1 ENS Live Breaking News

డయల్ యువర్ మేయర్ కు 36ఫోన్ కాల్స్..

డయల్ యువర్ మేయర్ కార్యక్రమంనకు  36 ఫోన్స్ కాల్స్ వచ్చాయని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. సోమవారం ఆమె జివిఎంసి సమావేశ మందిరం నుండి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009 ద్వారా డయల్ యువర్ మేయర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులను  స్వీకరించి, వచ్చిన విజ్ఞప్తులను స్వయంగా పరిష్కరించి తగు నివేదిక వెంటనే సమర్పించు నిమిత్తం ఆయా విభాగాల అధికారులకు/జోనల్ కమిషనర్లు కు పంపించారు. ఇందులో రెండవ జోనుకు 06, మూడవ జోనుకు 01, నాలుగవ జోనుకు 02, 5వ జోనుకు 03, ఆరవ జోనుకు 13, ఎనిమిదవ జోనుకు 07, సిఎంఒహెచ్.నకు 01, యుసిడి(పి.డి.)నకు 02, ఎస్.ఇ.(వాటర్ సప్లై)నకు 01, మొత్తము 36  ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన మేయర్ మరియు కమీషనర్ ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ మేయర్ కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులు 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఎ.వి.రమణి, డా. వి. సన్యాసి రావు, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ కనకదుర్గా దేవి, జె.డి.(అమృత్) విజయ భారతి, డి.సి.(ఆర్) నల్లనయ్య, ఎ.డి.హెచ్. ఎం. దామోదర రావు, యు.సి.డి.(పి.డి.) వై. శ్రీనివాస రావు, డి.సి.పి. రాంబాబు,  ఎఫ్.ఎ & ఏ.ఒ. మల్లికాంబ, డి.పి.ఓ. చంద్రిక,  పర్యవేక్షక ఇంజినీర్లు వేణు గోపాల్, శివ ప్రసాద రాజు తదితర అధికారులు పాల్గొన్నారు.   

GVMC office

2021-07-12 16:56:52

సమయపాలన పాటించాలి ..

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని చెత్త తరలించే వాహనాలు సమయపాలన పాటించాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు శానిటేషన్ అధికారులను ఆదేశించారు. సోమవారం 3వ జోన్ 23వ వార్డు పరిధిలోని మద్దిలపాలెం పరిసర ప్రాంతాలలో జోనల్ కమిషనర్ కె. శివ ప్రసాద్ తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్త తరలించే వాహనాలు నిర్దేశించిన సమయానికి వచ్చి చెత్తను తరలించాలని, డంపర్ బిన్ల చుట్టూ చెత్త వేయకుండా స్థానికలకు అవగాహన కల్పించాలని, డోర్ టు డోర్ చెత్త ప్రతీ రోజూ సేకరించాలని, తడి-పొడి మరియు ప్రమాదకరమైన చెత్తగా ప్రజలే విభజించి ఇచ్చేలా వారికి అవగాహన కల్పించాలని, కాలువలు, రోడ్డ్లను శుభ్రపరచాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా చూడాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. అనంతరం సీజనల్ వ్యాదులైన మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా తీసుకొనే చర్యలపై మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వర్షాకాలంలో పూల కుండీలు, ఇంటిలో వాడే నీటి కుండీలు, కొబ్బరి బొండాలు, ఫ్రిడ్జ్ వెనుక భాగంలో నీటినిల్వలు ఉండకుండా చూడాలని, ఇంటిలో  వాడే నీటిపై మూతలు అమర్చాలని, వారంలో ఒక్క రోజు “డ్రై” డే పాటించాలని, ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. ఈ పర్యటనలో మూడవ జోనల్ కమిషనర్ కె. శివ ప్రసాద్, ఎఎంఒహెచ్ రమణ మూర్తి, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-07-12 16:55:40

ఉపాదిహామీ లక్ష్యాలు సాధించాలి..

