1 ENS Live Breaking News

ఉద్యోగులంతా వేక్సిన్ వేయించకోవాలి..

ప్ర‌తి ప్ర‌భుత్వోద్యోగి కోవిడ్ వ్యాక్సిన్ త‌ప్ప‌నిస‌రిగా వేయించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశించారు. కోవిడ్ వ్యాక్సిన్ ఇప్ప‌టివ‌ర‌కు వేయించుకోని ఉద్యోగుల‌తో వ్యాక్సిన్ వేయించే బాధ్య‌త ఆయా జిల్లా అధికారుల‌దేన‌ని స్ప‌ష్టంచేశారు. వ్యాక్సిన్ తోనే కోవిడ్ నుంచి మ‌న‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని, నిత్యం ప్ర‌జ‌ల‌తో సంబంధాలు క‌లిగి వుండే ప్ర‌భుత్వ ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకోవ‌డం ద్వారా త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించుకోవ‌డంతోపాటు త‌మ కుటుంబానికి కూడా ర‌క్ష‌ణ క‌ల్పించిన‌ట్లవుతుంద‌న్నారు. క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో స్పంద‌న విన‌తుల స్వీక‌ర‌ణ సంద‌ర్భంగా సోమ‌వారం డి.ఆర్‌.డి.ఏ ఆధ్వ‌ర్యంలో మాస్క్‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు రూపొందించిన క‌ర‌ప‌త్రాల‌ను, పోస్ట‌ర్ల‌ను క‌లెక్ట‌ర్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా అధికారుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ 45 ఏళ్ల లోపు వ‌య‌స్సుగ‌ల ఉద్యోగుల‌కు కూడా ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్లుగా గుర్తించి వ్యాక్సిన్ వేస్తార‌ని చెప్పారు. ఏ ప్ర‌భుత్వ శాఖ‌కు చెందిన ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకొనేందుకు వ‌చ్చినా వ్యాక్సిన్ వేసేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి ఆదేశాలివ్వాల‌ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ర‌మ‌ణ‌కుమారికి సూచించారు. గ్రీవెన్స్ సెల్‌కు వ‌చ్చిన ఇద్ద‌రు సిబ్బంది తాము ఇప్ప‌టికీ వ్యాక్సిన్ వేయించుకోన‌ట్లు తెలుప‌గా వారిద్ద‌రికీ త‌క్ష‌ణ‌మే వ్యాక్సిన్ వేయించాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. వ్యాధి సోకిన త‌ర్వాత ఇబ్బందులు ప‌డే కంటే వ్యాధి ప్ర‌బ‌ల‌కుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్ట‌డ‌మే మేలైన విధాన‌మ‌ని చెప్పారు. మాస్క్ ధ‌రించ‌డం, శానిటైజేష‌న్‌, భౌతిక‌దూరం వంటి జాగ్ర‌త్త‌లు పాటించిన‌ట్లయితే మూడో వేవ్ రాకుండా నిరోధించ‌గ‌ల‌మ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ వేసుకొన‌డం ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించ‌గ‌ల‌మ‌న్నారు.

జిల్లాలో కోవిడ్ కేసులు అధికంగా వున్న మండ‌లాల ప్ర‌త్యేకాధికారులు పాజిటివ్‌ కేసులు న‌మోదైన గ్రామాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించి ప్ర‌జ‌ల్లో జాగ్ర‌త్త‌ల‌పై అవ‌గాహ‌న కల్పించాల‌ని సూచించారు. గ‌జ‌ప‌తిన‌గ‌రం, ఎల్‌.కోట‌, గ‌రివిడి, కొత్త‌వ‌ల‌స‌, బొండ‌ప‌ల్లి, ఎస్‌.కోట‌, తెర్లాం మండ‌లాల్లో యాక్టివ్ కేసులు అధికంగా ఉన్నాయ‌ని, ఈ మండ‌లాల అధికారులు అక్క‌డి ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌న్నారు. కెంగువ‌, వెల‌గ‌వ‌ల‌స‌, ద‌త్తిరాజేరు, కోనూరు, ఎస్‌.కోట‌, కొంపంగి, న‌గ‌రంలోని కె.ఎల్‌.పురం స‌చివాల‌యాల ప‌రిధిలో కేసులు అధికంగా వున్నాయ‌ని, ఆయా ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసేలా జిల్లా పంచాయ‌తీ అధికారి, జిల్లాప‌రిష‌త్ సి.ఇ.ఓ., మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్‌లు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. డి.ఆర్‌.డి.ఏ. ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ సునీల్ రాజ్ కుమార్‌, సిపిఓ విజ‌య‌ల‌క్ష్మీ, జిల్లాప‌రిష‌త్ సి.ఇ.ఓ. టి.వెంక‌టేశ్వ‌ర‌రావు, హౌసింగ్ పి.డి. ఎస్‌.వి.ర‌మ‌ణ‌మూర్తి, డి.ఇ.ఓ. నాగ‌మ‌ణి, అన్ని శాఖ‌ల జిల్లా అధికారులు  పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-19 13:23:56

