1 ENS Live Breaking News

VMRDAచైర్మన్ కు SCRWAఅభినందన..

విశాఖ మహానగరంలో ప్రజల సమస్యలు దగ్గరుండి పరిష్కరిండచంలో ఎల్లప్పుడూ ముందుండే వైఎస్సార్సీపీ తూర్పునియోజకవర్గ సమన్వయకర్త అక్కరామాని విజయనిర్మలకు వీఎంఆర్డీఏ చైర్మన్ పదవి రావడం అభినందనీయమని SCRWA అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం విశాఖలో అక్కరమాని కార్యాలయంలో అసోసియేషన్ సభ్యులతో ఆమెకు అభినందన తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ, ప్రజలతోపాటు, నాయకులు, కార్యకర్తల సంక్షేమం చూడటంలో అక్కరామానికి ఎవరూ సాటిరారని కొనియాడారు. అలాంటి మంచి వ్యక్తి రాజున్న రోజుల్లో మరిన్ని మంచి పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి నక్కాని అజయ్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-07-21 09:00:59

వైఎస్సార్ భీమా క్లైమ్ లు క్లియర్ చేయాలి..

 వైయస్సార్ బీమా పథకానికి సంబంధించి క్లైమ్స్ పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా&సంక్షేమం) జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు.   మంగళవారం కాకినాడలో జేసీ జి. రాజకుమారి జిల్లా గ్రామీణ అభివృద్ధి  సంస్థ కార్యాలయాన్ని సంబంధిత అధికారులతో కలిసి  సందర్శించి, వైయస్సార్ బీమా క్లయిమ్స్ లాగిన్ వివరాలు,ఆన్ లైన్ లో అప్లోడ్ ,పోర్టల్ రిపోర్టులను పరిశీలించి, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.   ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వివిధ కారణాల చేత మరణించిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే వైయస్సార్ బీమా పథకానికి సంబంధించిన లబ్ది వెంటనే కుటుంబానికి అందించడం ద్వారా మరణించిన వారి కుటుంబంలో  మనోధైర్యాన్ని నింపవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల్లో వైయస్సార్ బీమా చాలా ప్రధానమైనదని ఆమె తెలిపారు. దుఃఖంలో ఉన్న వారిని స్వయంగా వెళ్లి కలుసుకోకపోయినా వారికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా కుటుంబాన్ని ఆదుకోవచ్చన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ బీమా పథకం పై ప్రత్యేక దృష్టి పెట్టినందున అధికారులు మరింత శ్రద్ధ కనబరిచి బీమా క్లయిమ్స్ ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 12 లక్షల 63వేల 303 మందిని  వైయస్సార్ బీమా లో ఎన్ రోల్ చేయడంతో  ఇప్పటివరకు సుమారు 99.65శాతం సర్వే పూర్తయిందని ఆమె తెలిపారు. జూలై 1 నుంచి ప్రారంభమైన వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించి చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద రూ. పది వేలు అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో జూలై 1 నుంచి  నేటి వరకు మొత్తం 218 మరణాలు రిజిస్టర్ కాగా 207 సహజ మరణాలు, 11 ప్రమాద మరణాలుగా నమోదైనట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఎక్కువ సంఖ్యలో మహిళలే లబ్ధిదారులుగా ఉన్నందున జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పాత్ర చాలా కీలకమైనదని గుర్తించి అధికారులు జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు సమన్వయంతో పనిచేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని జేసీ రాజకుమారి అధికారులకు సూచించారు.
    ఈ పర్యటనలో జేసీ రాజకుమారి వెంట జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వై.హరిహరనాథ్ , ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డీఎస్. సునీత, బీసీ సంక్షేమ అధికారి కె. మయూరి, అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసు,.. సోమేశ్వర రావు, ఏరియా కో-ఆర్డినేటర్ లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2021-07-20 17:47:50

సచివాలయ సిబ్బంది గ్రామాల్లో తిరగాలి..

