1 ENS Live Breaking News

సాహసయాత్రలతో చైతన్య స్ఫూర్తి..

సాహసయాత్రలు చేయడంల ప్రపంచాన్ని తెలుసుకునే ఒక గొప్ప అవకాశం కలుగుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. నగరానికి చెందిన గంట్ల హర్షవర్ధన్ ఇటీవలే విశాఖ నుంచి చైనా సరిహద్దు వరకూ మోటార్ బైక్ సాహసయాత్ర చేపట్టి విజయ వంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో సోమవారం కలెక్టర్ తన కార్యాలయం లో హర్ష వర్ధన్ ను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటువంటి సాహసయాత్రలు వల్ల చైతన్యంతో పాటు ఒక గొప్ప స్ఫూర్తి కూడా వారిలో కలుగుతుందన్నారు. సమాజానికి అవసరమైన సందేశం ఇచ్చేందుకు ఈ  తరహా యాత్రలు దోహదం చేస్తాయన్నారు. అంతేకాకుండా సాహస యాత్రికుల్లో  ప్రజలకు సామాజిక చైతన్య కార్యక్రమాల కోసం తెలియజేసే మంచి అవకాశం కలుగుతుందన్నారు. విశాఖ నుంచి చైనా సరిహద్దు వరకు మోటార్ బైక్ పై యాత్ర చేయడం ఒక గొప్ప సాహసంతో పాటు అంతకు మించిన మధురానుభూతి నింపుతుందన్నారు.ఈ సాహస యాత్ర వివరాలు ను  కలెక్టర్ కు హర్ష వర్ధన్ తెలియచేయగా, తొలి ప్రయత్నంలోనే నాలుగు వేల కిలోమీటర్లు మోటార్ బైక్ పై యాత్ర చేయడం సాహసోపేతమైన చర్య గా వినయ్ చంద్ అభివర్ణించారు. అనంతరం గ్రేటర్ కమిషనర్ సృజన హర్ష ను అభినందించారు. జాతీయ జర్నలిస్టుల సంఘం  కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, తన కుమారుడి అభిరుచి మేరకే సాహస యాత్రకు ప్రోత్సహించామన్నారు. గతంలో చిన్న చిన్న కార్యక్రమాలు చేసినప్పటికీ ఈసారి నాలుగు వేల కిలోమీటర్ల సాహసయాత్రకు పూనుకోవడంతో తాము కూడా ప్రోత్సాహం అందించామన్నారు.  విశాఖలో సాహసయాత్రలు చేసే వారికి కొదవలేదని,అయితే వారికి తగిన ప్రోత్సాహం అందించే బాధ్యతను ప్రభుత్వంలు కూడా తీసుకోవాలని కోరారు. అర్ డీ డీ. మనిరామ్ తదితరులు పాల్గన్నారు.  అంతకు ముందు యాత్ర ను విజయవంతం గా పూర్తి చేసుకొని నగరానికి చేరుకున్న హర్ష వర్ధన్ కు సాదర స్వాగతం లభించింది. నగరం లో వేర్వేరు ప్రాంతాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఈ యాత్రలో పాల్గొన్నారు.

Visakhapatnam

2021-07-19 14:57:30

మాస్కులు లేకపోతే అనుమతించవద్దు..

విశాఖ జంతు ప్రదర్శశాలలో సందర్శకులకు మాస్కులు లేకుండా అనుమతించవద్దని అటవీశాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.ప్రతీప్ కుమార్ జూ అధికారులను ఆదేశించారు. కోవిడ్ అనంతరం సోమవారం తిరిగి జూలోకి సందర్శకులను అనుతించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందన్నారు. జూ, కంబాల కొండ ఎకో పార్కుకి వచ్చేవారంతా కరోనా నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. బౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్ ఇలా అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా పార్కులో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీఎఫ్, మరియు జూ క్యూరేటర్ లుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-07-19 14:56:49

మురికివాడల సర్వేపై సూచనలు చేయండి..

మహా విశాఖపట్నం నగరాపాలక సంస్థ పరిధిలో మురికివాడల ప్రాంతాలను అభివృద్ధి పరిచి, మెరుగైన మౌళిక సదుపాయాలను కల్పించడమే జివిఎంసి లక్ష్యమని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం తన కార్యాలయలో మీడియాతో మాట్లాడారు. మురికివాడల సర్వే విషయమై  పలు ప్రాంతాలలో సమగ్ర సర్వే నిర్వహించామన్నారు. ఈ సర్వేలో సేకరించిన నివాసితుల వివరాలను, మ్యాపులను, మౌళిక సదుపాయాలు తదితర వివరాలను సచివాలయాలాలలో ప్రదర్శించామన్నారు. వీటిపై సూచనలను, సలహాలను వారం రోజులలోగా సచివాలయాలలోగాని, జోనల్ ఆఫీసులలోగాని, జివిఎంసి ప్రధాన కార్యాలయం నందు గాని ప్రజలు తెలియ చేయవచ్చునని జివిఎంసి కమిషనర్ నగర వాసులను కోరుతున్నారు.

GVMC office

2021-07-19 14:55:59

కాటేజీల‌ను ప‌రిశుభ్రంగా ఉంచాలి..