నూతన సర్పంచ్ లకు ప్రాధమిక శిక్షణ..

విజయనగరం జిల్లాలో  నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతి సర్పంచులకు  ప్రాధమిక శిక్షణా కార్యక్రమం ఈ నెల 22 నుండి ఆగష్టు 7వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ తెలిపారు.  విజయనగరం డివిజిన్  సంబంధించి 5 బ్యాచ్ లుగా, పార్వతిపురం డివిజిన్ కు సంబంధించి 4 బ్యాచ్ లుగా విభజించడం జరిగిందన్నారు. 100 నుండి 120 మందితో బ్యాచ్ లను ఏర్పాటు  చేయడమైందని, ఒక్కో బ్యాచ్ కు  ముడేసి రోజుల చొప్పున శిక్షణా కార్యక్రమం ఉంటుందని  అన్నారు.  విజయనగరం డివిజిన్ కు జే.ఎన్ .టి యులో 489 మందికి,  పార్వతీపురం డివిజిన్ వారికీ  గరుగుబిల్లి మండలం  ఉల్లిభద్ర లో ఉన్న ఉద్యాన కళాశాలలో 379 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.   సోమవారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్ల పై సమీక్షించారు. శిక్షణకు అవసరమగు సామగ్రిని,  టేబుళ్ళ ను, హాజరు పట్టికలను, ఐ.డి కార్డులను  సిద్ధంగా ఉంచుకోవలన్నారు.  సర్పంచ్ లందరినీ ఒకేలా చూడాలని, క్రమ శిక్షణ తో శిక్షణ జరిగేలా చూడాలని సూచించారు.  చక్కటి భోజన, వసతి, బెడ్స్ ,  అల్పాహారం, తాగు నీరు  ఏర్పాటు చేయాలని,  వారి రవాణా కు కూడా ఏర్పాట్లు చేయాలనీ అన్నారు. స్థానికంగా ఎక్ష్పొజర్ పర్యటనకు ఏర్పాటు చేయాలనీ  ఇందులో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు.  ప్రతి ఒక్కరు  ఒక మొక్కను  నాటేలా చూడాలన్నారు.  పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, చెరువు శుద్ధి, అలంకరణ   తదితర అంశాల పై అవగాహన కలిగేల ఏర్పాటు చేయాలన్నారు.  ముందు గానే ఆయా శాఖలకు సమాచారం అందించి  సమన్వయం  చేసుకోవాలన్నారు.  శిక్షణ లో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన  ఉండాలన్నారు.  శిక్షణ అనంతరం ఇచ్చే సర్టిఫికేట్ లు, ఫోటో లు ప్రతి ఒక్కరికి అందజేయాలన్నారు.   శిక్షణ లో ప్రధానంగా   గ్రామ సచివాలయాల ఏర్పాటు, ప్రాముఖ్యత,  పంచాయతీల విధులు, అధికారాలు, బాధ్యతలు, లక్ష్యాలు,  మౌలిక సదుపాయాల కల్పన లో  గ్రామాభి వృద్ధి తాగు నీరు, రోడ్లు, విద్యుత్ దీపాలు, పంచాయతీల ఆర్ధిక పరిపుష్టి, ఆర్ధిక వ్యవహారాలు,  సంక్షేమ పధకాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం తదితర అంశాల పై శిక్షణ  ఉంటుందన్నారు.  ఎలాంటి లోపాలు జరగకుండా,  ఏర్పాట్లను గావించాలని ,  శిక్షణ అనంతరం ప్రతి ఒక్కరు సంతోషంగా వెళ్ళే లా చూడాలని అన్నారు.  