సచివాలయాల సిబ్బంది సమయానికి కార్యాలయాలకు హాజరై వీధుల్లో ఒక్క సారి  తిరగాలని, పారిశుధ్యం, డ్రైనేజ్ వ్యవస్థ, రహదారుల పరిస్థితిని తనిఖీ చేయాలనీ  అన్నారు.   అదే విధంగా సచివాలయాల వద్ద మొక్కలు నాటాలని, వీధిలో కూడా  గృహాల వద్ద  మొక్కలు నాటేలా చూడాలని తెలిపారు. కాళిఘాట్ కాలనీ లో నున్న 50 వ సచివాలయాన్ని, కుసుమ గజపతి నగర్ లో ఉన్న 47 వ సచివాలయాన్ని  మంగళ వారం  కలెక్టర్ తనిఖీ చేసారు.   బయో మెట్రిక్  హాజరు ను, రికార్డు లను తనిఖీ చేసారు.  పెండింగ్  ఉన్న ఈ-సేవ దరఖాస్తులను, ఇన్సురన్సు క్లెయిమ్స్ ను, రైస్ కార్డ్స్, పించన్లు,  తదితర అంశాల పై ఆరా తీసారు.  కాళిఘాట్ కాలనీ లో సచివాలయం పక్కనే ఉన్న గృహం ముందు ఇసుక, కంకర రహదారి పై కుప్పగా ఉండడం తో ఆ కుటుంభ సభ్యులతో  మాట్లాడి తొలగించాలని  చెప్పారు.  మొక్కలు ఇంటి ముందు నాటాలని కోరారు. కుసుమ గజపతి నగర్ సచివాలయం లో టేబుళ్ళు దుమ్ము ధూళి తో ఉండడం తో వారి పై ఆగ్రహం వ్యక్తం చేసారు.  స్వంత ఇంట్లో ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో సచివాలయాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచాలని సూచించారు.  ఈ. దరఖాస్తులను గడువు లోగా పరిష్కరించాలని ఆదేశించారు. వీధి లో   ఎవరికైనా మొక్కలు పెంచుకునే ఆసక్తి ఉంటే సరఫరా చేయాలనీ అన్నారు.   కలెక్టర్ వెంట మున్సిపల్ హెల్త్  ఆఫీసర్  డా. సత్యనారాయణ  పాల్గొన్నారు. 

Vizianagaram

2021-07-20 17:42:47

బ్యాంకు గ్యారెంటీలు ఇప్పించండి..

తాము చెల్లించిన బ్యాంకు గ్యారెంటీల‌ను తిరిగి ఇప్పించాల‌ని, జాయింట్ క‌లెక్ట‌ర్‌(రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌కు జిల్లా రైస్‌ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్ విజ్ఞ‌ప్తి చేసింది. జాయింట్ క‌లెక్ట‌ర్ కిశోర్‌ను మంగ‌ళ‌వారం ఆయ‌న ఛాంబ‌ర్‌లో, అసోసియేష‌న్ ప్ర‌తినిధులు క‌లిసి, త‌మ బాధ‌లు మొర‌పెట్టుకున్నారు.       ప్ర‌భుత్వం ఇచ్చిన ల‌క్ష్యాల మేర‌కు జిల్లాలో ధాన్యం సేక‌ర‌ణ జ‌రిగింద‌ని,  సిఎంఆర్‌ను కూడా దాదాపు అంద‌జేయ‌డం జ‌రిగింద‌ని అసోసియేష‌న్ అధ్య‌క్షులు కొండ‌ప‌ల్లి కొండ‌ల‌రావు అన్నారు. ఇంకా కేవ‌లం 5,100 ట‌న్నుల సిఎంఆర్ మాత్ర‌మే పెండింగ్ ఉంద‌ని, దానిని కూడా కొద్ది రోజుల్లోనే పూర్తి చేస్తామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే అధిక శాతం మిల్ల‌ర్లు, చాలా రోజుల క్రిత‌మే సిఎంఆర్‌ను పూర్తిచేశార‌ని, అయిన‌ప్ప‌టికీ వారికి నేటివ‌ర‌కూ  బ్యాంకు గ్యారెంటీలు తిరిగి ఇవ్వ‌లేద‌ని అన్నారు. బిజిలు రాక‌పోవ‌డం వ‌ల్ల‌, మిల్ల‌ర్లు చాలా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే జిల్లాలోని మిల్ల‌ర్లు వివిధ కార‌ణాల‌రీత్యా, ఆర్థికంగా చితికిపోయి, తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, బిజిలు ఇప్పించి ఆదుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. మిల‌ర్లు ఎదుర్కొంటున్న ప‌లు ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు. దీనిపై జెసి కిశోర్ స్పందిస్తూ, వారి స‌మ‌స్య‌ను ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, బిజిల‌ను ఇప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని హామీ ఇచ్చారు.

Vizianagaram

2021-07-20 17:41:21

స‌మ‌గ్ర సర్వేతో ఖ‌చ్చిత‌మైన భూరికార్డులు..

