1 ENS Live Breaking News

అర్భన్ పీహెచ్సీలను త‌నిఖీ చేసిన జెసి..

విజ‌య‌న‌గ‌రం అర్భన్ లో నూత‌నంగా నిర్మిస్తున్న ప‌లు ప‌ట్ట‌ణ ఆరోగ్య కేంద్ర భ‌వ‌నాల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు బుధ‌వారం త‌నిఖీ చేశారు. న‌గ‌రంలోని గాజుల‌రేగ‌, కొత్త‌పేట‌, ప్ర‌శాంతి న‌గ‌ర్‌, ఎల్‌.బి.కాల‌నీలో నిర్మిస్తున్న అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్ భ‌వ‌నాల‌ను, లంకాప‌ట్నంలో మ‌ర‌మ్మ‌త్తులు చేప‌డుతున్నఅర్బ‌న్ హెల్త్ సెంట‌ర్ భ‌వ‌నాన్ని జె.సి. వెంక‌ట‌రావు మునిసిపల్ ఇంజ‌నీర్ కె.దిలీప్ తో క‌ల‌సి ప‌రిశీలించారు. అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్ భ‌వ‌నాల నిర్మాణం ఎప్ప‌టికి పూర్త‌య్యేదీ మునిసిప‌ల్ ఇంజ‌నీర్‌ను అడిగి తెలుసుకున్నారు. నాణ్య‌త విష‌యంలో  రాజీలేకుండా ఈ భ‌వ‌నాల‌ను నిర్మించాల‌ని, భ‌వ‌న నిర్మాణం త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని జె.సి. వెంక‌ట‌రావు సూచించారు. మునిసిప‌ల్ ఇంజ‌నీరింగ్ శాఖ ఆధ్వ‌ర్యంలో న‌గ‌రంలో 7 అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్  భ‌వ‌నాల‌ను ఒక్కొక్క‌టి రూ.80 ల‌క్ష‌ల వ్య‌యంతో నిర్మిస్తున్నామని, నాలుగు అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్ భ‌వ‌నాల‌కు ఒక్కొక్క‌టి రూ.10 ల‌క్ష‌ల‌తో మ‌ర‌మ్మ‌త్తులు చేప‌ట్టామ‌ని మునిసిప‌ల్ ఇంజ‌నీర్ దిలీప్ వివ‌రించారు. మొత్తం రూ.6 కోట్ల వ్య‌యంతో న‌గ‌రంలో వైద్య ఆరోగ్య వ‌స‌తుల మెరుగుకోసం ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. గాజుల‌రేగ‌, కొత్తపేట‌, ప్ర‌శాంతిన‌గ‌ర్‌, వి.టి.అగ్ర‌హారం(బి.సి.కాల‌నీ), స్టేడియంపేట‌, కె.ఎల్‌.పురం, ఎల్‌.బి.కాల‌నీ ప్రాంతాల్లో కొత్త భ‌వ‌నాలు నిర్మిస్తుండ‌గా, లంకాప‌ట్నం, పూల్‌బాగ్ కాల‌నీ, విటి అగ్ర‌హారం, రాజీవ్ న‌గ‌ర్‌ల‌లో పాత అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్ భ‌వ‌నాల మ‌ర‌మ్మ‌త్తులు చేప‌డుతున్న‌ట్టు చెప్పారు.

Vizianagaram

2021-07-15 14:27:57

22నుంచి నూతన సర్పంచ్ లకు శిక్షణ..

 కొత్త‌గా ఎన్నికైన స‌ర్పంచుల‌కు ఈ నెల 22 నుంచి  శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు ప్రారంభం కానున్నాయి. ఒక్కో స‌ర్పంచ్‌కు మూడు రోజుల‌పాటు శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. డివిజ‌న్ల వారీగా ఈ శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశించారు.   స‌ర్పంచుల‌ శిక్ష‌ణా కార్య‌క్ర‌మానికి చేయాల్సిన ఏర్పాట్ల‌పై, జాయింట్ క‌లెక్ట‌ర్లు, వివిధ శాఖ‌ల అధికారుల‌తో గురువారం త‌న ఛాంబ‌ర్‌లో క‌లెక్ట‌ర్ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, స‌ర్పంచుల శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవాల‌ని ఆదేశించారు. డివిజ‌న్ల వారీగా సుమారు వంద మంది స‌ర్పంచ్‌ల‌ను ఒక బ్యాచ్‌గా విడ‌దీసి, బ్యాచుల‌వారీగా మూడురోజుల చొప్పున రెసిడెన్షియ‌ల్ శిక్ష‌ణ ఇవ్వాల‌ని సూచించారు. విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్ ప‌రిధిలోని స‌ర్పంచుల‌కు, స్థానిక మ‌హిళా ప్రాంగ‌ణంలో, పార్వ‌తీపురం డివిజ‌న్ స‌ర్పంచుల‌కు వైటిసిలో శిక్ష‌ణ ఏర్పాటు చేయాల‌ని ప్రాధ‌మికంగా నిర్ణ‌యించారు. వీరికి మూడు రోజులు ఉండేందుకు వీలుగా అన్ని ర‌కాల వ‌స‌తుల‌నూ, సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. వివిధ చ‌ట్టాలు, నిబంధ‌న‌లు, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు సంబ‌ పుస్త‌కాల‌ను కూడా వారికి అంద‌జేయాల‌న్నారు. ప్ర‌తిరోజూ సాయంత్రం సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని సూచించారు.

