1 ENS Live Breaking News

క‌లెక్ట‌ర్‌ను స‌న్మానించిన రిటైర్డ్ జెడి..

ఆర్అండ్ఆర్ క‌మిష‌న‌ర్ గా బ‌దిలీపై వెళ్తున్న జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ను, ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ రిటైర్డ్ జెడి ఎంవిఏ న‌ర్సింహులు శ‌నివారం స‌న్మానించారు. క‌లెక్ట‌ర్‌గా హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్  జిల్లాకు చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. ఆయ‌న పేరు జిల్లా చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిఉంటుంద‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌శుసంవ‌ర్థ‌క‌శాఖ డిడి మ‌నోజ్‌కుమార్, ఏడి తిమ్మారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-24 13:42:56

తూ.గో.జి కలెక్టర్ గా చేవూరి హరికిరణ్..

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా చేవూరి హరికిరణ్ ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న కలెక్టర్ జె.మురళీధరరెడ్డిని వైద్యశాఖ ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా బదిలీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 16 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వుల జారీచేసింది. అన్ని జిల్లాల్లో రెండేళ్లు పూర్తిచేసుకున్న కలెక్టర్లను ప్రభుత్వం బదిలీలు చేయడం విశేషం. మురళీధరరెడ్డి తూర్పుగోదావరి జిల్లా అభివ్రుద్ధిలోనూ, ప్రభుత్వ పథకాల అమలులోనూ చాలా కీలకంగా వ్యవహరించారు. స్పందన దరఖాస్తుల పరిష్కారంలో విశేషంగా క్రుషిచేసిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు.

Kakinada

2021-07-23 17:57:37

స్టాండింగ్ కమిటీ బరిలో 20 మంది..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జూలై 27వ తేదీన జరుగుతున్నందున, స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు పోటీలో 20 మంది సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారని,  తేది.23.07.2021 మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉన్నా, బరిలో ఉన్న సభ్యులు ఎవ్వరునూ నామినేషనలు ఉపసంహరణ చేసుకోనందున  పోటీలో 20 మంది సభ్యులూ ఉన్నారని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన తెలిపారు.  జూలై 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల జరిగిన అనంతరం ఓట్ల లెక్కింపు జరిపించి గెలిచిన స్టాండింగ్ కమిటీ సభ్యుల ఫలితాలను ప్రకటిస్తామని కమీషనర్ తెలిపారు.

GVMC office

2021-07-23 15:18:08

ఎస్సీ, ఎస్టీ కేసులు సత్వర పరిష్కారం..

తూర్పుగోదావ‌రి జిల్లాలో ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసుల త‌క్ష‌ణ ప‌రిష్కారానికి ప‌టిష్ట ప్ర‌ణాళిక ప్ర‌కారం గ్రామ‌, మండ‌ల‌, జిల్లాస్థాయిలో కృషిచేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లోని విధాన గౌత‌మి స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిట‌రింగ్ క‌మిటీ (ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీస్‌) స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జి.రాజ‌కుమారి, అద‌న‌పు ఎస్‌పీ క‌ర‌ణం కుమార్‌, ఎంఎల్‌సీ పండుల ర‌వీంద్ర‌బాబు, పి.గ‌న్న‌వ‌రం శాస‌న‌స‌భ్యులు కొండేటి చిట్టిబాబు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. స‌మావేశంలో మొద‌ట క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి.. జిల్లాకు సంబంధించి ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసులు, విచార‌ణ పురోగ‌తి, పెండింగ్ కేసుల ప‌రిష్కార ప్ర‌ణాళిక‌, బాధితుల‌కు ప‌రిహారం, బాధిత కుటుంబ స‌భ్యుల‌కు ఉద్యోగాలు త‌దిత‌ర వివ‌రాల‌తో పాటు గ‌తంలో క‌మిటీ చ‌ర్చించిన అంశాల‌పై కార్యాచ‌ర‌ణ నివేదిక‌ను స‌మావేశం ముందుంచారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ మూడు నెల‌ల‌కోసారి క‌మిటీ స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని, గ‌త మార్చిలో జ‌రిగిన స‌మావేశానికి గౌర‌వ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వ‌రూప్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారని, ఆ స‌మావేశంలో చ‌ర్చించిన అంశాల‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. కోవిడ్ కార‌ణంగా ఈసారి స‌మావేశం కొంత ఆల‌స్య‌మైంద‌న్నారు. 
ఎస్‌సీ, ఎస్‌టీల‌పై వేధింపుల‌కు సంబంధించిన కేసుల త‌క్ష‌ణ ప‌రిష్కారానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించేందుకు ఇది అత్యుత్త‌మ వేదిక అని, అందువ‌ల్ల ఈ క‌మిటీ స‌మావేశాన్ని ప్ర‌భావ‌వంతంగా ఉప‌యోగించుకోవాల్సి ఉంద‌న్నారు. పెండింగ్ కేసుల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా వ‌చ్చే సోమ‌వారం నుంచి స్పంద‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నామ‌ని, ఫిర్యాదులు అందించేందుకు ఈ కార్య‌క్ర‌మాన్ని కూడా ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని తెలిపారు. బాధితుల‌కు స‌రైన న్యాయం జ‌రిగే విష‌యంలో ప‌క్ష‌పాత ధోర‌ణి లేకుండా సేవలందించాల‌ని పోలీసు అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు వెల్ల‌డించారు. కేసుల పురోగ‌తి స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు బాధితుల‌కు తెలియ‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు.

