1 ENS Live Breaking News

రైతులకు సమయానికి సాగునీరందాలి..

రైతుకు సాగునీరు అందించే దిశగా పనిచేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి  డాక్టర్ సీదిరి అప్పలరాజు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖ ఇంజనీర్లతో పలాస మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సోమ వరం సమీక్షించారు. నియోజకవర్గంలో ఉన్న రిజర్వాయర్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మందస మండలంలో ఉన్న డబారుసింగి, కళింగదల్, దామోదర సాగర్, సంకుజోడి రిజర్వాయర్లు ఆధునీకరణ పనులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు సాగు నీరు అందించాలని అందుకు రిజర్వాయర్ల మరమ్మత్తులు పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేసారు. రిజర్వాయర్ల మరమ్మతులు పూర్తి చేయకుండా నీరు అందించే పరిస్థితి లేదని, ఎటువంటి జాప్యం చేయకుండా పనులు పూర్తి చేయాలని అన్నారు. నీటి కాలువలు, లింక్ ఛానళ్ళు మరమ్మత్తులు చేపడితే శివారు రైతుకు నీరు అందుతుందని అందుకు తగిన కార్యాచరణ తయారు చేయాలని ఆయన సూచించారు. వంశధార కాలువల నుండి నీరు శివారు ప్రాంతాలకు అందేలా చూడాలని అన్నారు. వంశధార కాలువ ద్వారా వచ్చిన నీటిని ప్రతి చెరువులో నింపగలిగితే రైతుకు సాగు నీరు అందించ వచ్చని మంత్రి పేర్కొన్నారు.

 రైతుకు సాగు నీరు అందించే లక్ష్యంతో పని చేయాలని ఆయన కోరారు. రిజర్వాయర్లు, మినీ రిజర్వాయర్లు మరమ్మత్తు పనులు పూర్తి చేయడం వలన నీటి నిలువ పెంచాలని అన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టాలని పేర్కొన్నారు.  ప్రభుత్వం రైతులు ఎన్ని సంక్షేమ పధకాలు అందించినా సాగునీరు అందించకపోతే  రైతు పరిస్థితి దయనీయంగా మారే పరిస్ధితి ఉంటుందని అన్నారు.  సమృద్ధిగా పంటలు పండాలని అందుకు తగిన నీటి వనరులు ఏడాది పొడవునా అందే విధంగా చర్యలు చేపట్టాలని ముఖ్యంగా చెరువుల్లో సమృద్దిగా నీటి నిల్వలు ఉండాలని కోరారు. అందుకు తగిన విధంగా ఇంజనీర్లు మంచి ప్రణాళికలతో పనులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీరు సుధాకర్, కార్యనిర్వాహక ఇంజనీరు శ్రీనివాసులు,  ఉప కార్యనిర్వాహక ఇంజనీరు రమేష్, సహాయ ఇంజనీర్లు శ్రీనివాసరావు, పాణిగ్రాహి, మధు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-19 15:10:55

పల్లెల ప్రగతికి సీఎం జగన్ శ్రీకారం..

పల్లెల ప్రగతికి రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో మంచి మనసుతో శ్రీకారం చుట్టారని రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. బూర్జ మండలం గుత్తావల్లి గ్రామంలో పలు అభివృద్ధి  పనులకు సోమవారం స్పీకర్ శంకుస్థాపన చేసారు. అంతకుముందు హరిత వన హారం (జగనన్న పచ్చతోరణం)లో భాగంగా లాభం నుండి గుత్తావల్లి వెళ్ళే రహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. గుత్తావల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. బల్క్ మిల్క్ కూలింగ్  సెంటర్ కు,  జగనన్న కాలనీలో  ఇల్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ పాలనా వ్యవస్థకు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి జీవం పోస్తున్నారన్నారు. ప్రతి రెండు  వేల జనాభాకు ఒక క్లస్టర్ గా ఏర్పాటు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకు వచ్చారని పేర్కొన్నారు. సచివాలయంతోపాటు రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ ప్రజలకు దగ్గరగా పాలనను తీసుకు వచ్చిన వ్యక్తి జగన్ అన్నారు.  ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీరును నియమించి ప్రజలకు పాలనా వ్యవస్థను అందుబాటులో ఉంచిన ఘనత దేశంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. 

జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే అవినీతిలేని పారదర్శక ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పి సుపరిపాలనకు నాంది పలికారని అన్నారు.  ముఖ్యమంత్రి ప్రగతి రథ సాధకుడని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు.  వై.యస్. జగన్ మోహన్ రెడ్డి  నగదు బదిలీ (క్యాష్ ట్రాన్స్ఫర్) విధానం ద్వారా అవినీతి లేని పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. విజ్ఞానవంతమై సమాజ నిర్మాణంలో వ్యవసాయదారుడు నిలబడాలని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సలహాలు, సూచనలు అందించి అధునాతన వ్యవసాయ పద్ధతుల ద్వారా నిలదొక్కుకునే విధంగా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన వివరించారు. పల్లెలను ప్రగతి పథంలో నడిపించాలని కలలు కన్న ముఖ్య మంత్రి అన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించాలని, వై.యస్.ఆర్ యంత్ర సేవ ద్వారా ఆధునిక పరికరాలు అందుబాటులో జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటికే 150 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని స్పీకర్ వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్ధానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-19 15:08:39

ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించండి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థలో పెండింగులో ఉన్న ఆడిట్ అభ్యంతరాలును వెంటనే పరిష్కరించాలని జివిఎంసి ఫైనాన్సు అడ్వైజర్ మల్లికాంబ అన్నారు. ఈ విషయమై సోమవారం ఆమె కమిషనర్ ఆదేశాల మేరకు జివిఎంసి విభాగాధిపతులు, జోనల్ కమిషనర్లతోను జివిఎంసి పాత సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో ఫైనాన్సు అడ్వైజర్ మల్లికాంబ మాట్లాడుతూ జివిఎంసి నందు 1998-99 నుండి 2017-18 సంవత్సరం వరకు పెండింగులో ఉన్న ఆడిట్ అభ్యంతరాలను వెంటనే పరిష్కరించవలసి ఉందని అన్నారు. ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్ అధికార్లు, సూపరింటెండ్లతో రెండు సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆడిట్ అభ్యంతరాలపై సమాధానాలు సిద్ధంగా ఉన్నట్లయితే స్టేట్ ఆడిట్ రీజనల్ డిప్యుటీ డైరెక్టర్ వారి సహకారంతో వాటిని పూర్తి చేయవచ్చని అన్నారు. జివిఎంసి అన్ని విభాగాధిపతులు, జోనల్ కమిషనర్లు వెంటనే సంబంధిత సిబ్బంది ద్వారా సమాధానాలు సిద్ధం చేయాలని అన్నారు. ఈ విషయమై జివిఎంసి అందరు అధికార్లు, జోనల్ కమిషనర్లతో తేది.20-07-2021న తదుపరి సమావేశం నిర్వహిస్తామని ఫైనాన్సు అడ్వైజర్ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

GVMC office

2021-07-19 15:06:45

ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలి..

మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలో ప్రజల ద్వారా వినతులు, డయల్ యువర్ కమిషనర్ అర్జీలను తక్షణమే పరిష్కరించాలని కమిషనర్ డా.స్రిజన అధికారులను ఆదేశించారు. సోమవాంర జి.వి.ఎం.సి. ప్రధాన కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో కమిషనర్   టోల్ ఫ్రీ నం. 1800-4250-0009 ద్వారా నిర్వహించారు. ఫోన్ ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు.  ఆయా విభాగాల అధికారులకు / జోనల్ కమిషనర్లకు పంపించారు. ఇందులో రెండవ జోనుకు 05 ఫిర్యాదులు / వినతులు,  మూడవ జోనుకు 01, నాలుగవ జోనుకు 01, అయిదవ జోనుకు 02, ఆరవ జోనుకు 02, ఎనిమిదవ జోనుకు 04, యుసిడి విభాగమునకు 01, మొత్తము 16 ఫిర్యాదులు / వినతులు ఫోను  ద్వారా స్వీకరించారు. అనంతరం ప్రధాన కార్యాలయ విభాగపు ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులతో పాటూ, స్పందన కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులు, మున్సిపల్ పరిపాలన శాఖ వెబ్ సైట్ ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ డా. జి. సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం అధికారులతో కమిషనర్ మాట్లాడుతూ వారంలో 4 రోజులు విభాగాధిపతులు, వార్డు స్పెషల్ ఆఫీసర్లు 2 రోజులు తప్పకుండా సంబంధిత సచివాలాయాలను పర్యవేక్షించవలసి ఉందని, ఆలా గతవారం పర్యవేక్షించని వారికి చార్జ్ మెమోలను జారీచేయమని అదనపు కమిషనర్ ఎ. వి. రమణిని ఆదేశించారు.  వార్డు కార్యదర్శులు అందరూ క్రమం తప్పకుండా ప్రతీ రోజూ మధ్యాహ్నం 2 గంటల నుండి 5గంటల వరకు సచివాలయాలలోనే ఉంటూ ప్రజలకు సేవలందించాలని అన్నారు. సచివాలయాలు ఆయా వార్డు పరిధిలోనే ఉండేటట్లు ఏర్పాటు చేయాలని జోనల్ కమిషనర్లను కమిషనర్ ఆదేశించారు. సచివాలయాల పరిధిలో మ్యాపింగు కాని ఇళ్ళు ఉండకూడదని, అందుకు మ్యాపింగు వెంటనే చేయాలన్నారు. ఒక వేళ ఏ ఇంటిలోనైనా సంబంధిత ఆధార్ కార్డు లేనట్లయితే వారు వెంటనే ఆధార్ కార్డు పొందిన తరువాత మాత్రమే ఆన్ లైన్లో ఆయా ఇళ్ళకు మ్యాపింగ్ చేసేటట్లు చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్లకు కమిషనర్ ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో ప్రధాన ఇంజినీరు రవికృష్ణ  రాజు , అదనపు కమిషనర్లు ఎ. వి. రమణి, డా. వి. సన్యాసిరావు,  సిసిపి. విద్యుల్లత,  ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, డి.సి.ఆర్. నల్లనయ్య, జె.డి.(అమృత్) విజయ భారతి, ఎఫ్.ఎ. & ఎ.ఒ. మల్లికాంబ, డి.పి.ఒ. చంద్రిక, పర్యవేక్షక ఇంజినీర్లు రాజా రావు, వినయ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-07-19 14:59:59

Sc,Stకేసులను సత్వరమే పరిష్కరించాలి..