శిక్షణ కు హాజరయ్యే  సర్పంచులందరికి ధర్మల్ స్కానర్ తో పరీక్షించాలని, ఎవరికైనా జ్వరం ఉంటే పంపించి వేయాలని తెలిపారు. శిక్షణలో  భౌతిక దూరాన్ని  పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా వాడాలని, ప్రవేశం వద్ద శానిటైజర్ ఉంచాలని, కోవిడ్ నిబంధనలను పాటించడమే కాకుండా, శిక్షణ లో కోవిడ్ పై కూడా  తరగతి నిర్వహించి అవగాహన కల్పించాలని అన్నారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంయుక్త కలెక్టర్లు డా. జి.సి.కిషోర్ కుమార్, జే.వెంకట రావు, సబ్ కలెక్టర్ భావన, ఆర్.డి.ఓ భవాని శంకర్ ,   డి.పి.ఓ సుభాషిని, జిల్లా పరిషత్ సి.ఎఈ.ఓ వెంకటేశ్వర రావు, డివిజినల్ పంచాయతి అధికారులు,  డిఎల్డి ఓ లు  రాజ్ కుమార్, రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-07-19 13:08:19

అనాధ బాలలకు ఉచిత వసతి గ్రుహాలు..

అనాధ బాలురు, తల్లి, లేదా తండ్రిని కోల్పోయిన పిల్లలు, వీధి బాలురు, యాచక బాలుర కోసం నిర్వహిస్తున్న అణగారిన పిల్లల హాస్టల్ సేవలను, అవసరమైనవారు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ కోరారు. సమగ్ర శిక్ష, ఐ.ఆర్.పి.డబ్ల్యు.ఏ. సంస్థ ఆధ్వర్యంలో, స్థానిక కంటోన్మెంట్ మున్సిపల్ హై స్కూల్ సమీపంలో నిర్వహిస్తున్న అణగారిన పిల్లల హాస్టల్ కు సంబంధించిన గోడ పత్రికను, కలెక్టరేట్ ఆడిటోరియంలో, సోమవారం కలెక్టర్ హరి జవహర్ లాల్ ఆవిష్కరించారు. ఈ హాస్టల్ పట్ల అవగాహన కల్పించి, అణగారిన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలని,  ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. అవసరం అయిన వారంతా సేవలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయ కర్త జె.విజయలక్ష్మి మాట్లాడుతూ,  అనాధ పిల్లలకు, ఈ హాస్టల్లో వసతిని కల్పించి, 3 వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్య, నైపుణ్యాభివృద్ధి కల్పించడం జరుగుతుందని చెప్పారు. ఈ హాస్టల్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి, అవసరమైన వారిని చేర్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్(సంక్షేమం) జె.వెంకటరావు, డిఆర్వో ఎం.గణపతిరావు, సోషల్ వెల్ఫేర్ డిడి కె.సునీల్ రాజ్ కుమార్, డి.ఎం.అండ్.హెచ్.ఓ. డాక్టర్ ఎస్వీ రమణ కుమారి, ఏ.ఎల్.ఎస్. కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు, ఐ.ఆర్.పి.డబ్ల్యూ.ఏ. డైరెక్టర్ కె.ప్రకాష్, యు.ఆర్.హెచ్. సిబ్బంది రామకృష్ణ, శ్రీనివాస్, భానుమూర్తి, విమల తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-19 12:58:41

25 వరకే జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు..

విజయనగరం జిల్లాలో రబీ సీజనులో ధాన్యం సేకరణ లక్ష్యాలు పూర్తి కావస్తుండటంతో,  ఈ నెల 25వ తేదీ వరకు మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తామని ని జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డాక్టర్ జిసి కిషోర్ కుమార్ తెలిపారు. సీజన్ చివరి దశకు చేరుకున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు ఎవరిదగ్గరైనా ధాన్యం మిగిలిపోయిన పక్షంలో, వెంటనే కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లి, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరను పొందాలని జేసీ సూచించారు. ప్రకటించిన తేదీ తరువాత ధాన్యం తీసుకొచ్చినా కొనుగోలుచేయడానికి వీలుపడదనే విషయాన్ని రైతులు గమనించాలన్నారు.