జాప్యం లేకుండా ప‌రిహారం:
చ‌ట్టం ప‌రిధిలో బాధితుల‌కు వీలైనంత త్వ‌రగా ప‌రిహారం అందేలా చూస్తున్నామ‌ని, వారికి పూర్తి భ‌రోసా క‌ల్పించే ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. బాధిత కుటుంబాల‌కు చెందిన 29 మందికి ఉద్యోగాలు ఇచ్చామ‌ని, మ‌రో కేసుకు సంబంధించి త్వ‌ర‌లో ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు తెలిపారు. 2018 నుంచి 2021, మే 31 వ‌ర‌కు చూస్తే 617 కేసుల‌కు సంబంధించి 405 కేసుల్లో బాధితుల‌కు రూ.3,81,48,750 మేర ప‌రిహారం అందించిన‌ట్లు వెల్ల‌డించారు. డివిజ‌న‌ల్ స్థాయిలోనూ క‌మిటీ స‌మావేశాలు క్ర‌మంత‌ప్ప‌కుండా నిర్వ‌హించ‌నున్నామ‌ని, ఇందుకు సంబంధించి డివిజ‌న‌ల్ ఉన్న‌తాధికారుల‌కు మార్గ‌నిర్దేశ‌నం చేస్తున్న‌ట్లు తెలిపారు. వ‌చ్చే జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిట‌రింగ్ క‌మిటీ (ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీస్‌) స‌మావేశాన్ని సెప్టెంబ‌ర్ 24న నిర్వ‌హించ‌నున్నామ‌ని, క‌మిటీ స‌భ్యులు ద్వారా ఎవ‌రైనా స‌మ‌స్య‌ల‌ను స‌మావేశం దృష్టికి తీసుకురావ‌చ్చ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. 

కీల‌క అంశాల‌ను లేవ‌నెత్తిన క‌మిటీ స‌భ్యులు
స‌మావేశంలో జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిట‌రింగ్ క‌మిటీ స‌భ్యులు న‌క్కా చిట్టిబాబు, ఎ.రామేశ్వ‌ర‌రావు, పిడుగు రాముడు, కొమ్ము చిన‌బాబు, బీవీవీఎస్ఎస్ మూర్తి, బూర కృష్ణ‌వేణి, జంగా బాబూరావు ప‌లు కీల‌క అంశాల‌ను లేవ‌నెత్త‌గా.. ఉన్న‌తాధికారులు వివ‌ర‌ణ ఇచ్చారు. స‌భ్యులు లేవ‌నెత్తిన ప్ర‌ధాన అంశాల‌ను ప‌రిశీలించి, అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. కేసుల ప‌రిష్కారం, ప‌రిహారం విష‌యంలో త్వ‌రిత‌త‌గిన నిర్ణ‌యాలు తీసుకోనున్న‌ట్లు వివ‌రించారు. జిల్లాస్థాయిలో అట్రాసిటీ కేసుల‌కు సంబంధించి ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే క‌మిటీ స‌మావేశం దృష్టికి తీసుకురావాల‌ని సూచించారు.

ఎస్‌సీ, ఎస్టీల‌కు సంబంధించి ప్ర‌తి కార్య‌క్ర‌మం పూర్తిస్థాయిలో అమ‌ల‌వుతుంద‌ని, ఈ విష‌యంలో ఎలాంటి అపోహ‌లు అవ‌స‌రం లేద‌ని ఎమ్మెల్సీ పండుల ర‌వీంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. కోవిడ్ నేప‌థ్యంలో ఆర్థికంగా స‌మ‌స్య‌లు ఏర్ప‌డ్డాయ‌ని, కోవిడ్ బాధితుల‌కు పూర్తిస్థాయి వైద్య సేవ‌లు అందించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక ప్ర‌కారం సేవ‌లందించింద‌న్నారు. విధాన‌ప‌ర నిర్ణ‌యాల‌కు సంబంధించి గౌర‌వ ముఖ్య‌మంత్రితో చ‌ర్చించ‌నున్న‌ట్లు పండుల ర‌వీంద్ర‌బాబు వెల్ల‌డించారు.  

క‌మిటీ స‌భ్యులు లేవ‌నెత్తిన వివిధ అంశాల‌ను గౌర‌వ ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్ల‌నున్న‌ట్లు పి.గ‌న్న‌వ‌రం శాస‌న‌స‌భ్యులు కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. భార‌త‌ర‌త్న బాబా సాహెబ్ అంబేడ్క‌ర్ ఆశ‌యాల స్ఫూర్తిగా ఎస్‌సీ, ఎస్‌టీల సంక్షేమానికి ప్ర‌భుత్వం కృషిచేస్తున్న‌ట్లు తెలిపారు. ఎస్‌సీ, ఎస్‌టీల భ‌ద్ర‌త‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యధిక ప్రాధాన్య‌మిస్తోంద‌ని, క్షేత్ర‌స్థాయిలో అధికారుల‌తో స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తూ అట్రాసిటీ కేసుల త‌క్ష‌ణ ప‌రిష్కారానికి, బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించేందుకు కృషిచేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

అన్ని అంశాల‌పైనా నిశిత ప‌రిశీల‌న‌: జేసీ జి.రాజ‌కుమారి
జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిట‌రింగ్ క‌మిటీ (ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీస్‌) స‌మావేశంలో స‌భ్యులు లేవ‌నెత్తిన అన్ని అంశాల‌నూ ప‌రిశీలించి, అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ రూపొందించ‌నున్న‌ట్లు జేసీ (ఏ అండ్ డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి తెలిపారు. స‌భ్యులు చాలా విలువైన అంశాల‌ను క‌మిటీ దృష్టికి తీసుకొచ్చార‌న్నారు. బాధితుల‌కు న్యాయం జ‌రిగే విష‌యంలో క్షేత్ర‌స్థాయిలో ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే వెంట‌నే ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు తెలిపారు. మ‌న‌బ‌డి-నాడు నేడు ద్వారా పాఠ‌శాల‌లు, సంక్షేమ హాస్ట‌ళ్ల‌ను ఆధునికీక‌రిస్తున్న‌ట్లు జేసీ వెల్ల‌డించారు. సంక్షేమ ప‌థ‌కాల ఫ‌లాలు ఎస్‌సీ, ఎస్‌టీల‌కు పూర్తిస్థాయిలో అందించేందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు వివ‌రించారు. స‌మావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జె.రంగ‌ల‌క్ష్మీదేవి, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు, హౌసింగ్ పీడీ జి.వీరేశ్వ‌ర‌ప్ర‌సాద్‌, ఎస్‌సీ కార్పొరేష‌న్ ఈడీ సునీత‌, సాంఘిక సంక్షేమం, పోలీస్‌, రెవెన్యూ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-07-23 15:13:57

ఎస్సీ, ఎస్టీ కేసులపై ద్రుష్టిపెట్టాలి..

ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసుల ప‌రిష్కారంపై దృష్టి సారించాల‌ని, అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశించారు. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోద‌క చ‌ట్టం, పౌర హ‌క్కుల ర‌క్ష‌ణ చ‌ట్టం అమ‌లుపై త‌న క్యాంపు కార్యాల‌యంలో శుక్ర‌వారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.   జిల్లాలో న‌మోదైన‌ అట్రాసిటీ కేసులు, వాటి స్థితిని, ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా సాంఘిక సంక్షేమ‌శాఖ డిప్యుటీ డైరెక్ట‌ర్ కె.సునీల్ రాజ్‌కుమార్ వివ‌రించారు. జిల్లాలో ప్ర‌స్తుతం సుమారు 163 కేసులు పెండింగ్ లో ఉన్నాయ‌ని చెప్పారు. ఈ ఏడాది 18 కేసులు న‌మోదు కాగా, వాటిలో 4 కేసుల్లో ఛార్జిషీటు దాఖ‌లు చేయ‌డం జ‌రిగింద‌ని, మిగిలిన 14 కేసులకు ఛార్జ్‌షీట్‌ పెండింగ్ ఉంద‌ని ఎఎస్‌పి శ్రీ‌నివాస‌రావు తెలిపారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్  మాట్లాడుతూ, అత్యాచార చ‌ట్టం క్రింద న‌మోదు చేసిన కేసుల ప‌రిష్కారంపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించాల‌ని ఆదేశించారు. బాధితుల‌కు త‌క్ష‌ణ‌మే ప‌రిహారం ఇచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.  కేసుల వారీగా స‌మీక్షించి, ఎస్‌సి, ఎస్‌టి కాల‌నీల‌కు రోడ్లు, అంగ‌న్‌వాడీ కేంద్రం ఏర్పాటు, త్రాగునీటి స‌మ‌స్య‌, త‌దిత‌ర  వాటికి సంబంధించిన ఉన్న‌తాధికారుల‌తో త‌క్ష‌ణ‌మే మాట్లాడి, వాటిని ప‌రిష్క‌రించాల‌ని సూచించారు.

                  అట్రాసిటీ కేసులు న‌మోదైన‌, సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్న గ్రామాల్లో శాంతి క‌మిటీల‌ను వేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ప్ర‌తీనెలా 30వ తేదీ లేదా చివ‌రి రోజున సివిల్ రైట్స్ డే నిర్వ‌హించాల‌ని సూచించారు. ఆ రోజున రెవెన్యూ, పోలీసు అధికారులు ఏదో ఒక గ్రామాన్ని లేదా కాల‌నీని సంద‌ర్శించి, అక్క‌డి ప్ర‌జ‌ల‌కు చ‌ట్టంపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. అట్రాసిటీ కేసుల ప‌రిష్కారంపైనా, సివిల్ రైట్స్ డే నిర్వ‌హ‌ణ పైనా ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టాల‌ని స‌బ్ క‌లెక్ట‌ర్‌, ఆర్‌డిఓల‌ను కోరారు. పెండింగ్  కేసుల ప‌రిష్కారంపై న్యాయ‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. కేసుల్లో ద‌ర్యాప్తు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని పోలీసు అధికారుల‌ను క‌లెక్ట‌ర్‌ కోరారు.

                 ఈ స‌మావేశంలో జిల్లా ఎస్‌పి దీపికా పాటిల్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(సంక్షేమం) జె.వెంక‌ట‌రావు, పార్వ‌తీపురం స‌బ్ క‌లెక్ట‌ర్ భావ‌న‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీ శంక‌ర్‌, సోష‌ల్ వెల్ఫేర్ డిడి కె.సునీల్‌రాజ్‌కుమార్‌, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వ‌రి, పిఆర్ ఇఇ విజ‌య్‌కుమార్‌, డిఎస్‌పి అనిల్‌కుమార్‌, ఇత‌ర శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-23 15:10:45

థర్డ్ వేవ్ ఎదర్కోవడానికి పక్కాగా ఏర్పాట్లు..

కోవిడ్ పాజిటివ్  అధిక నమోదు ప్రస్తుతం తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం  కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి తో కలిసి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి లోని పిల్లల ప్రసూతి కేంద్రం తో పాటు  నవజాత శిశు చికిత్సా కేంద్రాలను డాక్టర్ల్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ పాజిటివిటీ తగ్గుముఖం పట్టిందని , అలాగని  అజాగ్రత్తతో ఉండకూడదన్నారు. ముఖ్యమంత్రి వైయస్  జగన్మోహన్ రెడ్డి థర్డ్ వేవ్ పట్ల అప్రమత్తం చేస్తున్న దృష్ట్యా  ప్రభుత్వ ఆసుపత్రిలో చేపడుతున్న పనులను పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కోడానికి అవసరమైన  అన్ని చర్యలు తీసుకుంటున్నామని  ఆగస్టు ఒకటో తేదీ నాటికి జిజిహెచ్ లో జరుగుతున్న పనులు   పూర్తి అవుతాయన్నారు.  థర్డ్ వేవ్ దృష్టిలో పెట్టుకొని కాకినాడ  సామాన్య ఆసుపత్రిలో రెండు వందల పఅడకల ను సిద్ధం చేస్తున్నామన్నారు. కాకినాడ జిజిహెచ్ కు జిల్లా తో  పాటు ఇతర జిల్లాల నుండి రోగులు వస్తుంటారని  వాటికి తగిన విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.  మొదటి ,రెండోవ  దశల కోవేట్ ను  ఎదుర్కో గలిగామని థర్డ్ వేవ్ కావలసిన  అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు.   