విశాఖజిల్లాలో  నమోదైన  ఎస్ సి, ఎస్ టి అట్రాసిటి కేసులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా జిల్లాకలెక్టర్ మరియు జిల్లా విజిలెన్స్ మరియు మోనటరింగ్  కమిటీ  చైర్మన్ వి.వినయ్ చంద్ సంబందిత అధికారులను  ఆదేశించారు. సోమవారం  స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో  జిల్లా స్థాయి  విజిలెన్స్ మరియు మోనటరింగ్  కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా  కలెక్టర్ మాట్లాడుతూ  ఏప్రిల్ లో జరగవలసిన  త్రైమాసిక సమావేశం  కోవిడ్ ఉదృతంగా ఉండడంతో  అధికారులందరు  కోవిడ్ విదులలో  ఉన్నందున  నిర్వహించలేదన్నారు.  ఎస్ సి, ఎస్ .టి కేసులు తక్కువ గా నమోదై  రాష్ట్రంలో మన జిల్లా  రెండవ స్థానంలో నిలిచిందన్నారు. డి ఆర్ ఓ, జాయింట్ కలెక్టర్, పోలీస్ కార్యాలయాలకు అట్రాసిటి  కేసులకు   సంబందించి సమస్యల పిటీషన్లు సమయంతో సంబందం లేకుండా వేరు వేరుగా  వస్తున్నాయన్నారు.  ఆ విదంగా కాకుండా  డి ఎస్ పి, ఎస్ సి, ఎస్ టి సెల్ రూరల్ మరియు అర్భన్ కార్యాలయాలకు  అందిన ఫిర్యాదులను వారాంతపు నివేదికలాగ తయారు చేసి   పంపించాలన్నారు. ఎప్పటి కప్పుడు ఆర్ డి ఓ లు, డి ఎస్ పి లు  ఎఫ్ ఐ ఆర్, చార్జిసీట్ లకు సంబందించిన కేసులను  గూర్చి సమీక్షించు కోవాలన్నారు. చాలా మండలాలలో కులదృవీకరణ పత్రాలకు సంబందించి పెండింగులో ఉన్నట్లు  తమ దృష్టికి వచ్చాయని  ఆర్ డి ఓ లు వాటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి  వారంరోజులు లోగా   పరిష్కరించాలని  ఆదేశించారు. 

 ఎస్ సి, ఎస్ టి అట్రాసిటి   కేసులకు   సంబందించి 60 రోజులు లోగా విచారణ పూర్తి చేసి  చార్జిషీట్ పైలు  చేయాలన్నారు. ఎఫ్ ఐ ఆర్ నుండి చార్జిషీట్ మధ్యలో ఎక్కువ సమయం  లేకుండా చూడాలన్నారు. . ఎఫ్ ఐ ఆర్ పూర్తి అవగానే బాదితులకు  పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నారు. అత్యాచారం, హత్యలకు సంబందించి అదనపు రిలీఫ్ పేమెంట్ అందజేయాలన్నారు.   సబ్ డివిజన్ స్థాయిలో ఈ నెల 31వ తేదీ లోపల  విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ఎస్ సి , ఎస్ టి అట్రాసిటి   కేసుల బాదితులకు  అందించాల్సిన రిలీఫ్ పేమెంట్ లను సంబందిత   డి ఎస్ పిలు  కన్సాలిడేట్ చేసి  తీసుకొని వస్తే నిర్థిష్టసమయంలో పేమెంటు చేసే అవకాశం ఉంటుందన్నారు. సాంఘీక సంక్షేమ శాఖ జాయింట్ డైరక్టర్ ఆర్ వి రమణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో  ఇన్విష్టిగేషన్ పరిదిలో  UI 219 కేసులు , PT 697 కేసులు  పెండింగ్ లో ఉన్నాయన్నారు. పట్టణ పరిదిలో  511, గ్రామీణ పరిదిలో 186  UI కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో శాసన సభ్యులు శెట్టి ఫల్గుణ, కె. భాగ్యలక్ష్మి, జి.వి.ఎం .సి కమిషనర్ జి.సృజన, రూరల్ ఎస్ పి కృష్ణారావు,  జాయింట్ కలెక్టర్లు  వేణు గోపాలరెడ్డి, పి.అరుణ్ బాబు,  ఆర్. గోవిందరావు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆర్. గోపాల కృష్ణ, పాడేరు సబ్ కలెక్టర్ అబిషేక్,  విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్ డి ఓ లు  పెంచల కిశోర్, సీతారామారావు, అనిత, పోలీస్ అధికారులు,  DVMC మెంబర్లు పూండి మల్లేశ్వరరావు, ఏసేబు, సత్యం  తదితరులు హాజరయ్యారు.

Visakhapatnam

2021-07-19 14:58:39

సాహసయాత్రలతో చైతన్య స్ఫూర్తి..

