1 ENS Live Breaking News

థర్డ్ వేవ్ ఎదుర్కోడానికి సమాయత్తం ..

మొదటి, రెండవ దశలలో చూసిన కోవిడ్  అనుభవాలతో మూడవ దశ ను సమర్ధవంతంగా ఎదుర్కోడానికి జిల్లా  యంత్రాంగాన్ని సమాయత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు.  దానికి తగ్గట్టుగా అంచనాలు వేస్తూ కార్యాచరణ ప్రణాళికలను తయారు చేశామన్నారు.  మంగళవారం కలక్టరేట్  వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో  థర్డ్ వేవ్ కోవిడ్  కార్యాచరణ  పై  జిల్లా ఎస్.పి దీపికా పాటిల్ తో కలసి పాత్రికేయుల సమావేశం లో  కలెక్టర్ మాట్లాడారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కోడానికి అవసరమైన  వైద్యులు, నర్స్ లు, పారా  మెడికల్ సిబ్బందిని నియమించడం జరిగిందని,  అదే విధంగా వైద్య పరికరాలను, బెడ్స్ , వెంటిలేటర్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను కూడా సిద్ధం చేయడం జరిగిందన్నారు.   ఇప్పటికే థర్డ్ వేవ్  వస్తే ఎలా పని చేయాలనే అంశాల పై జిల్లా టాస్క్ ఫోర్సు కమిటీ సభ్య్యులకు తగు మార్గ దర్శకాలను నిర్దేశించడం జరిగిందన్నారు.  కోవిడ్  నిబంధనలు ప్రతి ఒక్కరు  పాటించేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు.  ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలని, కనీసం 2 మీటర్ల భౌతిక దూరాన్ని పాటించాలని, చేతులను సబ్బుతో తరచుగా కడుక్కోవాలని, లేదా సనిటైజర్  వాడాలని  పాత్రికేయులు ఈ విషయాల ను ప్రజలకు అర్ధమయ్యేలా  ప్రచురించాలని అన్నారు. 
మొదటి దశ కోవిడ్ లో 5.68 శాతం  పోజిటివిటి   నమోదు కాగా రెండవ దశ లో 10 శాతం నమోదైందని,  అదే విధంగా మరణాలు మొదటి సారి  0.50 శాతం నమోదు ఆయితే   రెండవ సారి  1.09 శాతంగా నమోదయ్యాయని అన్నారు.  మూడవ దశ లో సున్నా మరణాలే లక్ష్యంగా  చేసుకొని కార్యాచరణ తయారు చేశామన్నారు.  వాక్సినేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసామని, రాబోయే రోజుల్లో విద్యార్ధులకు కూడా వాక్సినేషన్  అవకాశం వస్తే వెంటనే  ప్రారంభిస్తామని  అన్నారు.   కోవిడ్ నిబంధనలు పాటిస్తూ  ప్రభుత్వ  ఆలోచనకు ప్రజల సహకారం తోడైతే థర్డ్ వేవ్ ను సమర్ధంగా ఎదుర్కోగలమని ఆశా  భావం వ్యక్తం చేసారు. 

కోవిడ్  నిబంధనలను పటిష్టంగా  అమలు జరిగేలా చూస్తామని జిల్లా ఎస్.పి దీపికా పాటిల్ తెలిపారు.   మొదటి, రెండవ దశలలో నిబంధనలను ఉల్లంఘించిన వారి పై కేసు లు పెట్టడం జరిగిందని , మూడవ దశ లో ఎలాంటి ఉపేక్ష లేకుండా మరింత కట్టు దిట్టంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.   మాస్క్ ధరించని వారిపైన, భౌతిక దూరాన్ని పాటించని వారిపై కఠినంగా  ఉంటామని హెచ్చరించారు.  మూడవ దశ లో  నిబంధనలను ఉల్లంఘించిన వారి పై అపరాధాన్ని ఎక్కువగా విధించడం జరుగుతుందని, కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-13 10:55:33

మహిళా లోకానికి స్ఫూర్తి ప్రధాత శిరీష..