Vizianagaram

2021-07-18 17:40:52

19 నుంచి స్పంద‌న‌ పునః ప్రారంభం..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఈ నెల 19 వ తేదీ సోమ‌వారం నుంచి స్పంద‌న కార్య‌క్ర‌మం ప్రారంభం కానుందని జిల్లా కలెక్టర్ డా. హరిజవహర్ లాల్ తెలియజేశారు. కోవిడ్ కార‌ణంగా కొంత‌కాలంగా ఆపివేసిన స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని పునః ప్రారంభిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. స్పంద‌న‌కు వ‌చ్చే ప్ర‌తీఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా మాస్కును ధ‌రించాల‌ని, భౌతిక దూరాన్ని పాటించాల‌ని సూచించారు.  ఈ కార్య‌క్ర‌మానికి వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారులంతా త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రు కావాల‌ని ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్టు పేర్కొన్నారు.

Vizianagaram

2021-07-18 17:38:25

4వ విడత చందనం లభ్యత 27కిలోలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి వారికి 4వ విడత చందనం సమర్పించడానికి అరగత కార్యక్రమంలో భాగంగా తొలి ఈరోజు 27 కిలోల చందనాన్ని అరగదీశారని ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. ఈమేరకు ఆమె మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 24వ తేదీన స్వామివారికి తుదివిడత చందన సమర్పణ జరుతుందని అందులో పేర్కొన్నారు. నేటి నుంచి చందనం అరగదీత నాలుగైదు రోజులపాటు కొనసాగనుంది. స్వామివారికి భక్తులు చందనాన్ని సమర్పించడానికి ట్రస్టు సభ్యులు లేదా ప్రత్యేక ఆహ్వానితులు, దేవస్థాన అధికారులను సంప్రదించవచ్చునని దేవస్థాన అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు భక్తులు స్వామివారికి చందనాన్ని సమర్పించారు. స్వామివారికి చందనం సమర్పించే అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని దేవస్థాన ఈఓ ఆ ప్రకటనలో కోరుతున్నారు.

సింహాచలం

2021-07-18 16:55:27

అప్పన్నకు పోలీసులు ప్రత్యేక పూజలు..

సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని 1991వ బ్యాచ్ కు చెందిన పోలీసు అధికారుల బృందం అదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. మొత్తం 25 మంది ఏసీపీలు, డీఎస్పీలు, సీఐలు స్వామిని దర్శించుకున్నావారిలో ఉన్నారు. 1991లో ఏపీ పోలీస్ అకాడమీలో శిక్షణపొందారు. ప్రతిఏటా ఒకరోజు ఏదో ఒక చోట ఈ అధికారులంతా  కలుస్తుంటారు. అయితే అనూహ్యంగా ఈ స్వామివారి దివ్య సన్నిధిలో కలిసే భాగ్యం దక్కిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. తమకు మంచి దర్శనం ఏర్పాటుచేసిన దేవస్థానం ఈఓ సూర్యకళకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.  స్వామివారిని దర్శించేటప్పుడు అందరూ సంప్రదాయ డ్రెస్ కోడ్ పాటించారు. శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆశీస్సులతో విధులు సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నామని చెప్పారు.  దర్శనం అనంతరం సింహగిరులపైనే కాసేపు గడిపారు పోలీసు అధికారులంతా..వీరిలో గోపాలపట్నం ట్రాఫిక్ సీఐ శ్రీహరి రాజు కూడా ఉన్నారు. 

సింహాచలం

2021-07-18 14:56:06

శనివారం అన్ని పీహెచ్సీల్లో కరోనాటీకా శిబిరాలు..

తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలలో 45 ఏళ్ల వయస్సు దాటిన వారికి మొదటి డోసు, అలాగే మొదటి డోసు టీకా తీసుకుని 84 రోజుల వ్యవధి పూర్తయిన  వారికి రెండవ డోసు కోవీషీల్డ్ టీకా వేస్తారని జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో  కోవీషీల్డ్  రెండవ డోస్ టీకా తీసుకోవలసిన వారు ఇంకా దాదాపు 50,000 వరకూ ఉన్నారని వారందరూ శనివారం తప్పని సరిగా రెండవ డోస్ టీకా వేయించుకోవాలని ఆమె కోరారు. కోవిడ్ వైరస్ నియంత్రణలో ప్రతీ ఒక్కరూ భాగస్వామి కావాలన్నారు. తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని జెసి కోరారు.

Kakinada

2021-07-16 15:49:45

వైఎస్సార్ భీమా పథకం 95% నమోదు..

వైఎస్సార్ భీమా పథకానికి సంబంధించి 99.25 శాతం రైస్ కార్డ్ హోల్డర్ లను నమోదు చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ (ఆసరా&సంక్షేమం) జి.రాజకుమారి తెలిపారు.  శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో వైయస్సార్ బీమా పథకానికి సంబంధించి అమలాపుర, రామచంద్రాపురం, పెద్దాపురం ,కాకినాడ డివిజన్ ల గ్రామ వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ లకు వైయస్సార్ బీమా క్లయిమ్ ఏవిధంగా చేయాలి దాని పై శిక్షణ కార్యక్రమాన్ని జూమ్  కాన్ఫరెన్స్ ద్వారా జేసీ రాజకుమారి సంబంధిత అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వై.ఎస్.ఆర్. బీమా పధకాని రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగాజూలై 1వ తేదీ న  ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పధకంలో సహజ మరణం పొందితే రూ.100000/-లు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.500000/- లు , పూర్తి అంగవైకల్యం కలిగితే రూ.500000/- మరియు పాక్షిక అంగవైకల్యం కలిగితే రూ.2,50,000/- లు
నేరుగా నామినీ ఖాతాలకు జమచేయడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో వై.ఎస్.ఆర్.బీమా పధకంలో 16,53,364 మంది రైస్ కార్డ్ హోల్టర్స్ నమోదు చేయవలసియుండగా ఇప్పటి వరకు 99.25 శాతం నమోదు చేయడం జరిగిందన్నారు . ఈ పధకంలో నమోదు అయిన వారు ఎవరైనా మరణిస్తే వారి క్లైమ్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, తక్షణ సహాయం (మట్టిఖర్చులు) రూ.10000/- లు  చెల్లించే విధానం పై  పలు అంశాలు ఈ సందర్భంగా వివరించారు.ఈ నేల 17న  రాజమహేంద్రవరం , గిరిజన ప్రాంతంలో ఉన్న 11 మండలంలో ఉన్న WEA &WDWS వారికి ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జేసీ జి.రాజకుమారి గారు తెలియజేసారు. ఈ జూమ్ కాన్పిరెన్స్ లో ప్రాజెక్టు డైరెక్టర్  వై.హరిహరనాథ్, అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ కె.శ్రీనివాసకుమార్, వై.ఎస్.ఆర్.బీమా ఇన్సూరెన్స్ విభాగం ఎస్.వేదకుమారి ఏపియం, డి.ఆర్.పి ఐ.టి పర్సన్స్ , నాలుగు డివిజన్ల గ్రామ వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2021-07-16 15:46:51

జగనన్న కాలనీలు త్వరగా పూర్తిచేయాలి..

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజక వర్గంలోని జగనన్న కాలనీల్లో చేపడుతున్నఇళ్ల నిర్మాణాలను  త్వరితగతిన పూర్తిచేయాలని, ఇల్లు నిర్మాణాల్లో ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండాలని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ ఆకాంక్షించారు. శుక్రవారం ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలో ఏర్పాటుచేసిన  పలు అభివృద్ధి పథకాలకు శాసన సభాపతి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపనలు చేశారు. తొలుత తోలాపి గ్రామంలోని జగనన్న కాలనీలో ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అలమాజీపేట గ్రామంలో సుమారు 13 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం జగనన్న పచ్చతోరణం - వనహారం  కార్యక్రమంలో భాగంగా రాపాక నుండి కుమ్మరి కాలననీ వరకు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమంలోనూ, పొందూరు ఎంపీడీవో కార్యాలయంలో వికలాంగులకు ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొందూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద శాసన సభాపతి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తుందని చెప్పారు. ఇటువంటి పరిపాలన చరిత్రలో మునుపెన్నడూ లేదని గుర్తుచేసారు. ప్రతీ సంక్షేమ పథకం నేరుగా లబ్ధిదారునికే అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అందువలనే ప్రతి పథకం విజయవంతం అయిందని సభాపతి అభిప్రాయపడ్డారు. ఆమదాలవలస నియోజకవర్గంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను కోరిన ఆయన ఇళ్ల  నిర్మాణంలో ఆమదాలవలస నియోజకవర్గం రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