స‌మ‌గ్ర భూ స‌ర్వే ద్వారా మ‌రింత‌ ఖ‌చ్చిత‌మైన భూముల రికార్డులు త‌యార‌వుతాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. రీస‌ర్వే ప్ర‌క్రియ‌ను నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిలో పూర్తి చేయాల‌ని కోరారు. వైఎస్ఆర్ జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూ హ‌క్కు మ‌రియు భూ ర‌క్ష ప‌థ‌కంపై త‌న ఛాంబ‌ర్‌లో మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ స‌మీక్షించారు. ఈ ప్ర‌క్రియ ద్వారా నాణ్య‌మైన‌, ఖ‌చ్చిత‌మైన రికార్డులు రూపొందుతాయ‌ని చెప్పారు. ప్ర‌భుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా, కాల‌వ్య‌వ‌ధిని పెట్టుకొని త్వ‌ర‌గా స‌ర్వేను పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్‌ సూచించారు. జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్ మాట్లాడుతూ,  జిల్లాలో ఆరు అంచెలుగా భూముల రీస‌ర్వే ప్ర‌క్రియ జోరుగా జ‌రుగుతోంద‌న్నారు. ఇత‌ర జిల్లాల‌కంటే మ‌న జిల్లా ముందంజ‌లో ఉంద‌ని చెప్పారు. ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌కు అనుగుణంగా తొలుత డివిజ‌న్‌కు ఒక గ్రామాన్ని, ఆ త‌రువాత మండ‌లానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, ద్రోణ్ ద్వారా స‌ర్వే ప్ర‌క్రియ చేప‌ట్టామ‌న్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 72 గ్రామాల్లో స‌ర్వేను పూర్తి చేయ‌డం జ‌రిగింద‌న్నారు. తాజాగా మూడునాలుగు మండ‌లాలు క‌లిపి ఒక క్ల‌ష్ట‌ర్‌గా నిర్ణ‌యించి, క్ల‌ష్ట‌ర్ల వారీగా స‌ర్వే చేయాల‌ని ప్ర‌భుత్వం నుంచి ఆదేశాలు వ‌చ్చాయ‌ని చెప్పారు. దీనికి అనుగుణంగా ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేసి, ఆమోదం కోసం ప్ర‌భుత్వానికి పంపించ‌డం జ‌రిగింద‌ని జెసి వివ‌రించారు.

                ఈ స‌మావేశంలో స‌ర్వే, భూ రికార్డుల‌శాఖ స‌హాయ సంచాల‌కులు కె.రాజాకుమార్‌, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.  

Vizianagaram

2021-07-20 17:39:53

సర్పంచ్ లకు రెసిడెన్సియల్ శిక్షణ..

నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతి సర్పంచులకు  ప్రాధమిక శిక్షణా కార్యక్రమం ఈ నెల 22 నుండి పార్వతీపురం డివిజన్ లో గల 15 మండలాల  సర్పంచ్లకు,  4 బ్యాచ్ లకు, ఒక్కో బ్యాచ్ కు 3 రోజులు చొప్పున  నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమాలకు సంబంధించిన అధికారులతో ఉద్యాన కళాశాలలో మంగళవారం పార్వతీపురం సబ్ కలెక్టర్ భావనా  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ 100 నుండి 120 మందితో బ్యాచ్ లను ఏర్పాటు  చేయడమైందని, ఒక్కో బ్యాచ్ కు  మూడేసి రోజుల చొప్పున శిక్షణా కార్యక్రమం ఉంటుందని  అన్నారు.  పార్వతీపురం డివిజన్ వారికి  గరుగుబిల్లి మండలం  ఉల్లిభద్ర లో ఉన్న ఉద్యాన కళాశాలలో 379 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.  సంబంధిత ఏర్పాట్ల పై సమీక్షించారు, శిక్షణకు అవసరమగు సామగ్రిని,  టేబుళ్ళ ను, హాజరు పట్టికలను, ఐ.డి కార్డులను  సిద్ధంగా ఉంచుకోవలన్నారు.  సర్పంచులందరినీ ఒకేలా చూడాలని, క్రమ శిక్షణ తో శిక్షణ జరిగేలా చూడాలని సూచించారు.  చక్కటి భోజన, వసతి, బెడ్స్ ,  అల్పాహారం, త్రాగు నీరు  ఏర్పాటు చేయాలని,  వారి రవాణా కు కూడా ఏర్పాట్లు చేయాలనీ అన్నారు. స్థానికంగా ఎక్ష్పొజర్ పర్యటనకు ఏర్పాటు చేయాలనీ  ఇందులో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు.  ప్రతి ఒక్కరు  ఒక మొక్కను  నాటేలా చూడాలన్నారు.  పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, చెరువు శుద్ధి, అలంకరణ   తదితర అంశాల పై అవగాహన కలిగేల ఏర్పాటు చేయాలన్నారు.  ముందు గానే ఆయా శాఖలకు సమాచారం అందించి  సమన్వయం  చేసుకోవాలన్నారు.  శిక్షణ లో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన  ఉండాలన్నారు.  శిక్షణ అనంతరం ఇచ్చే సర్టిఫికేట్ లు, ఫోటో లు ప్రతి ఒక్కరికి అందజేయాలన్నారు.   శిక్షణ లో ప్రధానంగా   గ్రామ సచివాలయాల ఏర్పాటు, ప్రాముఖ్యత,  పంచాయతీల విధులు, అధికారాలు, బాధ్యతలు, లక్ష్యాలు,  మౌలిక సదుపాయాల కల్పన లో  గ్రామాభి వృద్ధి తాగు నీరు, రోడ్లు, విద్యుత్ దీపాలు, పంచాయతీల ఆర్ధిక పరిపుష్టి, ఆర్ధిక వ్యవహారాలు,  సంక్షేమ పధకాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం తదితర అంశాల పై శిక్షణ  ఉంటుందన్నారు.  ఎలాంటి లోపాలు జరగకుండా చూడాలని అన్నారు.  