రాకెట్ ద్వారా అంతరిక్ష యాత్ర విజయవంతం గా పూర్తిచేసిన తెలుగు తేజం బండ్ల శిరీష మహిళా లోకానికి స్ఫూర్తి ప్రధాత గా నిలిచి,ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవాన్ని, ఔన్నిత్యాన్ని చాటిచెప్పారని శ్రీకాకుళం జిల్లా సమాచార పౌరసంబంధాలు శాఖ సహాయ సంచాలకులు లోచర్ల రమేష్ అన్నారు  .మంగళవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆశా దీపికా ఫౌండేషన్ మరియు స్టార్ వాకర్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన బండ్ల శిరీష అభినందన ర్యాలీ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆడది అబల కాదు సబల అని నిరూపించి..పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో మహిళలు దూసికిపోతారు అని చెప్పటానికి శిరీష రోదసీ యాత్ర విజయవంతం గా నిర్వహణ ఒక ఉదాహరణ అని అన్నారు.రోదసీ లోకి వెళ్లి తిరిగి వొచ్చిన రెండో మహిళ బండ్ల శిరీష అని రమేష్ అన్నారు.మహిళా రంగానికి స్పూర్తి దాయకం గా నిలుస్తారని పలువురు వక్తలు కొనియాడారు. భూమి నుండి 85 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన శిరీష  చిన్ననాటి నుండి ఆకాశ యాత్ర చేయాలనే తపనతో శిక్షణ పొందారని వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ కూన వెంకట రమణ మూర్తి అన్నారు.రోదసీ లో పయనించి తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలల వ్యాప్తి చేసిన బండ్ల శిరీష ఈనాటి మహిళా లోకానికి మార్గదర్శకమగా నిలుస్తారని అన్నారు.వాకర్స్ ఇంటర్నేషనల్ కో..ఆర్డినేటర్ శాసపు జోగినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ అభినందన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు తెలుగు అమ్మాయి సాధించిన ఈ ఘనత తెలుగురాష్ట్రాల కు ఒక ప్రత్యేక  గుర్తింపు తెచ్చిందని అన్నారు.ఆశా దీపికా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్లి ఆశాదీపిక మాట్లాడుతూ అంతరిక్షంలో తెలుగుజాతి ఖ్యాతిని ఇనుమడింప చేసిన బండ్ల శిరీష ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతీ మహిళ పయనించాలని తద్వారా  భవిష్యత్ తరాలకు గుర్తుండిపోతామని అన్నారు.ఆశా దీపికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కో కొంఖ్యాన వేణుగోపాల్ వివరించారు.. ఆకాశం నుండి ఆవనిని స్వయంగా తిలకించిన శిరీష ను ప్రపంచం అంతా గర్వించే స్థాయిలో ఉన్నారని అన్నారు.

          ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ జి.ఇందిరా ప్రసాద్,2022 గవర్నర్ పి.జి.గుప్తా,వాకర్స్ సంస్థలు ప్రతినిధులు గొర్లె వాసుదేవరావు, లాడి వాసుదేవరావు, డాక్టర్ కె. పాండురంగారావు, అందవరపు రవి, ఎం.మల్లిబాబు,డాడీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జి.సూర్యనారాయణ, ప్రముఖ సంఘసేవకులు డాక్టర్ గంజి ఎజ్రా, రోటరీ కైలాస భూమి నిర్వాహకులు బి.శ్రీనివాసరావు, ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ వ్యవస్థాపకులు బసవా వెంకటరమణ, కిల్లారి రవి,బెండి తారకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  జై..జై..శిరీష అంటూ కీర్తించారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణ అంతా క్రీడాకారులు,వాకర్స్ సంస్థలు,స్వంచ్చంద సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-13 10:53:31

గ్రంధాలయ బడ్జెట్ సమావేశం..

శ్రీకాకుళంజిల్లా గ్రంధాలయ బడ్జెట్ సర్వ సభ్య సమావేశం ఈ నెల 16న నిర్వహించనున్నట్లు  ఆ జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కె.కుమార్ రాజా  వెల్లడించారు. ఈ  మేరకు   సంయుక్త కలెక్టర్ ( గ్రామ, వార్డు సచివాలయాలు మరియు సంక్షేమం ) ఆదేశాలు జారీచేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 16వ తేది ఉదయం 10.30గం.లకు సంయుక్త కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంధాలయ సంస్థ సర్వసభ్య బడ్జెట్ సమావేశం జరగనుందని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. 

Srikakulam

2021-07-13 10:20:31

లాభదాయక సాగు దిశగా సాగాలి..

శ్రీకాకుళం జిల్లాలో రైతులు లాభదాయక సాగు విధానాల దిశగా సాగాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పిలుపునిచ్చారు. రైతు చైతన్య యాత్రలో భాగంగా మంగళ వారం వీరఘట్టాం మండలం రేగులపాడు తదితర గ్రామాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ మాట్లాడుతూ రైతులు లాభదాయక వ్యవసాయాన్ని చేయాల్సిన అవసరం ఉందన్నారు. సాంప్రదాయక విధానాలలో వెళ్ళడం వలన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుందని ఆయన సూచించారు. అధిక దిగుబడులు సాధించాలని అదే సమయంలో వ్యయం తక్కువగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులు ఎక్కువ దిగుబడి తక్కువగా ఉండటం వలన రైతులు ఇబ్బందులు పడే పరిస్ధితి ఉంటుందని చెప్పారు. ప్రతి రైతు ఆనందంగా ఉండాలని, రైతు కుటుంబం సంతోషంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు లేనిదే మనుషులకు మనుగడ లేదని ఆయన పేర్కొన్నారు. రైతులు యాంత్రీకరణ దిశగా అడుగులు వేయాలని పిలుపునిస్తూ ప్రభుత్వం వై.యస్.ఆర్ యంత్ర సేవ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుకు అందుబాటులో యంత్రాలను తీసుకువచ్చిందని వివరించారు. 