 ఉత్తరాంధ్ర వెనకబడిందని గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి  ఇరిగేషన్లో జిల్లాకు పెద్దపీట వేసారని చెప్పారు. మడ్డువలస ప్రోజెక్ట్ కోసం అక్కడి రైతులకు నష్టపరిహారం చెల్లించి సుమారు 30 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించబోతున్నారని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా సుమారు 75 వేల ఎకరాలకు లబ్ధి చేకూరనుందని అన్నారు. నేరేడు బ్యారేజీకి సాంకేతికపరమైన అడ్డంకులు తొలగించుకుని పనులు ప్రారంభించబోతున్నామని,  అది పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందని సభాపతి ఆశాభావం వ్యక్తం చేసారు. మన ముఖ్యమంత్రి అపర భగీరధుడని అని శాసనసభాపతి ఈ సందర్భంగా కొనియాడారు. మునుపెన్నడు మన ఉత్తరాంధ్రని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, వెనుకబడిన జిల్లాగా విడిచి పెట్టారని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ను ఒక వరంలా నాటి ముఖ్యమంత్రి దివంగత వై.యస్.రాజశేఖర్ రెడ్డి అందిస్తే ఈ వేళ ఆ పోలవరాన్ని పూర్తి చేసి జగన్మోహన్రెడ్డి  అపర భగీరధుడు అయ్యారని గుర్తుచేసారు. ఈ కార్యక్రమంలో పొందూరు మండల తహశీల్ధారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి,  కొంచాడ రమణమూర్తి , గాడు నాగరాజు, పప్పల వెంకటరమణ, జడ్పిటిసి అభ్యర్థి లోలుగు కాంతారావు, లోలుగు శ్రీరాములు నాయుడు, గంట్యాడ రమేష్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-16 15:37:53

తిరుమలలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం..

తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్ర‌వారంనాడు సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ ఉత్స‌వాన్ని నిర్వ‌హించారు.  ముందుగా ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు.   అనంతరం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఈవో, అద‌న‌పు ఈవో ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు.

        తదనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో ''పరివట్టం''(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి  'నిత్యైశ్వర్యోభవ' అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తరువాత అర్చకులు శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగారికి, టిటిడి తరఫున కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి గారికి 'లచ్చన' అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాలచెంత ఉంచ‌డంతో ఆణివార ఆస్థానం ముగిసింది. ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగ‌నాథ‌స్వామివారి ఆల‌య అధికారులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శుక్ర‌వారం ఉదయం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మఠం నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల ప్ర‌ద‌క్షిణ‌గా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  

వార్షిక లెక్కలు ప్రారంభించిన రోజు : టిటిడి ఈవో

        ఈ ఉత్స‌వం అనంత‌రం ఆల‌యం వెలుపల ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తార‌ని చెప్పారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వ‌చ్చింద‌న్నారు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవ‌ని తెలిపారు. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి - ఏప్రిల్‌ నెలలకు మార్చిన‌ట్టు వివ‌రించారు. సాయంత్రం పుష్ప‌ప‌ల్ల‌కీపై స్వామి, అమ్మ‌వారు నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తార‌ని తెలిపారు.

          ఈ కార్య‌క్ర‌మంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి, త‌మిళ‌నాడు దేవాదాయ శాఖ మంత్రి శేఖ‌ర్‌బాబు, దేవాదాయ శాఖ కార్య‌ద‌ర్శి  చంద్ర‌మోహ‌న్‌, క‌మిష‌న‌ర్  కుమ‌ర‌గురుభ‌ర‌న్‌, శ్రీ‌రంగం ఆల‌య జాయింట్ క‌మిష‌న‌ర్  మారిముత్తు, టిటిడి సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో ర‌మేష్‌బాబు, పేష్కార్  శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-16 15:30:25

22లోగా అభ్యంతరాలు తెలియజేయండి..