కోవిడ్ నిబంధనలు తప్పనిసరి

         శిక్షణకు హాజరయ్యే  సర్పంచులందరికి ధర్మల్ స్కానర్ తో పరీక్షించాలని, శిక్షణలో  భౌతిక దూరాన్ని  పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా వాడాలని, ప్రవేశం వద్ద శానిటైజర్ ఉంచాలని, కోవిడ్ నిబంధనలను పాటించడమే కాకుండా, శిక్షణ లో కోవిడ్ పై కూడా  తరగతి నిర్వహించి అవగాహన కల్పించాలని అన్నారు. 

        ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సి.ఇ.ఓ వెంకటేశ్వర రావు, డి.ఎల్.డి.ఓ రాజ్ కుమార్, డి.డి. ట్రైబల్ వెల్ఫేర్ కిరణ్, కొమరాడ, గరుగుబిల్లీ, తెర్లాం, మక్కువ ఎం.పి.డి.ఓ లు, గరుగుబిల్లీ, పార్వతీపురం తహసీల్దార్లు, తదితరులు  పాల్గొన్నారు. 

Vizianagaram

2021-07-20 17:36:26

శతశాతం హౌసింగ్ గ్రౌండింగ్ జరగాలి..

న‌వ‌ర‌త్నాలు లో భాగంగా, పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త‌నిస్తోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని, జిల్లాలో శ‌త‌శాతం ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాల‌ని ఆదేశించారు. వెంట‌నే ల‌బ్దిదారులంద‌రినీ చైత‌న్య‌ప‌రిచి, ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభింప‌జేయాల‌ని సూచించారు.   గృహ నిర్మాణ కార్య‌క్ర‌మంలో భాగంగా చేప‌ట్టిన మ్యాపింగ్‌, జియో ట్యాగింగ్‌, రిజిష్ట్రేష‌న్‌, జాబ్‌కార్డు జారీ త‌దిత‌ర ప్ర‌క్రియ‌ల‌పై త‌న ఛాంబ‌ర్‌లోమంగ‌ళ‌వారం సంబంధిత అధికారుల‌తో క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. గ్రౌండింగ్‌లో ఏమైనా స‌మ‌స్య‌లుంటే త‌న దృష్టికి తీసుకురావాల‌ని సూచించారు. జాబితాల్లో ఎవ‌రైనా అన‌ర్హులుంటే, వారి పేర్లు తొల‌గించాల‌ని, అర్హులంద‌రిచేతా ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభింప‌జేయాల‌ని చెప్పారు. ఇంకా ఎక్క‌డైనా లేఅవుట్ల‌కోసం భూమిని సేక‌రించాల్సి ఉంటే, త‌క్ష‌ణ‌మే ప్ర‌క్రియ‌ను ప్రారంభించాల‌ని సూచించారు. లేఅవుట్ల‌లో సిసి రోడ్లు, గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేయాల‌ని అన్నారు.