          శిక్ష‌ణ ప్రారంభ‌, ముగింపు కార్య‌క్ర‌మాల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్‌(రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, భోధ‌నాప‌ర‌మైన అంశాల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌, ఆతిథ్యానికి సంబంధించిన ఏర్పాట్ల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆసరా) జె.వెంక‌ట‌రావు ప‌ర్య‌వేక్షిస్తార‌ని తెలిపారు. స‌ర్పంచుల‌కు పాల‌న‌కు సంబంధించిన అంశాల‌ను బోధించ‌డ‌మే కాకుండా, సామాజిక సేవ ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. ఇందులో భాగంగా శిక్ష‌ణా స‌మ‌యంలో స‌ర్పంచుల‌ను చెరువుల శుద్ది, ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త మొద‌లగు కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వాముల‌ను చేయాల‌ని ఆదేశించారు. స‌ర్పంచులు శిక్ష‌ణా కేంద్రానికి చేరుకొనేందుకు వీలుగా వాహ‌న సౌక‌ర్యాన్ని కూడా క‌ల్పించాల‌న్నారు. శిక్ష‌ణానంత‌రం ప్ర‌తీఒక్క‌రికీ స‌ర్టిఫికేట్‌, గ్రూప్ ఫొటోను అంద‌జేయాల‌ని సూచించారు. శిక్ష‌ణ‌లో కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌డ‌మే కాకుండా, శానిటైజ‌ర్లు, మాస్కుల‌ను అంద‌జేయాల‌ని, అవ‌స‌ర‌మైన‌వారికి కోవిడ్ వేక్సిన్‌లు వేయాల‌ని సూచించారు. అలాగే కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌డంపై స‌ర్పంచులంద‌రికీ, నిపుణులైన వైద్యుల చేత అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని డిఎంఅండ్‌హెచ్‌ను క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు.

         ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్‌(రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌, పార్వ‌తీపురం స‌బ్‌క‌లెక్ట‌ర్ భావ‌న‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆసరా) జె.వెంక‌ట‌రావు, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, డిపిఓ సుభాషిణి, సిపిఓ జె.విజ‌య‌ల‌క్ష్మి, డిఎంఅండ్ హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డివిజ‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అధికారులు కె.రామ‌చంద్ర‌రావు, రాజ్‌కుమార్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-15 14:24:13

పచ్చదనం ప్రాధాన్య అందరూ గుర్తించాలి..

ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త ప్రాధాన్యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ గుర్తించి వాటి సాధ‌న‌కోసం త‌మ వంతు కృషిచేస్తేనే  ఆరోగ్య‌క‌ర స‌మాజం రూపొందుతుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. మొక్క‌లు నాటేందుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని పేర్కొంటూ ఈ సీజ‌నులోనే వీలైనంత‌గా మొక్క‌లు నాటి వాటిని ప‌రిర‌క్షించే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. క‌లెక్ట‌రేట్ కాంప్లెక్స్ స‌మీపంలోని ఆర్ధిక శాఖ‌ల భ‌వ‌న స‌ముదాయం ప్రాంగ‌ణంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. క‌లెక్ట‌ర్‌ తానే స్వ‌యంగా మొక్క‌లు నాటేందుకు గుణ‌పంతో గుంత‌లు త‌వ్వి, మొక్క‌లు నాటి వాటికి నీరు పోశారు. హ‌రిత విజ‌య‌న‌గ‌రం స‌భ్యుల‌తో క‌ల‌సి ఈ ప్రాంగ‌ణంలో సుమారు వంద అలంక‌ర‌ణ మొక్క‌లు నాటారు. బ్యూటిఫికేష‌న్ కార్పొరేష‌న్ ఈ మొక్క‌లు అంద‌జేసింది.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ న‌గ‌రంలో ప‌చ్చ‌ద‌నాన్ని పెంచే మొక్క‌ల‌తో పాటు ఆయా ప్రాంతాల సుంద‌రీక‌ర‌ణ కోసం అలంక‌ర‌ణ మొక్క‌లు  కూడా నాటుతున్న‌ట్టు క‌లెక్ట‌ర్ చెప్పారు. నాటిన ప్ర‌తి మొక్క‌కు ర‌క్ష‌ణ‌గా ట్రీ గార్డు ఏర్పాటుచేసి ప‌దికాలాల పాటు స‌జీవంగా ఉండేలా చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్టు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్రాంగ‌ణంలో పెరిగిన క‌లుపు మొక్క‌ల‌ను, విష‌పూరిత మొక్క‌ల‌ను క‌లెక్ట‌ర్ హ‌రిత విజ‌య‌న‌గ‌రం స‌భ్యుల‌తో క‌ల‌సి తొల‌గించే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా సామాజిక అట‌వీ అధికారి బి.జాన‌కిరావు, హ‌రిత విజ‌య‌న‌గ‌రం కో ఆర్డినేట‌ర్ రామ్మోహ‌న్ రావు, డా.వెంక‌టేశ్వ‌ర‌రావు, ఏ.పి.ఇ.డ‌బ్ల్యు.ఐ.డి.సి. కార్య‌నిర్వాహ‌క ఇంజ‌నీర్ శామ్యూల్‌, డి.ఇ. స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-15 14:22:12

జిల్లాలో 1528 మంది పిల్లలు గుర్తింపు..

