1 ENS Live Breaking News

పాలిటెక్నిక్ కోసం తాత్కాలిక ఏర్పాట్లు..

గుంటూజిల్లా మంగళగిరి పట్టణంలోని చింతక్రింది కనకయ్య హైస్కూల్, జూనియర్ కళాశాల, వి.టి.జే.ఎం అండ్ ఐ.వి.టి.ఆర్ డిగ్రీ కశాళాల వాటి ప్రాంగణాలను  మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, మంగళగిరి శాసన సభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మీడియాతో  మాట్లాడారు. మంగళగిరి- తాడేపల్లి కార్పోరేషన్ పరిధిలో ఉన్న సి.కె. డిగ్రీ కళాశాల జిల్లా పరిషత్తు  ప్రాపర్టీ అని తెలిపారు. అందుకు సంబంధించిన రికార్డులు, రిజిష్ట్రర్లు చూడటం జరిగిందని తెలిపారు. పూర్వం ఒక లీజు అగ్రిమెంట్ చేయడం జరిగిందని, అలాగే మళ్ళీ మరో అగ్రిమెంట్ జరిగినట్లు తెలిపారు. 3.7 ఎకరాల జిల్లా పరిషత్తు ప్రాపర్టీ లో కళాశాల నడుస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగిందని  దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి మేనేజ్ మెంట్ వారి నుండి, రెవెన్యూ,జిల్లా పరిషత్తు, మున్సిపల్ కార్పోరేషన్, జిల్లా కో ఆపరేటివ్ అధికారుల నుంచి రికార్డులు తెప్పించుకొని పరిశీలించడం కోసం ఎంక్వరీ అధికారిగా  జాయింట్ కలెక్టర్ ను నియమించడం జరిగిందన్నారు.  విచారణ వారం రోజుల్లో పూర్తిచేసి, అందిన నివేదిక ప్రకారం జిల్లా పరిషత్తు సిఈవొ తగు చర్యలు తీసుకుంటారన్నారు. అలాగే స్కూల్ ప్లే గ్రౌండ్ కోసం ఇచ్చిన స్థలాన్ని కూడా ఎంక్వరీ అధికారి విచారణ చేయడం జరుగుతుందన్నారు. ఇటీవల మంగళగిరి పట్టణ పరిధిలో ఒక పాలిటెక్నిక్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, వీటి నిర్మాణానికి  అవసరమైన 2 . 5 ఎకరాల భూమిని సేకరించేందుకు ఆర్.డి.వొ,  తహాశీల్ధారుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కొత్త భవనం నిర్మాణం జరిగే వరకు స్థానికంగా అనువుగా ఉండే పాత భవనంలో పాలిటెక్నిక్ కాలేజ్ ను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి శాసన సభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటి కమీషనర్ రవిచంద్రారెడ్డి, అడిషనల్  కమీషనర్ హేమమాలిని రెడ్డి, జిల్లా పరిషత్తు సి.ఈ.వొ చైతన్య, తహాశీల్ధార్ లు రామ్ ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ రమా ప్రసన్న, మున్సిపల్ కార్పోరేషన్ డివిజనల్ ఇంజనీర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పాలిటెక్నిక్ కోసం తాత్కాలిక ఏర్పాట్లు..

2021-07-13 15:33:36

మత్స్యకారులు మరింత అభివ్రుద్ధి చెందాలి..

జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డు)ఆర్ధిక సహాయం రూ.18 లక్షలతో   కొత్తపాలెం కోస్టల్ మెరైన్, ఆక్వా ప్రొడ్యూసర్ కంపెనీకి అందించిన మొబైల్ వ్యాన్ ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మంగళవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాలు వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ మత్య్సకారులు ఒక కంపెనీగా ఏర్పడటం వలన వారి యొక్క ఉత్పత్తులను కంపెనీ ద్వారా మధ్యవర్తులు లేకుండా విక్రయించటం వలన అధిక ఆదాయాన్ని పొందవచ్చు అన్నారు. సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ మత్స్సకారులు,రైతులు సంఘాలుగా ఏర్పడటం వలన వారి యొక్క ఆర్ధిక శక్తి పెరుగుతుందని, జిల్లాలో మరిన్ని రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పడాలని, ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులు పెరగాలని, ఆర్గానిక్ రైతు ఉత్పత్తి సంఘాలు పెరగాలన్నారు. ఈ కార్యక్రమంలో నాబార్డు డీడీఎం కార్తీక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం రవికుమార్, ఎల్డీఎం రాంబాబు,  సెర్చ్ ఎన్జీవో అధ్యక్షులు ఎం హనుమప్రసాద్, కార్యదర్శి సిహెచ్ పార్ధసారధి తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-07-13 15:26:34

ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఆహ్వానం..