                 ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (హౌసింగ్‌) మ‌యూర్ అశోక్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, హౌసింగ్ పిడి ఎస్‌వి ర‌మ‌ణ‌మూర్తి పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-20 17:35:00

విద్యార్ధికి నష్టపరిహాం అందజేత..

 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ప్ర‌మాద‌వ‌శాత్తూ విద్యార్థి మృతి చెంద‌గా, అత‌ని కుటుంబానికి, జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్  ప‌రిహారాన్ని అందించారు. 2018లో పాచిపెంట మండ‌ల‌ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో ప్ర‌మాద‌వశాత్తూ గోడకూలి శ‌శివ‌ర్థ‌న్ అనే విద్యార్థి మృతి చెందాడు. వారు జాతీయ మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్‌ను ఆశ్ర‌యించ‌గా, క‌మిష‌న్ ఆదేశాల మేర‌కు, ప్ర‌భుత్వం ఆ కుటుంబానికి రూ.2.5ల‌క్ష‌ల ప‌రిహారాన్ని మంజూరుచేసింది. దీనికి సంబంధించిన చెక్కును,  విద్యార్థి తండ్రి డోల రాజుకు క‌లెక్ట‌ర్ త‌న ఛాంబ‌ర్‌లో మంగ‌ళ‌వారం అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో డిఇఓ జి.నాగ‌మ‌ణి, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-20 17:33:39

థ‌ర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు స‌న్న‌ద్దం..

కోవిడ్ థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు స‌న్న‌ద్దంగా ఉండాల‌ని, అధికార యంత్రాంగానికి జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ పిలుపునిచ్చారు. థ‌ర్డ్‌వేవ్ స‌న్న‌ద్ద‌త‌లో భాగంగా ప‌లు ప్ర‌యివేటు ఆసుప‌త్రుల యాజ‌మాన్యాల‌తో, క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో మంగ‌ళ‌వారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, థ‌ర్డ్‌వేవ్ రాకుండా ఉండాల‌ని కోరుకుంటున్నామ‌ని, ఒక‌వేళ వ‌చ్చిన ప‌క్షంలో, ఎదుర్కొన‌డానికి అన్నివిధాలా సిద్దంగా ఉండాల‌ని అన్నారు. మొద‌టి, రెండో ద‌శ‌లో కోవిడ్‌ను ఎదుర్కొన‌డంలో ప్ర‌యివేటు ఆసుప‌త్రులు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేశాయ‌ని అభినందించారు. ప్ర‌భుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా, థ‌ర్డ్‌వేవ్ కోసం ఆసుప‌త్రుల్లో త‌గిన వ‌స‌తుల‌ను స‌మ‌కూర్చుకొని సిద్దం చేయాల‌ని కోరారు. ఆసుప‌త్రిలోని ప‌డ‌క‌ల‌న్నిటికీ ఆక్సీజ‌న్ స‌దుపాయాన్ని క‌ల్పించాల‌ని, ఆక్సీజ‌న్ సిలండ‌ర్ల‌ను, కాన్‌సెంటేట‌ర్లును అవ‌స‌ర‌మైన‌న్ని స‌మ‌కూర్చుకోవాల‌ని, ఆక్సీజ‌న్ ట్యాంకుల‌ను, ప్లాంట్ల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని ఆదేశించారు.  వెంటిలేట‌ర్ బెడ్స్ సంఖ్య‌ను ప్ర‌తీ ఆసుప‌త్రిలో పెంచాల‌ని స్ప‌ష్టం చేశారు. వ‌సతుల‌తోపాటుగా త‌గిన మాన‌వ వ‌న‌రుల‌ను, నైపుణ్యం గ‌ల సిబ్బందిని సిద్దం చేయాల‌ని అన్నారు. అధికారులు ప్రయివేటు ఆసుప‌త్రుల‌ను త‌నిఖీ చేసి, థ‌ర్డ్‌వేవ్‌కు సిద్దం చేయాల‌ని సూచించారు.

                  ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(సంక్షేమం) జె.వెంక‌ట‌రావు, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ జి.నాగ‌భూష‌ణ‌రావు, ఐపిఓ క‌ళింగ‌వ‌ర్థ‌న్‌, ఇత‌ర అధికారులు,  ప్ర‌యివేటు ఆసుప‌త్రుల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-20 17:26:28

అభివృద్ధి, సంక్షేమం రెండు రెండు కళ్ళు..