విభిన్న ప్రతిభావంతుల స్పెషల్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ నకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను సంబంధిత వెబ్ సైట్ నందు ఉంచామని, వాటిపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22లోగా తమ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని విభిన్నప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కె.జీవనబాబు  పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీచేసారు. 2019-20 సం.నకు సంబంధించి విభిన్న ప్రతిభావంతుల స్పెషల్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ Class–IV(Other than DSC) బ్యాక్ లాగ్ పోస్టులు ఖాళీలను భర్తీచేయు ప్రక్రియలో భాగంగా పోస్టులవారీగా ప్రొవిజనల్ మెరిట్ జాబితాను www.dw2020backlogsklm.in మరియు srikakulam.ap.gov.in వెబ్ సైట్ నందు పొందుపరచినట్లు ఆయన చెప్పారు. ప్రొవిజనల్ మెరిట్ జాబితాపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నఎడల జూలై 22 లోగా లిఖిత పూర్వకంగా సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, శ్రీకాకుళం వారికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. జూలై 22 సాయంత్రం 05.00గం.ల తదుపరి వచ్చిన అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకోబడవని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు. 

Srikakulam

2021-07-16 15:25:55

జాబ్ మేళాలో 500 మందికి ఉద్యోగాలు..

విజ‌య‌న‌గ‌రం టిటిడిసి వ‌ద్ద డిఆర్‌డిఏ నిర్వ‌హించిన మెగా జాబ్‌మేళా విజ‌య‌వంత‌మ‌య్యింది. శుక్ర‌వారం నిర్వ‌హించిన ఈ మేళాలో జిల్లాకు చెందిన సుమారు 500 మంది ఉద్యోగాల‌కు ఎంపిక‌య్యారు. డిఆర్‌డిఏ ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాలో తిరుప‌తికి చెందిన‌ అమెరాన్ బ్యాట‌రీస్ సంస్థ‌, త‌మ సంస్థ‌లో ప‌నిచేసేందుకు 500 మందిని ఎంపిక చేసింది. ఐటిఐ ఉత్తీర్ణుల‌తోపాటుగా,  కేవ‌లం ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ అర్హ‌త ఉన్న‌వారిని కూడా ఉద్యోగాల‌కు తీసుకున్నారు. వీరికి ప్రారంభ వేత‌నం రూ.10,800గా నిర్ణ‌యించారు. వారి ప్ర‌తిభ‌ను బ‌ట్టి కొద్దికాలంలోనే వేత‌నాల‌ను పెంచుతారు. ఇపిఎఫ్‌, ఇఎస్ఐ సౌక‌ర్యంతోపాటుగా, స‌బ్సిడీపై భోజ‌నం, వ‌స‌తిని కూడా క‌ల్పించ‌నున్నారు. మేళాకు జిల్లా న‌లుమూల‌నుంచి 580 మంది రాగా, వీరిలో 86 శాతం మందికి పైగా ఉద్యోగాల‌ను సాధించ‌డం విశేషం. ఉద్యోగాల‌కు ఎంపికైన వారంతా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసి, జిల్లాకు మంచి పేరు తేవాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా, సంక్షేమం) జె.వెంక‌ట‌రావు కోరారు. జాబ్‌మేళాను ప్రారంభించిన అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. ఎక్క‌డైనా క‌ష్ట‌ప‌డిన వారికే మంచి పేరుతోపాటు, అభివృద్దీ ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తాము కూడా చాలాక‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి చేరుకున్నామ‌ని చెప్పారు. అంకిత‌భావం, క్ర‌మ‌శిక్ష‌ణ అల‌వాటు చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. జిల్లానుంచి ఇంత‌కుముందు కూడా చాలామంది ఈ కంపెనీకి ఇదేస్థాయిలో ఎంపికై, ప్ర‌స్తుతం ఉద్యోగాలు చేస్తూ, ఉన్న‌త స్థానానికి చేరుకున్నార‌ని, వారిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని జెసి కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో డిఆర్‌డిఏ పిడి కె.సునీల్ రాజ్‌కుమార్‌, ఏపిడి సావిత్రి, ఆర్‌సెట్ డైరెక్ట‌ర్ వేణుగోపాల్‌, జెడిఎం(జాబ్స్‌) బి.శ్రీ‌నివాస‌రావు, అమెరాన్ బేట‌రీస్ హెచ్ఆర్ మేనేజ‌ర్ క‌ల్యాణ్‌, వెలుగు, డిఆర్‌డిఏ ఏరియా కో-ఆర్డినేట‌ర్లు, ఎపిఎంలు, డిపిఎంలు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-16 14:58:08