ప్రధానమంత్రి మత్స్యశాఖ సంపద యోజన పథకం(2020-21) క్రింద  చేపల తలసరి వినియోగం పెంపొందించేందుకు వివిధ యూనిట్ల స్థాపనకై జిల్లాలోని ఔత్సాహిక వ్యాపారవేత్తల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి.కె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన జారీచేసారు.  ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన  క్రింద లైవ్ ఫిష్, ఫ్రెష్ ఫిష్, రొయ్యలు, మేరినేటేడ్ అండ్ కుక్డ్ ప్రోడక్ట్స్ రిటైల్ అమ్మకం, స్నాక్స్, ఇన్ స్టంట్ కుకింగ్ ఫుడ్స్ తయారీ, ఆన్ లైన్ ద్వారా విక్రయాలు, వివిధ రకాల రిటైల్ యూనిట్ల ఏర్పాటు, నిర్వహణ కొరకు ఆసక్తి గల వ్యాపారవేత్తలు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 2020-21జిల్లాలో చేపల ఉత్పత్తి  1,68,870 టన్నులు కాగా, 2021-22 సం.నకు  1,70,896  టన్నులు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని అన్నారు. జిల్లాలో చేపల తలసరి వినియోగం పెంచి, వివిధ రకాల చేపల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను అమలుచేస్తుందని చెప్పారు. శ్రీకాకుళం  నగర  కేంద్రంగా రూ.1.27 కోట్లతో ఒక ఆక్వాహబ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, క్రమేపీ ప్రతి నియోజకవర్గంలో ఒక హబ్ చొప్పున ఏర్పాటుచేయుటకు ప్రతిపాదించడమైందని తెలిపారు. శ్రీకాకుళం పట్టణం లో అక్వా హబ్ కేంద్రంగా శ్రీకాకుళం మరియు ఆమదలవలస మున్సిపాలిటీలు మరియు శ్రీకాకుళం ఆమదాలవలస రూరల్ మండలాలు ఎచ్చెర్ల , గార, నరసన్నపేట, పోలాకి, పొందూరు గ్రామ సచివాలయాలు వెరశి మొత్తం 224 ఉండగా 77 సచివాలయాలు నుంచి మాత్రమే మినీ ఫిష్ రిటైల్ ఔట్ లెట్ ల కొరకు ధరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు తమ వార్డు లేదా గ్రామ వాలంటీర్ ను సంప్రదించాలని అన్నారు. అలాగే పట్టణ వార్డు,గ్రామ సచివాలయాలు వెరశి 147 సచివాలయాల నుండి దరఖాస్తులు కోరినట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. రూ.50 లక్షల వ్యయంతో జిల్లాలో ఒక వాల్యూ యాడెడ్  యూనిట్, రూ.20లక్షలతో  లైవ్ ఫిష్ వెండింగ్ యూనిట్లను ఐదింటిని, రూ.10 లక్షల వ్యయంతో 10 ఫిష్ కియోస్క్ యూనిట్లను,  రూ.4 లక్షల వ్యయంతో 10 ఈ-వెహికల్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. వీటితో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కటి  రూ. 1.25 లక్షలతో  మినీ ఫిష్ వెండింగ్ రిటైల్ యూనిట్లను ఏర్పాటుచేయుటకు ప్రతిపాదించగా ప్రస్తుతం 100 యూనిట్లు మంజూరుకాబడ్డాయని, 2022 నాటికి 300 యూనిట్లను ఏర్పాటు చేయుటకు  ప్రతిపాదించినట్లు ఆయన చెప్పారు. పై యూనిట్ల స్థాపనకు బి.సి జనరల్ కేటగిరికి 40 శాతం, ఎస్.సి, ఎస్.టి, ఉమెన్ కేటగిరీలు 60 శాతం వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేసారు. దరఖాస్తు చేసుకునేవారు  https://ematsyakar.com/efisher/retailunits వెబ్ సైటును లేదా 94408 14719, 83090 54784, 93460 07766 మొబైల్ నెంబర్లను సంప్రదించాలని ఆ ప్రకటనలో వివరించారు.

Srikakulam

2021-07-13 14:49:43

ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఆహ్వానం..

ప్రధానమంత్రి మత్స్యశాఖ సంపద యోజన పథకం(2020-21) క్రింద  చేపల తలసరి వినియోగం పెంపొందించేందుకు వివిధ యూనిట్ల స్థాపనకై జిల్లాలోని ఔత్సాహిక వ్యాపారవేత్తల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి.కె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన జారీచేసారు.  ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన  క్రింద లైవ్ ఫిష్, ఫ్రెష్ ఫిష్, రొయ్యలు, మేరినేటేడ్ అండ్ కుక్డ్ ప్రోడక్ట్స్ రిటైల్ అమ్మకం, స్నాక్స్, ఇన్ స్టంట్ కుకింగ్ ఫుడ్స్ తయారీ, ఆన్ లైన్ ద్వారా విక్రయాలు, వివిధ రకాల రిటైల్ యూనిట్ల ఏర్పాటు, నిర్వహణ కొరకు ఆసక్తి గల వ్యాపారవేత్తలు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 2020-21జిల్లాలో చేపల ఉత్పత్తి  1,68,870 టన్నులు కాగా, 2021-22 సం.నకు  1,70,896  టన్నులు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని అన్నారు. జిల్లాలో చేపల తలసరి వినియోగం పెంచి, వివిధ రకాల చేపల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను అమలుచేస్తుందని చెప్పారు. శ్రీకాకుళం  నగర  కేంద్రంగా రూ.1.27 కోట్లతో ఒక ఆక్వాహబ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, క్రమేపీ ప్రతి నియోజకవర్గంలో ఒక హబ్ చొప్పున ఏర్పాటుచేయుటకు ప్రతిపాదించడమైందని తెలిపారు. శ్రీకాకుళం పట్టణం లో అక్వా హబ్ కేంద్రంగా శ్రీకాకుళం మరియు ఆమదలవలస మున్సిపాలిటీలు మరియు శ్రీకాకుళం ఆమదాలవలస రూరల్ మండలాలు ఎచ్చెర్ల , గార, నరసన్నపేట, పోలాకి, పొందూరు గ్రామ సచివాలయాలు వెరశి మొత్తం 224 ఉండగా 77 సచివాలయాలు నుంచి మాత్రమే మినీ ఫిష్ రిటైల్ ఔట్ లెట్ ల కొరకు ధరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు తమ వార్డు లేదా గ్రామ వాలంటీర్ ను సంప్రదించాలని అన్నారు. అలాగే పట్టణ వార్డు,గ్రామ సచివాలయాలు వెరశి 147 సచివాలయాల నుండి దరఖాస్తులు కోరినట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. రూ.50 లక్షల వ్యయంతో జిల్లాలో ఒక వాల్యూ యాడెడ్  యూనిట్, రూ.20లక్షలతో  లైవ్ ఫిష్ వెండింగ్ యూనిట్లను ఐదింటిని, రూ.10 లక్షల వ్యయంతో 10 ఫిష్ కియోస్క్ యూనిట్లను,  రూ.4 లక్షల వ్యయంతో 10 ఈ-వెహికల్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. వీటితో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కటి  రూ. 1.25 లక్షలతో  మినీ ఫిష్ వెండింగ్ రిటైల్ యూనిట్లను ఏర్పాటుచేయుటకు ప్రతిపాదించగా ప్రస్తుతం 100 యూనిట్లు మంజూరుకాబడ్డాయని, 2022 నాటికి 300 యూనిట్లను ఏర్పాటు చేయుటకు  ప్రతిపాదించినట్లు ఆయన చెప్పారు. పై యూనిట్ల స్థాపనకు బి.సి జనరల్ కేటగిరికి 40 శాతం, ఎస్.సి, ఎస్.టి, ఉమెన్ కేటగిరీలు 60 శాతం వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేసారు. దరఖాస్తు చేసుకునేవారు  https://ematsyakar.com/efisher/retailunits వెబ్ సైటును లేదా 94408 14719, 83090 54784, 93460 07766 మొబైల్ నెంబర్లను సంప్రదించాలని ఆ ప్రకటనలో వివరించారు.