శ్రీకాకుళంజిల్లాలో 1528 మంది ప్రత్యేక అవసరాల పిల్లలుగా గుర్తించడం జరిగిందని సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త యస్.తిరుమల చైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీచేసారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల గల పిల్లల నమోదు మరియు బడిబయట పిల్లలను ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమైంది. అందులో భాగంగా 06-18 సం.ల లోపు ప్రత్యేక అవసరాల గల పిల్లలు తప్పనిసరిగా  పాఠశాలల్లో నమోదుచేయడం లక్ష్యంగా ఉందని, మార్చిలో జరిగిన సర్వేలో బడి బయట పిల్లలు 1528 మందిని గుర్తించడం జరిగిందని తెలిపారు. వీరిలో 802 ప్రాథమిక స్థాయిలో, 726 మంది సెకండరీ స్థాయిలో గుర్తించామని, వీరందరిని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేసినట్లు ఆయన చెప్పారు. 1528 మంది పిల్లలో 101 మంది స్వయంగా నమోదుచేసుకున్నారని, 38 మంది దివ్యాంగ పిల్లలు,  97 మంది కె.జి.బి.వి పిల్లలు, 138 మంది ఆవాస సహిత ప్రత్యేక శిక్షణ కేంద్రం పిల్లలు, 428 మంది ఆవాస రహిత ప్రత్యేక శిక్షణ కేంద్రం పిల్లలు, 726 మంది ఓపెన్ స్కూల్ పిల్లలు వెరశి 1528 మంది పిల్లలుగా గుర్తించినట్లు చెప్పారు. జిల్లాస్థాయిలో జిల్లా విద్యాశాఖాధికారి, అదనపు పథక సమన్వయకర్త, ఉపవిద్యాశాఖాధికారి, మండల విద్యాశాఖాధికారి మరియు సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేసినట్లు ఆయన తెలిపారు.

          ప్రత్యేక అవసరాల గల పిల్లలు సర్వే మరియు బడి బయట పిల్లలు సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, అదనపు పథక సమన్వయకర్త యస్.తిరుమల చైతన్య, సహిత విద్యా సమన్వయకర్త్లు యస్.అనురాథ, సిహెచ్.సుధాకర్, ప్రత్యామ్నాయ పాఠశాల సమన్వయకర్త డి.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-15 14:19:28

కోవిడ్ నిబంధనలు అమలుకావాల్సిందే..

కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలు, 144 సెక్షన్ ఉల్లంఘించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుం టామని జిల్లా కలెక్టర్  ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. కోవిడ్ నివారణా చర్యలపై గురువారం స్థానిక ప్రకాశం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  పబ్లిక్ స్థలాల్లో మాస్కు ధరించకుండా సంచరించే వారికి రూ. 100 రూపాయలు జరిమాన విధించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ. నెం: 370, 371 విడుదల చేసిందన్నారు. వైరస్ వ్యాప్తని అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేస్తామన్నారు. వాణిజ్య సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాలలోకి మాస్కు లేనివారిని అనుమతిస్తే రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమాన విధిస్తామన్నారు. మూడు రోజుల వరకు దుకాణాలు వాణిజ్య సముదాయాలను సైతం మూత వేస్తామన్నారు. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఆరు గంటల వరకు కోవిడ్ కర్ఫ్యూ, 144 సెక్షన్ ఈనెల 21వ తేదీ వరకు అమలులో ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో 3.5 శాతం కోవిడ్ కేసులు
నమోదవుతున్నాయని చెప్పారు. వైరస్ వ్యాప్తి అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జి.ఓ. విడుదల చేసిందన్నారు.

           నూతన ఉత్తర్వుల ప్రకారం జరిమాన విధించే అధికారాలను పోలీసులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందని కలెక్టర్ తెలిపారు. రెవిన్యూ, మున్సిపాలిటీ, పోలీసులు బృందాలుగా ఏర్పడి జి.ఓ.ను అమలు చేస్తారన్నారు. గడిచిన మూడు రోజుల్లో 149 గ్రామ పంచాయతీలలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై 750 కేసులు నమోదు చేశామన్నారు. వారికి రూ. 65 వేలు జరిమానా విధించామన్నారు. కోవిడ్ కేసుల నమోదు తగ్గక పోవడంపై ప్రతిరోజు సమీక్షిస్తున్నామని ఆయన వివరించారు. వివాహాలు, శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాల నిర్వహణలో కోవిడ్ నిబంధనలు ప్రజలు పాటించడం లేదన్నారు. క్వారీలు, మార్కెట్ సముదాయాల వద్ద కూలీలు సమూహంగా పనులకు వెళ్లే పరిస్థితులలో వైరస్ వ్యాప్తి జరుగుతోందన్నారు. వైద్యశాలలను సిద్ధ పరిచామని, ఐ.సి.యు. బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు, వైద్య పరికరాలు, ఔషధాలు సిద్ధంచేస్తున్నామని ఆయన వివరించారు. ఇందుకోసం సమగ్ర ప్రణాళికతో యంత్రాంగం ముందుకు వెళ్తుందని ఆయన చెప్పారు.