అవార్డు వరించడం హర్షదాయకం..

గాంధేయవాది, స్వాతంత్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త ,అభ్యుదయవాది పద్మ విభూషణ్ డాక్టర్ దుర్గ భాయ్ దేశ్ ముఖ్ జయంతి సందర్భంగా ఆమె పేరిట ఏర్పాటు చేసిన అవార్డును ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకురాలు ఏచూరి కల్పకం న్యూఢిల్లీ వారికి ఇవ్వడం అభినందనీయమని జాయింట్ కలెక్టర్ వెల్ఫేర్ జి. రాజకుమారి పేర్కొన్నారు.   గురువారం కాకినాడ గాంధీ నగర్ పార్క్ లోని గ్రంథాలయంలో వర్చువల్ విధానంలో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ కాకి నాడ విభాగం వారు నిర్వహించారు. వర్చువల్ కాన్ఫరెన్స్ లో కల్పకం వారితో పాటు ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫెరెన్స్ అధ్యక్షురాలు  షీలా ఖక్కడె, ఉపాధ్యక్షురాలు చంద్రప్రభ జోష్ పాల్గొన్నారు.
   ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గాంధీజీ ఆశయాల కోసం పనిచేసిన దుర్గ భాయ్  దేశ్ ముఖ్ కాకినాడ చెందిన వారు కావడం ఆమె ప్రోద్బలంతో మొదటిసారిగా కాకినాడలో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ కీలకంగా వ్యవహరించి వ్యవస్థాపక అధ్యక్షురాలు గా పనిచేస్తున్న కల్పకం వారికి  ఇస్తున్న అవార్డు ఆమె  సేవా స్ఫూర్తికి నిదర్శనంగా అభివర్ణించారు.
 మహిళ స్వావలంబనకు పని చేస్తూ నిరంతరం సౌర పునరుత్పాదక శక్తి పరిశోధనలు చేయడంతోపాటు సామాజిక సేవలో తమ సేవలను అందిస్తున్న కల్పకం సేవలను జెసి రాజకుమారి కొనియాడారు. ఈ సందర్భంగా వర్చువల్ విధానములో జెసి రాజకుమారి కల్పకం కు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత ఏచూరి కల్పకం  తనను ఎంతో అభిమానిస్తూ దుర్గాభాయి దేశముఖ్ అవార్డును ప్రధానం చేయడం పట్ల ఆల్ ఇండియా ఉమెన్స్ కాకినాడ విభాగానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ కాకినాడ విభాగం అధ్యక్షురాలు పలువురు సభ్యులు పాల్గొన్నారు.

Kakinada

2021-07-15 16:29:56

అన్నవరం చేరుకున్న అమాత్యులు..

తూర్పుగోదావరి జిల్లా అన్నవం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామి కొండపై నిర్మించిన పలు నూతన భవనాలను శుక్రవారం పలువురు మంత్రులు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సన్నిధికి  మాజీ టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ చేరుకున్నారు. వారికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే  పర్వతప్రసాద్ స్వాగతం పలికారు. స్వామివారి ప్రత్యేక అతిథి గ్రుహంలో వారు రాత్రికి బసచేస్తారు. రేపు అన్నవరంలోని పలు అభివ్రుద్ధి కార్యక్రమాలు ప్రారంబోత్సవంతోపాటు, శంఖవరం మండంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను వీరు ప్రారంభించనున్నారు.

అన్నవరం

2021-07-15 16:24:10