మన ప్రాంతానికి అనువైన వంగడాలను గుర్తించి వేసుకోవాలని, అంతర పంటల వినియోగంపై అవగాహన పొందాలని ఆయన కోరారు. బొప్పాయి వంటి ఉద్యానవన పంటలు లాభాలను ఆర్జించి పెట్టగలవని సూచించారు. పంటలను కేవలం పండింటే ఉద్దేశంతో కాకుండా వాటి లాభదాయకత, మార్కెటింగుపైన అవగాహన పొందాలని అన్నారు. చేపల పెంపకం ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉందని వ్యవసాయంతోపాటు ఇతర అంశాలను కూడా గమనించాలని చెప్పారు. పాడిపరిశ్రమను అభివృద్ధి చేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేసిన అముల్ ప్రాజెక్టుకు పాల విక్రయం ద్వారా మంచ ధల లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు పాల ఉత్పాదనపై ప్రత్యేక దృష్టి సారించి అధిక ఆదాయాన్ని పొందుతున్న తీరును వివరించారు. 

ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను (ఆర్.బి.కె) ఏర్పాటు చేసిందని తద్వారా ఉత్తనం నుండి విక్రయం వరకు అవసరమగు సలహాలు సూచనలు అందించడం జరుగుతుందని చెప్పారు. ఆర్.బి.కెలలో ధృవీకరించిన విత్తనాలు సరఫరా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మెట్ట భూముల్లో సైతం అపరాలను పండించుటకు ఆరుతడి పండలను వేయసుకోవాలని చెప్పారు. పంట వేసే సమయంలో రైతు – నాణ్యమైన విత్తనాలను కొనుగోళు చేయాలని, కొనుగోళు చేసిన విత్తనాలకు విధిగా రశీదు పొందాలని సూచించారు. విత్తన శుద్ధి జరగాలని, భూసార పరీక్షలు ఆధారంగా ఎరువులు వినియోగించాలని శ్రీకేష్ లాఠకర్ చెప్పారు. సేంద్రియ ఎరువలు వినియోగం వలన భూసారం పెరుగుతుందని అన్నారు. భూముల సారం అనుగుణంగా పచ్చి రొట్ట ఎరువులు, ఇతర ఎరువులను వినియోగించాలని చెప్పారు. 

పంట ఎదుగుదలకు 16 రకాల పోషకాలు అవసరమని, అవి సరైన మోతాదులో ఉన్నదీ లేనిది పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. పంట సాగుదారు పత్రం (సి.ఆర్.సి)లను జారీ చేయడం జరుగుతోందని కలెక్టర్ చెప్పారు. ఈ పత్రం ఆధారంగా రైతు భరోసా సహయం అందుతుందని అన్నారు. రైతులు ఇ – క్రాప్ లో నమోదు చేసుకోవాలని తద్వారా ఉచిత పంటల బీమాతోపాటు ఇతర ప్రభుత్వ సహాయక కార్యక్రమాల ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. వై.యస్.ఆర్ పొలంబడి కార్యక్రమం క్రింద వ్యవసాయ అధికారుల సాంకేతిక సలహాలు పొందాలని ఆయన చెప్పారు.  ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, తహశీల్దారు అప్పారావు స్ధానిక అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.


Srikakulam

2021-07-13 10:11:39

సమాచార శాఖకు మంచి పేరుతేవాలి..

సమాచార పౌర సంబంధాల శాఖలో శ్రీకాకుళం జిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తూ సహాయ సంచాలకులుగా పదోన్నతి పొందిన యల్.రమేష్ కు కార్యాలయ సిబ్బంది ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని మంగళవారం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత సహాయ సంచాలకులకు  దుశ్సాలువ, జ్ఞాపికను ఇచ్చి సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సహాయ సంచాలకులు మాట్లాడుతూ సిబ్బంది సహకారంతో జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఇంతవరకు జిల్లాలో సేవలు అందించడం జరిగిందని, ఇదేస్పూర్తితో మున్ముందు కూడా సేవలు అందించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఒక శాఖకు మంచిపేరు వచ్చిందంటే అది కేవలం అధికారుల వలన మాత్రమే కాదని, సిబ్బంది అందరి కృషితోనే కార్యాలయానికి మంచి పేరు వస్తుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. కావున సిబ్బంది అందరూ ఇదివరకు కంటే మెరుగైన సేవలు అందించి శాఖకు మంచిపేరును తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యాలయ అభివృద్థికి తనవంతు కృషి చేస్తానని ఆయన హామి ఇచ్చారు.

          ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, పాలకొండ డివిజనల్ పౌర సంబంధాల అధికారులు యన్.రాజు, ఐ.శ్రీనివాసరావు, పౌర సంబంధాల అధికారి ఆర్.ఆర్.మూర్తి, ఏ.వి.సూపర్ వైజర్ బి.కృష్ణారావు, పబ్లిసిటీ అసిస్టెంట్ జి.వి.రవి కుమార్, సీనియర్ అసిస్టెంట్ ఆర్.కేశ్వరమ్మ, టైపిస్టులు యన్.దాలమ్మ, టి.వి.కృష్ణంరాజు, ఫొటోగ్రాఫర్ కె.రాజు, వీడియోగ్రాఫర్ పి.బాబ్జి, రికార్డ్ అసిస్టెంట్ బి.శ్రీను, డ్రైవర్  టి.రామరత్నం, ఆఫీస్ సబార్డినేట్లు ఎ.నాగేశ్వరరావు, పి.ప్రసాద్, పి.శ్రీదేవి, యన్.గౌరీశ్వరీ తదితరులు పాల్గొన్నారు.    