Srikakulam

2021-07-13 14:25:57

వెలుగొండ ప్రాజెక్టు పనులు వేగవంతం..

పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ రెండవ టన్నెల్ నిర్మాణ పనులు వేగంగా జరుగు తున్నాయని కలెక్టర్  ప్రవీణ్ కుమార్ చెప్పారు. ప్రాజెక్టు  టన్నెల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. దోర్నాల, పెద్దారవీడు మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు.  నిర్మిస్తున్న 1, 2 టన్నెల్ సొరంగంలోకి వెళ్లి ఆయన నిశితంగా పరిశీలించారు. ప్రతిరోజు నాలుగు మీటర్ల తక్కువ కాకుండా టన్నెల్ నిర్మాణం జరగాలన్నారు. అనంతరం పెద్దారవీడు మండలంలోని గొట్టిపడియ, సుంకేసుల గ్యాప్ వద్ద 80 మీటర్ల ఎత్తులో నిర్మించిన రిజర్వాయర్ గోడ మీదకు వెళ్లి నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. రిజర్వాయర్ లో  నీరు నిల్వ చేసే ప్రాంతాలను ఆయన పరిశీలించారు.  పనులలో భాగంగా తూర్పు ప్రధాన కాల్వ వద్ద నిర్మించనున్న ఎత్తిపోతల పథకాలను ఆయన పరిశీలించారు. ఆయకట్టు భూములు సుంకేసుల రిజర్వాయర్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. తొలుత దోర్నాల వద్దనే అధికారులతో ఆయన సమీక్షించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం త్వరలో పూర్తి కానుందని కలెక్టర్ చెప్పారు. ప్రాజెక్టు పూర్తికాగానే 53 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉందన్నారు. 

మొత్తంగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.8,080 కోట్ల నిధులు కేటాయించాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.ఆరు వేల కోట్లు ప్రాజెక్టుకు వచ్చాయన్నారు. కేవలం రూ.1,230 కోట్లు భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ల కింద ఖర్చు చేస్తున్నట్లు ప్రాజెక్టుల ఎస్ ఈ కలెక్టర్ కు  వివరించారు. ప్రాజెక్టుతో 4.4 7 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందనున్నదని ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లాలో స్టేజ్-1 కింద 1.20 లక్షల ఎకరాలకు, స్టేజ్-2 కింద 2.55 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన వివరించారు. సుంకేసుల నుంచి తీగలేరు కెనాల్ కు నీరు తరలించడం ద్వారా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 62 వేల ఎకరాల బీడు భూములు సాగులోకి వస్తాయన్నారు. ఈ పనులు 70 శాతం పూర్తయిందన్నారు.

            బచావో ట్రిబ్యునల్ నిర్ణయాలు, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాల మేరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 840  అడుగుల ఎత్తులో నీరు నిల్వ ఉన్న నీటిని తరలించడానికి అనుమతులు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ఒప్పందాల మేరకు గుత్తేదారులు నిర్మాణ పనులు చేస్తున్నారన్నారు. టి-5 బ్లాక్ వద్ద తీగలేరు కెనాల్ పనులు 54 శాతం ముగిశాయన్నారు. 74 పనులకుగాను 27 పనులు నేటికీ ప్రారంభం కాకపోవడంపై ఆయన ఆరా తీశారు. మిగిలినవి వివిధ దశలో ఉన్నాయన్నారు. రిజర్వాయర్ నుంచి తూర్పు ప్రధాన కాల్వల వద్ద నాలుగు ఎత్తిపోతల పథకాల నిర్మాణంపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతంమొదటి టన్నెల్ నిర్మాణం పూర్తికాగా, రెండవ టన్నెల్ నిర్మాణం శరవేగంగా సాగుతోందని కలెక్టర్ చెప్పారు. ప్రాజెక్టు   ప్రారంభించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు కోసం ఎదురు చూస్తున్నామని కలెక్టర్ వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుమతులు రాగానే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ తెలిపారు.  సమావేశంలో ప్రాజెక్టుల ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ సరళ వందనం, మార్కాపురం ఆర్డీఓ లక్ష్మీశివజ్యోతి, ఉప కలెక్టర్ గ్లోరియా, ఇఈ లు అబూతలీమ్, చిన్న బాబు, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

వెలుగొండ

2021-07-13 12:44:23

2వ డోస్ వేయించుకున్న మేయర్..

మహా విశాఖ నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అల్లిపురం లోని భీమ్ నగర్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కోవీషీల్డ్ కరోనా సెకెండ్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మొదటి డోస్ వేసి 84రోజులు పూర్తి అయినందున రెండవ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నానని, 45 సంవత్సరాలు పై బడిన వారు వ్యాక్సిన్  వేయించుకోవాలని, అలాగే 5 సం. ల లోపు చిన్న పిల్లల తల్లులు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని మేయర్ తెలిపారు. కోవిడ్ వైరస్ కొద్దిగా తగ్గినప్పటికీ పూర్తిగా తొలగిపోలేదనీ, వ్యాక్సినేషన్ వేసుకున్నా కూడా మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుగు కోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అర్హత ఉండి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన ప్రతీ ఒక్కరుకు వ్యాక్సిన్ వేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, డాక్టర్లు, సంబంధిత ఇతర సిబ్బంది పాల్గొన్నారు.     

విశాఖ సిటీ

2021-07-13 12:07:44

జాతీయ రహదారికి సహకరించండి..