తిరుమ‌ల‌లోని కాటేజీల‌ను మ‌రింత ప‌రిశుభ్రంగా ఉంచేందుకు త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల‌ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహం ప్రాంతంలోని ప‌లు కాటేజీల‌ను సోమ‌వారం అద‌న‌పు ఈవో త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ ప్ర‌తి కాటేజీలో చెక్‌లిస్టు రూపొందించాల‌ని, త‌ద్వారా యాత్రికుల‌కు కేటాయించే స‌మ‌యంలో సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్ వ‌స‌తుల‌తోపాటు ప‌రిశుభ్ర‌తాచ‌ర్య‌లు చ‌క్క‌గా ఉండేలా చూడాల‌ని సూచించారు. కాటేజీల‌కు వార్షిక నిర్వహణ ఒప్పందం కుదుర్చుకుని ఎప్ప‌టిక‌ప్పుడు మ‌ర‌మ్మ‌తులు పూర్తి చేయాల‌న్నారు. గ‌దుల్లో ఉన్న సోఫాలు, టీపాయ్‌లు, టాయ్‌లెట్ల‌ను ప‌రిశీలించారు. స్నానపుగదుల్లో చ‌క్క‌టి సువాస‌న వ‌చ్చేలా, కాటేజీ ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. గదుల లోప‌ల లీకేజీల‌ను అరిక‌ట్టాల‌ని, అక్క‌డ‌క్క‌డ విరిగిన చెట్ల కొమ్మ‌ల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని ఆదేశించారు. అవ‌స‌ర‌మైన చోట్ల సుంద‌రంగా ఉద్యాన‌వ‌నాల‌ను అభివృద్ధి చేయాల‌న్నారు.  అద‌న‌పు ఈవో వెంట టిటిడి వ‌స‌తిక‌ల్ప‌న విభాగం డెప్యూటీ ఈవోలు లోక‌నాథం,  భాస్క‌ర్‌, ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ సునీల్‌, డిఎఫ్‌వో  చంద్ర‌శేఖ‌ర్‌, గార్డెన్ డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాసులు, ఇఇలు  శ్రీ‌హ‌రి, మ‌ల్లికార్జున‌ప్ర‌సాద్ త‌దిత‌రులు ఉన్నారు.

Tirumala

2021-07-19 14:54:29

శ్రీకాకుళం స్పందన కి 21 వినతులు..

శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 21 వినతులు అందాయి. సోమవారం కలెక్టర్  కార్యాలయంలోని  ప్రజా ఫిర్యాదుల విభాగంలో స్పందన కార్యక్రమం ఫోన్ ద్వారా జరిగింది.  ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పలువురు ఫోన్ కాలర్స్ తమ ఫిర్యాదులను వివరించారు. అరసవల్లి నుండి యస్.పుష్పలత కుమారి ఫోన్ చేసి మాట్లాడుతూ తన తల్లికి వై.యస్.ఆర్.చేయూత పథకం ఇంతవరకు అందలేదని, కావున దానిని మంజూరుచేయాలని కోరారు. సారవకోట మండలం అలుదు నుండి ఆర్.జగన్నాధరావు మాట్లాడుతూ వృద్ధుడైన తనకు వృద్ధాప్య పింఛనును మంజూరుచేయాలని కోరారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని యం.సరోజ ఫోన్ చేసి మాట్లాడుతూ తనకు విద్యాదీవెన మంజూరుచేయాలని కోరారు. సరుబుజ్జిలి నండలం మతలబుపేట నుండి వాలంటీరు యు.ఈశ్వరరావు మాట్లాడుతూ వాలంటీర్లకు ప్రకటించిన అవార్డు డబ్బులు ఇంతవరకు తనకు అందలేదని, కావున పురష్కార నగదు రూ.10వేలు మంజూరుచేయాలని కోరారు. సోంపేట నుండి బి.వంశి మాట్లాడుతూ సోంపేటలో అక్రమ కట్టడాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. సారవకోట మండలం అన్నుపురం నుండి బి.గణపతిరావు మాట్లాడుతూ పట్టాదారు పాసుపుస్తకం మంజూరుచేయాలని కోరారు. జి.సిగడాం నుండి ఇ.హరనాథ బాబా మాట్లాడుతూ డి – పట్టా భూమిని అక్రమంగా విక్రయించారని, అలాగే ఒక చెరువు నుండి మరో చెరువుకు నీరు వెళ్లే మార్గాన్ని మూసివేసి దాన్ని కూడా అక్రమంగా విక్రయించేసారని, కావున బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు నుండి యన్.ఉషారాణి మాట్లాడుతూ జగనన్న కాలనీలో తనకు ఇంటి స్థలాన్ని మంజూరుచేయాలని కోరు. భామిని మండలం బురుజోల నుండి ఎ.హరిబాబు మాట్లాడుతూ వి.ఎ.ఎ విద్యుత్ బోర్లు మరియు ట్రాక్టర్లను మంజూరుచేయాలని కోరారు. పొందూరు మండలం లోలుగు నుండి పి,సీతారాజు మాట్లాడుతూ సర్వేనెం.45 – 28లోని 16 సెంట్ల భూమిని నమోదు చేసి 1బి అడంగళ్ మంజూరుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదుల విభాగం ( స్పందన ) సిబ్బంది హెచ్. సెక్షన్  సూపరింటిండెంట్ చలమయ్య, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-19 14:52:42

హోట‌ళ్ల‌లో నిర్వ‌హ‌ణ చ‌క్క‌గా ఉండాలి..