            కోవిడ్ మూడవ దశ రాకుండా జిల్లా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. కోవిడ్ నివారణ టీకా పొందడానికి హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్, ఐదేళ్ల లోపు పిల్లలున్న తల్లులు, 45 సంవత్సరాలు దాటిన వారంతా అర్హులన్నారు. 11 లక్షల 55 వేల 580 మందికి టీకా వేయాలనే లక్ష్యం కాగా ప్రస్తుతం 9 లక్షల 81 వేల 666 మందికి టీకా మొదటి డోసు వేశామన్నారు. 85.5 శాతం లక్ష్యానికి చేరుకున్నామని మిగిలిన వారికి టీకా వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. ప్రస్తుతం 1,046 గ్రామ పంచాయతీలలో ప్రతిరోజు 10 వేలకు తగ్గకుండా కోవిడ్ పరీక్షలు చేస్తున్నామని, గడిచిన 14 రోజులలో 1,34,051 మందికి పరీక్షలు చేశామన్నారు. ప్రస్తుతం 20 మండలాలలోని 20 పి. హెచ్.సి.ల పరిధిలో ఐదు శాతానికి మించి కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని వివరించారు. ఈ నేపధ్యంలో కోవిడ్ నిబంధనలపై రూపొందించిన గోడపత్రాలు, కరపత్రాలను 7.22 లక్షల గృహాలలో అందజేశామన్నారు. గడిచిన రెండు రోజుల్లో 46 వేల మందిని చైతన్య పరిచామన్నారు. అన్ని గ్రామ పంచాయతీలలో ప్రచార బోర్డులు, సచివాలయాల వద్ద గోడ పత్రాలు ఉంచామన్నారు. కోవిడ్ మూడవ దశ రాకుండా జిల్లా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

            కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జి.ఓ.ను కఠినంగా అమలు చేస్తామని నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్.పి. మాలికా గార్గ్ చెప్పారు. వైరస్ సోకిన కేసుల నమోదులో ప్రకాశం జిల్లా ఐదో స్థానంలో ఉందన్నారు. జిల్లాలో కోవిడ్ నివారణపై రెవిన్యూ, పోలీస్ శాఖలు సమస్వయంతో ఉద్యమంలా పనిచేస్తామని ఆమె తెలిపారు. కోవిడ్ నివారణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, వ్యాప్తి అరికట్టడానికి సమర్థంగా చర్యలు తీసుకుంటమని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) టి.ఎస్. చేతన్, కోవిడ్ కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి డాక్టర్ తిరుమల రావు, తదితరులు పాల్గొన్నారు.

Ongole

2021-07-15 14:05:12

ఉన్నత స్థానాలు అధిరోహించాలి..

శ్రీకాకుళం సమాచార పౌర సంబంధాల శాఖలో జిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేసిన యల్.రమేష్ అదే శాఖలో సహాయ సంచాలకులుగా పదోన్నతి పొందడం ఆనందంగా ఉందని, ఆయన మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ విభాగం అధ్యాపకులు ఆకాంక్షించారు. సహాయ సంచాలకులుగా పదోన్నతి పొందిన రమేష్ కు డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ విభాగం అధ్యాపకులు దుశ్శాలువ, పుష్పగుచ్ఛం, జ్ఞాపికతో గురువారం ఆయన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్స్ విభాగానికి యల్.రమేష్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబరుగా కొనసాగుతున్నారని, అటువంటి సభ్యులకు పదోన్నతి రావడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అధ్యాపక బృందం అభిలషించారు. ఈ కార్యక్రమంలో డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ విభాగం అధ్యాపకులు డా. రెడ్డి తిరుపతిరావు, డా. జి.లీలావరప్రసాద్, డా. వై.డి.రామ్ దాస్, డా. పి.పద్మ తదితరులు పాల్గొన్నారు.   

Srikakulam

2021-07-15 14:00:15

రూ.7 లక్షల మోనిటర్లు అందజేత..

శ్రీకాకుళం జిల్లాలో థర్డ్ వేవ్ వస్తే సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వంతో పాటు పలు స్వచ్చంద సంస్థలు, కంపెనీలు, ఇతర రంగాలు ముందుకువస్తున్నాయని ఇది శుభపరిణామమని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. కలెక్టర్ ఛాంబరులో 7 లక్షల రూపాయలు విలువైన ఆక్సీజెన్ కాన్సంట్రేటర్లు, పేషేంట్ మోనిటర్లను జిల్లా కలెక్టర్ కు ఐ.సి.ఐ.సి.ఐ  బ్యాంక్ సిబ్బంది గురువారం అంద జేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఫస్ట్, సెకెండ్ వేవ్ లో వచ్చిన కరోనాను సమర్ధంగా ఎదుర్కొ న్నామని, గతంలో వచ్చిన చిన్నపాటి లోపాలను దృష్టిలో ఉంచుకుని థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొ నేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు సమకూరుస్తున్న సామాగ్రితో పాటు స్వచ్ఛంద సంస్థలు,పలు కంపెనీలు ముందుకువచ్చి తమ సహాయ సహకారాలను అందించడం ఆనందంగా ఉందన్నారు. ఇదేబాటలో ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు సిబ్బంది రూ.7లక్షల విలువైన ఆక్సీజెన్ కాన్సం ట్రేటర్లు, పేషేంట్ మోనిటర్లను అందజేయడం సంతోషకరమని కలెక్టర్ తెలిపారు. వీటిని అవసరమైన ప్రభుత్వ ఆసు పత్రులకు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ మెట్ట చంద్రశేఖర్, డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ దుంగ సౌమ్య, రిలేషన్ షిప్ మేనేజర్ ఎం.సేతుపతి, అకౌం ట్స్ ఆఫీసర్ ఎస్.పృథ్వి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-15 13:37:39

సింహాద్రినాధుడికి రూ.లక్ష విరాళం..

సింహాచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారికి విశాఖలోని పెందుర్తి చిన్న ముషిడివాడకు చెందిన గుల్లిపల్లి సత్యనారాయణ లక్షా ఒక్క రూపాయలు విరాళం ఇచ్చారు. గురువారం ఈ మేరకు దాతలు దేవస్థానం పీఆర్వో ఆఫీసులోని లో చెక్ అందించారు.  గుల్లిపల్లి నారాయణమ్మ, గుల్లిపల్లి శ్యామల,గౌరునాయుడు సంస్మరణార్థం 17-07-21న అన్నదానం చేయాలని దేవస్థాన సిబ్బందిని కోరారు. అనంతరం స్వామివారి వారిని దర్శించుకుని కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. దాతలకు ఆలయ సిబ్బంది తీర్ధ ప్రసాదాలను అందజేశారు. దాతలు మాట్లాతూ, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నామన్నారు.

Simhachalam

2021-07-15 13:33:26

అప్పన్నకు రూ.1,01,116 విరాళం ..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారికి విశాఖపట్నం మధురవాడ ప్రాంతానికి చెందిన లక్ష్మీరామ్ నాయుడు లక్షా 1116 రూపాయలు విరాళమిచ్చారు. ఈ మేరకు గురువారం పీఆర్వో ఆఫీసులోని డొనేషన్ కౌంటర్లో  నగదు సమర్పించారు. వెంటనే నిత్యన్నదానం  బాండ్, రిసీప్ట్ స్వీకరించారు. తన పుట్టినరోజైన సెప్టెంబర్ 19వ తేదీన స్వామివారి సన్నిధిలో భక్తులకు అన్నదానం చేయాలని లక్ష్మీరామ్ నాయుడు ఆలయ అధికారులను కోరారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అధికారులు ప్రసాదం అందించారు. 

Simhachalam

2021-07-15 13:30:32

థర్డ్ వేవ్ పైప్రజలను చైతన్యపరచాలి..

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో ప్రాజెక్టు పునరావాస కాలనీలను ఆయన మంగళవారం పరిశీలించారు. వేములకోట పునరావాసకాలనీని ఆయన పరిశీలించారు. అనంతరం గొట్టిపడియ  నిర్వాసితులు కూడా కలెక్టర్ ను కలిసి వినతి పత్రాలు అందజేశారు. పునరావాస కాలనీల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. కాలనీలో అంతర్గత రహదారులు నిర్వహిస్తామని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడానికి సచివాలయాల చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ చెప్పారు. పెద్దారవీడు మండలంలోని వేముల కోట-1 సచివాలయాన్ని, దేవరాజుగట్టు సచివాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది, వాలంటీర్ల హాజరు పట్టిక, అనుబంధ దస్త్రాలను ఆయన పరిశీలించారు. కరోనా వైరస్ మూడవ దశ రాకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ముఖ్యంగా వలస కూలీలు వస్తే వారికి కోవిడ్ పరీక్షలు చేయాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ప్రజలలో చైతన్యం రావాలని ఆయన సూచించారు. ఇందుకోసం అవగాహనపై ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన తెలిపారు.  కోవిడ్ నివారణ టీకాలు లక్ష్యం మేరకు వేగంగా పూర్తి చేయాలన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన చెప్పారు. గ్రామ స్థాయిలోకి పరిపాలన తీసుకు వెళ్లాలని ఆయన వివరించారు. వాలంటీర్ల పనితీరును పరిశీలించి నివేదిక పంపాలన్నారు. సచివాలయాల భవనాలు వేగంగా పూర్తి అయ్యేలా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పర్యవేక్షించాలన్నారు.  ఆయన వెంట మార్కాపురం ఆర్డిఓ లక్ష్మీశివజ్యోతి, భూసేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్ సరళ వందనం, ఉప కలెక్టర్ గ్లోరియా, తాసిల్దార్ నాగార్జునరెడ్డి, తదితరులు ఉన్నారు.

Peddaraveedu

2021-07-13 15:44:47

పాలిటెక్నిక్ కోసం తాత్కాలిక ఏర్పాట్లు..