Srikakulam

2021-07-13 10:10:31

ఆక్సిజన్ ప్లాంట్లుకి ముదుకి రండి..

వైద్య రంగానికి అవసరమయ్యే ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళ వారం ఒక ప్రకటన జారీ చేస్తూ మూడవ దశ కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొనుటకు జిల్లాలో అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా జిల్లా శ్రేయస్సు దృష్ట్యా ఔత్సాహికులు ముందుకు వచ్చి ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రభుత్వం అందించే రాయితీలను పొందాలని కోరారు. రాయితీ వివరాలను తెలియజేస్తూ ప్రభుత్వం 57 నంబరు ఉత్తర్వులను విడుదల చేసిందన్నారు. ఏపి అల్లోపతి ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్ మెంటు చట్టం 2002 సెక్షన్ 18 క్రింద ఏపి అల్లోపతి ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్ మెంటు నిబంధనలు 2007 మేరకు దీనిని అనుమతించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ చట్టం, నిబంధనల మేరకు 50 నుండి 100 పడకలు ఉన్న ఆసుపత్రులు, నర్సింగు హోమ్ లకు వంద ఆక్సిజన్ సిలిండర్లు, 50 లోపు పడకలు ఉన్న వాటికి 40 సిలిండర్లు వరకు ఉత్పాదకత చేయుటకు అవకాశం ఉందని ఆయన చెప్పారు. రెగ్యులేటర్ తో కూడిన ఆక్సిజన్ మాస్కులను వంద పడకలుగల వాటికి వాటి పడకల సామర్ద్యం మేరకు ఉత్పాదకత చేయవచ్చని సూచించారు. పి.ఎస్.ఎ ప్లాంటు ఏర్పాటు వాటి విధివిధానాలను గూర్చి తెలియజేస్తూ వంద పడకల వరకు వెయ్యి ఎల్.పి.ఎం, 50 నుండి వంద పడకల వరకు 5 వందల ఎల్.పి.ఎం సామర్ధ్యం ఉండాలని చెప్పారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను వంద పడకలు సామర్ధ్యం ఉన్న సంస్ధలలో పడకల మేరకు ఏర్పాటు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఆక్సిజన్ ఉత్పత్తిదారులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్లనకు ఆసుపత్రుల దగ్గరలో ఏర్పాటు చేయాలని, ఇందుకు ఆసుపత్రుల వద్ద లీజు పద్ధతిలో భూమిని పొందవచ్చని వివరించారు. ఉత్పత్తి చేసే ఆక్సిజన్ లో 80 శాతం అదే ఆసుపత్రికి వినియోగించాలని, మిగిలిన 20 శాతం వాణిజ్యపర కార్యకలాపాలకు ఉపయోగించవచ్చని అన్నారు. ప్లాంటులు సరఫరా చేస్తున్న 80 శాతం అవసరం లేదని సంబంధిత ఆసుపత్రులు భావిస్తే అటువంటి ఆసుపత్రులు నిరభ్యంతర పత్రం జారీ చేయాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలో జోన్ల వారీగా ఏర్పాటు చేయవలసిన లక్ష్యాలకు ప్రభుత్వం నిర్ధేశిస్తూ ఒకటవ జోన్ లో ఐదు యూనిట్లు ఏర్పాటు చేయుటకు లక్ష్యంగా నిర్ధేశించిందన్నారు.  

            గతంలో వివిధ కారణాల వలన మూసివేసి,  ఇప్పటి వరకు రాయితీ వినియోగించుకోకుండా ఉన్న పి.ఎస్.ఏ సంబంధిత యూనిట్ల (ఏయిర్ సస్పెన్షన్)కు స్ధిర పెట్టుబడి (ఫిక్స్ డ్ కాపిటల్ ఇన్వెస్ట్ మెంటు)పై 20 శాతం లేదా మెట్రిక్ టన్నుకు రూ.20 లక్షల వరకు., మూడు సంవత్సరాల వరకు రూ.7 లక్షలకు దాటకుండా విద్యుత్ ను యూనిట్ కు రెండు రూపాయల వరకు రాయితీ సదుపాయం కల్పించడం జరుగుతుందని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసే పి.ఎస్.ఏ ఆధారిత ప్లాంట్లకు ఫిక్స్ డ్ కేపిటల్ ఇన్వెస్టిమెంటు పై 30 శాతం కేపిటల్ సబ్సిడి లేదా మెట్రిక్ టన్నుకు రూ.30 లక్షల వరకు,  మూడు సంవత్సరాల వరకు రూ.7 లక్షలకు దాటకుండా విద్యుత్ ను యూనిట్ కు రెండు రూపాయల వరకు రాయితీ సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు. మొదటి సంవత్సరం రెండు రూపాయలు, రెండవ సంవత్సరం రూపాయి ఏభై పైసలు, మూడవ సంవత్సరం ఒక రూపాయి చొప్పున రాయితీ కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.