సాహసయాత్రలు చేయడంల ప్రపంచాన్ని తెలుసుకునే ఒక గొప్ప అవకాశం కలుగుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. నగరానికి చెందిన గంట్ల హర్షవర్ధన్ ఇటీవలే విశాఖ నుంచి చైనా సరిహద్దు వరకూ మోటార్ బైక్ సాహసయాత్ర చేపట్టి విజయ వంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో సోమవారం కలెక్టర్ తన కార్యాలయం లో హర్ష వర్ధన్ ను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటువంటి సాహసయాత్రలు వల్ల చైతన్యంతో పాటు ఒక గొప్ప స్ఫూర్తి కూడా వారిలో కలుగుతుందన్నారు. సమాజానికి అవసరమైన సందేశం ఇచ్చేందుకు ఈ  తరహా యాత్రలు దోహదం చేస్తాయన్నారు. అంతేకాకుండా సాహస యాత్రికుల్లో  ప్రజలకు సామాజిక చైతన్య కార్యక్రమాల కోసం తెలియజేసే మంచి అవకాశం కలుగుతుందన్నారు. విశాఖ నుంచి చైనా సరిహద్దు వరకు మోటార్ బైక్ పై యాత్ర చేయడం ఒక గొప్ప సాహసంతో పాటు అంతకు మించిన మధురానుభూతి నింపుతుందన్నారు.ఈ సాహస యాత్ర వివరాలు ను  కలెక్టర్ కు హర్ష వర్ధన్ తెలియచేయగా, తొలి ప్రయత్నంలోనే నాలుగు వేల కిలోమీటర్లు మోటార్ బైక్ పై యాత్ర చేయడం సాహసోపేతమైన చర్య గా వినయ్ చంద్ అభివర్ణించారు. అనంతరం గ్రేటర్ కమిషనర్ సృజన హర్ష ను అభినందించారు. జాతీయ జర్నలిస్టుల సంఘం  కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, తన కుమారుడి అభిరుచి మేరకే సాహస యాత్రకు ప్రోత్సహించామన్నారు. గతంలో చిన్న చిన్న కార్యక్రమాలు చేసినప్పటికీ ఈసారి నాలుగు వేల కిలోమీటర్ల సాహసయాత్రకు పూనుకోవడంతో తాము కూడా ప్రోత్సాహం అందించామన్నారు.  విశాఖలో సాహసయాత్రలు చేసే వారికి కొదవలేదని,అయితే వారికి తగిన ప్రోత్సాహం అందించే బాధ్యతను ప్రభుత్వంలు కూడా తీసుకోవాలని కోరారు. అర్ డీ డీ. మనిరామ్ తదితరులు పాల్గన్నారు.  అంతకు ముందు యాత్ర ను విజయవంతం గా పూర్తి చేసుకొని నగరానికి చేరుకున్న హర్ష వర్ధన్ కు సాదర స్వాగతం లభించింది. నగరం లో వేర్వేరు ప్రాంతాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఈ యాత్రలో పాల్గొన్నారు.

Visakhapatnam

2021-07-19 14:57:30

మాస్కులు లేకపోతే అనుమతించవద్దు..

విశాఖ జంతు ప్రదర్శశాలలో సందర్శకులకు మాస్కులు లేకుండా అనుమతించవద్దని అటవీశాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.ప్రతీప్ కుమార్ జూ అధికారులను ఆదేశించారు. కోవిడ్ అనంతరం సోమవారం తిరిగి జూలోకి సందర్శకులను అనుతించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందన్నారు. జూ, కంబాల కొండ ఎకో పార్కుకి వచ్చేవారంతా కరోనా నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. బౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్ ఇలా అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా పార్కులో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీఎఫ్, మరియు జూ క్యూరేటర్ లుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-07-19 14:56:49

మురికివాడల సర్వేపై సూచనలు చేయండి..

మహా విశాఖపట్నం నగరాపాలక సంస్థ పరిధిలో మురికివాడల ప్రాంతాలను అభివృద్ధి పరిచి, మెరుగైన మౌళిక సదుపాయాలను కల్పించడమే జివిఎంసి లక్ష్యమని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం తన కార్యాలయలో మీడియాతో మాట్లాడారు. మురికివాడల సర్వే విషయమై  పలు ప్రాంతాలలో సమగ్ర సర్వే నిర్వహించామన్నారు. ఈ సర్వేలో సేకరించిన నివాసితుల వివరాలను, మ్యాపులను, మౌళిక సదుపాయాలు తదితర వివరాలను సచివాలయాలాలలో ప్రదర్శించామన్నారు. వీటిపై సూచనలను, సలహాలను వారం రోజులలోగా సచివాలయాలలోగాని, జోనల్ ఆఫీసులలోగాని, జివిఎంసి ప్రధాన కార్యాలయం నందు గాని ప్రజలు తెలియ చేయవచ్చునని జివిఎంసి కమిషనర్ నగర వాసులను కోరుతున్నారు.

GVMC office

2021-07-19 14:55:59

కాటేజీల‌ను ప‌రిశుభ్రంగా ఉంచాలి..

తిరుమ‌ల‌లోని కాటేజీల‌ను మ‌రింత ప‌రిశుభ్రంగా ఉంచేందుకు త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల‌ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహం ప్రాంతంలోని ప‌లు కాటేజీల‌ను సోమ‌వారం అద‌న‌పు ఈవో త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ ప్ర‌తి కాటేజీలో చెక్‌లిస్టు రూపొందించాల‌ని, త‌ద్వారా యాత్రికుల‌కు కేటాయించే స‌మ‌యంలో సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్ వ‌స‌తుల‌తోపాటు ప‌రిశుభ్ర‌తాచ‌ర్య‌లు చ‌క్క‌గా ఉండేలా చూడాల‌ని సూచించారు. కాటేజీల‌కు వార్షిక నిర్వహణ ఒప్పందం కుదుర్చుకుని ఎప్ప‌టిక‌ప్పుడు మ‌ర‌మ్మ‌తులు పూర్తి చేయాల‌న్నారు. గ‌దుల్లో ఉన్న సోఫాలు, టీపాయ్‌లు, టాయ్‌లెట్ల‌ను ప‌రిశీలించారు. స్నానపుగదుల్లో చ‌క్క‌టి సువాస‌న వ‌చ్చేలా, కాటేజీ ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. గదుల లోప‌ల లీకేజీల‌ను అరిక‌ట్టాల‌ని, అక్క‌డ‌క్క‌డ విరిగిన చెట్ల కొమ్మ‌ల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని ఆదేశించారు. అవ‌స‌ర‌మైన చోట్ల సుంద‌రంగా ఉద్యాన‌వ‌నాల‌ను అభివృద్ధి చేయాల‌న్నారు.  అద‌న‌పు ఈవో వెంట టిటిడి వ‌స‌తిక‌ల్ప‌న విభాగం డెప్యూటీ ఈవోలు లోక‌నాథం,  భాస్క‌ర్‌, ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ సునీల్‌, డిఎఫ్‌వో  చంద్ర‌శేఖ‌ర్‌, గార్డెన్ డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాసులు, ఇఇలు  శ్రీ‌హ‌రి, మ‌ల్లికార్జున‌ప్ర‌సాద్ త‌దిత‌రులు ఉన్నారు.