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా హోట‌ళ్ల‌లో ప‌రిశుభ్ర‌త‌, నిర్వ‌హ‌ణ చ‌క్క‌గా ఉండేలా నిర్వాహ‌కులు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి కోరారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో సోమ‌వారం హోట‌ళ్ల నిర్వాహ‌కులు, ఆస్థాన‌మండ‌పంలో స్థానికులు, దుకాణాల వ్యాపారుల‌తో అద‌న‌పు ఈవో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా హోట‌ళ్ల నిర్వాహ‌కుల స‌మావేశంలో అద‌న‌పు ఈవో మాట్లాడుతూ భ‌క్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్య‌మైన భోజ‌నం అందించేందుకు తిరుమ‌ల‌లోని 15 ప్రాంతాల్లో లాభాపేక్ష లేకుండా హోట‌ళ్లు నిర్వ‌హించేందుకు ప‌లువురు వ్య‌క్తులు, సంస్థ‌లు ముందుకొస్తున్నాయ‌ని చెప్పారు. అన్ని హోట‌ళ్ల‌లో ధ‌ర‌ల ప‌ట్టిక‌లు క‌నిపించేలా ఏర్పాటుచేయాల‌ని, కంప్యూట‌రైజ్డ్ బిల్ ఇవ్వాల‌ని, డిజిట‌ల్ చెల్లింపుల‌ను అనుమ‌తించాల‌ని, ప‌రిశుభ్ర‌త‌, నిర్వ‌హ‌ణ చ‌క్క‌గా ఉండాల‌ని సూచించారు. హోట‌ళ్లు, దుకాణాల్లో అగ్నిమాప‌క ప‌రిక‌రాల‌ను త‌ప్ప‌నిస‌రిగా ఏర్పాటు చేయాల‌న్నారు. లీజు పొందినవారు స‌బ్‌లీజుకు ఇవ్వ‌రాద‌న్నారు. సేక‌ర‌ణ‌కు వీలుగా త‌డి చెత్త‌, పొడి చెత్త‌ను వేరు చేయాల‌న్నారు.

             ఆస్థాన‌మండ‌పంలో అద‌న‌పు ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌లోని దుకాణాలు, హాక‌ర్ లైసెన్సులు, బాలాజిన‌గ‌ర్‌లోని ఇళ్ల‌ను కొంత‌మంది అన‌ధికారికంగా పొందిన‌ట్లు స‌మాచారం ఉంద‌ని, కావున ప్ర‌తి లైసెన్సును క్షుణ్ణంగా త‌నిఖీ చేసి స‌క్ర‌మంగా ఉన్న‌వారికి ఫొటో గుర్తింపుకార్డు మంజూరు చేస్తామ‌న్నారు. స్థానికుల వివ‌రాల‌న్నింటినీ కంప్యూట‌ర్‌లో న‌మోదు చేస్తామ‌ని తెలిపారు. అలిపిరి చెక్‌పాయింట్ వ‌ద్ద భ‌క్తులతో క‌లిసి చెక్ చేసుకోవ‌డం ఇబ్బందిగా ఉంద‌ని స్థానికులు విజ్ఞ‌ప్తి చేశార‌ని, వీరికోసం ప్ర‌త్యేక వ‌రుస ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. స్థానికులు ప‌లు స‌మ‌స్య‌లు తెలియ‌జేశార‌ని, త‌న ప‌రిధిలో ఉన్న‌వాటిని వెంట‌నే ప‌రిష్క‌రిస్తాన‌ని, మిగ‌తా స‌మ‌స్య‌ల‌ను ఈవో దృష్టికి, బోర్డు దృష్టికి తీసుకెళ‌తామ‌ని వివ‌రించారు. ఈ స‌మావేశాల్లో టిటిడి ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ సునీల్‌, డెప్యూటీ ఈవో  విజ‌య‌సార‌థి, విజివో  బాలిరెడ్డి, హోట‌ళ్ల నిర్వాహ‌కులు, దుకాణాల వ్యాపారులు, స్థానికులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-19 13:50:01

యువత దేశ రక్షణకు ముందుకి రావాలి..