ఉపాధి హామీ పథకం క్రింద చేపడుతున్న వివిధ పనులను పూర్తి చేసి లక్ష్యాలు సాధించాల్సిందేనని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ స్పష్టం చేశారు. టెక్కలి డివిజన్ లో ఉపాధి హామీ పథకం క్రింద చేపడుతున్న వివిధ పనులను గూర్చి కలెక్టరు కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. దేశంలోనే అత్యధిక వేజ్ కాంపొనేంట్ జనరెట్ చేసిన జిల్లా అన్నారు. మెటీరియల్ కాంపోనెంటు నిధులు వినియోగంలో వెనుకబడి ఉన్నామని గ్రహించాలని ఆయన చెప్పారు. పనులు సకాలంలో పూర్తి చేయడం పట్ల శ్రద్ద వహించాలని ఆయన ఆదేశించారు. రూ.60 కోట్లతో పనులు మంజూరు చేశామన్నారు. ఇంజనీర్లు వృత్తి నిపుణతతో పనిచేయాలన్నారు. ఉపాధి హామీ వెబ్ సైట్ లో చూపిస్తున్న ప్రగతిని పరిశీలించే స్థాయిలో ఇంజనీర్లు ఉండాలని అందుకు అనుగుణంగా పనుల వేగం పెంచాలని ఆయన ఆదేశించారు. సమస్యలు అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో ఉంటాయని వాటిని అధిగమించి లక్ష్యాలు సాధించాలని ఆయన స్పష్టం చేశారు. కంచిలి పంచాయతీ రాజ్ డిఇ ఆధ్వర్యంలో 238 పనులు మంజూరు కాగా 220 పనులు ప్రారంభం కాగా 20 శాతం పనులు పూర్తి అయ్యాయని అన్నారు. తక్కువ పనులు జరగడం పట్ల కలెక్టర్ ప్రశ్నించారు. ఎక్కువ పనులు ఒకే గుత్తేదారుకు అప్పగించడం వలన పనులు సకాలంలో పూర్తి అయ్యే అవకాశాలు ఉండవని ఆయన అన్నారు. పనులు జాప్యం చేస్తున్న గుత్తేదారులను మార్చాలని ఆయన సూచించారు. కంచిలి డిఇ, ఏఇ పరిధిలో ఉన్న పనులు తీవ్ర జాప్యం జరుగతోందని, ప్రగతి అతి తక్కువగా ఉందని ఆయన తెలిపారు. టెక్కలి డివిజన్ లో పనుల ప్రగతి తక్కువగా ఉందని ఆయన అన్నారు. వారం రోజుల్లో ప్రగతి కనిపించాలని ఆయన పేర్కొన్నారు. నందిగాం మండలంలో నాలుగు గ్రామాల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకపోవడాన్ని ప్రశ్నించారు. పూర్తి అయిన పనులకు వెంటనే బిల్లులు పెట్టాలని ఆయన ఆదేశించారు. సోంపేట మండలంలో 24 గ్రామ సచివాలయాన్ని 22 పనులు ప్రారంభం అయ్యాయని డిఇ తెలియజేయగా మిగిలిన పనులను ఎన్ని రోజులలో పూర్తి చేయగలరని ప్రశ్నించారు. ప్రస్తుత వేగంతో పనులు జరిగితే భవనాల నిర్మాణం నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. పనుల ప్రగతి పరిగెట్టాలని ఆయన సూచించారు. ఉపాధి హామీ మెటీరియల్ కాంపొనెంట్ నిధులు ఉపయోగించుకుని ఎక్కువ పనులు చేపట్టాలని ఆయన అన్నారు. ఒక్క పైసా కూడా వృథాకారాదని ఆయన ఆదేశించారు. ప్రస్తుతం మొక్కలు నాటేందుకు అనువైన సమయమని రహదారికి ఇరువైపులా మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టామన్నారు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆసరా జాయింట్ కలెక్టర్ ఆర్. శ్రీరాములు నాయుడు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ హెచ్. కూర్మా రావు, జిల్లా పరిషత్ సిఇఓ బి. లక్ష్మీపతి, పంచాయతీ రాజ్ ఎస్ఇ కె. బ్రహ్మయ్య, టెక్కలి పీఆర్ ఇఇ, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-07-12 16:54:38

అరసవిల్లి ఆలయ అభివృద్ధికి చర్యలు..

శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యల చేపడుతున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి,  పాలకమండలి కన్వీనర్ వి.హరిసూర్యప్రకాశ్ వెల్లడించారు.  శ్రీసూర్య నారాయణ స్వామి వారి దేవస్థానం పాలకమండలి సర్వసభ్య సమావేశం ఇ.ఓ అధ్యక్షతన సోమవారం ఆలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపధ్యంలో ఏప్రిల్ 23 నుండి జూన్ 19వరకు భక్తులకు దర్శనాలను నిలిపివేసి, జూన్ 20 నుంచి భక్తులకు దర్శనాలను అనుమతించామన్నారు. ఆలయ విశిష్టతను తెలియజేసేలా ద్వాదశ ఆదిత్యుని విగ్రహాలు నిర్మించామని, ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇంద్రపుష్కరిణిలోని నీటిని తొలగిస్తూ, పనులను వేగవంతం చేసామని చెప్పారు. ఇంద్రపుష్కరిణి వద్ద తలనీలాలు సమర్పించే భక్తులు స్నానాలు చేసేందుకు సకల సౌకర్యాలతో ఒక గదిని నిర్మిస్తున్నామని వివరించారు. మహిళలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు, అన్నదాన భవనంలో భక్తులకు మరిన్ని మౌళిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటాన్నామని పేర్కొన్నారు. బేడా మండపం పైకప్పు నుంచి వర్షం నీరు పడి భక్తులు తడవకుండా ఉండేందుకు శ్లాబ్ వేశామని చెప్పారు. ఈ పనులన్ని చేసేందుకు పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నామని వివరించారు.  ఈ పాలకమండలి సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు మరియు పాలకమండలి సభ్యులు ఇప్పిలి శంకరశర్మ, మండవిల్లి రవి, మండల మన్మధరావు, అంధవరపు రఘు, రాజేశ్వరీ, కింజరాపు ఉమారాణి, జెన్ని గౌతమి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఇటీవల కరోనాతో మృతిచెందిన ఆలయ ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్  లక్ష్మణరావుకు,  కేన్సర్ వ్యాధితో మృతిచెందిన కొండలరావులకు తొలుత సంతాపం వ్యక్తం చేస్తూ, రెండు నిమిషాలు మౌనాన్ని పాలకమండలి సభ్యులు పాటించారు.

Srikakulam

2021-07-12 16:53:28

ఎడి ర‌మేష్‌ను అభినందించిన క‌లెక్ట‌ర్‌..

విజ‌య‌న‌గరం జిల్లా స‌మాచార‌, పౌర సంబంధాల‌శాఖ‌ స‌హాయ సంచాల‌కులుగా పదోన్న‌తి పొందిన డిపిఆర్ఓ డి.ర‌మేష్‌ను. జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ అభినందించారు. ఆయ‌నను సోమ‌వారం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో దుశ్శాలువ‌తో స‌త్క‌రించి, పుష్ప‌గుచ్ఛం అంద‌జేశారు. జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్ కూడా, ర‌మేష్‌కు పుష్ప‌గుచ్ఛాన్ని అంద‌జేసి అభినంద‌న‌లు తెలిపారు. క‌లెక్ట‌ర్‌, జెసిల‌కు ర‌మేష్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  ప‌దోన్న‌తి పొందిన డిపిఆర్ఓ ర‌మేష్‌ను స‌మాచార‌, పౌర సంబంధాల‌శాఖ సిబ్బంది అభినందించారు. ఆయ‌న‌ను కార్యాయంలో దుశ్శాలువ‌తో స‌త్క‌రించి, పుష్ప గుచ్ఛాన్ని అంద‌జేశారు. వివిధ శాఖ‌ల అధికారులు, ప‌లు ప‌త్రిక‌లు, ఛాన‌ళ్ల ప్ర‌తినిధులు ర‌మేష్‌కు అభినంద‌న‌లు తెలిపారు. జిల్లా గ్రంథాల‌య సంస్థ మాజీ ఛైర్మ‌న్ రొంగ‌లి పోత‌న్న ప్ర‌త్యేకంగా స‌మాచార‌శాఖ కార్యాల‌యానికి వ‌చ్చి, ర‌మేష్‌ను అభినందించారు.

Vizianagaram

2021-07-12 16:48:49

స్పంద‌న‌కు 159 విన‌తులు..

విజ‌య‌న‌గ‌రంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం సోమ‌వారం నిర్వ‌హించిన స్పంద‌న కార్య‌క్ర‌మానికి మొత్తం 159 విన‌తులు అందాయి. వీటిలో కొన్ని విన‌తులు టెలీఫోన్ ద్వారా అంద‌గా, క‌లెక్ట‌రేట్ కు వ్య‌క్తిగ‌తంగా వ‌చ్చిన‌వారివ‌ద్ద‌నుంచి, జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ అర్జీల‌ను స్వీక‌రించారు. వారి విన‌తుల‌ను విని, వాటిని ప‌రిష్కారం నిమిత్తం ఆయా శాఖ‌ల‌కు పంపించారు. సమస్యల పరిష్కారంలో అధికారులు సత్వరమే చొరచూపాలన్నారు. సమస్యల పరిష్కరించే జిల్లాల్లో విజయనగం జిల్లా మొదటి స్థానంలో నిలవాలన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు కూడా పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-12 16:47:55

జిఎస్టీ, క్లిప్పింగ్స్ మినహాంపు ఇవ్వాలి..