 వరదలు భారీ వర్షాలు తో పోలవరం వద్ద  గోదావరి నీటిమట్టం పెరుగుతున్న దృశ్య ధవళేశ్వరం వద్ద శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం నాటికి నీటి మట్టం పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.  వీటిని దృష్టిలో పెట్టుకుని  జిల్లా కలెక్టర్ కార్యాలయం తో పాటు రెవిన్యూ డివిజనల్ కేంద్రాలు, మండల కేంద్రాలలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికీ అప్పుడు పరిస్థితులను గమనిస్తున్నామన్నారు. అవసరమైన సహాయక చర్యలు తగిన విధముగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  ముఖ్యంగా ముంపుకు  గురవుతున్న ఏజెన్సీ ప్రాంతంలో బిసి సంక్షేమ శాఖ మాత్యులు  చెల్లి బోయిన వేణు గోపాల కృష్ణ వారితో శనివారం నాడు పర్యటించనున్నట్లు కలెక్టర్  వెల్లడించారు.  ప్రస్తుతం  జిల్లాలో ప్రాణ, ఆస్తి  నష్టము జరగ లేదని అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. తొలుతగా కలెక్టర్ జిజిహెచ్ లో హాస్పిటల్ సూపర్నెంట్ ఆర్ మహాలక్ష్మి,  డాక్టర్ల బృందాలతో కలిసి డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ ,శిశుసంజీవని, నవజాత శిశువు చికిత్స కేంద్రం, నర్సింగ్ స్టేషన్,  ఐ సి యు ,స్పెషల్ కేర్ జోన్ , నియోనేటల్ ఇన్సెంటివ్ కేర్ యూనిట్ల ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పనులను కలెక్టర్ బృందం పరిశీలించి పనులు త్వరితగతిన సంబంధిత కాంట్రాక్టర్లకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. 

Kakinada

2021-07-23 14:11:19

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి..

రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలకు పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ నుంచి  వర్షపు నీటిని దిగువకు  విడుదల చేస్తున్న నేపధ్యంలో అధికారులంతా అప్రమత్తమంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, తెనాలి, గురజాల డివిజన్ల రెవెన్యూ అధికారులు, తహాశీల్ధార్ల తో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్( రైతు భరోసా-రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్(సచివాలయాలు-అభివృద్ధి) పి.ప్రశాంతి, సంయుక్త కలెక్టర్( ఆసరా-సంక్షేమం) శ్రీధర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్యలతో కలిసి అకాల వర్షాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ సంక్షేమ పధకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లడుతూ జిల్లాలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఎవ్వరూ ఇబ్బందులు పడకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి పధకాలు అమలులో ఎక్కడా జాప్యం జరగకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణతో పని చేయాలన్నారు. ప్రధానంగా భూసేకరణ ద్వారా పేదలకు ఇళ్ళ స్థలాలు, భూముల రీసర్వే, కౌలు రైతు కార్డులు, రైసు కార్డులు, రైల్వేలైన్ల డబ్లింగ్ పనులకు భూసేకరణ, జగనన్న కాలనీల అభివృద్ధి, చిలకలూరిపేట బైపాస్ రహదారి నిర్మాణానికి భూములు సేకరణ, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలకు స్థలాలు, కోవిడ్ నివారణ చర్యలు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, జమాబంది, త్వరితగతిన పేదప్రజల సమస్యల పరిష్కారం, సచివాలయాల్లో సిబ్బంది విధులు, వాలంటీర్ల వ్యవస్థల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అధికారులు సకాలంలో కోర్టు కేసుల పరిష్కారంలో చొరవ చూపాలన్నారు. మీసేవ కేంద్రాల్లో ప్రజలు,రైతుల నుంచి వస్తున్న సమస్యలను త్వరిత గతిన విచారించి తాత్సారం చేయకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 
  సంయుక్త కలెక్టర్( రైతు భరోసా-రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలను లబ్ధిదారులకు అందేలా  రెవెన్యూ అధికారులు వేగం పెంచాలని అన్నారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ పధకాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టం వలన మండల అధికారులు, సిబ్బందిలో జవాబు దారితనం పెరుగుతుందన్నారు. తరచూ సంక్షేమ పధకాల అమలులో వెనుకబడుతున్న మండలాలను రెవెన్యూ అధికారులు గుర్తించి, మండల అధికారులు, రెవెన్యూ సిబ్బందికి ఆధునిక సాంకేతిక వ్యవస్థ విధానంపై తగిన శిక్షణఇప్పించి  పనుల వేగం పెరిగేలా చూడాలన్నారు. జిల్లాలో రెవెన్యూ సమస్యలు అధికంగా వస్తున్న మండలాలను గుర్తించి సత్వర పరిష్కారం చూపడానికి గల అవకాశాలను అధికారులు అందిపుచ్చుకోవాలన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ, అభివృద్ధి పధకాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పని చేస్తున్నారని, అందుకు అనుగుణంగా మనం కూడా ప్రజా సమస్యల  సత్వర పరిష్కారంలో వేగం పెంచాలని ఆదేశించారు. దీంతో పాటు సంక్షేమ పధకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో గుంటూరు డివిజన్ ఆర్.డి.ఒ భాస్కరరెడ్డి, కలెక్టరేట్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-07-23 13:41:32

నిరుపేదలకు పౌష్టికాహారం అంది తీరాలి..

