంప్రదించారు. వెంటనే సంఘటనా స్థలాని వెళ్లి నాగుపాముని ప్రాణాలతో పట్టుకొని దగ్గర్లోని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. దీనితో ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ నగర పరిధిలో ఎక్కడ పాములు కనిపించినా వాటి చంపవద్దని, తమకు సమాచారం అందిస్తే వాటిని పట్టుకొని సురక్షితంగా వాటిని అడవుల్లోకి విడిచి పెతామని స్నేక్ సేవర్ కిరణ్ చెప్పారు.

Pedagantyada

2021-07-25 09:39:04