రాష్ట్రంలోని జర్నలిస్టులకు 2021-22 అక్రిడేషన్ల జారీలో చిన్న,మధ్య తరహా పత్రికలకు,న్యూస్ ఏజెన్సీ లకు జి.ఎస్ టి,క్లిప్పింగ్స్ జత చెయ్యాలనే నిబంధనను మినహాయించాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఫర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా (ఏపీజేయూ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమవారం వర్చువల్ విధానంలో జరిగిన ఏపీజేయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి యూనియన్ అధ్యక్షులు జాలే వాసుదేవ నాయుడు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రతినెలా 10 వేల విలువైన ప్రకటనలు ఆయా జిల్లాల్లోని వివిధ కార్యాల ద్వారా జారీ అయ్యేలా అదేశాలిచ్చి అత్యంత కస్ట నష్టాలకోర్చి నడుపుతున్న నిర్వాహకులకు కనీస చేయూత ఇవ్వాలని సమావేశం తీర్మానించింది. ఇళ్ళు లేని జర్నలిస్టులకు కనీసం మూడు సెంట్లు స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సహాయం చెయ్యాలని కోరింది. కరోనా వలన ఏర్పడిన సంక్షోభంతో గత ఒకటిన్నర సంవత్సరాలుగా జీతాలు రాక,ప్రకటనలు లేక జర్నలిజం, దాన్ని నమ్ముకున్న పాత్రికేయులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని,వెంటనే ప్రభుత్వం ఆయా జిల్లాల సమాచార శాఖల ద్వారా అర్హులైన జర్నలిస్టులను గుర్తించి ఒక్కరికి రూ.25 వేలు ఆర్ధిక సహాయం అందించాలని కోరింది. అలాగే కరోనాతో మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షలు నష్టపరిహారం అందించాలని కూడా తీర్మానించింది. ఏపీజేయూ 35 వ వార్షికోత్సవాన్ని నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించేందుకు త్వరలో నెల్లూరులో కార్యవర్గ సమావేశం పెట్టాలని నిర్ణయించింది. ఈ వర్చువల్ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న అల్ ఇండియా న్యూస్పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్(ఏ ఐ ఎన్ ఈ ఎఫ్) జాతీయ ఉపాధ్యక్షులు సీహెచ్.పూర్ణచంద్ర రావు మాట్లాడుతూ, ఎందరికో ఎన్నోవిధాల సహాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి  కేవలం ఒక్క పధకం లో నాల్గోవ వంతు కూడా లేని పత్రికేయులకి ఈ చిన్న సహాయం పెద్ద లెక్కలోనిది కాదని, ప్రభుత్వం పెద్ద మనసుతో ఈ చిన్న సహాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి విజ్ఞప్తి చేసారు.కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవిధమైన పథకాలు వున్నా వాటిని జాతీయ యూనియన్ నాయకులతో కలిసి అమలయ్యేలా తన వంతు కృషిచేస్తానన్నారు. ఈ సమావేశంలో ఏపీజేయూ ప్రధానకార్యదర్శి తూము పార్థసారధి వరప్రసాద్ తో సహా పలువురు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Vijayawada

2021-07-12 16:44:35

అప్పన్నకు అరకేజి చందనం సమర్పణ..

శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన వెంకట రమేష్, లక్ష్మీ ప్రియాంక దంపతులు శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారికి అరకేజీ చందనం సమర్పించారు. ఈ మేరకు శనివారం ఆలయ ఏఈఓ రాఘవ కుమార్ కు రూ.10,116 చెల్లించారు. చందన స్వామికి చందనం సమర్పించడం తమ పూర్వజన్మసుకృతమని వెంకటరమేష్ తెలిపారు. ఆయనకుఒక చందనం చెక్కను దేవస్థానం అధికారులు ప్రసాదంగా  ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఈఓ మాట్లాడుతూ, స్వామివారికి చందనాన్ని ఎవరైనా, ఎప్పుడైనా సమర్పించవచ్చని,   డైరెక్టుగా ఆలయానికి వస్తే సమర్పిస్తే వెంటనే స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన చందనం చెక్కను  ప్రసాదంగా  ఇస్తామన్నారు.

Simhachalam

2021-07-10 15:00:30

హెల్త్ హబ్ కి స్థలాలు గుర్తించండి..