నిరుపేదలకు బలవర్ధకమైన పౌష్టికాహారం అందించే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) 2013 ను అమలు చేస్తుందని  పర్యవేక్షణ కమిటీ నోడల్ అధికారి డా. ఉపేంద్ర సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్సీ హాలులో నోడల్ అధికారి జిల్లా సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా,రెవెన్యూ) ఎఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డితో కలిసి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు  ఆహార భద్రత చట్టం ద్వారా ఉచితంగా ప్రతి నెల అందించే 5 కేజీల బియ్యం వారికి ఎంతో విలువైనదన్నారు. ఉచిత బియ్యం నిరుపేదలకు సక్రమంగా అందకపోతే దేశంలో కార్మికుల శ్రమశక్తి పైన తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఎన్ఎఫ్ఎస్ఏ 2013 పటిష్టంగా అమలుకు జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమీటీల పాత్ర ఎంతో కీలకం అన్నారు. ఆహార భద్రత చట్టం అమలులో వచ్చే సమస్యలను విజిలెన్స్ మానిటరింగ్ కమీటీల ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుందన్నారు.  దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఎన్ఎఫ్ఎస్ఏ 2013 అమలు తీరును పరిశీలన చేసి ఫీడ్ బ్యాక్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జయపూర్లోని కమ్యూనికేషన్ మరియు స్టడీస్ డెవలప్మెంట్ సెంటరుకు బాధ్యతలు అప్పగించిందన్నారు. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నియమించిన పర్యవేక్షణ బృందం గుంటూరు జిల్లాలో శుక్రవారం, శనివారం, ఆదివారం  ఎన్ఎఫ్ఎస్ఏ 2013 అమలును క్షేత్రస్థాయిలో రేషన్ షాపుల వద్ద పరిశీలిస్తుందని, రేషన్ కార్డు లబ్ధిదారులతో మాట్లాడి ఫీడ్ బ్యాక్ తీసుకుంటుందన్నారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రకారం జిల్లాలో ఆహర భద్రత చట్టం అమలు సంతృప్తికరంగా ఉందని, క్షేత్ర స్థాయిలో పర్యటించి మరోసారి ఫీడ్ బ్యాక్ అందిస్తామన్నారు.
సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్ జిల్లాలో ఎన్ఎఫ్ఎస్ఏ 2013 అమలు గురించి పర్యవేక్షణ కమిటీ నోడల్ అధికారికి వివరిస్తూ  రాష్ట్రీయ ఆహార భద్రత చట్టం 2013 ప్రకారం జనాభాలో 75 శాతం మందికి మాత్రమే ఉచితంగా బియ్యం పంపిణీ చేయ్యాలని నిబంధన ఉన్న రాష్ట్రంలో మాత్రం అర్హతే ప్రమాణికంగా 90 శాతం మందికి పైగా బియ్యం కార్డులు అందించి  బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 14,92,004 బియ్యం కార్డులు ఉన్నాయని, వీటిలో 8,54,265 ఎన్ఎఫ్ఎస్ఏ  బియ్యం కార్డులు ఉన్నాయన్నారు. ఈ పాస్ డివైజ్ ద్వారా 2803 రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల బియ్యం పంపిణీ జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ బియ్యంను 901 ఎండీయుల ద్వారా లబ్ధిదారుల ఇంటిముంగిటకే పంపిణీ చేస్తున్నామన్నారు. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా గ్రామ స్థాయిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి బియ్యం కార్డులు అందించటం జరుగుతుందన్నారు. ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీరును నియమించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హతే ప్రమాణికంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే అందించటం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిని సైతం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయటం జరుగుతుందన్నారు. మహిళా సాధికారికతలో భాగంగా సంక్షేమ పథకాల లభ్ధిని మహిళలకే అందించటంతో పాటు పేదలందరికీ ఇళ్ళ పథకం ద్వారా జిల్లాలో దాదాపు 3 లక్షల ఇంటి పట్టాలను మహిళల పేరుతోనే ఇవ్వటం జరిగిందన్నారు. ఇంటి స్థలాలలో మొదటి విడతలో 1,20,000 గృహాల నిర్మాణాలు ప్రారంభించామన్నారు.

  సమావేశంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ కన్వీనర్ జిల్లా పౌర  సరఫరాల అధికారిణి  పద్మశ్రీ,  సభ్యులు సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజరు జయంతి, సోషల్ వేల్ఫేర్ డీడీ మధుసూదనరావు, తూనికలు కొలతల శాఖ జిల్లా కంట్రోలర్ సలీం రాజు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గౌస్ మొహీద్దీన్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి దుర్గాబాయి, జిల్లా మహిళా శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరక్టర్ మనోరంజని, జిల్లా విద్యాశాఖ అధికారిణి గంగా భవానీ, జిల్లా వినియోగదారుల సమాచార విభాగం ఇన్చార్జి చదలవాడ హరిబాబు, చాంబర్ ఆఫ్  కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, రేషన్ దుకాణాల అసోసియేషన్ జిల్లా  ఉపాధ్యక్షులు వైఏబీ ప్రసాదు, సివిల్ సప్లయిస్ అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-07-23 13:33:11

తిరుమ‌ల‌ సుందరీకరణకు ప్రాధన్యత..

తిరుమ‌ల‌లో ఖాళీగా ఉన్న ప్ర‌దేశాల్లో ప‌చ్చ‌ద‌నం పెంచి భ‌క్తుల‌కు ఆహ్లాద‌క‌రంగా ఉండేలా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈఓ  డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి వివరించారు. శుక్ర‌వారం తిరుమ‌ల‌లోని ప‌లు ప్రాంతాల్లో త‌నిఖీలు నిర్వ‌హించారు. గ‌తంలో త‌నిఖీల సంద‌ర్భంగా సూచించిన ప‌లు ప‌నుల ప్ర‌గ‌తిని ప‌రిశీలించారు. అనంత‌రం ఈవో మీడియాతో మాట్లాడుతూ  ద‌క్షిణ మాడ వీధిలో ప‌చ్చ‌ద‌నం పెంచేలా, అవ‌స‌ర‌మైన ఇత‌ర ప్రాంతాలు, కాటేజీల మ‌ధ్య‌భాగంలో ఉద్యాన‌వ‌నాలు పెంచేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని తెలిపారు. భ‌క్తులు న‌డిచే ఫుట్‌పాత్‌ల‌లో విరిగిన టైల్స్ స్థానంలో కొత్త‌వి ఏర్పాటు, భ‌క్తులు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటుకు ఆదేశించామ‌న్నారు. శ్రీ‌వారికి అవ‌స‌ర‌మ‌య్యే పుష్పాలను తిరుమ‌ల‌లోనే పండించేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించామని, ఇందుకోసం ప‌లువురు దాత‌లు కూడా ముందుకొస్తున్నార‌ని చెప్పారు. శ్రీ‌వారికి నైవేద్యానికి, దీపారాధ‌న కోసం దేశీయ ఆవునెయ్యిని ఇక్క‌డే త‌యారుచేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని తెలిపారు. టిటిడి ఆల‌యాల్లో వినియోగించిన పుష్పాల‌ను మ‌రుస‌టి సేక‌రించి తిరుప‌తిలోని గోశాల‌లో అగ‌ర‌బ‌త్తీలు త‌యారుచేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని, ఆగ‌స్టు 15 నాటికి కొన్ని ఉత్ప‌త్తుల‌ను విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు. ఈ అగ‌ర‌బ‌త్తీలను తిరుమ‌ల‌లో కౌంట‌ర్లు ఏర్పాటుచేసి భ‌క్తుల‌కు విక్ర‌యిస్తామ‌ని, ఇందులో వ‌చ్చే లాభాన్ని గోసంర‌క్ష‌ణ‌కు వినియోగిస్తామ‌ని వివ‌రించారు.