Srikakulam

2021-07-13 07:01:59

కరోనా థర్డ్ వేవ్ కు సర్వం సిద్ధం..

శ్రీకాకుళంజిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు అందించిన సహకారంతో కరోనా మొదటి దశ, రెండవ దశలను పూర్తిస్థాయిలో అధిగమించామని, ఇదేస్థాయిలో రానున్న థర్డ్ వేవ్ ను కూడా ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కరోనా థర్డ్ వేవ్ పై ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ  కరోనా మొదటి రెండు దశల్లో ఆసుపత్రుల్లో తలెత్తిన కొన్ని విషయాలను గమనించడం జరిగిందని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని థర్డ్ వేవ్ వస్తే అందుకు తగిన విధంగా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మునుపటి కంటే అదనంగా బెడ్స్, ఐసియు బెడ్స్, పిడియాట్రిక్ బెడ్స్, ఆక్సిజన్ సరఫరా, ఆక్సిజన్ జనరేషన్ వంటి వాటిపై ప్రణాళికబద్ధమైన చర్యలు తీసుకోవడం జరిగిందని, చిన్నపిల్లల వైద్యులను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. వీటితో పాటు జిల్లాలో సెకెండ్ వేవ్ లో సర్వీస్ ఉపయోగించుకున్న 20 ప్రైవేటు ఆసుపత్రులలోని సౌకర్యాలను కూడా  పెంచమని ఆదేశించడం జరిగిందని అన్నారు. ప్రతీ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసియు బెడ్స్, పిడియాట్రిక్ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ జనరేషన్ వంటి వాటిని గతంలో కంటే  పెంచాలని, ఈ విషయమై గత సమావేశంలో ఆదేశించామని చెప్పారు. అలాగే ప్రతీ ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను గతంలో కంటే కెపాసిటీని పెంపుదల చేయమని కోరడం జరిగిందని, ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలలో విఫలమైన ఆసుపత్రులపై చర్యలు కూడా తీసుకోమని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని చెప్పారు. అయితే అటువంటి పరిస్థితి జిల్లాలో లేదని ప్రతీ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం  జిల్లా యంత్రాంగానికి పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఇంకా కొన్ని ఆసుపత్రులలో చిన్న చిన్న పనులు చేయాల్సి ఉందని, అటువంటి ఆసుపత్రులను చర్యలపై నోడల్ అధికారులు స్వయంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న ముందస్తు చర్యల వలన థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా కాబోతున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు.

Srikakulam

2021-07-12 16:58:08

డయల్ యువర్ మేయర్ కు 36ఫోన్ కాల్స్..

డయల్ యువర్ మేయర్ కార్యక్రమంనకు  36 ఫోన్స్ కాల్స్ వచ్చాయని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. సోమవారం ఆమె జివిఎంసి సమావేశ మందిరం నుండి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009 ద్వారా డయల్ యువర్ మేయర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులను  స్వీకరించి, వచ్చిన విజ్ఞప్తులను స్వయంగా పరిష్కరించి తగు నివేదిక వెంటనే సమర్పించు నిమిత్తం ఆయా విభాగాల అధికారులకు/జోనల్ కమిషనర్లు కు పంపించారు. ఇందులో రెండవ జోనుకు 06, మూడవ జోనుకు 01, నాలుగవ జోనుకు 02, 5వ జోనుకు 03, ఆరవ జోనుకు 13, ఎనిమిదవ జోనుకు 07, సిఎంఒహెచ్.నకు 01, యుసిడి(పి.డి.)నకు 02, ఎస్.ఇ.(వాటర్ సప్లై)నకు 01, మొత్తము 36  ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన మేయర్ మరియు కమీషనర్ ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ మేయర్ కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులు 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఎ.వి.రమణి, డా. వి. సన్యాసి రావు, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ కనకదుర్గా దేవి, జె.డి.(అమృత్) విజయ భారతి, డి.సి.(ఆర్) నల్లనయ్య, ఎ.డి.హెచ్. ఎం. దామోదర రావు, యు.సి.డి.(పి.డి.) వై. శ్రీనివాస రావు, డి.సి.పి. రాంబాబు,  ఎఫ్.ఎ & ఏ.ఒ. మల్లికాంబ, డి.పి.ఓ. చంద్రిక,  పర్యవేక్షక ఇంజినీర్లు వేణు గోపాల్, శివ ప్రసాద రాజు తదితర అధికారులు పాల్గొన్నారు.   

GVMC office

2021-07-12 16:56:52

సమయపాలన పాటించాలి ..