చిత్తూరు (కుక్కలపల్లి) –సి. మల్లవరం 6 లైన్ల 140 నెంబరు  జాతీయ రహదారి పనులు  త్వరగా పూర్తి చేయడానికి సహకరించాలని, కొలతల్లో తేడాలు వుంటే మరో మారు పరిశీలించి న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణ అన్నారు. మంగళవారం  ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు  ఆరు  లైన్ల రహదారిలో కోర్టులను ఆశ్రయించిన రైతులతో , గృహాలు కోల్పోతున్న వారితో జిల్లా కలెక్టర్ , తిరుపతి ఆర్. డి. ఓ.  కనకనరసా రెడ్డి  , సంబంధిత తహసీల్దార్ల సమక్షంలో సమస్యలపై,  పరిహారంపై  పెండింగ్ లో వున్న ఆయా ప్రదేశాలలో  చర్చించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,  పరిహారం విషయంలో ప్రభుత్వ పరంగా మీకు న్యాయం జరిగేలా చూస్తానని, భూములు, ఇళ్ళు  కోల్పోతున్నవారి కొలతల విషయంలో నమోదు సమయంలో   తేడా వున్నా, అనుమానం వున్నా  మరోసారి వ్రాత పూర్వకంగా సమస్యలు తెలపాలని, పరిష్కరించడానికి సిద్దంగా వున్నామని  అన్నారు.   ఇప్పటికే రూ.1800 కోట్లతో నిర్మిస్తున్న జాతీయ రహదారి,  90% పైగా పూర్తి అయిన రహదారిలో , చిన్న సమస్యలతో 61 కి.మీ.లలో 10 కి.మీ లు రహదారి నిర్మాణం ఆలస్యం  కావడం ప్రజా ప్రయోజనాల  దృష్ట్యా భావ్యంకాదని అన్నారు.  కోవిడ్ కారణంతో ఇప్పటికే చాలా ఆలస్యం కావడం, కోర్టు కేసులు వల్ల పనులు ఆలస్యమైందని తెలిపారు.  చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి, బొడింబాయి వద్ద కోర్టులో కేసులు వేసి వున్నరైతులతో మాట్లాడటం,  కృష్ణాపురం  వద్ద ఇళ్ళు కట్టుకున్నట్టుకుంటున్న వారి కోరిన మేరకు  విద్యుత్ లైన్లు ఏర్పాటు , పనపాకం వద్ద రైస్ మిల్లు వారి  పరిహారం విషయం , సబ్ స్టేషన్ మార్పు, ఇరుగుశెట్టి వారిపల్లి గృహాల కోసం ఆలస్యంలేకుండా కల్ రోడ్ పల్లి వద్ద  ఇంటి స్థలం,  ఇళ్ళు మంజూరు వంటివి పరిష్కారానికి కలెక్టర్ హామీ ఇచ్చి జాతీయ రహదారికి సహకరించాలని కోరారు. రైతులు కోరిన మేరకు జాతీయ రహదారికి ఆనుకొని వున్న రవణప్పగారిపల్లి  వద్ద స్వర్ణముఖి కాలువ  విషయంలో కె. ఎన్. ఆర్. కంస్ట్రక్షన్ వారు జాగ్రత్తలు తీసుకొని ఫ్లడ్ వాల్ ఏర్పాటు చేయాలని, రైతుల భూములు వర్షాలవల్ల భూమి  కోతలకు గురికాకుండా చూడాల్సిన  బాధ్యత  మీపై  వుందని, గతంలో ఇలాంటి చోట నెల్లూరు వద్ద ఫ్లడ్ వాల్ ఏర్పాటు చేయక పోవడం రోడ్డు కుంగటం జరిగిందని,  అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తతో , న్యాణ్యతతో  ఫ్లడ్ వాల్ నిర్మాణంలో  తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.  పాకాల మండలం సామిరెడ్డి పల్లివద్ద ఇంటి విషయం కోర్టు కేసు వేసిన  వ్యక్తులతో  సహరించాలని ప్రాధాన్యత గుర్తించాలని సూచించారు. 
      జిల్లా కలెక్టర్ పర్యటన లో చంద్రగిరి తహసిల్దారు వెంకటేశ్వర్లు, పాకాల తహసిల్దారు భాగ్యలక్ష్మి , ఆర్. ఐ. లు మోహన్ రెడ్డి, జగన్, కె .ఎన్. ఆర్. కంస్ట్రక్షన్  ప్రతినిధులు వినోద్, వెంకటేష్ అధికారులు వున్నారు.  

Tirupati

2021-07-13 10:57:25

కోర్టు ఆదేశాలు అమలు చేయాలి..

వివిధ కేసుల‌కు సంబంధించి కోర్టులు ఇస్తున్న ఆదేశాల‌ను, సంబంధిత ప్ర‌భుత్వ శాఖ‌లు అమ‌లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ కోరారు. ప్ర‌తీశాఖ‌లో కోవిడ్ నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని సూచించారు. వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లెక్ట‌రేట్ స‌మావేశ‌మందిరంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన స‌మావేశంలో, ప‌లు అంశాల‌పై క‌లెక్ట‌ర్ స‌మీక్షించారు. వివిధ ప్ర‌భుత్వ‌ శాఖ‌ల ప‌రంగా కోర్టు కేసుల‌కు సంబంధించి క‌లెక్ట‌ర్ స‌మీక్షిస్తూ, న్యాయ‌స్థానం ఆదేశాల‌ను అమ‌లు చేయాల‌ని, అమ‌లు చేయ‌లేని ప‌క్షంలో సంబంధిత ప్ర‌భుత్వ న్యాయ‌వాది ద్వారా కోర్టుకు కార‌ణాల‌ను తెలియ‌జేయాల‌ని సూచించారు. కోర్టు ఉల్లంఘ‌న‌కు సంబంధించిన కేసుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ద వ‌హించి, న్యాయ‌ప‌రంగా త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అన్నారు. అన్ని శాఖ‌ల్లోనూ కోర్టు కేసుల‌ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండి, నిర్ల‌క్ష్యం వ‌హించ‌కుండా ఎప్ప‌టిక‌ప్ప‌డు త‌గిన చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని సూచించారు. కోర్టు కేసుల విష‌యంలో సక్ర‌మంగా, స‌కాలంలో స్పందించ‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌, రెవెన్యూకి సంబంధించిన కేసుల‌పై జిల్లా రెవెన్యూ అధికారిని, రెవెన్యూ యేత‌ర కేసుల‌పై జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం)ని ముందుగా సంప్ర‌దించి, వారి స‌ల‌హా ప్ర‌కారం న్యాయ‌ప‌రంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