Tirumala

2021-07-19 14:54:29

శ్రీకాకుళం స్పందన కి 21 వినతులు..

శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 21 వినతులు అందాయి. సోమవారం కలెక్టర్  కార్యాలయంలోని  ప్రజా ఫిర్యాదుల విభాగంలో స్పందన కార్యక్రమం ఫోన్ ద్వారా జరిగింది.  ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పలువురు ఫోన్ కాలర్స్ తమ ఫిర్యాదులను వివరించారు. అరసవల్లి నుండి యస్.పుష్పలత కుమారి ఫోన్ చేసి మాట్లాడుతూ తన తల్లికి వై.యస్.ఆర్.చేయూత పథకం ఇంతవరకు అందలేదని, కావున దానిని మంజూరుచేయాలని కోరారు. సారవకోట మండలం అలుదు నుండి ఆర్.జగన్నాధరావు మాట్లాడుతూ వృద్ధుడైన తనకు వృద్ధాప్య పింఛనును మంజూరుచేయాలని కోరారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని యం.సరోజ ఫోన్ చేసి మాట్లాడుతూ తనకు విద్యాదీవెన మంజూరుచేయాలని కోరారు. సరుబుజ్జిలి నండలం మతలబుపేట నుండి వాలంటీరు యు.ఈశ్వరరావు మాట్లాడుతూ వాలంటీర్లకు ప్రకటించిన అవార్డు డబ్బులు ఇంతవరకు తనకు అందలేదని, కావున పురష్కార నగదు రూ.10వేలు మంజూరుచేయాలని కోరారు. సోంపేట నుండి బి.వంశి మాట్లాడుతూ సోంపేటలో అక్రమ కట్టడాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. సారవకోట మండలం అన్నుపురం నుండి బి.గణపతిరావు మాట్లాడుతూ పట్టాదారు పాసుపుస్తకం మంజూరుచేయాలని కోరారు. జి.సిగడాం నుండి ఇ.హరనాథ బాబా మాట్లాడుతూ డి – పట్టా భూమిని అక్రమంగా విక్రయించారని, అలాగే ఒక చెరువు నుండి మరో చెరువుకు నీరు వెళ్లే మార్గాన్ని మూసివేసి దాన్ని కూడా అక్రమంగా విక్రయించేసారని, కావున బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు నుండి యన్.ఉషారాణి మాట్లాడుతూ జగనన్న కాలనీలో తనకు ఇంటి స్థలాన్ని మంజూరుచేయాలని కోరు. భామిని మండలం బురుజోల నుండి ఎ.హరిబాబు మాట్లాడుతూ వి.ఎ.ఎ విద్యుత్ బోర్లు మరియు ట్రాక్టర్లను మంజూరుచేయాలని కోరారు. పొందూరు మండలం లోలుగు నుండి పి,సీతారాజు మాట్లాడుతూ సర్వేనెం.45 – 28లోని 16 సెంట్ల భూమిని నమోదు చేసి 1బి అడంగళ్ మంజూరుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదుల విభాగం ( స్పందన ) సిబ్బంది హెచ్. సెక్షన్  సూపరింటిండెంట్ చలమయ్య, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-19 14:52:42

హోట‌ళ్ల‌లో నిర్వ‌హ‌ణ చ‌క్క‌గా ఉండాలి..

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా హోట‌ళ్ల‌లో ప‌రిశుభ్ర‌త‌, నిర్వ‌హ‌ణ చ‌క్క‌గా ఉండేలా నిర్వాహ‌కులు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి కోరారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో సోమ‌వారం హోట‌ళ్ల నిర్వాహ‌కులు, ఆస్థాన‌మండ‌పంలో స్థానికులు, దుకాణాల వ్యాపారుల‌తో అద‌న‌పు ఈవో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా హోట‌ళ్ల నిర్వాహ‌కుల స‌మావేశంలో అద‌న‌పు ఈవో మాట్లాడుతూ భ‌క్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్య‌మైన భోజ‌నం అందించేందుకు తిరుమ‌ల‌లోని 15 ప్రాంతాల్లో లాభాపేక్ష లేకుండా హోట‌ళ్లు నిర్వ‌హించేందుకు ప‌లువురు వ్య‌క్తులు, సంస్థ‌లు ముందుకొస్తున్నాయ‌ని చెప్పారు. అన్ని హోట‌ళ్ల‌లో ధ‌ర‌ల ప‌ట్టిక‌లు క‌నిపించేలా ఏర్పాటుచేయాల‌ని, కంప్యూట‌రైజ్డ్ బిల్ ఇవ్వాల‌ని, డిజిట‌ల్ చెల్లింపుల‌ను అనుమ‌తించాల‌ని, ప‌రిశుభ్ర‌త‌, నిర్వ‌హ‌ణ చ‌క్క‌గా ఉండాల‌ని సూచించారు. హోట‌ళ్లు, దుకాణాల్లో అగ్నిమాప‌క ప‌రిక‌రాల‌ను త‌ప్ప‌నిస‌రిగా ఏర్పాటు చేయాల‌న్నారు. లీజు పొందినవారు స‌బ్‌లీజుకు ఇవ్వ‌రాద‌న్నారు. సేక‌ర‌ణ‌కు వీలుగా త‌డి చెత్త‌, పొడి చెత్త‌ను వేరు చేయాల‌న్నారు.