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని చెత్త తరలించే వాహనాలు సమయపాలన పాటించాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు శానిటేషన్ అధికారులను ఆదేశించారు. సోమవారం 3వ జోన్ 23వ వార్డు పరిధిలోని మద్దిలపాలెం పరిసర ప్రాంతాలలో జోనల్ కమిషనర్ కె. శివ ప్రసాద్ తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్త తరలించే వాహనాలు నిర్దేశించిన సమయానికి వచ్చి చెత్తను తరలించాలని, డంపర్ బిన్ల చుట్టూ చెత్త వేయకుండా స్థానికలకు అవగాహన కల్పించాలని, డోర్ టు డోర్ చెత్త ప్రతీ రోజూ సేకరించాలని, తడి-పొడి మరియు ప్రమాదకరమైన చెత్తగా ప్రజలే విభజించి ఇచ్చేలా వారికి అవగాహన కల్పించాలని, కాలువలు, రోడ్డ్లను శుభ్రపరచాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా చూడాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. అనంతరం సీజనల్ వ్యాదులైన మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా తీసుకొనే చర్యలపై మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వర్షాకాలంలో పూల కుండీలు, ఇంటిలో వాడే నీటి కుండీలు, కొబ్బరి బొండాలు, ఫ్రిడ్జ్ వెనుక భాగంలో నీటినిల్వలు ఉండకుండా చూడాలని, ఇంటిలో  వాడే నీటిపై మూతలు అమర్చాలని, వారంలో ఒక్క రోజు “డ్రై” డే పాటించాలని, ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. ఈ పర్యటనలో మూడవ జోనల్ కమిషనర్ కె. శివ ప్రసాద్, ఎఎంఒహెచ్ రమణ మూర్తి, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-07-12 16:55:40

ఉపాదిహామీ లక్ష్యాలు సాధించాలి..

ఉపాధి హామీ పథకం క్రింద చేపడుతున్న వివిధ పనులను పూర్తి చేసి లక్ష్యాలు సాధించాల్సిందేనని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ స్పష్టం చేశారు. టెక్కలి డివిజన్ లో ఉపాధి హామీ పథకం క్రింద చేపడుతున్న వివిధ పనులను గూర్చి కలెక్టరు కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. దేశంలోనే అత్యధిక వేజ్ కాంపొనేంట్ జనరెట్ చేసిన జిల్లా అన్నారు. మెటీరియల్ కాంపోనెంటు నిధులు వినియోగంలో వెనుకబడి ఉన్నామని గ్రహించాలని ఆయన చెప్పారు. పనులు సకాలంలో పూర్తి చేయడం పట్ల శ్రద్ద వహించాలని ఆయన ఆదేశించారు. రూ.60 కోట్లతో పనులు మంజూరు చేశామన్నారు. ఇంజనీర్లు వృత్తి నిపుణతతో పనిచేయాలన్నారు. ఉపాధి హామీ వెబ్ సైట్ లో చూపిస్తున్న ప్రగతిని పరిశీలించే స్థాయిలో ఇంజనీర్లు ఉండాలని అందుకు అనుగుణంగా పనుల వేగం పెంచాలని ఆయన ఆదేశించారు. సమస్యలు అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో ఉంటాయని వాటిని అధిగమించి లక్ష్యాలు సాధించాలని ఆయన స్పష్టం చేశారు. కంచిలి పంచాయతీ రాజ్ డిఇ ఆధ్వర్యంలో 238 పనులు మంజూరు కాగా 220 పనులు ప్రారంభం కాగా 20 శాతం పనులు పూర్తి అయ్యాయని అన్నారు. తక్కువ పనులు జరగడం పట్ల కలెక్టర్ ప్రశ్నించారు. ఎక్కువ పనులు ఒకే గుత్తేదారుకు అప్పగించడం వలన పనులు సకాలంలో పూర్తి అయ్యే అవకాశాలు ఉండవని ఆయన అన్నారు. పనులు జాప్యం చేస్తున్న గుత్తేదారులను మార్చాలని ఆయన సూచించారు. కంచిలి డిఇ, ఏఇ పరిధిలో ఉన్న పనులు తీవ్ర జాప్యం జరుగతోందని, ప్రగతి అతి తక్కువగా ఉందని ఆయన తెలిపారు. టెక్కలి డివిజన్ లో పనుల ప్రగతి తక్కువగా ఉందని ఆయన అన్నారు. వారం రోజుల్లో ప్రగతి కనిపించాలని ఆయన పేర్కొన్నారు. నందిగాం మండలంలో నాలుగు గ్రామాల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకపోవడాన్ని ప్రశ్నించారు. పూర్తి అయిన పనులకు వెంటనే బిల్లులు పెట్టాలని ఆయన ఆదేశించారు. సోంపేట మండలంలో 24 గ్రామ సచివాలయాన్ని 22 పనులు ప్రారంభం అయ్యాయని డిఇ తెలియజేయగా మిగిలిన పనులను ఎన్ని రోజులలో పూర్తి చేయగలరని ప్రశ్నించారు. ప్రస్తుత వేగంతో పనులు జరిగితే భవనాల నిర్మాణం నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. పనుల ప్రగతి పరిగెట్టాలని ఆయన సూచించారు. ఉపాధి హామీ మెటీరియల్ కాంపొనెంట్ నిధులు ఉపయోగించుకుని ఎక్కువ పనులు చేపట్టాలని ఆయన అన్నారు. ఒక్క పైసా కూడా వృథాకారాదని ఆయన ఆదేశించారు. ప్రస్తుతం మొక్కలు నాటేందుకు అనువైన సమయమని రహదారికి ఇరువైపులా మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టామన్నారు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆసరా జాయింట్ కలెక్టర్ ఆర్. శ్రీరాములు నాయుడు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ హెచ్. కూర్మా రావు, జిల్లా పరిషత్ సిఇఓ బి. లక్ష్మీపతి, పంచాయతీ రాజ్ ఎస్ఇ కె. బ్రహ్మయ్య, టెక్కలి పీఆర్ ఇఇ, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-07-12 16:54:38

అరసవిల్లి ఆలయ అభివృద్ధికి చర్యలు..

శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యల చేపడుతున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి,  పాలకమండలి కన్వీనర్ వి.హరిసూర్యప్రకాశ్ వెల్లడించారు.  శ్రీసూర్య నారాయణ స్వామి వారి దేవస్థానం పాలకమండలి సర్వసభ్య సమావేశం ఇ.ఓ అధ్యక్షతన సోమవారం ఆలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపధ్యంలో ఏప్రిల్ 23 నుండి జూన్ 19వరకు భక్తులకు దర్శనాలను నిలిపివేసి, జూన్ 20 నుంచి భక్తులకు దర్శనాలను అనుమతించామన్నారు. ఆలయ విశిష్టతను తెలియజేసేలా ద్వాదశ ఆదిత్యుని విగ్రహాలు నిర్మించామని, ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇంద్రపుష్కరిణిలోని నీటిని తొలగిస్తూ, పనులను వేగవంతం చేసామని చెప్పారు. ఇంద్రపుష్కరిణి వద్ద తలనీలాలు సమర్పించే భక్తులు స్నానాలు చేసేందుకు సకల సౌకర్యాలతో ఒక గదిని నిర్మిస్తున్నామని వివరించారు. మహిళలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు, అన్నదాన భవనంలో భక్తులకు మరిన్ని మౌళిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటాన్నామని పేర్కొన్నారు. బేడా మండపం పైకప్పు నుంచి వర్షం నీరు పడి భక్తులు తడవకుండా ఉండేందుకు శ్లాబ్ వేశామని చెప్పారు. ఈ పనులన్ని చేసేందుకు పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నామని వివరించారు.  ఈ పాలకమండలి సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు మరియు పాలకమండలి సభ్యులు ఇప్పిలి శంకరశర్మ, మండవిల్లి రవి, మండల మన్మధరావు, అంధవరపు రఘు, రాజేశ్వరీ, కింజరాపు ఉమారాణి, జెన్ని గౌతమి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఇటీవల కరోనాతో మృతిచెందిన ఆలయ ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్  లక్ష్మణరావుకు,  కేన్సర్ వ్యాధితో మృతిచెందిన కొండలరావులకు తొలుత సంతాపం వ్యక్తం చేస్తూ, రెండు నిమిషాలు మౌనాన్ని పాలకమండలి సభ్యులు పాటించారు.

Srikakulam

2021-07-12 16:53:28

ఎడి ర‌మేష్‌ను అభినందించిన క‌లెక్ట‌ర్‌..

విజ‌య‌న‌గరం జిల్లా స‌మాచార‌, పౌర సంబంధాల‌శాఖ‌ స‌హాయ సంచాల‌కులుగా పదోన్న‌తి పొందిన డిపిఆర్ఓ డి.ర‌మేష్‌ను. జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ అభినందించారు. ఆయ‌నను సోమ‌వారం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో దుశ్శాలువ‌తో స‌త్క‌రించి, పుష్ప‌గుచ్ఛం అంద‌జేశారు. జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్ కూడా, ర‌మేష్‌కు పుష్ప‌గుచ్ఛాన్ని అంద‌జేసి అభినంద‌న‌లు తెలిపారు. క‌లెక్ట‌ర్‌, జెసిల‌కు ర‌మేష్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  ప‌దోన్న‌తి పొందిన డిపిఆర్ఓ ర‌మేష్‌ను స‌మాచార‌, పౌర సంబంధాల‌శాఖ సిబ్బంది అభినందించారు. ఆయ‌న‌ను కార్యాయంలో దుశ్శాలువ‌తో స‌త్క‌రించి, పుష్ప గుచ్ఛాన్ని అంద‌జేశారు. వివిధ శాఖ‌ల అధికారులు, ప‌లు ప‌త్రిక‌లు, ఛాన‌ళ్ల ప్ర‌తినిధులు ర‌మేష్‌కు అభినంద‌న‌లు తెలిపారు. జిల్లా గ్రంథాల‌య సంస్థ మాజీ ఛైర్మ‌న్ రొంగ‌లి పోత‌న్న ప్ర‌త్యేకంగా స‌మాచార‌శాఖ కార్యాల‌యానికి వ‌చ్చి, ర‌మేష్‌ను అభినందించారు.

Vizianagaram

2021-07-12 16:48:49

స్పంద‌న‌కు 159 విన‌తులు..