             ప్ర‌భుత్వ శాఖ‌లన్నీ, బ్యాంకుల్లో ఉంచిన త‌మ‌ డిపాజిట్ల వివ‌రాలు వెంట‌నే అంద‌జేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఏయే బ్యాంకుల్లో ఎంత డిపాజిట్ ఉన్న‌దీ, అది ఏ రూపంలో ఉన్న‌దీ, వ‌డ్డీ ద్వారా వ‌చ్చిన ఆదాయం త‌దిత‌ర వివ‌రాల‌ను నిర్ణీత న‌మూనాలో నింపి, మంగ‌ళ‌వారం సాయంత్రానికి అంద‌జేయాల‌ని సూచించారు. ప్ర‌తీ ప్ర‌భుత్వ కార్యాల‌యంలో కోవిడ్-19 నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిసరిగా అమ‌లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ అన్నారు.  కోవిడ్‌కు సంబంధించి, వివిధ శాఖ‌ల‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేయాల‌ని ఆదేశించారు. ప్ర‌తీఒక్క‌రూ మాస్కును ధ‌రించేలా చూడాల‌ని, ధ‌రించ‌క‌పోతే రూ.100 జ‌రిమానా విధించ‌డం జరుగుతుంద‌ని హెచ్చ‌రించారు. ముఖ్యంగా కోవిడ్ మూడోద‌శ ప‌ట్ల అంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరారు. త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌క‌పోతే, తీవ్ర‌మైన న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని,  ప్ర‌జ‌లంతా స్వీయ నియంత్ర‌ణ పాటించేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

             ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జె.వెంక‌ట‌రావు, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, సిపిఓ జె.విజ‌య‌ల‌క్ష్మి, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, వివిధ శాఖ‌ల అధికారులు, ఏఓలు, సూప‌రింటిండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-13 10:56:30

థర్డ్ వేవ్ ఎదుర్కోడానికి సమాయత్తం ..

మొదటి, రెండవ దశలలో చూసిన కోవిడ్  అనుభవాలతో మూడవ దశ ను సమర్ధవంతంగా ఎదుర్కోడానికి జిల్లా  యంత్రాంగాన్ని సమాయత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు.  దానికి తగ్గట్టుగా అంచనాలు వేస్తూ కార్యాచరణ ప్రణాళికలను తయారు చేశామన్నారు.  మంగళవారం కలక్టరేట్  వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో  థర్డ్ వేవ్ కోవిడ్  కార్యాచరణ  పై  జిల్లా ఎస్.పి దీపికా పాటిల్ తో కలసి పాత్రికేయుల సమావేశం లో  కలెక్టర్ మాట్లాడారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కోడానికి అవసరమైన  వైద్యులు, నర్స్ లు, పారా  మెడికల్ సిబ్బందిని నియమించడం జరిగిందని,  అదే విధంగా వైద్య పరికరాలను, బెడ్స్ , వెంటిలేటర్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను కూడా సిద్ధం చేయడం జరిగిందన్నారు.   ఇప్పటికే థర్డ్ వేవ్  వస్తే ఎలా పని చేయాలనే అంశాల పై జిల్లా టాస్క్ ఫోర్సు కమిటీ సభ్య్యులకు తగు మార్గ దర్శకాలను నిర్దేశించడం జరిగిందన్నారు.  కోవిడ్  నిబంధనలు ప్రతి ఒక్కరు  పాటించేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు.  ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలని, కనీసం 2 మీటర్ల భౌతిక దూరాన్ని పాటించాలని, చేతులను సబ్బుతో తరచుగా కడుక్కోవాలని, లేదా సనిటైజర్  వాడాలని  పాత్రికేయులు ఈ విషయాల ను ప్రజలకు అర్ధమయ్యేలా  ప్రచురించాలని అన్నారు. 
మొదటి దశ కోవిడ్ లో 5.68 శాతం  పోజిటివిటి   నమోదు కాగా రెండవ దశ లో 10 శాతం నమోదైందని,  అదే విధంగా మరణాలు మొదటి సారి  0.50 శాతం నమోదు ఆయితే   రెండవ సారి  1.09 శాతంగా నమోదయ్యాయని అన్నారు.  మూడవ దశ లో సున్నా మరణాలే లక్ష్యంగా  చేసుకొని కార్యాచరణ తయారు చేశామన్నారు.  వాక్సినేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసామని, రాబోయే రోజుల్లో విద్యార్ధులకు కూడా వాక్సినేషన్  అవకాశం వస్తే వెంటనే  ప్రారంభిస్తామని  అన్నారు.   కోవిడ్ నిబంధనలు పాటిస్తూ  ప్రభుత్వ  ఆలోచనకు ప్రజల సహకారం తోడైతే థర్డ్ వేవ్ ను సమర్ధంగా ఎదుర్కోగలమని ఆశా  భావం వ్యక్తం చేసారు. 

కోవిడ్  నిబంధనలను పటిష్టంగా  అమలు జరిగేలా చూస్తామని జిల్లా ఎస్.పి దీపికా పాటిల్ తెలిపారు.   మొదటి, రెండవ దశలలో నిబంధనలను ఉల్లంఘించిన వారి పై కేసు లు పెట్టడం జరిగిందని , మూడవ దశ లో ఎలాంటి ఉపేక్ష లేకుండా మరింత కట్టు దిట్టంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.   మాస్క్ ధరించని వారిపైన, భౌతిక దూరాన్ని పాటించని వారిపై కఠినంగా  ఉంటామని హెచ్చరించారు.  మూడవ దశ లో  నిబంధనలను ఉల్లంఘించిన వారి పై అపరాధాన్ని ఎక్కువగా విధించడం జరుగుతుందని, కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-13 10:55:33

మహిళా లోకానికి స్ఫూర్తి ప్రధాత శిరీష..