యువత సైన్యం లో చేరి దేశ సేవలో భాగస్వామ్యం కావాలని, భారత సైన్యాన్ని పెంచుదాం –దేశ రక్షణకు తోడ్పడుదామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గనులు భూగర్బ శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం  జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్, జిల్లా సంయుక్త కలెక్టర్లు , (అభివృద్ధి) వి.వీరబ్రహ్మం,( సంక్షేమం) రాజశేఖర్, సబ్ కలెక్టర్ యం.జాహ్నవి, తంబళ్ళపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డిలతో కలసి పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని మండలాలకు సంబందించిన నిరుద్యోగులకు ప్రభుత్వ శుభరాం డిగ్రీ కళాశాల నందు  యువతకు ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ క్యాంపు నిర్వహణ  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమన్నారు.  రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మంజూరు అయిందన్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఫ్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యక్రమం ద్వారా యువతకు ఉపాధి అవకాశం కల్పించి వారి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయలన్నదే ముఖ్య ఉద్దేశమని వివరించారు. 
     ఇక్కడ సెలెక్ట్ చేసిన యువతకు తిరుపతి ఎస్వీ డిఫెన్స్ అకాడమీ ద్వారా 60 రోజుల ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నామని, శిక్షణ సమయంలో భోజనం వసతి ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. శేషారెడ్డి ఆధ్వర్యంలో యువతకు శిక్షణ ఇచ్చి గతంలో కూడా చాలా మందికి పారా మిలటరీ లో ఉద్యోగ అవకాశం కల్పించారని తెలిపారు. శిక్షణలో పాల్గొన్న యువత కష్టపడి ఉద్యోగం సంపాదించుకుని దేశ సేవలో భాగస్వాములు  కావడమే కాకుండా వారి కుటుంబానికి ఆర్థిక అభివృద్ధికి యువత సహాయపడాలని తెలిపారు.  గత ఫిబ్రవరి మాసములో  ఇక్కడే  జాబ్ మేళా నిర్వహించి సుమారు 2400 మంది యువతకు వివిధ కంపెనీ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న మాజీ సైనికుల సమస్యల పరిష్కారం కోసం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మాజీ సైనికులకు కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం గతంలో ఎంపి నిధులు ద్వారా రూ.10 లక్షలు మంజూరు చేయడం జరిగిందని, అది  సరిపోకపోవడం లేదని వారు నా దృష్టికి తీసుకురావడంతో ఇప్పుడే కలెక్టర్ తో మాట్లాడి జడ్పీ నిధుల నుండి రూ.10 లక్షలు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు.  రూ.5050 కోట్ల తో గండికోట రిజర్వాయర్ నుండి జిల్లాకు త్రాగు - సాగు నీరు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రూ.6800 కోట్ల తో పుంగనూరు బ్రాంచ్ కాల్వ ద్వారా కుప్పం నియోజకవర్గానికి నీరు ఇవ్వడం జరుగుతుందన్నారు. హంద్రీనీవా కాల్వను మూడు  రెట్లు వెడల్పు  చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కుళాయిలు ద్వారా త్రాగునీరు అందజేయడం జరుగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలలో ఒక దిక్సూచి గా పని చేస్తున్నారని తెలిపారు. ఈ మూడు సంవత్సరాలలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత నే ఎన్నికలకు రావడం జరుగుతుందని తెలిపారు.
     ఈ కార్యక్రమంలో తంబల్లపల్లి ఎమ్మెల్యే ద్వారాకనాథ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబానికి ఎదో రకంగా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో  ఈరోజు ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశం తెలిపారు.

    ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ హరినారాయణన్ మాట్లాడుతూ ఈ దేశానికి  బలం యువకులని, వారిని మంచి దారిలో తీసుకెళ్లాలని, వారి జీవతంలో వెలుగుతీసుకురావలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి, ముందుండి నడిపించాలన్నదే  మంత్రిగారి  ఆలోచన అన్నారు. ఆయన ఆలోచనలను కార్యాచరణ చేసి ముందుకు తీసుకెల్లే  ఈ రోజు గొప్పగా ప్రారంబించడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందన్నారు.  మన దేశంలో చాలా మంది  యువకులు చదువుకొని, కొంత మంది చదువులేనివారు కూడా ఎలా జీవితంలో ముందుకెళ్లాలని ఆలోచన ఉన్నప్పుడు, నిజంగా ఈ యొక్క ఆర్మీ రెక్రూట్మెంట్ నిరుద్యోగ యువతకు ఉపయోగపడుతున్నారు. దేశంలో 25 వేల మందికి ప్రీ ఆర్మీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడిందన్నారు. గ్రామీణ ప్రాంతంలో చాలామంది యువకులు వ్యవసాయం చేసి పంట పొలాల్లో తిరిగి పని చేసిన వారు చాలా ధృఢంగా  ఉంటారని, వారికి కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి దారి చూపిస్తే కచ్చితంగా వారు ఆర్మీ, ప్యారా మిలిటరీ  కి సెలెక్ట్ అవుతారని తెలిపారు.  ఒక సారి ఉద్యోగం వచ్చిందంటే వారి కుటుంబం ఆర్థికంగా అభివృద్ది చెందుతుందని తెలిపారు. ఈ ప్రాంత యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ ఉద్యోగంలో చేరడానికి శిక్షణతో బాగా ఉపయోగపడుతుందని, శిక్షణ పొంది ఉద్యోగాలు సంపాదించుకోవాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, అధికారులు వివిధ హోదాలలో దేశరక్షణ కోసం పని చేసి ఇక్కడికి వచ్చిన మాజీ సైనిక అధికారులకు అభినందనలన్నారు. మాజీ సైనికులు ఇక్కడ శిక్షణ పొందే వారికి మీ అనుభవాలను వారికి తెలియజేయాలన్నారు. 

ఈ కార్యక్రమంలో మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఎన్. వెంకట్ రెడ్డి యాదవ్, ఏపీ అండ్ క్రియేటివిటీ అకాడమీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, పుంగనూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నాగరాజ రెడ్డి  , జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర  కౌన్సిల్  మెంబర్ ముత్తంశెట్టి విశ్వనాథం,  వైయస్సార్ సిపి అధికార ప్రతినిధిలు పోకల అశోక్ కుమార్, పెద్ది రెడ్డి   ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అంతకుమునుపు భారత సైన్యం వివిధ హోదాల్లో పనిచేసిన మాజీ సైనిక అధికారులను  శివ ప్రసాద్, నరసింహారెడ్డి, సి వి రమణలను మంత్రి, కలెక్టర్ దుశ్సాలువతో  సన్మానించి, మొమెంటోలు అందించారు. అనంతరం మంత్రి, కలెక్టర్ గారు ఎమ్మెల్యే అధికారులు పావురాలను గాలిలోకి వదిలిపెట్టారు. అంతకముందు సభా ప్రాంగణం చేరుకొన్న మంత్రిగారు జాతీయ జండాను  ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంబించారు.
  
       ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ కమిషనర్ ఓ ఎస్ డి దుర్గాప్రసాద్, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, సెట్విన్ సి.ఈ.ఓ మురళీకృష్ణ రెడ్డి, డి.ఎస్.ఒ సయ్యద్ భాష, జిల్లా పంచాయతీ అధికారి దశరధ రామిరెడ్డి, డి.ఈ,ఓ పురుషోత్తం, డి.సి.హెచ్.ఎస్ డాక్టర్ సరళమ్మ, మున్సిపల్ కమిషనర్ కె ఎల్ వర్మ, s v డిఫెన్స్ అకాడమీ అధ్యక్షులు శేషా రెడ్డి, మునిసిపల్ చైర్మన్ అలీం భాష, వైస్ చైర్మన్ నాగేంద్ర,  మున్సిపల్ కౌన్సిలర్లు, పుంగనూరు నియోజకవర్గంలోని మండల తహశీల్దార్ లు, ఎంపీడీవోలు, మాజీ సైనికులు, వై.ఎస్.ఆర్.సి.పి పార్టీ నాయకులు  తదితరులు, పాల్గొన్నారు.

Tirupati

2021-07-19 13:39:11

చిత్తూరుకి 20వేల కోవిడ్ వేక్సిన్ డోసులు..

చిత్తూరు జిల్లాలో ప్రభుత్వం నుంచి 8వేల కోవ్యాక్సిన్, 20 వేల కోవిషీల్డ్ వ్యాక్సిన్ వచ్చిందని అర్హులైన వారికి మాత్రమే వ్యాక్సిన్ వేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్(ఆసరా) రాజశేఖర్ అన్నారు. సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అర్బన్ హెల్త్ సెంటర్ లకు ఈ వ్యాక్సిన్ను పంపడం జరిగిందని 45 సంవత్సరాలు పైబడిన వారికి రెండవ డోసు, గర్భిణీ మహిళలకు, ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఉన్న మహిళలకు మొదటి డోస్ వ్యాక్సిన్ వేయాలని ఆయన అన్నారు. వ్యాక్సిన్ అతి విలువైనది అని వృధా చేయకూడదని ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని ఏ మాత్రం అతిక్రమించిన వారిపై చట్టపరంగా ఏ మాత్రం అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని వైద్యాధికారులకు జాయింట్ కలెక్టర్ (ఆసరా) రాజశేఖర్ సూచించారు.

Chittoor

2021-07-19 13:35:41

చిత్తూరు జిల్లాలో 553 మందికి అక్రిడిటేషన్లు..

చిత్తూరు జిల్లాలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్ లకు 2021-22 సంవత్సరానికి 553 మందికి మీడియా అక్రెడిటేషన్లు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశపు మందిరంలో జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ సమావేశం ఛైర్మన్, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సమాచార శాఖ వెబ్ సైటులో  దరఖాస్తు చేసుకున్న జర్నలిస్ట్ లకు జి.ఓ ఎం.ఎస్ నెం.142 లోని నియమ నిబంధనల మేరకు అర్హులైన వారికి అక్రెడిటేషన్లు మంజూరు చేశామని, తక్కిన దరఖాస్తులను పెండింగ్ లో ఉంచి వారు 15 రోజుల లోపు సమర్పించవలసిన డాక్యుమెంట్లను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన అనంతరం వారికి కూడా అర్హత మేరకు అక్రెడిటేషన్లు మంజూరు చేస్తామని తెలిపారు. తమిళ దిన పత్రికలు, చానెల్ లలో పని చేసే మీడియా ప్రతినిధులకు అక్రెడిటేషన్ మంజూరు చేసేందుకు జి.ఓ లో రూల్స్ లేనందున,  కమిషనర్, సమాచార శాఖ విజయవాడ నుండి క్లారిఫికేషన్ పొందిన అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే తిరుమలలో పని చేస్తున్న విలేకరులకు తిరుమల కేంద్రంగా నమోదు చేసుకోవడానికి కమిషనర్ సమాచార శాఖ వారిని చర్యలు తీసుకోవాలసినదిగా కోరాలని సూచించారు. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు డిఎం అండ్ హెచ్ఓ శ్రీహరి, హౌసింగ్ పిడి పద్మనాభం, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ యం. బాలు నాయక్, సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్, చిత్తూరు ఎన్. వెంకటేసులు, రిజర్వేషన్ ఇన్స్పెక్టర్, తిరుపతి జె. సుబ్రమణ్యం, డిఎం ఏపిఎస్ ఆర్టిసి, చిత్తూరు కిరణ్ కుమార్, మెంబర్ కన్వీనర్ మరియు సమాచార శాఖ డిడి ఐ&పిఆర్ ఐ.ఆర్ లీలావతి పాల్గొన్నారు. 

Chittoor

2021-07-19 13:30:14

విజయనగరం స్పంద‌నకి 382 వినతులు..