           అంత‌కుముందు బూందీ పోటులో శ‌న‌గ‌పిండి మిక్సింగ్‌, బూందీ త‌యారీ, థ‌ర్మోఫ్లూయిడ్ స్టౌలను ఈవో ప‌రిశీలించారు. అదేవిధంగా జిఎన్‌సి టోల్‌గేట్‌, సైనిక్ నివాస్, ల‌డ్డూ కౌంట‌ర్లు, గోశాల, నిర్మాణంలో ఉన్న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నాన్ని ప‌రిశీలించారు. నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో వ్య‌ర్థాల‌ను తొల‌గించాల‌ని అధికారుల‌కు సూచించారు. శ్రీ‌వారిమెట్టు మార్గంలో ప‌ల్ల‌పు ప్రాంతాల్లో ఉద్యాన‌వ‌నాలు పెంచాల‌న్నారు. ఏఎన్‌సి ప్రాంతంలో వ‌ర్ష‌పునీరు నేరుగా ఉద్యాన‌వ‌నాల్లోని చెట్ల‌కు చేరేలా ఏర్పాటు చేయాల‌న్నారు. ఈవో వెంట టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు, గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, గార్డెన్ డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాసులు, డిఎఫ్‌వో చంద్ర‌శేఖ‌ర్‌, రిసెప్ష‌న్‌ డెప్యూటీ ఈవోలు  లోక‌నాథం, భాస్క‌ర్‌, ఆరోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ సునీల్ త‌దిత‌రులు ఉన్నారు.

Tirumala

2021-07-23 13:25:52

వైఎస్సార్ చేయూత లేఖలు ఆవిష్కరణ..

వైఎస్ఆర్ చేయూత ల‌బ్దిదారుల‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి రాసిన లేఖ‌ల‌ను, క‌లెక్ట‌రేట్‌లో జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు గురువారం ఆవిష్క‌రించారు. ఈ ప‌థ‌కాన్ని ఎప్పుడు ప్రారంభించిందీ, అర్హ‌త‌లు, ల‌క్ష్యాలను ఈ లేఖ‌ల్లో వివ‌రించారు. వీటిని జిల్లా వ్యాప్తంగా ఉన్న చేయూత ల‌బ్దిదారులంద‌రికీ అంద‌జేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఈ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్‌తోపాటు, ఎంఎల్‌సి పెనుమ‌త్స సురేష్ బాబు, ఎంఎల్ఏలు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌,  విజ‌య‌న‌గ‌రం మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, కొప్ప‌ల‌వెల‌మ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ నెక్క‌ల నాయుడుబాబు, దాస‌రి కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ రంగుముద్రి ర‌మాదేవి, కార్పొరేట‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణి, డిఆర్‌డిఏ పిడి కె.సునీల్ రాజ్‌కుమార్‌, బిసి కార్పొరేష‌న్ ఇడి ఆర్‌వి నాగ‌రాణి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-22 15:42:03

ప్రజలకు సకాలంలోనే సేవలందాలి..

ప్రజలకు సకాలంలో సచివాలయాల నుంచి సేవలు అందించేందుకు సిబ్బంది శ్రమించాలని జెసి జె.వెంకటరావు ఆదేశించారు.  విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ పరిధిలోని కొత్త అగ్ర‌హారం రెండో వార్డు స‌చివాల‌యాన్ని జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం)  గురువారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఆయ‌న ముందుగా హాజ‌రు ప‌ట్టీని ప‌రిశీలించి, సిబ్బంది హాజ‌రును త‌నిఖీ చేశారు. అనంత‌రం సచివాల‌య రికార్డుల‌ను ప‌రిశీలించారు. పెండింగ్ ద‌ర‌ఖాస్తుల‌పై ఆరా తీశారు. వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు, పెండింగ్‌ రిక్వెస్టుల పై సిబ్బందిని ప్ర‌శ్నించారు. ప్రభుత్వం సచివాలయాల ద్వారా అందించే 745 సేవలను ప్రజలకు అందించి తద్వారా వారి సమస్యలకు స్థానికంగానే పరిష్కారం చూపించాలన్నారు. సిబ్బంది అంతా నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని, స‌మ‌య పాల‌న పాటించాల‌ని, వ‌చ్చిన విన‌తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించాల‌ని జెసి ఆదేశించారు.