విజ‌య‌న‌గ‌రంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం సోమ‌వారం నిర్వ‌హించిన స్పంద‌న కార్య‌క్ర‌మానికి మొత్తం 159 విన‌తులు అందాయి. వీటిలో కొన్ని విన‌తులు టెలీఫోన్ ద్వారా అంద‌గా, క‌లెక్ట‌రేట్ కు వ్య‌క్తిగ‌తంగా వ‌చ్చిన‌వారివ‌ద్ద‌నుంచి, జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ అర్జీల‌ను స్వీక‌రించారు. వారి విన‌తుల‌ను విని, వాటిని ప‌రిష్కారం నిమిత్తం ఆయా శాఖ‌ల‌కు పంపించారు. సమస్యల పరిష్కారంలో అధికారులు సత్వరమే చొరచూపాలన్నారు. సమస్యల పరిష్కరించే జిల్లాల్లో విజయనగం జిల్లా మొదటి స్థానంలో నిలవాలన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు కూడా పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-12 16:47:55

జిఎస్టీ, క్లిప్పింగ్స్ మినహాంపు ఇవ్వాలి..

రాష్ట్రంలోని జర్నలిస్టులకు 2021-22 అక్రిడేషన్ల జారీలో చిన్న,మధ్య తరహా పత్రికలకు,న్యూస్ ఏజెన్సీ లకు జి.ఎస్ టి,క్లిప్పింగ్స్ జత చెయ్యాలనే నిబంధనను మినహాయించాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఫర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా (ఏపీజేయూ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమవారం వర్చువల్ విధానంలో జరిగిన ఏపీజేయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి యూనియన్ అధ్యక్షులు జాలే వాసుదేవ నాయుడు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రతినెలా 10 వేల విలువైన ప్రకటనలు ఆయా జిల్లాల్లోని వివిధ కార్యాల ద్వారా జారీ అయ్యేలా అదేశాలిచ్చి అత్యంత కస్ట నష్టాలకోర్చి నడుపుతున్న నిర్వాహకులకు కనీస చేయూత ఇవ్వాలని సమావేశం తీర్మానించింది. ఇళ్ళు లేని జర్నలిస్టులకు కనీసం మూడు సెంట్లు స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సహాయం చెయ్యాలని కోరింది. కరోనా వలన ఏర్పడిన సంక్షోభంతో గత ఒకటిన్నర సంవత్సరాలుగా జీతాలు రాక,ప్రకటనలు లేక జర్నలిజం, దాన్ని నమ్ముకున్న పాత్రికేయులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని,వెంటనే ప్రభుత్వం ఆయా జిల్లాల సమాచార శాఖల ద్వారా అర్హులైన జర్నలిస్టులను గుర్తించి ఒక్కరికి రూ.25 వేలు ఆర్ధిక సహాయం అందించాలని కోరింది. అలాగే కరోనాతో మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షలు నష్టపరిహారం అందించాలని కూడా తీర్మానించింది. ఏపీజేయూ 35 వ వార్షికోత్సవాన్ని నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించేందుకు త్వరలో నెల్లూరులో కార్యవర్గ సమావేశం పెట్టాలని నిర్ణయించింది. ఈ వర్చువల్ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న అల్ ఇండియా న్యూస్పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్(ఏ ఐ ఎన్ ఈ ఎఫ్) జాతీయ ఉపాధ్యక్షులు సీహెచ్.పూర్ణచంద్ర రావు మాట్లాడుతూ, ఎందరికో ఎన్నోవిధాల సహాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి  కేవలం ఒక్క పధకం లో నాల్గోవ వంతు కూడా లేని పత్రికేయులకి ఈ చిన్న సహాయం పెద్ద లెక్కలోనిది కాదని, ప్రభుత్వం పెద్ద మనసుతో ఈ చిన్న సహాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి విజ్ఞప్తి చేసారు.కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవిధమైన పథకాలు వున్నా వాటిని జాతీయ యూనియన్ నాయకులతో కలిసి అమలయ్యేలా తన వంతు కృషిచేస్తానన్నారు. ఈ సమావేశంలో ఏపీజేయూ ప్రధానకార్యదర్శి తూము పార్థసారధి వరప్రసాద్ తో సహా పలువురు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Vijayawada

2021-07-12 16:44:35

అప్పన్నకు అరకేజి చందనం సమర్పణ..

శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన వెంకట రమేష్, లక్ష్మీ ప్రియాంక దంపతులు శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారికి అరకేజీ చందనం సమర్పించారు. ఈ మేరకు శనివారం ఆలయ ఏఈఓ రాఘవ కుమార్ కు రూ.10,116 చెల్లించారు. చందన స్వామికి చందనం సమర్పించడం తమ పూర్వజన్మసుకృతమని వెంకటరమేష్ తెలిపారు. ఆయనకుఒక చందనం చెక్కను దేవస్థానం అధికారులు ప్రసాదంగా  ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఈఓ మాట్లాడుతూ, స్వామివారికి చందనాన్ని ఎవరైనా, ఎప్పుడైనా సమర్పించవచ్చని,   డైరెక్టుగా ఆలయానికి వస్తే సమర్పిస్తే వెంటనే స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన చందనం చెక్కను  ప్రసాదంగా  ఇస్తామన్నారు.

Simhachalam

2021-07-10 15:00:30