గుంటూరు జిల్లాలో అత్యాధునిక వైద్య సేవలు అందించే హెల్త్ హబ్స్, సూపర్ స్పెషాలిటీ  ఆసుపత్రుల నిర్మాణాలకు అనువైన ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలను గుర్తించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను కోరారు.  శనివారం మధ్యాహ్నం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఏ.పి.ఐ.ఏ.సి మేనేజింగ్ డైరెక్టర్ మరియు కమిషనర్ జే.వి.ఎన్. సుబ్రహ్మణ్యం, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ ( సచివాలయాలు, అభివృద్ది ) పి. ప్రశాంతి లతో కలసి  లా పరిశోధన కేంద్రం, మంగళగిరి వద్ద వున్న ఎయిమ్స్ పరిసర ప్రాంతాలలోని ప్రభుత్వ, ప్రైవేట్ భూములను పరిశీలించారు. మొదట తాడికొండ మండలం లాం పరిశోధన కేంద్రంలో వున్న ఐదు ఎకరాలు, తాడేపల్లి మండలం వడ్డేశ్వరం పరిధిలో వున్న 4.46 ఎకరాలను పరిశీలించడం జరిగింది. లాం పరిశోధన కేంద్రంలోని శాస్త్రవేత్తలు, డాక్టర్లతో అందుబాటులో వున్న స్థల లభ్యతపై మాట్లాడారు.  వడ్డేశ్వరం  గ్రామ శివారు ప్రాంతం ఎయిమ్స్ కు సమీపంలో వున్న భూములను పరిశీలించారు. ఈ ప్రాంతంలో లభ్యత వున్న స్థలాలను, అందుబాటులో  వున్న వనరులు, వసతులను గుర్తించి వివరాలు అందించాలని అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరుగుతుందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో గుంటూరు ఆర్ డి ఓ భాస్కర్ రెడ్డి, తాడికొండ తహశీల్దారు కుటుంబరావు, తాడేపల్లి తహశీల్దారు శ్రీనివాస రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సెక్రెటరీ లు పాల్గొన్నారు. 

Guntur

2021-07-10 14:37:59

1483కేసులకు లోక్అదాలత్ పరిష్కారం..

రాష్ట్ర న్యాయ‌సేవా సంస్థ ఆదేశాల మేర‌కు జిల్లా వ్యాప్తంగా వున్న కోర్టుల్లో శ‌నివారం నిర్వ‌హించిన జాతీయ లోక్ అదాల‌త్ విజ‌య‌వంతం అయ్యింద‌ని విజయనగరం జిల్లా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జి.గోపి తెలిపారు. ఈ లోక్ అదాల‌త్‌కు క‌క్షిదారుల నుంచి మంచి స్పంద‌న ల‌భించింద‌న్నారు. జిల్లాలోని జిల్లా కేంద్ర న్యాయ‌స్థానం స‌హా తొమ్మిది చోట్ల నిర్వ‌హించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా 1493 కేసులు రాజీ ద్వారా ప‌రిష్క‌రించిన‌ట్లు పేర్కొన్నారు. ఇరు ప‌క్షాల స‌మ్మ‌తితో ఈ కేసుల ప‌రిష్క‌రించ‌డం జ‌రిగింద‌న్నారు. కోవిడ్ నిబంధ‌న‌లు అనుస‌రించి వ‌ర్చ్యువ‌ల్ విధానంలో లోక్ అదాల‌త్ నిర్వ‌హించామ‌న్నారు. క‌క్షిదారులు, పోలీసు, ఎక్స‌యిజ్‌, రెవిన్యూ త‌దిత‌ర ప్ర‌భుత్వ శాఖ‌ల స‌హాయంతో ఈ లోక్ అదాల‌త్ విజ‌య‌వంతం అయ్యింద‌ని పేర్కొంటూ వారంద‌రికీ జిల్లా జ‌డ్జి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ లోక్ అదాల‌త్‌లో త‌న‌తో పాటు పార్వ‌తీపురంలోని రెండో అద‌న‌పు జిల్లా న్యాయ‌మూర్తి కె.రాజ‌గోపాల్‌, కుటుంబ న్యాయ‌స్థానం జిల్లా న్యాయ‌మూర్తి ఎం.మాధురి, సీనియ‌ర్ సివిల్ జ‌డ్జి వి.ల‌క్ష్మీరాజ్యం, సీనియ‌ర్ సివిల్ జ‌డ్జి జె.శ్రీ‌నివాస‌రావు, బొబ్బిలిలోని సీనియ‌ర్ సివిల్ జ‌డ్జి ఎం.మంగ‌కుమారి, అడిష‌న‌ల్ జ్యుడిషియ‌ల్ ఫ‌స్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బి.శిరీష జిల్లాలోని జ్యుడిషియ‌ల్ ఫ‌స్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ లు పాల్గొని లోక్ అదాలత్ ను విజ‌య‌వంతం చేశార‌ని పేర్కొన్నారు. జాతీయ  లోక్ అదాల‌త్‌లో విజ‌య‌న‌గ‌రంలో 500, పార్వ‌తీపురంలో 138, బొబ్బిలో 226, సాలూరులో 314, ఎస్‌.కోట‌లో 53, గ‌జ‌ప‌తిన‌గ‌రంలో 68, చీపురుప‌ల్లిలో 129, కొత్త‌వ‌ల‌స‌లో 22, కురుపాంలో 18 కేసులు ప‌రిష్క‌రించిన‌ట్లు వెల్ల‌డించారు.