Vizianagaram

2021-07-22 15:37:48

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

కోస్తా ప్రాంతంలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో, జిల్లా యంత్రాంగాన్ని క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ అప్ర‌మ‌త్తం చేశారు. వ‌ర్షాల కార‌ణంగా జిల్లాలో ఎటువంటి న‌ష్టం వాటిల్ల‌కుండా ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. గురువారం సాయంత్రం నిర్వ‌హించిన టెలీకాన్ఫ‌రెన్స్ లో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున, దానికి అనుగుణంగా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఎక్క‌డా ప్రాణ‌, ఆస్తి న‌ష్టాలు చోటుచేసుకోకుండా అన్ని ర‌కాల‌ ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌న్నారు. వ‌ర్షాల కార‌ణంగా స‌మాచార వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన‌కుండా చూడాల‌న్నారు. ఒక‌వేళ ఎక్క‌డైనా  క‌మ్యూనికేష‌న్ దెబ్బ‌తింటే, వెంట‌నే పున‌రుద్ద‌రించేందుకు ముందస్తు ఏర్పాటు చేయాల‌న్నారు. అలాగే రోడ్లు ఎక్క‌డైనా కొట్టుకుపోయే ప‌క్షంలో, వాటిని హుటాహుటిన పున‌ర్‌నిర్మించేందుకు సిద్దంగా ఉండాల‌న్నారు. ఎక్క‌డైనా చెరువుల‌కు గండ్లు ప‌డే అవ‌కాశం ఉన్నందున‌, ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు ముందుగానే త‌నిఖీ చేయాల‌ని సూచించారు. విద్యుత్ స్థంబాలు ప‌డిపోవ‌డం, విద్యుత్ వైర్లు తెగిపోవ‌డం చోటుచేసుకొనే అవ‌కాశం ఉంద‌ని, అందువ‌ల్ల విద్యుత్ అధికారులు ముందుగా త‌మ శాఖాప‌రంగా త‌నిఖీలు నిర్వ‌హించాల‌ని సూచించారు. పెద్ద‌పెద్ద చెట్లు, పాత వృక్షాలు కూలిపోయే ప్ర‌మాదం ఉంద‌ని, వాటిని తొల‌గించేందుకు ప‌వ‌ర్ సాల‌ను, ఇత‌ర ప‌నిముట్ల‌ను సిద్దంగా ఉంచుకోవాల‌న్నారు. అలాగే లోత‌ట్టు ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించేందుకుగాను,  పున‌రావాస కేంద్రాల‌ను ముందుగా గుర్తించి సిద్దం చేయాల‌ని సూచించారు. వారికి అవ‌స‌ర‌మైన ఆహారం, ఇత‌ర అవ‌స‌రాల‌ను ఏర్పాటు చేయాల్సి ఉంద‌న్నారు. త్రాగునీటి ప‌థ‌కాలు దెబ్బ‌తినే అవ‌కాశం ఉంద‌ని, వాటిని హుటాహుటిన పున‌రుద్ద‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంద‌న్నారు.  జిల్లా వ్యాప్తంగా ఎక్క‌డ ఎటువంటి ప్ర‌మాదం చోటుచేసుకున్నా, రెవెన్యూ అధికారులు త‌క్ష‌ణ‌మే స్పందించాల‌ని, త‌మ‌కు వెంట‌నే స‌మాచారం ఇవ్వాల‌ని ఆదేశించారు. ఇరిగేష‌న్‌, విద్యుత్, త్రాగునీటి స‌ర‌ఫ‌రా అధికారుల‌ను, ఇత‌ర సాంకేతిక నిపుణుల‌ను ముందుగానే అప్ర‌మ‌త్తం చేయాల‌ని, కంట్రోలు రూముల‌ను ఏర్పాటు చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.  ఈ టెలీకాన్ఫ‌రెన్స్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, స‌బ్ క‌లెక్ట‌ర్ భావ‌న‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీ శంక‌ర్‌, వివిధ మండ‌లాల తాశీల్దార్లు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-22 15:33:07

అభివృద్ధికి సర్పంచ్ లకు శిక్షణ అవసరం..

గ్రామ సర్పంచులు తమ గ్రామాలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి శిక్షణా తరగతులు ఎంతగానో దోహదపడతాయని ఆంధ్ర ప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు వెల్లడించారు. గురువారం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 22నుండి 31 తేదీ వరకు పెద్దాపురం డివిజన్ సంబంధించిన సర్పంచులకు ఇచ్చు శిక్షణ కార్యక్రమాన్ని చైర్మన్ దొరబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక మండల ఎంపీడీవో రమణారెడ్డి అధ్యక్షతన శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణా తరగతిలో చైర్మన్ దొరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  గ్రామాలను అన్నివిధాలా అభివృద్ధి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించడానికి గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు సర్పంచులు ఈ శిక్షణా తరగతులు పూర్తిస్థాయిలో శిక్షణ పొంది  గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని గ్రామాభివృద్ధికి పాటుపడాలన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు గ్రామ సచివాలయం ద్వారా అందించి మంచి కీర్తి ప్రతిష్టలు సాధించాలని కోరారు . ప్రజల అభిమానంతో మరో సారి  మీరే సర్పంచ్ గా గెలవాలని ఆకాంక్షించారు .రాష్ట్రప్రభుత్వం కులమతాలకు అతీతంగా ప్రతి వారికి సంక్షేమ పథకాలు అందించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు ఇందులో భాగంగానే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం లో రాష్ట్రంలో 117వేలు కాలనీలకు, 30 లక్షల పట్టాలు అందజేశారని తెలిపారు.  గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పోటీపడి గ్రామాభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ శిక్షణ లో పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామ సర్పంచ్ యొక్క విధులు- బాధ్యతలు, వివిధ సంక్షేమ కార్యక్రమాల పై అవగాహన , త్రాగునీరు,గ్రామీణ రోడ్ల నిర్మాణం , తదితర అంశాలపై పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు,పెద్దాపురం డివిజనల్ అభివృద్ధి అధికారి ప్రసాదు, డివిజనల్ పంచాయతీ అధికారిణి అమ్మాజీ , తాసిల్దార్ బి. శ్రీదేవి  ఈ ఓ పి ఆర్ డి మహేశ్వరి. కోటనందూరు, పెద్దాపురం, తొండంగి మండలాలకు చెందిన 54 మంది గ్రామ  సర్పంచులు సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-07-22 15:26:23

గ్రామాభివ్రుద్ధిలో సర్పంచ్ లే కీలకం..