రాకెట్ ద్వారా అంతరిక్ష యాత్ర విజయవంతం గా పూర్తిచేసిన తెలుగు తేజం బండ్ల శిరీష మహిళా లోకానికి స్ఫూర్తి ప్రధాత గా నిలిచి,ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవాన్ని, ఔన్నిత్యాన్ని చాటిచెప్పారని శ్రీకాకుళం జిల్లా సమాచార పౌరసంబంధాలు శాఖ సహాయ సంచాలకులు లోచర్ల రమేష్ అన్నారు  .మంగళవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆశా దీపికా ఫౌండేషన్ మరియు స్టార్ వాకర్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన బండ్ల శిరీష అభినందన ర్యాలీ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆడది అబల కాదు సబల అని నిరూపించి..పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో మహిళలు దూసికిపోతారు అని చెప్పటానికి శిరీష రోదసీ యాత్ర విజయవంతం గా నిర్వహణ ఒక ఉదాహరణ అని అన్నారు.రోదసీ లోకి వెళ్లి తిరిగి వొచ్చిన రెండో మహిళ బండ్ల శిరీష అని రమేష్ అన్నారు.మహిళా రంగానికి స్పూర్తి దాయకం గా నిలుస్తారని పలువురు వక్తలు కొనియాడారు. భూమి నుండి 85 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన శిరీష  చిన్ననాటి నుండి ఆకాశ యాత్ర చేయాలనే తపనతో శిక్షణ పొందారని వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ కూన వెంకట రమణ మూర్తి అన్నారు.రోదసీ లో పయనించి తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలల వ్యాప్తి చేసిన బండ్ల శిరీష ఈనాటి మహిళా లోకానికి మార్గదర్శకమగా నిలుస్తారని అన్నారు.వాకర్స్ ఇంటర్నేషనల్ కో..ఆర్డినేటర్ శాసపు జోగినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ అభినందన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు తెలుగు అమ్మాయి సాధించిన ఈ ఘనత తెలుగురాష్ట్రాల కు ఒక ప్రత్యేక  గుర్తింపు తెచ్చిందని అన్నారు.ఆశా దీపికా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్లి ఆశాదీపిక మాట్లాడుతూ అంతరిక్షంలో తెలుగుజాతి ఖ్యాతిని ఇనుమడింప చేసిన బండ్ల శిరీష ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతీ మహిళ పయనించాలని తద్వారా  భవిష్యత్ తరాలకు గుర్తుండిపోతామని అన్నారు.ఆశా దీపికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కో కొంఖ్యాన వేణుగోపాల్ వివరించారు.. ఆకాశం నుండి ఆవనిని స్వయంగా తిలకించిన శిరీష ను ప్రపంచం అంతా గర్వించే స్థాయిలో ఉన్నారని అన్నారు.

          ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ జి.ఇందిరా ప్రసాద్,2022 గవర్నర్ పి.జి.గుప్తా,వాకర్స్ సంస్థలు ప్రతినిధులు గొర్లె వాసుదేవరావు, లాడి వాసుదేవరావు, డాక్టర్ కె. పాండురంగారావు, అందవరపు రవి, ఎం.మల్లిబాబు,డాడీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జి.సూర్యనారాయణ, ప్రముఖ సంఘసేవకులు డాక్టర్ గంజి ఎజ్రా, రోటరీ కైలాస భూమి నిర్వాహకులు బి.శ్రీనివాసరావు, ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ వ్యవస్థాపకులు బసవా వెంకటరమణ, కిల్లారి రవి,బెండి తారకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  జై..జై..శిరీష అంటూ కీర్తించారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణ అంతా క్రీడాకారులు,వాకర్స్ సంస్థలు,స్వంచ్చంద సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-13 10:53:31

గ్రంధాలయ బడ్జెట్ సమావేశం..

శ్రీకాకుళంజిల్లా గ్రంధాలయ బడ్జెట్ సర్వ సభ్య సమావేశం ఈ నెల 16న నిర్వహించనున్నట్లు  ఆ జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కె.కుమార్ రాజా  వెల్లడించారు. ఈ  మేరకు   సంయుక్త కలెక్టర్ ( గ్రామ, వార్డు సచివాలయాలు మరియు సంక్షేమం ) ఆదేశాలు జారీచేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 16వ తేది ఉదయం 10.30గం.లకు సంయుక్త కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంధాలయ సంస్థ సర్వసభ్య బడ్జెట్ సమావేశం జరగనుందని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. 

Srikakulam

2021-07-13 10:20:31

లాభదాయక సాగు దిశగా సాగాలి..

శ్రీకాకుళం జిల్లాలో రైతులు లాభదాయక సాగు విధానాల దిశగా సాగాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పిలుపునిచ్చారు. రైతు చైతన్య యాత్రలో భాగంగా మంగళ వారం వీరఘట్టాం మండలం రేగులపాడు తదితర గ్రామాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ మాట్లాడుతూ రైతులు లాభదాయక వ్యవసాయాన్ని చేయాల్సిన అవసరం ఉందన్నారు. సాంప్రదాయక విధానాలలో వెళ్ళడం వలన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుందని ఆయన సూచించారు. అధిక దిగుబడులు సాధించాలని అదే సమయంలో వ్యయం తక్కువగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులు ఎక్కువ దిగుబడి తక్కువగా ఉండటం వలన రైతులు ఇబ్బందులు పడే పరిస్ధితి ఉంటుందని చెప్పారు. ప్రతి రైతు ఆనందంగా ఉండాలని, రైతు కుటుంబం సంతోషంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు లేనిదే మనుషులకు మనుగడ లేదని ఆయన పేర్కొన్నారు. రైతులు యాంత్రీకరణ దిశగా అడుగులు వేయాలని పిలుపునిస్తూ ప్రభుత్వం వై.యస్.ఆర్ యంత్ర సేవ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుకు అందుబాటులో యంత్రాలను తీసుకువచ్చిందని వివరించారు. 

మన ప్రాంతానికి అనువైన వంగడాలను గుర్తించి వేసుకోవాలని, అంతర పంటల వినియోగంపై అవగాహన పొందాలని ఆయన కోరారు. బొప్పాయి వంటి ఉద్యానవన పంటలు లాభాలను ఆర్జించి పెట్టగలవని సూచించారు. పంటలను కేవలం పండింటే ఉద్దేశంతో కాకుండా వాటి లాభదాయకత, మార్కెటింగుపైన అవగాహన పొందాలని అన్నారు. చేపల పెంపకం ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉందని వ్యవసాయంతోపాటు ఇతర అంశాలను కూడా గమనించాలని చెప్పారు. పాడిపరిశ్రమను అభివృద్ధి చేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేసిన అముల్ ప్రాజెక్టుకు పాల విక్రయం ద్వారా మంచ ధల లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు పాల ఉత్పాదనపై ప్రత్యేక దృష్టి సారించి అధిక ఆదాయాన్ని పొందుతున్న తీరును వివరించారు. 

ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను (ఆర్.బి.కె) ఏర్పాటు చేసిందని తద్వారా ఉత్తనం నుండి విక్రయం వరకు అవసరమగు సలహాలు సూచనలు అందించడం జరుగుతుందని చెప్పారు. ఆర్.బి.కెలలో ధృవీకరించిన విత్తనాలు సరఫరా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మెట్ట భూముల్లో సైతం అపరాలను పండించుటకు ఆరుతడి పండలను వేయసుకోవాలని చెప్పారు. పంట వేసే సమయంలో రైతు – నాణ్యమైన విత్తనాలను కొనుగోళు చేయాలని, కొనుగోళు చేసిన విత్తనాలకు విధిగా రశీదు పొందాలని సూచించారు. విత్తన శుద్ధి జరగాలని, భూసార పరీక్షలు ఆధారంగా ఎరువులు వినియోగించాలని శ్రీకేష్ లాఠకర్ చెప్పారు. సేంద్రియ ఎరువలు వినియోగం వలన భూసారం పెరుగుతుందని అన్నారు. భూముల సారం అనుగుణంగా పచ్చి రొట్ట ఎరువులు, ఇతర ఎరువులను వినియోగించాలని చెప్పారు. 

పంట ఎదుగుదలకు 16 రకాల పోషకాలు అవసరమని, అవి సరైన మోతాదులో ఉన్నదీ లేనిది పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. పంట సాగుదారు పత్రం (సి.ఆర్.సి)లను జారీ చేయడం జరుగుతోందని కలెక్టర్ చెప్పారు. ఈ పత్రం ఆధారంగా రైతు భరోసా సహయం అందుతుందని అన్నారు. రైతులు ఇ – క్రాప్ లో నమోదు చేసుకోవాలని తద్వారా ఉచిత పంటల బీమాతోపాటు ఇతర ప్రభుత్వ సహాయక కార్యక్రమాల ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. వై.యస్.ఆర్ పొలంబడి కార్యక్రమం క్రింద వ్యవసాయ అధికారుల సాంకేతిక సలహాలు పొందాలని ఆయన చెప్పారు.  ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, తహశీల్దారు అప్పారావు స్ధానిక అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.


Srikakulam

2021-07-13 10:11:39

సమాచార శాఖకు మంచి పేరుతేవాలి..

సమాచార పౌర సంబంధాల శాఖలో శ్రీకాకుళం జిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తూ సహాయ సంచాలకులుగా పదోన్నతి పొందిన యల్.రమేష్ కు కార్యాలయ సిబ్బంది ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని మంగళవారం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత సహాయ సంచాలకులకు  దుశ్సాలువ, జ్ఞాపికను ఇచ్చి సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సహాయ సంచాలకులు మాట్లాడుతూ సిబ్బంది సహకారంతో జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఇంతవరకు జిల్లాలో సేవలు అందించడం జరిగిందని, ఇదేస్పూర్తితో మున్ముందు కూడా సేవలు అందించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఒక శాఖకు మంచిపేరు వచ్చిందంటే అది కేవలం అధికారుల వలన మాత్రమే కాదని, సిబ్బంది అందరి కృషితోనే కార్యాలయానికి మంచి పేరు వస్తుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. కావున సిబ్బంది అందరూ ఇదివరకు కంటే మెరుగైన సేవలు అందించి శాఖకు మంచిపేరును తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యాలయ అభివృద్థికి తనవంతు కృషి చేస్తానని ఆయన హామి ఇచ్చారు.

          ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, పాలకొండ డివిజనల్ పౌర సంబంధాల అధికారులు యన్.రాజు, ఐ.శ్రీనివాసరావు, పౌర సంబంధాల అధికారి ఆర్.ఆర్.మూర్తి, ఏ.వి.సూపర్ వైజర్ బి.కృష్ణారావు, పబ్లిసిటీ అసిస్టెంట్ జి.వి.రవి కుమార్, సీనియర్ అసిస్టెంట్ ఆర్.కేశ్వరమ్మ, టైపిస్టులు యన్.దాలమ్మ, టి.వి.కృష్ణంరాజు, ఫొటోగ్రాఫర్ కె.రాజు, వీడియోగ్రాఫర్ పి.బాబ్జి, రికార్డ్ అసిస్టెంట్ బి.శ్రీను, డ్రైవర్  టి.రామరత్నం, ఆఫీస్ సబార్డినేట్లు ఎ.నాగేశ్వరరావు, పి.ప్రసాద్, పి.శ్రీదేవి, యన్.గౌరీశ్వరీ తదితరులు పాల్గొన్నారు.    

Srikakulam

2021-07-13 10:10:31

ఆక్సిజన్ ప్లాంట్లుకి ముదుకి రండి..