Vizianagaram

2021-07-10 14:35:27

జోరుగా పింఛనుదార్ల ఈ-కేవైసీ..

విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు సంబంధించిన ఈ- కేవైసీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. జిల్లాలో మొత్తం 3,36,590 వైఎస్ఆర్ పింఛనుదార్లు ఉండగా శనివారం నాటికి 33 శాతం అనగా 1,11,766 మంది లబ్ధిదారులకు సంబంధించిన ఈ - కేవైసీలను పూర్తి చేసినట్లు కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ల పంపిణీలో అవకతవకలను అరికట్టేందుకు, నిజమైనా లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ ప్రక్రియ తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో  పారదర్శకతను తీసుకొచ్చేందుకే ఈ ప్రక్రియ చేపడుతున్నామని, త్వరలోనే అందరి లబ్ధిదారుల ఈ- కేవైసీలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Vizianagaram

2021-07-10 14:32:21

ఘనంగా నికోలా టెస్లా జయంతి..

విద్యుత్ పరికాల స్రుష్టికర్త నికోలా టెస్లాను ప్రతీ ఒక్క ఎలక్ట్రీషియన్ గుర్తు పెట్టుకోవాలని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్, గోదావరి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శిలు బొజ్జారామక్రిష్ణ, కరణం రాజులు పిలుపు నిచ్చారు. శనివారం సంఘం ఆధ్వర్యంలో నికోలా టెస్లా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంఘం సభ్యులు అన్ని విషయాల్లో కలిసికట్టుగా ముందుకి సాగాలన్నారు. అదేవిధంగా ఎవరిక ఏ కష్టమొచ్చినా ముందు సంఘ సభ్యులు స్పందించి వారిని ఆదుకోవాలని అన్నారు. సమిష్టిగా ఉద్యమిస్తే ఎలాంటి సమస్యనైనా నెరవేర్చుకోవడానికి ఆస్కారం వుంటుందని చెప్పారు. కరోనా సమయంలో చాలా మంది ఎలక్ట్రికల్ వర్కర్లు, కాంట్రాక్టర్లు పనులు లేకుండా పోయాయని..అలాంటి ఇబ్బందులు రానున్న రోజుల్లో రాకుండా ఉండేందుకు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అదే సమయంలో సభ్యు సంక్షేమం కోసం కూడా ద్రుష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా సభ్యులకు నూతన ఐడికార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కరణం రాజు, సెక్రటరీ ఆశపు శ్రీనివాస్, ట్రెజరర్ సర్వ కోట లక్ష్మణరావు, గౌరవ అధ్యక్షులు, సలహాదారులు క్షత్రి మోతీ సింగ్, యడ్ల సూర్యచంద్రరావు, కొల్లి వెంకట రావు, కాకి రవి బాబు, రాయవరపు జగదీష్, అసోసియేషన్ కార్యదర్శి, ట్రేడ్ యూనియన్ జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు, అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బోరా వెంకట గోపాలకృష్ణారెడ్డి, కమిటీ మెంబర్లు స్వామి అయ్యప్ప, చల్లా వర ప్రసాద్, పండురి శివ శంకర్ వర ప్రసాద్, ఆముదాలపల్లి కామేశ్వరరావు, గొల్ల రవి, ఊర్ల శ్రీరాములు, యడ్ల శేఖర్ రబ్బానీ, గుబ్బల జ్యోతి కుమార్, విరవల్లి ఆచారి సుదర్శన్ ,తదితరులు పాల్గొన్నారు.

Rajahmundry

2021-07-10 14:03:38

పార్లమెంటు ద్రుష్టికి పోర్టుఉద్యోగుల సమస్య..