దేశం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో పైనించాలంటే గ్రామాలు అభివృద్ధి సాధించాలని, అందుకు క్షేత్ర స్థాయి ప్రజాప్రతినిధులు కీలకపాత్ర పోషించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయంలో గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన  పంచాయతీ ఎన్నికలలో ఎన్నికైన సర్పంచ్ లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని, శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించి,ఉత్తమ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు , కార్యక్రమాలు విజయవంతం కావాలంటే సర్పంచులు కీలక భాగస్వామ్యం వహించాలన్నారు. భారత రాజ్యాంగంలో పంచాయతీలకు, సర్పంచులకు ప్రత్యేక స్థానం ఉందని గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పిన మహాత్ముని మాటలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన సచివాలయ  వ్యవస్థ ద్వారా సుమారుగా 530 సేవలు అందించబడుతున్నాయన్నారు. తమ సొంత అనుభవాలను ఇతరులతో పంచుకొని తమ గ్రామంలో గతంలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని సర్పంచులు అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్నారు. 

జిల్లాలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్ నెస్  సెంటర్లు,బల్క్ మిల్క్ సెంటర్ల కు సంబంధించి సుమారుగా 4,500 నూతన భవనాలు నిర్మాణం జరుగుతుందని, త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి అయ్యే విధంగా సర్పంచులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. గ్రామాల్లో స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా బహిరంగ మలవిసర్జన, పారిశుద్ధ్యంలో ఉత్తమ పనితీరు కనబరిచిన సర్పంచులకు జాతీయ స్థాయిలో  ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందించ బడుతున్నాయన్నారు. గ్రామాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారిలో మార్పు తీసుకు రావాలన్నారు. ప్రధానంగా పచ్చదనం , తడి-పొడి చెత్త సేకరణ,  పారిశుద్ధ్యం,త్రాగు నీరు ఇతర అంశాలపై  ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగా లేకపోతే అనేక రోగాలకు నిలయంగా ఉంటుందన్నారు. 

కోవిడ్ పాజిటివ్ రేటు అత్యధికంగా ఉన్న గ్రామాల్లో పూర్తిగా ఆంక్షలు విధించడం జరుగుతుందని,కరోనా నియంత్రణకు ఎటువంటి సందేహాలకు పోకుండా సర్పంచులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టిన సర్పంచులు తమకు  ఎదురయే  ప్రతి సవాళ్లను ఒక ఛాలెంజ్ గా తీసుకుని గ్రామాలను  అభివృద్ధి పథంలో నడిపించడం ద్వారా జిల్లాకు మంచిపేరు వస్తుందని కలెక్టర్ తెలిపారు.  జిల్లా పరిషత్ ప్రధాన కార్యదర్శి ఎన్ వివి.సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1103 గ్రామ పంచాయతీలకు గాను 1072 మంది ఈ శిక్షణా కార్యక్రమలలో పాల్గొంటున్నారు.5 వెలు జనాభా పైనున్న 218 గ్రామాల్లో సర్పంచ్ లకు సామర్లకోట ఈటీసీ కేంద్రంలోను ,854 మందికి ఐదు డివిజన్లలో శిక్షణాతరగతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తొలిరోజు శిక్షణా కార్యక్రమానికి  సంబంధించి కాకినాడ డివిజన్ పరిధిలో ఉన్న కాకినాడ, కరప,తాళ్ళరేవు మండలాల నుంచి సుమారుగా 49 మంది శిక్షణ తరగతులకు హాజరైనట్లుఆయన తెలిపారు.

  గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించడంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులో నిర్మాణాత్మకమైన పాత్రను పోషించే విధంగా గ్రామ సర్పంచులు పరిపాలన విధానం పై అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ ఆర్టీవో ఏజీ.చిన్నికృష్ణ తెలిపారు. క్షేత్ర స్థాయిలో సర్పంచులు ఉత్సాహంగా ఉంటే లబ్ధిదారులకు మంచి జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి ఎస్ వి నాగేశ్వర నాయక్ తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రతి అంశం పట్ల పూర్తి అవగాహన పెంపొందించుకొని, ఏ విధమైన సందేహం ఉన్న ఇక్కడే నివృత్తి చేసుకోవాలని ఆయన తెలిపారు.  ఈ కార్యక్రమంలో డిఎల్ డీఓ. మధుసుధన్ రావు ,కో-ఆర్డినేటర్ కెఎస్ .ఆర్మ్ స్ట్రాంగ్ , ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-07-22 14:02:01

3వ దశకు ముందస్తు ఏర్పాటు చేయండి..

తూర్పుగోదావరి జిల్లాలో 3వదశ కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  గురువారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ మూడో దశ సన్నద్ధతపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, నోడల్ అధికారులు‌, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి లతో కలిసి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి సమీక్షించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడో దశ కోవిడ్ ముప్పు పొంచి యున్నందున ఆసుపత్రిలో సాధారణ ,ఆక్సిజన్, ఐసియు పడకలను, వెంటిలేటర్స్, ఆక్సిజన్ సిలిండర్ ఇతర  మౌలిక సదుపాయాల కల్పన పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు .నియోనటల్ పడకలు కూడా తగినన్ని అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. ప్రతి ఆస్పత్రికి నోడల్ అధికారులు నిరయమించడం జరిగిందని , నోడల్ అధికారులు క్రమం తప్పకుండా ఆసుపత్రులను తనిఖీ చేయాలి అన్నారు. కోవిడ్ మూడో దశను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సరైన  కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా.కేవిఎస్ గౌరీశ్వరరావు, జిల్లా ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ డా.పీ రాధాకృష్ణ,జేడ్పీసీఇవో ఎన్ వివి.సత్యనారాయణ, ఏపీఎంఐసి ఇంజనీర్లు,ఇతర అధికారులు హాజరయ్యారు.

కాకినాడ

2021-07-22 13:57:52