వైద్య రంగానికి అవసరమయ్యే ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళ వారం ఒక ప్రకటన జారీ చేస్తూ మూడవ దశ కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొనుటకు జిల్లాలో అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా జిల్లా శ్రేయస్సు దృష్ట్యా ఔత్సాహికులు ముందుకు వచ్చి ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రభుత్వం అందించే రాయితీలను పొందాలని కోరారు. రాయితీ వివరాలను తెలియజేస్తూ ప్రభుత్వం 57 నంబరు ఉత్తర్వులను విడుదల చేసిందన్నారు. ఏపి అల్లోపతి ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్ మెంటు చట్టం 2002 సెక్షన్ 18 క్రింద ఏపి అల్లోపతి ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్ మెంటు నిబంధనలు 2007 మేరకు దీనిని అనుమతించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ చట్టం, నిబంధనల మేరకు 50 నుండి 100 పడకలు ఉన్న ఆసుపత్రులు, నర్సింగు హోమ్ లకు వంద ఆక్సిజన్ సిలిండర్లు, 50 లోపు పడకలు ఉన్న వాటికి 40 సిలిండర్లు వరకు ఉత్పాదకత చేయుటకు అవకాశం ఉందని ఆయన చెప్పారు. రెగ్యులేటర్ తో కూడిన ఆక్సిజన్ మాస్కులను వంద పడకలుగల వాటికి వాటి పడకల సామర్ద్యం మేరకు ఉత్పాదకత చేయవచ్చని సూచించారు. పి.ఎస్.ఎ ప్లాంటు ఏర్పాటు వాటి విధివిధానాలను గూర్చి తెలియజేస్తూ వంద పడకల వరకు వెయ్యి ఎల్.పి.ఎం, 50 నుండి వంద పడకల వరకు 5 వందల ఎల్.పి.ఎం సామర్ధ్యం ఉండాలని చెప్పారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను వంద పడకలు సామర్ధ్యం ఉన్న సంస్ధలలో పడకల మేరకు ఏర్పాటు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఆక్సిజన్ ఉత్పత్తిదారులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్లనకు ఆసుపత్రుల దగ్గరలో ఏర్పాటు చేయాలని, ఇందుకు ఆసుపత్రుల వద్ద లీజు పద్ధతిలో భూమిని పొందవచ్చని వివరించారు. ఉత్పత్తి చేసే ఆక్సిజన్ లో 80 శాతం అదే ఆసుపత్రికి వినియోగించాలని, మిగిలిన 20 శాతం వాణిజ్యపర కార్యకలాపాలకు ఉపయోగించవచ్చని అన్నారు. ప్లాంటులు సరఫరా చేస్తున్న 80 శాతం అవసరం లేదని సంబంధిత ఆసుపత్రులు భావిస్తే అటువంటి ఆసుపత్రులు నిరభ్యంతర పత్రం జారీ చేయాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలో జోన్ల వారీగా ఏర్పాటు చేయవలసిన లక్ష్యాలకు ప్రభుత్వం నిర్ధేశిస్తూ ఒకటవ జోన్ లో ఐదు యూనిట్లు ఏర్పాటు చేయుటకు లక్ష్యంగా నిర్ధేశించిందన్నారు.  

            గతంలో వివిధ కారణాల వలన మూసివేసి,  ఇప్పటి వరకు రాయితీ వినియోగించుకోకుండా ఉన్న పి.ఎస్.ఏ సంబంధిత యూనిట్ల (ఏయిర్ సస్పెన్షన్)కు స్ధిర పెట్టుబడి (ఫిక్స్ డ్ కాపిటల్ ఇన్వెస్ట్ మెంటు)పై 20 శాతం లేదా మెట్రిక్ టన్నుకు రూ.20 లక్షల వరకు., మూడు సంవత్సరాల వరకు రూ.7 లక్షలకు దాటకుండా విద్యుత్ ను యూనిట్ కు రెండు రూపాయల వరకు రాయితీ సదుపాయం కల్పించడం జరుగుతుందని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసే పి.ఎస్.ఏ ఆధారిత ప్లాంట్లకు ఫిక్స్ డ్ కేపిటల్ ఇన్వెస్టిమెంటు పై 30 శాతం కేపిటల్ సబ్సిడి లేదా మెట్రిక్ టన్నుకు రూ.30 లక్షల వరకు,  మూడు సంవత్సరాల వరకు రూ.7 లక్షలకు దాటకుండా విద్యుత్ ను యూనిట్ కు రెండు రూపాయల వరకు రాయితీ సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు. మొదటి సంవత్సరం రెండు రూపాయలు, రెండవ సంవత్సరం రూపాయి ఏభై పైసలు, మూడవ సంవత్సరం ఒక రూపాయి చొప్పున రాయితీ కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.

Srikakulam

2021-07-13 07:01:59

కరోనా థర్డ్ వేవ్ కు సర్వం సిద్ధం..

శ్రీకాకుళంజిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు అందించిన సహకారంతో కరోనా మొదటి దశ, రెండవ దశలను పూర్తిస్థాయిలో అధిగమించామని, ఇదేస్థాయిలో రానున్న థర్డ్ వేవ్ ను కూడా ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కరోనా థర్డ్ వేవ్ పై ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ  కరోనా మొదటి రెండు దశల్లో ఆసుపత్రుల్లో తలెత్తిన కొన్ని విషయాలను గమనించడం జరిగిందని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని థర్డ్ వేవ్ వస్తే అందుకు తగిన విధంగా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మునుపటి కంటే అదనంగా బెడ్స్, ఐసియు బెడ్స్, పిడియాట్రిక్ బెడ్స్, ఆక్సిజన్ సరఫరా, ఆక్సిజన్ జనరేషన్ వంటి వాటిపై ప్రణాళికబద్ధమైన చర్యలు తీసుకోవడం జరిగిందని, చిన్నపిల్లల వైద్యులను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. వీటితో పాటు జిల్లాలో సెకెండ్ వేవ్ లో సర్వీస్ ఉపయోగించుకున్న 20 ప్రైవేటు ఆసుపత్రులలోని సౌకర్యాలను కూడా  పెంచమని ఆదేశించడం జరిగిందని అన్నారు. ప్రతీ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసియు బెడ్స్, పిడియాట్రిక్ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ జనరేషన్ వంటి వాటిని గతంలో కంటే  పెంచాలని, ఈ విషయమై గత సమావేశంలో ఆదేశించామని చెప్పారు. అలాగే ప్రతీ ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను గతంలో కంటే కెపాసిటీని పెంపుదల చేయమని కోరడం జరిగిందని, ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలలో విఫలమైన ఆసుపత్రులపై చర్యలు కూడా తీసుకోమని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని చెప్పారు. అయితే అటువంటి పరిస్థితి జిల్లాలో లేదని ప్రతీ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం  జిల్లా యంత్రాంగానికి పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఇంకా కొన్ని ఆసుపత్రులలో చిన్న చిన్న పనులు చేయాల్సి ఉందని, అటువంటి ఆసుపత్రులను చర్యలపై నోడల్ అధికారులు స్వయంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న ముందస్తు చర్యల వలన థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా కాబోతున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు.

Srikakulam

2021-07-12 16:58:08