విశాఖ పోర్ట్ ట్రస్ట్ క్యాజువల్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, పోర్ట్  ట్రస్ట్ మాజీ సలహాదారు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో  క్యాజువల్ కార్మికులు కలిసి విన్నవించారు. శనివారం ఈ మేరకు ఎంపీని ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకుని  పెండింగ్ సమస్యలను వివరించారు. సుమారు 300 మంది కార్మికులు ( కారుణ్య నియామకాలు కింద) విధుల్లోచేరగా తమను 2008 లో డిఎల్ బి నుంచి పోర్ట్ లో విలీనం చేసినప్పటికీ నేటికీ సరైన ఉపాధి లేకుండా తీవ్ర అన్యాయం జరిగిందని కార్మికులంతా ఎంపీ ద్రుష్టికి తీసుకెళ్లారు.  తమ తల్లిదండ్రుల నుంచి  కారుణ్య నియామకాలు కింద తమకు ఈ ఉద్యోగాలు సంక్రమించినా..నేటికీ సరైన ఉపాధి లేకపోవడంతో తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తమ ఆవేదనను ఎంపీకి తెలియజేశారు. దీనితో ఎంపి ఎంవీవీ స్పందిస్తూ.. ఈ సమస్యను ఇప్పటికే అప్పటి కేంద్ర మంత్రి మాం వీయ దృష్టికి పలుమార్లు తీసుకు వెళ్లామని, నేటికీ పరిష్కారం కాకపోవడంతో త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని కార్మికులుకు హామీ ఇచ్చారు. విలీనం ఒప్పందం ప్రకారం కార్మికులు కు విధిగా ఉపాధి చూపాలని  నిభందనలు ఉన్నప్పటికీ పోర్ట్ యాజమాన్యం సరిగా పట్టించుకోక పోవడం దారుణం అన్నారు.  అనంతరం కాజువల్ కార్మికులకు తక్షణమే ఉపాధి చూపించాలని ఎంపీ సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఎంపీ ని కలిసిన వారిలో పోర్ట్ కాజువల్ కార్మికులు అసోసియేషన్ ప్రతినిధులు కే. శ్రీనివాస వర్మ, ముక్కగోపి, కే.కృష్ణారావు, వై..త్రినాధ్ , ఏ.సతీష్ , కె.అప్పారావు, ఎస్ నూకరాజు, పి..నూకరాజు తదితరులు ఉన్నారు.

విశాఖ సిటీ

2021-07-10 13:41:22

రాజీమార్గమే సిసలైన రాజమార్గం..

ఇరువర్గాల రాజీమార్గం ద్వారా ఇంత వరకు పరిష్కరించబడని కేసులను సత్వరమే పరిష్కరించుకోవడానికే జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ స్పష్టం చేశారు. శనివారం జిల్లా కోర్టుల సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జిల్లా ప్రధాన న్యాయమూర్తి,  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆద్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ తో కలిసి లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రోజువారీ కూలిపనులు చేసుకునే సామాన్య ప్రజలకు చెందిన భూ తగాదాలు, ఇతర తగాదాల పరిష్కారానికి కోర్టులను ఆశ్రయించవలసి వస్తుందని, అటువంటి   సందర్భంలో తమ దినసరి కూలీ పనులు మానుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం న్యాయవాదులకు, కోర్టు ఫీజులు మరియు రవాణా కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయినప్పటికీ తగిన న్యాయం జరుగు తుందనే నమ్మకం ఉండదని, దిగువ కోర్టులో న్యాయం జరగకపోతే పైకోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుందన్నారు. అటువంటి కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కని వేదిక అని కొనియాడారు. అదాలత్ నందు ఇరువర్గాల ఆమోదంతో కేసులు పరిష్కరించబడుతున్నందున ఇతర కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండబోదని, అదే రోజు కేసు పరిష్కరించబడుతుందని తెలిపారు. అంతేకాకుండా కోర్టు ఫీజులు వాపసు ఇవ్వబడు తుందని, ఫీజులు చెల్లించుకోలేని వారికి న్యాయవాదులను ఏర్పాటుచేయడం జరుగుతుందని ప్రధాన న్యాయమూర్తి వివరించారు. 

న్యాయ,పోలీసు,రెవిన్యూ వ్యవస్థలు ప్రజలు కోసమే ఉన్నాయన్న సంగతిని ప్రజలు గుర్తించాలన్నారు. కోవిడ్ నేపథ్యంలో కోర్టులను ఆశ్రయించలేనివారి కోసం వర్చువల్ విధానంలో కేసులను పరిష్కరించడం జరుగు తుందని అన్నారు. కావున కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ కేసులను పరిష్కరించు కోవాలని ఆయన ఆకాంక్షించారు.జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ మాట్లాడుతూ కోర్టులలో చాలావరకు పలు కేసులు పెండింగులో ఉండిపోయాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు వారు జాతీయ,రాష్ట్ర,జిల్లా స్థాయిలో న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటుచేసిందని చెప్పారు. దీనిద్వారా ప్రీలిగేంట్ కేసులు, పోలీస్ స్టేషనులో నమోదుకాని కేసులు, ఇంకా మోటార్ వాహనాల కేసులు వంటివి ఇరువర్గాల రాజీతో అక్కడికక్కడే పరిష్కరించు కోవచ్చని కలెక్టర్ సూచించారు. కక్షిదారులు ఏ ఇతర ఖర్చులు కూడా చేయనవసరం లేదని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు కల్పించిన ఈ సదవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని, పెండింగ్ లో ఉన్న తమ కేసులను సత్వరమే పరిష్కరించుకోవాలని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో సెకెండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి టి.వెంకటేశ్వర్లు, థర్డ్  అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి పి.అన్నపూర్ణ, పెర్మనంట్ లోక్ అదాలత్ చైర్మన్ గాయాత్రిదేవి, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి కె.నాగమణి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మి, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్. జయలక్ష్మి, స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ జడ్జి జె.కిషోర్ కుమార్, జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ జడ్జి జి.లెనిన్ బాబు, ఫస్ట్ అడిషనల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కె.రాణి, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి.సోమశేఖర్,జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.రమేష్ ,కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-10 13:09:50