అభివృద్ధి, సంక్షేమం రెండు రెండు కళ్ళుగా చేసుకుని జగన్ మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నారని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. జగనన్న పచ్చ తోరణం ( హరిత వన హారం) కార్యక్రమంలో భాగంగా పొందూరు మండలం కొంచాడ గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమంలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం మంగళ వారం పాల్గొన్నారు.తాడివలస గ్రామంలో రూ.23 లక్షల నిధులతో  నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగా ఎరువులు, పురుగు మందులకు మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు వెళ్లవలసిన అవసరం లేదన్నారు. మీ ఊర్లోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కేంద్రంలోనే ఎరువులు, పురుగు మందులను పంపిణీ చేయడం జరుగతుందన్నారు.  రైతులకు సలహాలు సూచనలు ఇచ్చే విధంగా జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు రెండు కళ్ళుగా చేసుకుని జగన్ మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు తమ్మినేని చిరంజీవి నాగ్, పప్పల వెంకటరమణ, జడ్పిటిసి అభ్యర్థి లోలుగు కాంతారావు, లోలుగు శ్రీరాములు నాయుడు, గంట్యాడ రమేష్, అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-20 17:15:37

అభివ్రద్ధి పధంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో ముఖ్యమంత్రి నడిపిస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజు అన్నారు. పూండి - పర్లాఖిమిడి రాష్ట్ర హైవే విస్తరణ కార్యక్రమాన్ని పూండి రైల్వే గేట్ వద్ద మంత్రి మంగళ వారం శంఖుస్థాపన చేశారు. రహదారి విస్తరణ కార్యక్రమాన్ని రూ.25 కోట్లతో రహదారులు, భవనాల శాఖ చేపడుతుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నువ్వలరేవు నుండి టెక్కలి పట్నం వరకు రహదారి విస్తరణ జరుగుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని తెలిపారు. అనేక పంచాయతీలు భవనాలు లేక ఉన్నాయని అటువంటి సమయంలో ప్రతి సచివాలయానికి కోటి రూపాయలతో భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి మంజూరు చేసారని ఆయన తెలిపారు. ప్రజల ఫిర్యాదులు స్థానికంగా పరిష్కారానికి కృషి చేయడం అభివృద్ధిలో భాగమని ఆయన అభిప్రాయపడ్డారు. వాస్తవ అభివృద్ధి అంటే ఏమిటో ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలని ఆయన పేర్కొన్నారు. నాడు నేడు పనులు చేపట్టి పాఠశాలల రూపురేఖలు మార్చడం జరుగుతోందని ఆయన అన్నారు. ప్రామాణిక విద్య జీవితాన్ని మార్చుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారని మంత్రి వివరించారు.రిమ్స్ వైద్య కళాశాల, టెక్కలి జిల్లా ఆసుపత్రి, హరిపురం, పలాస సామాజిక ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రతి గ్రామానికి ఒక ఆరోగ్య కేంద్రం ఇచ్చామని ఇది అభివృద్ధిలో భాసగమని అన్నారు. 

మౌలిక సదుపాయాల కల్పన పెద్ద ఎత్తున జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. రూ.30 కోట్లతో అక్కుపల్లి రోడ్డు పనులు జరుగుతున్నాయని, మందస మండలంలో మారుమూల ప్రాంతమైన తురసవాడకు కూడా రహదారులు వేశామని మంత్రి చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో రూ.36 కోట్లతో రోడ్లు వేశామని ఆయన చెప్పారు. కాశీబుగ్గ ఫ్లై ఓవర్ పనులు మొదలు పెట్టామని, పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన పేర్కొన్నారు. రహదారి విస్తరణకు సహకారాన్ని అందిస్తున్న వ్యాపారులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నౌపడ వెంకటాపురం రోడ్డుకు త్వరలో శంఖుస్థాపన చేస్తామని, జీడీపిక్కల మద్ధతు ధర సమస్య  పరిష్కరించుటకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. తితిలి సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు.

        జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ పూండి - పర్లాఖిమిడి రహదారి విస్తరణ వలన ఈ ప్రాంతం అభివృద్ధి పథకంలోకి వెళుతుందన్నారు. గ్రామాల్లో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం తదితర భవనాల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. సంవత్సరం కాలంలో గ్రామాల రూపు రేఖలు మారతాయని ఆయన పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పారిశ్రామిక, పర్యాటక, మౌళిక సదుపాయాలు గల జిల్లా గా అభివృద్ధి చెందాలని అన్నారు. వెనుకబడిన జిల్లాగా ఉండరాదని ఆయన స్పష్టం చేసారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. మూడవ దశ వ్యాప్తిలో ఉందని గుర్తించాలని, అందరూ మాస్క్ లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు.  ఆర్ అండ్ బి ఎస్.ఇ కె.కాంతిమతి మాట్లాడుతూ  పూండి - పర్లాఖిమిడి రహదారి రాష్ట్ర హైవే గా ఉందన్నారు. ఆఫ్ షోర్ లో రెండు కిలోమీటర్ల మేర ఉండటంతో జలవనరుల శాఖ సమన్వయంతో చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీ ఛైర్మన్ బల్లా గిరిబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సతీష్, దువ్వాడ రాంబాబు, సర్పంచులు, అధికారులు, అనాధికారులు పాల్గొన్నారు.