             ఆస్థాన‌మండ‌పంలో అద‌న‌పు ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌లోని దుకాణాలు, హాక‌ర్ లైసెన్సులు, బాలాజిన‌గ‌ర్‌లోని ఇళ్ల‌ను కొంత‌మంది అన‌ధికారికంగా పొందిన‌ట్లు స‌మాచారం ఉంద‌ని, కావున ప్ర‌తి లైసెన్సును క్షుణ్ణంగా త‌నిఖీ చేసి స‌క్ర‌మంగా ఉన్న‌వారికి ఫొటో గుర్తింపుకార్డు మంజూరు చేస్తామ‌న్నారు. స్థానికుల వివ‌రాల‌న్నింటినీ కంప్యూట‌ర్‌లో న‌మోదు చేస్తామ‌ని తెలిపారు. అలిపిరి చెక్‌పాయింట్ వ‌ద్ద భ‌క్తులతో క‌లిసి చెక్ చేసుకోవ‌డం ఇబ్బందిగా ఉంద‌ని స్థానికులు విజ్ఞ‌ప్తి చేశార‌ని, వీరికోసం ప్ర‌త్యేక వ‌రుస ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. స్థానికులు ప‌లు స‌మ‌స్య‌లు తెలియ‌జేశార‌ని, త‌న ప‌రిధిలో ఉన్న‌వాటిని వెంట‌నే ప‌రిష్క‌రిస్తాన‌ని, మిగ‌తా స‌మ‌స్య‌ల‌ను ఈవో దృష్టికి, బోర్డు దృష్టికి తీసుకెళ‌తామ‌ని వివ‌రించారు. ఈ స‌మావేశాల్లో టిటిడి ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ సునీల్‌, డెప్యూటీ ఈవో  విజ‌య‌సార‌థి, విజివో  బాలిరెడ్డి, హోట‌ళ్ల నిర్వాహ‌కులు, దుకాణాల వ్యాపారులు, స్థానికులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-19 13:50:01

యువత దేశ రక్షణకు ముందుకి రావాలి..

యువత సైన్యం లో చేరి దేశ సేవలో భాగస్వామ్యం కావాలని, భారత సైన్యాన్ని పెంచుదాం –దేశ రక్షణకు తోడ్పడుదామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గనులు భూగర్బ శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం  జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్, జిల్లా సంయుక్త కలెక్టర్లు , (అభివృద్ధి) వి.వీరబ్రహ్మం,( సంక్షేమం) రాజశేఖర్, సబ్ కలెక్టర్ యం.జాహ్నవి, తంబళ్ళపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డిలతో కలసి పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని మండలాలకు సంబందించిన నిరుద్యోగులకు ప్రభుత్వ శుభరాం డిగ్రీ కళాశాల నందు  యువతకు ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ క్యాంపు నిర్వహణ  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమన్నారు.  రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మంజూరు అయిందన్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఫ్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యక్రమం ద్వారా యువతకు ఉపాధి అవకాశం కల్పించి వారి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయలన్నదే ముఖ్య ఉద్దేశమని వివరించారు. 
     ఇక్కడ సెలెక్ట్ చేసిన యువతకు తిరుపతి ఎస్వీ డిఫెన్స్ అకాడమీ ద్వారా 60 రోజుల ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నామని, శిక్షణ సమయంలో భోజనం వసతి ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. శేషారెడ్డి ఆధ్వర్యంలో యువతకు శిక్షణ ఇచ్చి గతంలో కూడా చాలా మందికి పారా మిలటరీ లో ఉద్యోగ అవకాశం కల్పించారని తెలిపారు. శిక్షణలో పాల్గొన్న యువత కష్టపడి ఉద్యోగం సంపాదించుకుని దేశ సేవలో భాగస్వాములు  కావడమే కాకుండా వారి కుటుంబానికి ఆర్థిక అభివృద్ధికి యువత సహాయపడాలని తెలిపారు.  గత ఫిబ్రవరి మాసములో  ఇక్కడే  జాబ్ మేళా నిర్వహించి సుమారు 2400 మంది యువతకు వివిధ కంపెనీ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న మాజీ సైనికుల సమస్యల పరిష్కారం కోసం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మాజీ సైనికులకు కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం గతంలో ఎంపి నిధులు ద్వారా రూ.10 లక్షలు మంజూరు చేయడం జరిగిందని, అది  సరిపోకపోవడం లేదని వారు నా దృష్టికి తీసుకురావడంతో ఇప్పుడే కలెక్టర్ తో మాట్లాడి జడ్పీ నిధుల నుండి రూ.10 లక్షలు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు.  రూ.5050 కోట్ల తో గండికోట రిజర్వాయర్ నుండి జిల్లాకు త్రాగు - సాగు నీరు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రూ.6800 కోట్ల తో పుంగనూరు బ్రాంచ్ కాల్వ ద్వారా కుప్పం నియోజకవర్గానికి నీరు ఇవ్వడం జరుగుతుందన్నారు. హంద్రీనీవా కాల్వను మూడు  రెట్లు వెడల్పు  చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కుళాయిలు ద్వారా త్రాగునీరు అందజేయడం జరుగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలలో ఒక దిక్సూచి గా పని చేస్తున్నారని తెలిపారు. ఈ మూడు సంవత్సరాలలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత నే ఎన్నికలకు రావడం జరుగుతుందని తెలిపారు.
     ఈ కార్యక్రమంలో తంబల్లపల్లి ఎమ్మెల్యే ద్వారాకనాథ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబానికి ఎదో రకంగా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో  ఈరోజు ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశం తెలిపారు.

    ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ హరినారాయణన్ మాట్లాడుతూ ఈ దేశానికి  బలం యువకులని, వారిని మంచి దారిలో తీసుకెళ్లాలని, వారి జీవతంలో వెలుగుతీసుకురావలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి, ముందుండి నడిపించాలన్నదే  మంత్రిగారి  ఆలోచన అన్నారు. ఆయన ఆలోచనలను కార్యాచరణ చేసి ముందుకు తీసుకెల్లే  ఈ రోజు గొప్పగా ప్రారంబించడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందన్నారు.  మన దేశంలో చాలా మంది  యువకులు చదువుకొని, కొంత మంది చదువులేనివారు కూడా ఎలా జీవితంలో ముందుకెళ్లాలని ఆలోచన ఉన్నప్పుడు, నిజంగా ఈ యొక్క ఆర్మీ రెక్రూట్మెంట్ నిరుద్యోగ యువతకు ఉపయోగపడుతున్నారు. దేశంలో 25 వేల మందికి ప్రీ ఆర్మీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడిందన్నారు. గ్రామీణ ప్రాంతంలో చాలామంది యువకులు వ్యవసాయం చేసి పంట పొలాల్లో తిరిగి పని చేసిన వారు చాలా ధృఢంగా  ఉంటారని, వారికి కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి దారి చూపిస్తే కచ్చితంగా వారు ఆర్మీ, ప్యారా మిలిటరీ  కి సెలెక్ట్ అవుతారని తెలిపారు.  ఒక సారి ఉద్యోగం వచ్చిందంటే వారి కుటుంబం ఆర్థికంగా అభివృద్ది చెందుతుందని తెలిపారు. ఈ ప్రాంత యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ ఉద్యోగంలో చేరడానికి శిక్షణతో బాగా ఉపయోగపడుతుందని, శిక్షణ పొంది ఉద్యోగాలు సంపాదించుకోవాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, అధికారులు వివిధ హోదాలలో దేశరక్షణ కోసం పని చేసి ఇక్కడికి వచ్చిన మాజీ సైనిక అధికారులకు అభినందనలన్నారు. మాజీ సైనికులు ఇక్కడ శిక్షణ పొందే వారికి మీ అనుభవాలను వారికి తెలియజేయాలన్నారు. 

ఈ కార్యక్రమంలో మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఎన్. వెంకట్ రెడ్డి యాదవ్, ఏపీ అండ్ క్రియేటివిటీ అకాడమీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, పుంగనూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నాగరాజ రెడ్డి  , జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర  కౌన్సిల్  మెంబర్ ముత్తంశెట్టి విశ్వనాథం,  వైయస్సార్ సిపి అధికార ప్రతినిధిలు పోకల అశోక్ కుమార్, పెద్ది రెడ్డి   ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అంతకుమునుపు భారత సైన్యం వివిధ హోదాల్లో పనిచేసిన మాజీ సైనిక అధికారులను  శివ ప్రసాద్, నరసింహారెడ్డి, సి వి రమణలను మంత్రి, కలెక్టర్ దుశ్సాలువతో  సన్మానించి, మొమెంటోలు అందించారు. అనంతరం మంత్రి, కలెక్టర్ గారు ఎమ్మెల్యే అధికారులు పావురాలను గాలిలోకి వదిలిపెట్టారు. అంతకముందు సభా ప్రాంగణం చేరుకొన్న మంత్రిగారు జాతీయ జండాను  ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంబించారు.
  
       ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ కమిషనర్ ఓ ఎస్ డి దుర్గాప్రసాద్, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, సెట్విన్ సి.ఈ.ఓ మురళీకృష్ణ రెడ్డి, డి.ఎస్.ఒ సయ్యద్ భాష, జిల్లా పంచాయతీ అధికారి దశరధ రామిరెడ్డి, డి.ఈ,ఓ పురుషోత్తం, డి.సి.హెచ్.ఎస్ డాక్టర్ సరళమ్మ, మున్సిపల్ కమిషనర్ కె ఎల్ వర్మ, s v డిఫెన్స్ అకాడమీ అధ్యక్షులు శేషా రెడ్డి, మునిసిపల్ చైర్మన్ అలీం భాష, వైస్ చైర్మన్ నాగేంద్ర,  మున్సిపల్ కౌన్సిలర్లు, పుంగనూరు నియోజకవర్గంలోని మండల తహశీల్దార్ లు, ఎంపీడీవోలు, మాజీ సైనికులు, వై.ఎస్.ఆర్.సి.పి పార్టీ నాయకులు  తదితరులు, పాల్గొన్నారు.

Tirupati

2021-07-19 13:39:11

చిత్తూరుకి 20వేల కోవిడ్ వేక్సిన్ డోసులు..

చిత్తూరు జిల్లాలో ప్రభుత్వం నుంచి 8వేల కోవ్యాక్సిన్, 20 వేల కోవిషీల్డ్ వ్యాక్సిన్ వచ్చిందని అర్హులైన వారికి మాత్రమే వ్యాక్సిన్ వేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్(ఆసరా) రాజశేఖర్ అన్నారు. సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అర్బన్ హెల్త్ సెంటర్ లకు ఈ వ్యాక్సిన్ను పంపడం జరిగిందని 45 సంవత్సరాలు పైబడిన వారికి రెండవ డోసు, గర్భిణీ మహిళలకు, ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఉన్న మహిళలకు మొదటి డోస్ వ్యాక్సిన్ వేయాలని ఆయన అన్నారు. వ్యాక్సిన్ అతి విలువైనది అని వృధా చేయకూడదని ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని ఏ మాత్రం అతిక్రమించిన వారిపై చట్టపరంగా ఏ మాత్రం అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని వైద్యాధికారులకు జాయింట్ కలెక్టర్ (ఆసరా) రాజశేఖర్ సూచించారు.