పచ్చదనంతో హరితవనం మెరుగుపడాలి..

శ్రీకాకుళం జిల్లా మొత్తం పచ్చదనం పెంపొందించి హరిత వనం మెరుగుపరచాలని రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. జగనన్న హరిత వన హారం కార్యక్రమంలో భాగంగా ఆమదాలవలస మండలం కొత్తవలస గ్రామం నుండి కలివరం గ్రామం వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని శాసన సభ స్పీకర్ శని వారం ప్రారంభించారు. శాసన సభ స్పీకర్ సతీమణి మరియు తొగరాం గ్రామ సర్పంచ్ వాణి సీతారాం కూడా కార్యక్రమంలో పాల్గొని వెయ్యి మొక్కలను రోడ్డుకు ఇరువైపులా నాటారు. హరిత వన హరం కార్యక్రమాన్ని ఆమదాలవలస మండలంలో పెద్ద ఎత్తున చేపట్టి మండలంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కలివరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ ప్రకృతిని నాశనం చేస్తున్నామన్నారు. ఈ విధంగా నాశనం చేయడం వలన భావితరాలకు మనుగడ లేకుండ పోతుందని ఆయన పేర్కొన్నారు. మంచి వాతావరణం ఉండుటకు పచ్చని చెట్లు ఎంతో దోహదం చేస్తాయని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఆయన పిలుపునిచ్చారు. వాతావరణ సమతౌల్యం దెబ్బతింటుందని పర్యావసానంగా అనేక అనర్ధాలు కలుగుతున్నాయని గ్రహించాలని పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని, భూగర్భజలాలు ఎండిపోయే పరిస్ధితులు వస్తున్నాయని, వాతావరణంలో కాలుష్య ప్రభావం పెరుగుతోందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక చెట్టు నాటాలని పిలుపునిచ్చారు. రహదారులకు ఇరువైపులా అశోక చక్రవర్తి మొక్కలు నాటారని చదివామని వాటి ప్రయోజనాలు ఏ విధంగా ఉంటుందో రహదారిపై నడుస్తుంటే తెలుస్తుందని ఆయన వివరించారు. భావితరాలకు మంచి వారసత్వ సంపదను అందించాల్సిన బాధ్యత ప్రస్తుత తరం మీద ఉందని ఆయన స్పష్టం చేసారు. మంచి గాలి, నీరు, వాతావరణం భావితరాలకు అందిస్తే సకల సంపదలు అందించినట్లేనని ఆయన అన్నారు. కాలుష్యకారకాలు పెరిగిపోతూ అనేక వ్యాధులు దాపురిస్తున్నాయని స్పీకర్ చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో పచ్చదనం ఆవశ్యకతను ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గుర్తించారని, హరిత వన హారం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టాలని ఆదేశించారని అన్నారు. మొక్కలు నాటుటకు ఇది మంచి తరుణం అన్నారు. గ్రామాల్లో ప్రతి వ్యక్తికి చెట్లతో ఎంతో అనుబంధం ఉంటుందని అందరూ ముందుకు వచ్చి గ్రామాలను హరిత వనాలుగా మార్పు చేయాలని సూచించారు.

          ఈ కార్యక్రమంలో జిల్లా నీటియాజమాన్య సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ హెచ్.కూర్మారావు, అటవీ రేంజ్ అధికారి సింధు, డిప్యూటి రేంజ్ అధికారి జగదీష్, సర్పంచులు మెట్ట నాగజ్యోతి, సురేష్, స్ధానిక నాయకులు తమ్మినేని శ్రీరామమూర్తి, బెండి గోవింద రావు, బెడ్డేపల్లి నారాయణ రావు, గురుగుబెల్లి శ్రీనివాసరావు, తిర్లంగి రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-10 13:08:18