స్పంద‌న విన‌తుల ప‌రిష్కారంపై ప్ర‌త్యేక దృష్టి  సారించి నిర్ణీత గ‌డువు దాట‌క‌ముందే వాటిని ప‌రిష్క‌రించాల‌ని క‌లెక్ట‌ర్ జిల్లా హరిజవహర్ లాల్ అధికారుల‌కు సూచించారు. వివిధ శాఖ‌ల వ‌ద్ద పెండింగ్‌లో ఉన్న ద‌ర‌ఖాస్తుల‌ను చ‌దివి వినిపించి వాటి రేప‌టిలోగా  వాటికి ప‌రిష్కారం చూపాల‌న్నారు. కోవిడ్ రెండో వేవ్ కార‌ణంగా గ‌త రెండు నెల‌లుగా స్పంద‌న విన‌తులు స్వీక‌రించే కార్య‌క్ర‌మం నేరుగా చేప‌ట్ట‌క‌పోవ‌డంతో సోమ‌వారం క‌లెక్ట‌ర్ కార్యాల‌య ఆడిటోరియంలో నిర్వ‌హించిన స్పంద‌న గ్రీవెన్స్ సెల్‌కు పెద్ద ఎత్తున అర్జీదారులు త‌ర‌లివ‌చ్చారు. ఉద‌యం 10 గంట‌ల నుంచే ప‌దుల సంఖ్య‌లో అర్జీదారులు ఆడిటోరియం వెలుప‌ల విన‌తిప‌త్రాల‌తో సిద్ధంగా వేచి వున్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, జిల్లా రెవిన్యూ అధికారి డా.ఎం.గ‌ణ‌ప‌తిరావు, డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు మేనేజ‌ర్ ప‌ద్మావ‌తి త‌దిత‌రులు విన‌తులు స్వీక‌రించారు. జిల్లా న‌లుమూల‌ల నుంచి 382 మంది అర్జీదారులు వివిధ స‌మస్య‌ల‌పై విన‌తులు అంద‌జేశారు. ఆయా స‌మస్య‌ల ప‌రిష్కారం నిమిత్తం క‌లెక్ట‌ర్, జాయింట్ క‌లెక్ట‌ర్ లు సంబంధిత శాఖ‌ల అధికారుల‌కు ఆ విన‌తుల‌ను పంపించి వాటి ప‌రిష్కారానికి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. డి.ఆర్‌.డి.ఏ. ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ సునీల్ రాజ్ కుమార్‌, సిపిఓ విజ‌య‌ల‌క్ష్మీ, జిల్లాప‌రిష‌త్ సి.ఇ.ఓ. టి.వెంక‌టేశ్వ‌ర‌రావు, హౌసింగ్ పి.డి. ఎస్‌.వి.ర‌మ‌ణ‌మూర్తి, డి.ఇ.ఓ. నాగ‌మ‌ణి, అన్ని శాఖ‌ల జిల్లా అధికారులు  పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-19 13:26:05

ఉద్యోగులంతా వేక్సిన్ వేయించకోవాలి..

ప్ర‌తి ప్ర‌భుత్వోద్యోగి కోవిడ్ వ్యాక్సిన్ త‌ప్ప‌నిస‌రిగా వేయించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశించారు. కోవిడ్ వ్యాక్సిన్ ఇప్ప‌టివ‌ర‌కు వేయించుకోని ఉద్యోగుల‌తో వ్యాక్సిన్ వేయించే బాధ్య‌త ఆయా జిల్లా అధికారుల‌దేన‌ని స్ప‌ష్టంచేశారు. వ్యాక్సిన్ తోనే కోవిడ్ నుంచి మ‌న‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని, నిత్యం ప్ర‌జ‌ల‌తో సంబంధాలు క‌లిగి వుండే ప్ర‌భుత్వ ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకోవ‌డం ద్వారా త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించుకోవ‌డంతోపాటు త‌మ కుటుంబానికి కూడా ర‌క్ష‌ణ క‌ల్పించిన‌ట్లవుతుంద‌న్నారు. క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో స్పంద‌న విన‌తుల స్వీక‌ర‌ణ సంద‌ర్భంగా సోమ‌వారం డి.ఆర్‌.డి.ఏ ఆధ్వ‌ర్యంలో మాస్క్‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు రూపొందించిన క‌ర‌ప‌త్రాల‌ను, పోస్ట‌ర్ల‌ను క‌లెక్ట‌ర్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా అధికారుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ 45 ఏళ్ల లోపు వ‌య‌స్సుగ‌ల ఉద్యోగుల‌కు కూడా ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్లుగా గుర్తించి వ్యాక్సిన్ వేస్తార‌ని చెప్పారు. ఏ ప్ర‌భుత్వ శాఖ‌కు చెందిన ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకొనేందుకు వ‌చ్చినా వ్యాక్సిన్ వేసేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి ఆదేశాలివ్వాల‌ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ర‌మ‌ణ‌కుమారికి సూచించారు. గ్రీవెన్స్ సెల్‌కు వ‌చ్చిన ఇద్ద‌రు సిబ్బంది తాము ఇప్ప‌టికీ వ్యాక్సిన్ వేయించుకోన‌ట్లు తెలుప‌గా వారిద్ద‌రికీ త‌క్ష‌ణ‌మే వ్యాక్సిన్ వేయించాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. వ్యాధి సోకిన త‌ర్వాత ఇబ్బందులు ప‌డే కంటే వ్యాధి ప్ర‌బ‌ల‌కుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్ట‌డ‌మే మేలైన విధాన‌మ‌ని చెప్పారు. మాస్క్ ధ‌రించ‌డం, శానిటైజేష‌న్‌, భౌతిక‌దూరం వంటి జాగ్ర‌త్త‌లు పాటించిన‌ట్లయితే మూడో వేవ్ రాకుండా నిరోధించ‌గ‌ల‌మ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ వేసుకొన‌డం ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించ‌గ‌ల‌మ‌న్నారు.