గుంటూజిల్లా మంగళగిరి పట్టణంలోని చింతక్రింది కనకయ్య హైస్కూల్, జూనియర్ కళాశాల, వి.టి.జే.ఎం అండ్ ఐ.వి.టి.ఆర్ డిగ్రీ కశాళాల వాటి ప్రాంగణాలను  మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, మంగళగిరి శాసన సభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మీడియాతో  మాట్లాడారు. మంగళగిరి- తాడేపల్లి కార్పోరేషన్ పరిధిలో ఉన్న సి.కె. డిగ్రీ కళాశాల జిల్లా పరిషత్తు  ప్రాపర్టీ అని తెలిపారు. అందుకు సంబంధించిన రికార్డులు, రిజిష్ట్రర్లు చూడటం జరిగిందని తెలిపారు. పూర్వం ఒక లీజు అగ్రిమెంట్ చేయడం జరిగిందని, అలాగే మళ్ళీ మరో అగ్రిమెంట్ జరిగినట్లు తెలిపారు. 3.7 ఎకరాల జిల్లా పరిషత్తు ప్రాపర్టీ లో కళాశాల నడుస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగిందని  దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి మేనేజ్ మెంట్ వారి నుండి, రెవెన్యూ,జిల్లా పరిషత్తు, మున్సిపల్ కార్పోరేషన్, జిల్లా కో ఆపరేటివ్ అధికారుల నుంచి రికార్డులు తెప్పించుకొని పరిశీలించడం కోసం ఎంక్వరీ అధికారిగా  జాయింట్ కలెక్టర్ ను నియమించడం జరిగిందన్నారు.  విచారణ వారం రోజుల్లో పూర్తిచేసి, అందిన నివేదిక ప్రకారం జిల్లా పరిషత్తు సిఈవొ తగు చర్యలు తీసుకుంటారన్నారు. అలాగే స్కూల్ ప్లే గ్రౌండ్ కోసం ఇచ్చిన స్థలాన్ని కూడా ఎంక్వరీ అధికారి విచారణ చేయడం జరుగుతుందన్నారు. ఇటీవల మంగళగిరి పట్టణ పరిధిలో ఒక పాలిటెక్నిక్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, వీటి నిర్మాణానికి  అవసరమైన 2 . 5 ఎకరాల భూమిని సేకరించేందుకు ఆర్.డి.వొ,  తహాశీల్ధారుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కొత్త భవనం నిర్మాణం జరిగే వరకు స్థానికంగా అనువుగా ఉండే పాత భవనంలో పాలిటెక్నిక్ కాలేజ్ ను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి శాసన సభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటి కమీషనర్ రవిచంద్రారెడ్డి, అడిషనల్  కమీషనర్ హేమమాలిని రెడ్డి, జిల్లా పరిషత్తు సి.ఈ.వొ చైతన్య, తహాశీల్ధార్ లు రామ్ ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ రమా ప్రసన్న, మున్సిపల్ కార్పోరేషన్ డివిజనల్ ఇంజనీర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పాలిటెక్నిక్ కోసం తాత్కాలిక ఏర్పాట్లు..

2021-07-13 15:33:36

మత్స్యకారులు మరింత అభివ్రుద్ధి చెందాలి..

జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డు)ఆర్ధిక సహాయం రూ.18 లక్షలతో   కొత్తపాలెం కోస్టల్ మెరైన్, ఆక్వా ప్రొడ్యూసర్ కంపెనీకి అందించిన మొబైల్ వ్యాన్ ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మంగళవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాలు వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ మత్య్సకారులు ఒక కంపెనీగా ఏర్పడటం వలన వారి యొక్క ఉత్పత్తులను కంపెనీ ద్వారా మధ్యవర్తులు లేకుండా విక్రయించటం వలన అధిక ఆదాయాన్ని పొందవచ్చు అన్నారు. సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ మత్స్సకారులు,రైతులు సంఘాలుగా ఏర్పడటం వలన వారి యొక్క ఆర్ధిక శక్తి పెరుగుతుందని, జిల్లాలో మరిన్ని రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పడాలని, ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులు పెరగాలని, ఆర్గానిక్ రైతు ఉత్పత్తి సంఘాలు పెరగాలన్నారు. ఈ కార్యక్రమంలో నాబార్డు డీడీఎం కార్తీక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం రవికుమార్, ఎల్డీఎం రాంబాబు,  సెర్చ్ ఎన్జీవో అధ్యక్షులు ఎం హనుమప్రసాద్, కార్యదర్శి సిహెచ్ పార్ధసారధి తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-07-13 15:26:34

ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఆహ్వానం..