Paralakhemundi

2021-07-20 16:57:25

నెల రోజుల్లో పనులు పూర్తి కావాల్సిందే..

ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న గ్రామ సచివాలయాలు, ఆర్బికేలు, వెల్ నెస్ సెంటర్ల నిర్మాణం రానున్న నెల రోజుల్లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాల్సిందేనని డిప్యూటీ సీఎం ధర్మాన  కృష్ణదాస్ అధికారులను ఆదేశించారు. గడువు తర్వాత ఏ ఒక్క కేంద్రం కూడా అసంపూర్తిగా కనిపించరాదని స్పష్టం చేశారు. సారవకోట ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం జిల్లా అధికారులతో కలిసి మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారనడానికి వారి పనితీరే కొలమానమని పేర్కొన్నారు. ఇండ్ల పట్టాల పంపిణీకి సంబంధించి అడ్డంకులు తొలగించాలని,  ప్రభుత్వ భూమిలో ఉన్న ఆక్రమణలు తొలగించి ఆయా ప్రభుత్వ భవన నిర్మాణాలకు ఆ భూములను కేటాయించాలనీ ఆదేశాలు ఇచ్చారు. చాలా చోట్ల ఏజెన్సీలనే ఏర్పాటు చేయలేదని తన దృష్టికి వచ్చిందని,  వెంటనే వాటిని ఏర్పాటు చేసి అన్ని పనులూ మొదలు పెట్టాలన్నారు. పనులన్నీ అత్యంత నాణ్యతా ప్రమాణాలతో నిర్వహించాలని సూచించారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేయనున్నారని ఆ సమయానికి నూరు శాతం సన్నద్ధతతో అన్ని నిర్మాణాలను పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. తాను త్వరలోనే క్షేత్రస్థాయిలో ఈ నిర్మాణాలను పరిశీలిస్తానని, మార్పు లేని చోట సంబంధిత అధికారులపై చర్యలకు సిఫార్సు చేస్తానని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఆర్. శ్రీరాముల నాయుడు వివిధ శాఖల ప్రగతిపై అధికారులతో కలిసి వివరించారు. ఎన్ఆర్జిఎస్ పనులు, సాగునీటి అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో  డిఆర్డీఏ పీడీ బి.శాంతి శ్రీ, పాలకొండ ఆర్డీవో కుమార్, వంశధార ఎస్ ఈ డోల తిరుమల రావు, నీటిపారుదల శాఖ ఎస్ఈ పి.సుధాకర్, పీఆర్ ఎస్ఈ బ్రహ్మయ్య, మండల ప్రత్యేక అధికారి జై రాజు, డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ చిన్నాల కూర్మి నాయుడు, తాసిల్డార్ రాజమోహన్ రావు, ఎంపీడీవో ఈశ్వరరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-20 16:47:58

అప్పన్నకు ఎమ్మెల్యే అదీప్ పూజలు..

సింహాలంలోని శ్రీశ్రీశ్రీ వారాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు సతీసమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఈమేరకు ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపుతులకు ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అదీప్ రాజ్ సతీమణి పెందుర్తి సర్పంచ్ గా గెలిచిన తరువాత మొదటి సారిగా స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఆలయ సిబ్బంది ప్రసాదాలు అందించగా, వేద పండితులు ఆశీర్వచనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు బోర్డు సభ్యులు సూరిశెట్టి సూరిబాబు, సిరిపురపు క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Simhachalam