జిల్లాలో కోవిడ్ కేసులు అధికంగా వున్న మండ‌లాల ప్ర‌త్యేకాధికారులు పాజిటివ్‌ కేసులు న‌మోదైన గ్రామాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించి ప్ర‌జ‌ల్లో జాగ్ర‌త్త‌ల‌పై అవ‌గాహ‌న కల్పించాల‌ని సూచించారు. గ‌జ‌ప‌తిన‌గ‌రం, ఎల్‌.కోట‌, గ‌రివిడి, కొత్త‌వ‌ల‌స‌, బొండ‌ప‌ల్లి, ఎస్‌.కోట‌, తెర్లాం మండ‌లాల్లో యాక్టివ్ కేసులు అధికంగా ఉన్నాయ‌ని, ఈ మండ‌లాల అధికారులు అక్క‌డి ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌న్నారు. కెంగువ‌, వెల‌గ‌వ‌ల‌స‌, ద‌త్తిరాజేరు, కోనూరు, ఎస్‌.కోట‌, కొంపంగి, న‌గ‌రంలోని కె.ఎల్‌.పురం స‌చివాల‌యాల ప‌రిధిలో కేసులు అధికంగా వున్నాయ‌ని, ఆయా ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసేలా జిల్లా పంచాయ‌తీ అధికారి, జిల్లాప‌రిష‌త్ సి.ఇ.ఓ., మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్‌లు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. డి.ఆర్‌.డి.ఏ. ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ సునీల్ రాజ్ కుమార్‌, సిపిఓ విజ‌య‌ల‌క్ష్మీ, జిల్లాప‌రిష‌త్ సి.ఇ.ఓ. టి.వెంక‌టేశ్వ‌ర‌రావు, హౌసింగ్ పి.డి. ఎస్‌.వి.ర‌మ‌ణ‌మూర్తి, డి.ఇ.ఓ. నాగ‌మ‌ణి, అన్ని శాఖ‌ల జిల్లా అధికారులు  పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-19 13:23:56

నూతన సర్పంచ్ లకు ప్రాధమిక శిక్షణ..

విజయనగరం జిల్లాలో  నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతి సర్పంచులకు  ప్రాధమిక శిక్షణా కార్యక్రమం ఈ నెల 22 నుండి ఆగష్టు 7వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ తెలిపారు.  విజయనగరం డివిజిన్  సంబంధించి 5 బ్యాచ్ లుగా, పార్వతిపురం డివిజిన్ కు సంబంధించి 4 బ్యాచ్ లుగా విభజించడం జరిగిందన్నారు. 100 నుండి 120 మందితో బ్యాచ్ లను ఏర్పాటు  చేయడమైందని, ఒక్కో బ్యాచ్ కు  ముడేసి రోజుల చొప్పున శిక్షణా కార్యక్రమం ఉంటుందని  అన్నారు.  విజయనగరం డివిజిన్ కు జే.ఎన్ .టి యులో 489 మందికి,  పార్వతీపురం డివిజిన్ వారికీ  గరుగుబిల్లి మండలం  ఉల్లిభద్ర లో ఉన్న ఉద్యాన కళాశాలలో 379 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.   సోమవారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్ల పై సమీక్షించారు. శిక్షణకు అవసరమగు సామగ్రిని,  టేబుళ్ళ ను, హాజరు పట్టికలను, ఐ.డి కార్డులను  సిద్ధంగా ఉంచుకోవలన్నారు.  సర్పంచ్ లందరినీ ఒకేలా చూడాలని, క్రమ శిక్షణ తో శిక్షణ జరిగేలా చూడాలని సూచించారు.  చక్కటి భోజన, వసతి, బెడ్స్ ,  అల్పాహారం, తాగు నీరు  ఏర్పాటు చేయాలని,  వారి రవాణా కు కూడా ఏర్పాట్లు చేయాలనీ అన్నారు. స్థానికంగా ఎక్ష్పొజర్ పర్యటనకు ఏర్పాటు చేయాలనీ  ఇందులో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు.  ప్రతి ఒక్కరు  ఒక మొక్కను  నాటేలా చూడాలన్నారు.  పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, చెరువు శుద్ధి, అలంకరణ   తదితర అంశాల పై అవగాహన కలిగేల ఏర్పాటు చేయాలన్నారు.  ముందు గానే ఆయా శాఖలకు సమాచారం అందించి  సమన్వయం  చేసుకోవాలన్నారు.  శిక్షణ లో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన  ఉండాలన్నారు.  శిక్షణ అనంతరం ఇచ్చే సర్టిఫికేట్ లు, ఫోటో లు ప్రతి ఒక్కరికి అందజేయాలన్నారు.   శిక్షణ లో ప్రధానంగా   గ్రామ సచివాలయాల ఏర్పాటు, ప్రాముఖ్యత,  పంచాయతీల విధులు, అధికారాలు, బాధ్యతలు, లక్ష్యాలు,  మౌలిక సదుపాయాల కల్పన లో  గ్రామాభి వృద్ధి తాగు నీరు, రోడ్లు, విద్యుత్ దీపాలు, పంచాయతీల ఆర్ధిక పరిపుష్టి, ఆర్ధిక వ్యవహారాలు,  సంక్షేమ పధకాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం తదితర అంశాల పై శిక్షణ  ఉంటుందన్నారు.  ఎలాంటి లోపాలు జరగకుండా,  ఏర్పాట్లను గావించాలని ,  శిక్షణ అనంతరం ప్రతి ఒక్కరు సంతోషంగా వెళ్ళే లా చూడాలని అన్నారు.  