Chittoor

2021-07-19 13:35:41

చిత్తూరు జిల్లాలో 553 మందికి అక్రిడిటేషన్లు..

చిత్తూరు జిల్లాలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్ లకు 2021-22 సంవత్సరానికి 553 మందికి మీడియా అక్రెడిటేషన్లు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశపు మందిరంలో జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ సమావేశం ఛైర్మన్, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సమాచార శాఖ వెబ్ సైటులో  దరఖాస్తు చేసుకున్న జర్నలిస్ట్ లకు జి.ఓ ఎం.ఎస్ నెం.142 లోని నియమ నిబంధనల మేరకు అర్హులైన వారికి అక్రెడిటేషన్లు మంజూరు చేశామని, తక్కిన దరఖాస్తులను పెండింగ్ లో ఉంచి వారు 15 రోజుల లోపు సమర్పించవలసిన డాక్యుమెంట్లను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన అనంతరం వారికి కూడా అర్హత మేరకు అక్రెడిటేషన్లు మంజూరు చేస్తామని తెలిపారు. తమిళ దిన పత్రికలు, చానెల్ లలో పని చేసే మీడియా ప్రతినిధులకు అక్రెడిటేషన్ మంజూరు చేసేందుకు జి.ఓ లో రూల్స్ లేనందున,  కమిషనర్, సమాచార శాఖ విజయవాడ నుండి క్లారిఫికేషన్ పొందిన అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే తిరుమలలో పని చేస్తున్న విలేకరులకు తిరుమల కేంద్రంగా నమోదు చేసుకోవడానికి కమిషనర్ సమాచార శాఖ వారిని చర్యలు తీసుకోవాలసినదిగా కోరాలని సూచించారు. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు డిఎం అండ్ హెచ్ఓ శ్రీహరి, హౌసింగ్ పిడి పద్మనాభం, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ యం. బాలు నాయక్, సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్, చిత్తూరు ఎన్. వెంకటేసులు, రిజర్వేషన్ ఇన్స్పెక్టర్, తిరుపతి జె. సుబ్రమణ్యం, డిఎం ఏపిఎస్ ఆర్టిసి, చిత్తూరు కిరణ్ కుమార్, మెంబర్ కన్వీనర్ మరియు సమాచార శాఖ డిడి ఐ&పిఆర్ ఐ.ఆర్ లీలావతి పాల్గొన్నారు. 

Chittoor

2021-07-19 13:30:14

విజయనగరం స్పంద‌నకి 382 వినతులు..

స్పంద‌న విన‌తుల ప‌రిష్కారంపై ప్ర‌త్యేక దృష్టి  సారించి నిర్ణీత గ‌డువు దాట‌క‌ముందే వాటిని ప‌రిష్క‌రించాల‌ని క‌లెక్ట‌ర్ జిల్లా హరిజవహర్ లాల్ అధికారుల‌కు సూచించారు. వివిధ శాఖ‌ల వ‌ద్ద పెండింగ్‌లో ఉన్న ద‌ర‌ఖాస్తుల‌ను చ‌దివి వినిపించి వాటి రేప‌టిలోగా  వాటికి ప‌రిష్కారం చూపాల‌న్నారు. కోవిడ్ రెండో వేవ్ కార‌ణంగా గ‌త రెండు నెల‌లుగా స్పంద‌న విన‌తులు స్వీక‌రించే కార్య‌క్ర‌మం నేరుగా చేప‌ట్ట‌క‌పోవ‌డంతో సోమ‌వారం క‌లెక్ట‌ర్ కార్యాల‌య ఆడిటోరియంలో నిర్వ‌హించిన స్పంద‌న గ్రీవెన్స్ సెల్‌కు పెద్ద ఎత్తున అర్జీదారులు త‌ర‌లివ‌చ్చారు. ఉద‌యం 10 గంట‌ల నుంచే ప‌దుల సంఖ్య‌లో అర్జీదారులు ఆడిటోరియం వెలుప‌ల విన‌తిప‌త్రాల‌తో సిద్ధంగా వేచి వున్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, జిల్లా రెవిన్యూ అధికారి డా.ఎం.గ‌ణ‌ప‌తిరావు, డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు మేనేజ‌ర్ ప‌ద్మావ‌తి త‌దిత‌రులు విన‌తులు స్వీక‌రించారు. జిల్లా న‌లుమూల‌ల నుంచి 382 మంది అర్జీదారులు వివిధ స‌మస్య‌ల‌పై విన‌తులు అంద‌జేశారు. ఆయా స‌మస్య‌ల ప‌రిష్కారం నిమిత్తం క‌లెక్ట‌ర్, జాయింట్ క‌లెక్ట‌ర్ లు సంబంధిత శాఖ‌ల అధికారుల‌కు ఆ విన‌తుల‌ను పంపించి వాటి ప‌రిష్కారానికి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. డి.ఆర్‌.డి.ఏ. ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ సునీల్ రాజ్ కుమార్‌, సిపిఓ విజ‌య‌ల‌క్ష్మీ, జిల్లాప‌రిష‌త్ సి.ఇ.ఓ. టి.వెంక‌టేశ్వ‌ర‌రావు, హౌసింగ్ పి.డి. ఎస్‌.వి.ర‌మ‌ణ‌మూర్తి, డి.ఇ.ఓ. నాగ‌మ‌ణి, అన్ని శాఖ‌ల జిల్లా అధికారులు  పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-19 13:26:05