2021-07-19 15:46:10

నగర పరిశుభ్రతకి సహకరించండి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం చాలా అవసరమని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అన్నారు. సోమవారం ఆమె 6 వ జోన్ 75వ వార్డు గాజువాక పరిధిలోని నీలపు వీధి, ధర్మాన వీధి మెయిన్ రోడ్డు పరిసర ప్రాంతాలలో పర్యటించారు. మరుగుదొడ్లు శుభ్రంగా లేవని, వీధులు సరిగా ఊడ్చడం లేదని, వీధుల్లో డస్ట్ బిన్లు కనిపిస్తున్నాయని, వాటిని ఇంకా తొలగించలేదని, కాలువలలో చెత్త సరిగా తీయటంలేదని ఆగ్రహం వ్యక్తపరిచారు. ప్రతీ రోజు ఇంటింటికి వచ్చి తడి-పొడి చెత్త సేకరణ చేస్తున్నదీ లేనిదీ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. త్రాగు నీరు ప్రతీ రోజు వస్తున్నదీ లేనిదీ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ధర్మాన వీధి మెయిన్ రోడ్డులో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని అక్కడ ప్రజలు కోరగా కమిషనర్ పరిశీలిస్తామని వారికి తెలిపారు. నడుపూర్ వంతెన వద్ద సీతానగర్ లో బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తున్నారని, చెత్త వేసే వారిపై నిఘా ఉంచి వారిపై చర్యలు తీసుకోవాలని లో శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు.ఈ పర్యటనలో ఆరవ జోనల్ కమిషనర్ శ్రీధర్, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, కార్యనిర్వాహక ఇంజినీరు ప్రసాద్ బాబు, పి. శ్రీనివాస రావు, సహాయక ఇంజినీరు రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ వార్డు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-07-19 15:33:13

రహదారుల పనులను పరిశీలించిన మంత్రి..

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో కెటి రహదారి విస్తరణ పనులను రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సోమ వారం పరిశీలించారు. కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి నుండి పలాస ఇందిరా చౌక్ వరకు రోడ్డు పనులు పరిశీలించారు. మంత్రి స్వయంగా కాలి నడకన నడుచుకుంటూ దుకాణదారులతో మాట్లాడుతూ పనులను పరిశీలించడం గమనార్హం. రహదారి విస్తరణ పనులకు సహకరిస్తున్న వ్యాపారస్తులకు, ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేసారు. కెటి రహదారికి ఇరువైపులా నిబంధనలను అనుసరిస్తూ పనులు జరుగుతున్నట్లు గమనించారు. 80 అడుగుల విస్తీర్ణంతో కెటి రహదారి ఆధునీకరణ చేయడం జరుగుతుందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఇరుకు రహదారులపై ప్రయాణిస్తున్నారని, అనేక ఇబ్బందులకు గురికావడం జరుగుతుందని పేర్కొన్నారు. పలాస నియోజకవర్గంలో పలాస - కాశీబుగ్గ పట్టణాలు మూడు మండలాల ప్రజలకు ఎంతో అవసరమైన పట్టణం అని తెలిపారు. పలాస కాశీబుగ్గ   మున్సిపాలిటీలో  రహదారులు అభివృద్ధి చెందితే పట్టణాన్ని సుందరంగా మార్చుకునే అవకాశం ఉందని అన్నారు. మన పట్టణం అని అభివృద్ధి చెందే దిశగా విస్తరణ పనుల ప్రారంభం నుండి ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా ముందుకు రావడం సంతోషంగా ఉందని చెప్పారు.

 అభివృద్ధికి అందరూ భాగస్వామ్యం కావడం శుభపరిణామం అన్నారు. పలాస నియోజకవర్గంలో మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలతో పాటు పలాస కాశీబుగ్గను సమూలంగా అభివృద్ధి చేసుకుని సుందర పట్టణంగా మార్చుతానని ప్రజలకు హామి ఇచ్చారు. ప్రజల నిత్యవసరాలకు నిత్యం పలాస - కాశీబుగ్గ పట్టణానికి రాకపోకలు సాగిస్తారని రహదారులు విస్తరించడం వలన ట్రాఫిక్ సమస్యల నుండి బయట పడతామని అన్నారు. రహదారికి ఇరువైపుల డ్రైనేజి, పుట్ పాత్ నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు. డ్రైనేజి, పుట్ పాత్ పనుల నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ప్రజలు ఎంతగా సహకరిస్తే అంత వేగంగా అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు, వ్యాపారుల మద్దతు పూర్తిస్తాయిగా ఉందని స్వచ్చందంగా విస్తరణ పనులలో కట్టడాలను తొలిగించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బల్లా గిరిబాబు, మునిసిపల్, రెవెన్యూ, ఆర్ అండ్ బి, ఎలక్ట్రికల్ సిబ్బంది స్ధానిక కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Palasa

2021-07-19 15:30:24