ప్రధానమంత్రి మత్స్యశాఖ సంపద యోజన పథకం(2020-21) క్రింద  చేపల తలసరి వినియోగం పెంపొందించేందుకు వివిధ యూనిట్ల స్థాపనకై జిల్లాలోని ఔత్సాహిక వ్యాపారవేత్తల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి.కె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన జారీచేసారు.  ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన  క్రింద లైవ్ ఫిష్, ఫ్రెష్ ఫిష్, రొయ్యలు, మేరినేటేడ్ అండ్ కుక్డ్ ప్రోడక్ట్స్ రిటైల్ అమ్మకం, స్నాక్స్, ఇన్ స్టంట్ కుకింగ్ ఫుడ్స్ తయారీ, ఆన్ లైన్ ద్వారా విక్రయాలు, వివిధ రకాల రిటైల్ యూనిట్ల ఏర్పాటు, నిర్వహణ కొరకు ఆసక్తి గల వ్యాపారవేత్తలు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 2020-21జిల్లాలో చేపల ఉత్పత్తి  1,68,870 టన్నులు కాగా, 2021-22 సం.నకు  1,70,896  టన్నులు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని అన్నారు. జిల్లాలో చేపల తలసరి వినియోగం పెంచి, వివిధ రకాల చేపల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను అమలుచేస్తుందని చెప్పారు. శ్రీకాకుళం  నగర  కేంద్రంగా రూ.1.27 కోట్లతో ఒక ఆక్వాహబ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, క్రమేపీ ప్రతి నియోజకవర్గంలో ఒక హబ్ చొప్పున ఏర్పాటుచేయుటకు ప్రతిపాదించడమైందని తెలిపారు. శ్రీకాకుళం పట్టణం లో అక్వా హబ్ కేంద్రంగా శ్రీకాకుళం మరియు ఆమదలవలస మున్సిపాలిటీలు మరియు శ్రీకాకుళం ఆమదాలవలస రూరల్ మండలాలు ఎచ్చెర్ల , గార, నరసన్నపేట, పోలాకి, పొందూరు గ్రామ సచివాలయాలు వెరశి మొత్తం 224 ఉండగా 77 సచివాలయాలు నుంచి మాత్రమే మినీ ఫిష్ రిటైల్ ఔట్ లెట్ ల కొరకు ధరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు తమ వార్డు లేదా గ్రామ వాలంటీర్ ను సంప్రదించాలని అన్నారు. అలాగే పట్టణ వార్డు,గ్రామ సచివాలయాలు వెరశి 147 సచివాలయాల నుండి దరఖాస్తులు కోరినట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. రూ.50 లక్షల వ్యయంతో జిల్లాలో ఒక వాల్యూ యాడెడ్  యూనిట్, రూ.20లక్షలతో  లైవ్ ఫిష్ వెండింగ్ యూనిట్లను ఐదింటిని, రూ.10 లక్షల వ్యయంతో 10 ఫిష్ కియోస్క్ యూనిట్లను,  రూ.4 లక్షల వ్యయంతో 10 ఈ-వెహికల్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. వీటితో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కటి  రూ. 1.25 లక్షలతో  మినీ ఫిష్ వెండింగ్ రిటైల్ యూనిట్లను ఏర్పాటుచేయుటకు ప్రతిపాదించగా ప్రస్తుతం 100 యూనిట్లు మంజూరుకాబడ్డాయని, 2022 నాటికి 300 యూనిట్లను ఏర్పాటు చేయుటకు  ప్రతిపాదించినట్లు ఆయన చెప్పారు. పై యూనిట్ల స్థాపనకు బి.సి జనరల్ కేటగిరికి 40 శాతం, ఎస్.సి, ఎస్.టి, ఉమెన్ కేటగిరీలు 60 శాతం వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేసారు. దరఖాస్తు చేసుకునేవారు  https://ematsyakar.com/efisher/retailunits వెబ్ సైటును లేదా 94408 14719, 83090 54784, 93460 07766 మొబైల్ నెంబర్లను సంప్రదించాలని ఆ ప్రకటనలో వివరించారు.

Srikakulam

2021-07-13 14:49:43

ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఆహ్వానం..

ప్రధానమంత్రి మత్స్యశాఖ సంపద యోజన పథకం(2020-21) క్రింద  చేపల తలసరి వినియోగం పెంపొందించేందుకు వివిధ యూనిట్ల స్థాపనకై జిల్లాలోని ఔత్సాహిక వ్యాపారవేత్తల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి.కె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన జారీచేసారు.  ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన  క్రింద లైవ్ ఫిష్, ఫ్రెష్ ఫిష్, రొయ్యలు, మేరినేటేడ్ అండ్ కుక్డ్ ప్రోడక్ట్స్ రిటైల్ అమ్మకం, స్నాక్స్, ఇన్ స్టంట్ కుకింగ్ ఫుడ్స్ తయారీ, ఆన్ లైన్ ద్వారా విక్రయాలు, వివిధ రకాల రిటైల్ యూనిట్ల ఏర్పాటు, నిర్వహణ కొరకు ఆసక్తి గల వ్యాపారవేత్తలు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 2020-21జిల్లాలో చేపల ఉత్పత్తి  1,68,870 టన్నులు కాగా, 2021-22 సం.నకు  1,70,896  టన్నులు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని అన్నారు. జిల్లాలో చేపల తలసరి వినియోగం పెంచి, వివిధ రకాల చేపల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను అమలుచేస్తుందని చెప్పారు. శ్రీకాకుళం  నగర  కేంద్రంగా రూ.1.27 కోట్లతో ఒక ఆక్వాహబ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, క్రమేపీ ప్రతి నియోజకవర్గంలో ఒక హబ్ చొప్పున ఏర్పాటుచేయుటకు ప్రతిపాదించడమైందని తెలిపారు. శ్రీకాకుళం పట్టణం లో అక్వా హబ్ కేంద్రంగా శ్రీకాకుళం మరియు ఆమదలవలస మున్సిపాలిటీలు మరియు శ్రీకాకుళం ఆమదాలవలస రూరల్ మండలాలు ఎచ్చెర్ల , గార, నరసన్నపేట, పోలాకి, పొందూరు గ్రామ సచివాలయాలు వెరశి మొత్తం 224 ఉండగా 77 సచివాలయాలు నుంచి మాత్రమే మినీ ఫిష్ రిటైల్ ఔట్ లెట్ ల కొరకు ధరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు తమ వార్డు లేదా గ్రామ వాలంటీర్ ను సంప్రదించాలని అన్నారు. అలాగే పట్టణ వార్డు,గ్రామ సచివాలయాలు వెరశి 147 సచివాలయాల నుండి దరఖాస్తులు కోరినట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. రూ.50 లక్షల వ్యయంతో జిల్లాలో ఒక వాల్యూ యాడెడ్  యూనిట్, రూ.20లక్షలతో  లైవ్ ఫిష్ వెండింగ్ యూనిట్లను ఐదింటిని, రూ.10 లక్షల వ్యయంతో 10 ఫిష్ కియోస్క్ యూనిట్లను,  రూ.4 లక్షల వ్యయంతో 10 ఈ-వెహికల్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. వీటితో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కటి  రూ. 1.25 లక్షలతో  మినీ ఫిష్ వెండింగ్ రిటైల్ యూనిట్లను ఏర్పాటుచేయుటకు ప్రతిపాదించగా ప్రస్తుతం 100 యూనిట్లు మంజూరుకాబడ్డాయని, 2022 నాటికి 300 యూనిట్లను ఏర్పాటు చేయుటకు  ప్రతిపాదించినట్లు ఆయన చెప్పారు. పై యూనిట్ల స్థాపనకు బి.సి జనరల్ కేటగిరికి 40 శాతం, ఎస్.సి, ఎస్.టి, ఉమెన్ కేటగిరీలు 60 శాతం వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేసారు. దరఖాస్తు చేసుకునేవారు  https://ematsyakar.com/efisher/retailunits వెబ్ సైటును లేదా 94408 14719, 83090 54784, 93460 07766 మొబైల్ నెంబర్లను సంప్రదించాలని ఆ ప్రకటనలో వివరించారు.