శిక్షణ కు హాజరయ్యే  సర్పంచులందరికి ధర్మల్ స్కానర్ తో పరీక్షించాలని, ఎవరికైనా జ్వరం ఉంటే పంపించి వేయాలని తెలిపారు. శిక్షణలో  భౌతిక దూరాన్ని  పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా వాడాలని, ప్రవేశం వద్ద శానిటైజర్ ఉంచాలని, కోవిడ్ నిబంధనలను పాటించడమే కాకుండా, శిక్షణ లో కోవిడ్ పై కూడా  తరగతి నిర్వహించి అవగాహన కల్పించాలని అన్నారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంయుక్త కలెక్టర్లు డా. జి.సి.కిషోర్ కుమార్, జే.వెంకట రావు, సబ్ కలెక్టర్ భావన, ఆర్.డి.ఓ భవాని శంకర్ ,   డి.పి.ఓ సుభాషిని, జిల్లా పరిషత్ సి.ఎఈ.ఓ వెంకటేశ్వర రావు, డివిజినల్ పంచాయతి అధికారులు,  డిఎల్డి ఓ లు  రాజ్ కుమార్, రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-07-19 13:08:19

అనాధ బాలలకు ఉచిత వసతి గ్రుహాలు..

అనాధ బాలురు, తల్లి, లేదా తండ్రిని కోల్పోయిన పిల్లలు, వీధి బాలురు, యాచక బాలుర కోసం నిర్వహిస్తున్న అణగారిన పిల్లల హాస్టల్ సేవలను, అవసరమైనవారు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ కోరారు. సమగ్ర శిక్ష, ఐ.ఆర్.పి.డబ్ల్యు.ఏ. సంస్థ ఆధ్వర్యంలో, స్థానిక కంటోన్మెంట్ మున్సిపల్ హై స్కూల్ సమీపంలో నిర్వహిస్తున్న అణగారిన పిల్లల హాస్టల్ కు సంబంధించిన గోడ పత్రికను, కలెక్టరేట్ ఆడిటోరియంలో, సోమవారం కలెక్టర్ హరి జవహర్ లాల్ ఆవిష్కరించారు. ఈ హాస్టల్ పట్ల అవగాహన కల్పించి, అణగారిన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలని,  ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. అవసరం అయిన వారంతా సేవలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయ కర్త జె.విజయలక్ష్మి మాట్లాడుతూ,  అనాధ పిల్లలకు, ఈ హాస్టల్లో వసతిని కల్పించి, 3 వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్య, నైపుణ్యాభివృద్ధి కల్పించడం జరుగుతుందని చెప్పారు. ఈ హాస్టల్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి, అవసరమైన వారిని చేర్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్(సంక్షేమం) జె.వెంకటరావు, డిఆర్వో ఎం.గణపతిరావు, సోషల్ వెల్ఫేర్ డిడి కె.సునీల్ రాజ్ కుమార్, డి.ఎం.అండ్.హెచ్.ఓ. డాక్టర్ ఎస్వీ రమణ కుమారి, ఏ.ఎల్.ఎస్. కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు, ఐ.ఆర్.పి.డబ్ల్యూ.ఏ. డైరెక్టర్ కె.ప్రకాష్, యు.ఆర్.హెచ్. సిబ్బంది రామకృష్ణ, శ్రీనివాస్, భానుమూర్తి, విమల తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-19 12:58:41

25 వరకే జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు..

విజయనగరం జిల్లాలో రబీ సీజనులో ధాన్యం సేకరణ లక్ష్యాలు పూర్తి కావస్తుండటంతో,  ఈ నెల 25వ తేదీ వరకు మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తామని ని జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డాక్టర్ జిసి కిషోర్ కుమార్ తెలిపారు. సీజన్ చివరి దశకు చేరుకున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు ఎవరిదగ్గరైనా ధాన్యం మిగిలిపోయిన పక్షంలో, వెంటనే కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లి, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరను పొందాలని జేసీ సూచించారు. ప్రకటించిన తేదీ తరువాత ధాన్యం తీసుకొచ్చినా కొనుగోలుచేయడానికి వీలుపడదనే విషయాన్ని రైతులు గమనించాలన్నారు.

Vizianagaram

2021-07-18 17:40:52

19 నుంచి స్పంద‌న‌ పునః ప్రారంభం..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఈ నెల 19 వ తేదీ సోమ‌వారం నుంచి స్పంద‌న కార్య‌క్ర‌మం ప్రారంభం కానుందని జిల్లా కలెక్టర్ డా. హరిజవహర్ లాల్ తెలియజేశారు. కోవిడ్ కార‌ణంగా కొంత‌కాలంగా ఆపివేసిన స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని పునః ప్రారంభిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. స్పంద‌న‌కు వ‌చ్చే ప్ర‌తీఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా మాస్కును ధ‌రించాల‌ని, భౌతిక దూరాన్ని పాటించాల‌ని సూచించారు.  ఈ కార్య‌క్ర‌మానికి వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారులంతా త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రు కావాల‌ని ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్టు పేర్కొన్నారు.

Vizianagaram

2021-07-18 17:38:25