Srikakulam

2021-07-13 14:25:57

వెలుగొండ ప్రాజెక్టు పనులు వేగవంతం..

పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ రెండవ టన్నెల్ నిర్మాణ పనులు వేగంగా జరుగు తున్నాయని కలెక్టర్  ప్రవీణ్ కుమార్ చెప్పారు. ప్రాజెక్టు  టన్నెల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. దోర్నాల, పెద్దారవీడు మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు.  నిర్మిస్తున్న 1, 2 టన్నెల్ సొరంగంలోకి వెళ్లి ఆయన నిశితంగా పరిశీలించారు. ప్రతిరోజు నాలుగు మీటర్ల తక్కువ కాకుండా టన్నెల్ నిర్మాణం జరగాలన్నారు. అనంతరం పెద్దారవీడు మండలంలోని గొట్టిపడియ, సుంకేసుల గ్యాప్ వద్ద 80 మీటర్ల ఎత్తులో నిర్మించిన రిజర్వాయర్ గోడ మీదకు వెళ్లి నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. రిజర్వాయర్ లో  నీరు నిల్వ చేసే ప్రాంతాలను ఆయన పరిశీలించారు.  పనులలో భాగంగా తూర్పు ప్రధాన కాల్వ వద్ద నిర్మించనున్న ఎత్తిపోతల పథకాలను ఆయన పరిశీలించారు. ఆయకట్టు భూములు సుంకేసుల రిజర్వాయర్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. తొలుత దోర్నాల వద్దనే అధికారులతో ఆయన సమీక్షించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం త్వరలో పూర్తి కానుందని కలెక్టర్ చెప్పారు. ప్రాజెక్టు పూర్తికాగానే 53 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉందన్నారు. 

మొత్తంగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.8,080 కోట్ల నిధులు కేటాయించాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.ఆరు వేల కోట్లు ప్రాజెక్టుకు వచ్చాయన్నారు. కేవలం రూ.1,230 కోట్లు భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ల కింద ఖర్చు చేస్తున్నట్లు ప్రాజెక్టుల ఎస్ ఈ కలెక్టర్ కు  వివరించారు. ప్రాజెక్టుతో 4.4 7 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందనున్నదని ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లాలో స్టేజ్-1 కింద 1.20 లక్షల ఎకరాలకు, స్టేజ్-2 కింద 2.55 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన వివరించారు. సుంకేసుల నుంచి తీగలేరు కెనాల్ కు నీరు తరలించడం ద్వారా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 62 వేల ఎకరాల బీడు భూములు సాగులోకి వస్తాయన్నారు. ఈ పనులు 70 శాతం పూర్తయిందన్నారు.

            బచావో ట్రిబ్యునల్ నిర్ణయాలు, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాల మేరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 840  అడుగుల ఎత్తులో నీరు నిల్వ ఉన్న నీటిని తరలించడానికి అనుమతులు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ఒప్పందాల మేరకు గుత్తేదారులు నిర్మాణ పనులు చేస్తున్నారన్నారు. టి-5 బ్లాక్ వద్ద తీగలేరు కెనాల్ పనులు 54 శాతం ముగిశాయన్నారు. 74 పనులకుగాను 27 పనులు నేటికీ ప్రారంభం కాకపోవడంపై ఆయన ఆరా తీశారు. మిగిలినవి వివిధ దశలో ఉన్నాయన్నారు. రిజర్వాయర్ నుంచి తూర్పు ప్రధాన కాల్వల వద్ద నాలుగు ఎత్తిపోతల పథకాల నిర్మాణంపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతంమొదటి టన్నెల్ నిర్మాణం పూర్తికాగా, రెండవ టన్నెల్ నిర్మాణం శరవేగంగా సాగుతోందని కలెక్టర్ చెప్పారు. ప్రాజెక్టు   ప్రారంభించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు కోసం ఎదురు చూస్తున్నామని కలెక్టర్ వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుమతులు రాగానే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ తెలిపారు.  సమావేశంలో ప్రాజెక్టుల ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ సరళ వందనం, మార్కాపురం ఆర్డీఓ లక్ష్మీశివజ్యోతి, ఉప కలెక్టర్ గ్లోరియా, ఇఈ లు అబూతలీమ్, చిన్న బాబు, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

వెలుగొండ

2021-07-13 12:44:23