1 ENS Live Breaking News

డిపిఆర్వో రమేష్ కి ఏడిగా పదోన్నతి..

విజయనగరం జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి (డిపిఆర్వో) డి.రమేష్ కి పదోన్నతి లభించింది. ఆయనకు సహాయ సంచాలకులుగా (ఏ.డి ) గా పదోన్నతి కల్పిస్తూ, విజయనగరంలోనే నియమించారు. రమేష్ ప్రస్తుతం డిపిఆర్వో గా ఉంటూ  సుమారు రెండేళ్లుగా సహాయ సంచాలకులుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు కూడా రమేష్, జిల్లాలో డివిజనల్ పిఆర్వోగా, డిపిఆర్వో గా కూడా విధులు నిర్వహించారు. పదోన్నతి లభించిన రమేష్ ని పలువురు జిల్లా అధికారులు, పాత్రికేయులు, కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.

Vizianagaram

2021-07-09 14:16:12

ఎస్సీల నిధులు వారికే ఖర్చుచేయాలి..

విజయనగరం జిల్లాలో షెడ్యూల్డ్ కులాల‌కు కేటాయించిన నిధుల‌ను, వారి సంక్షేమం కోసం ఖ‌ర్చు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశించారు. ప్ర‌తీ ప్ర‌భుత్వ శాఖ‌, ఎస్‌సిల కోసం త‌మ బ‌డ్జెట్‌లో త‌ప్ప‌నిస‌రిగా 17.08 శాతానికి త‌గ్గ‌కుండా నిధుల‌ను ఖ‌ర్చుచేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. కేటాయించిన నిధుల‌ను ఖ‌ర్చుచేయ‌ని శాఖ‌లు, ఇక‌నుంచీ ప్ర‌త్యేకంగా దీనిపై దృష్టి కేంద్రీక‌రించి, వారి సంక్షేమం కోసం కృషి చేయాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. షెడ్యూల్డ్ కులాల ఉప ప్ర‌ణాళిక అమ‌లుపై క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో శుక్ర‌వారం స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. ముందుగా సాంఘిక సంక్షేమ‌శాఖ ఉప సంచాల‌కులు కె.సునీల్‌రాజ్‌కుమార్ మాట్లాడుతూ, ఉప ప్ర‌ణాళిక ల‌క్ష్యాల‌ను వివ‌రించారు. వివిధ శాఖ‌లు ప్ర‌ణాళిక అమ‌లులో భాగంగా తీసుకున్న చ‌ర్య‌ల‌ను చ‌దివి వినిపిచారు. ప్ర‌భుత్వ శాఖ‌ల‌న్నీ ఎస్‌సిల కోసం వెచ్చిస్తున్న నిధులు, సాధించిన ల‌క్ష్యాల‌ను తెలుసుకున్నారు.  ఎస్‌సిల‌కు ల‌బ్ది చేకూర్చిన ఫొటోల‌ను, పూర్తి వివ‌రాల‌ను, మండ‌లాల వారీగా జాబితాల‌ను నెల‌నెలా త‌మ‌శాఖ‌కు నివేదించాల‌ని సూచించారు. ప్ర‌తీ ప్ర‌భుత్వ శాఖ‌, త‌ప్ప‌నిస‌రిగా ఎస్‌సిల‌కు కేటాయించిన నిధుల‌ను ఖ‌ర్చు చేసి, వారి సంక్షేమానికి కృషి చేయాల‌ని కోరారు.  ఈ స‌మావేశంలో జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వర్రావు, సిపిఓ జె.విజ‌య‌ల‌క్ష్మి, ఎస్‌సి కార్పొరేష‌న్ ఇడి ఎస్‌.జ‌గ‌న్నాధ‌రావు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, హౌసింగ్ పిడి ఎస్‌వి ర‌మ‌ణ‌మూర్తి, డుమా పిడి ఏ.నాగేశ్వ‌ర్రావు, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వ‌రి, మెప్మా పిడి సుధాక‌ర్‌,  ఆర్‌డ‌బ్ల్యూఎస్ ఎస్ఇ శివానంద‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-09 13:36:25

స్వామివారి భక్తులకు పూర్తి ఏర్పాట్లు..

శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దర్శించుకోవడానికి వచ్చే  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం ఈఓ ఎంవీ సూర్యకళ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లు, సదుపాయాలను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, సర్వదర్శనం, వంద రూపాయల క్యూలైన్లలో లోపాలను సరిచేయాలన్నారు. మాక్ డ్రిల్ తరహాలో ట్రయల్ రన్ వేశామని వివరించారు. అనంతరం సెల్ ఫోన్లు చెప్పులు, బ్యాగులు భద్రపరుచుకునే కౌంటర్లను పరిశీలించారు. ఒకేసారి వేలాదిమంది భక్తులొచ్చినా వారికి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దైవదర్శనం చేసుకునేలా చూడాలన్నారు.   దేవస్థానం ఈఓతోపాటు ఈఈ శ్రీనివాసరాజు, ఏఈఓ రమణమూర్తి ఇతర ఈఓ పర్యటనలో పాల్గొన్నారు.

Simhachalam

2021-07-09 13:32:06

సత్వరమే ప్రజలకు సేవలందాలి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయాల్లో ప్రజలకు జాప్యంలేని సేవలు అందాలని అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం నాలుగవ జోన్ అల్లిపురం పరిధిలోని రెండు సచివాలయాలను ఆయన సందర్శించారు.  ఈ సంరద్భంగా సచివాలయ సిబ్బంది హాజరు, వారి డైరీ, మూమెంట్ రిజిస్టర్, ప్రజలు పెట్టుకున్న ఆర్జీలను,   సచివాలయంలోని వివిధ సేవలకు సంబంధించిన పోస్టర్లును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టారని, వాటికి అనుగుణంగా కార్యదర్శి విధులు నిర్వర్తించాలని, విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదని, నిర్ణయించిన సమయానికే విధులకు హాజరు కావాలని, ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా సచివాలయంలో వివిధ సేవలకు సంబంధించిన సేవా పోస్టర్లను, కోవిడ్ నియంత్రణా నియమావళి పోస్టులను, ప్రభుత్వ సేవల ఫోన్ నెంబర్లను ప్రదర్శించాలని సిబ్బందిని ఆదేశించారు. 

విశాఖ సిటీ

2021-07-09 13:11:24

గ్రామస్థాయిలో ఆధార్ సేవలు పెరగాలి..

గ్రామ/వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలను అనుసంధానం చేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ సిబ్బంది విధి నిర్వహణలో మరింత బాధ్యతతో పని చేయాలని సంయుక్త కలెక్టర్( సచివాలయం–అభివృద్ధి) పి.ప్రశాంతి అన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ లోని  సంయుక్త కలెక్టర్(సచివాలయం – అభివృద్ధి) పి.ప్రశాంతి ఛాంబర్ లో గ్రామ/వార్డు సచివాలయాల జిల్లా కో- ఆర్ఢినేటర్, డిజిటల్ అసిస్టెంట్ లకు 22 ఆధార్ నమోదు పరికరాలు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ గతంలో మీసేవా కేంద్రాల ద్వారా ఆధార్ లో దొర్లిన తప్పులను సరి చేయడం. ఫోన్ నంబర్లు అనుసంధానం, పేర్లు మార్పులు, చేర్పులు చేయడానికి నిర్వాహకుల తీరుతో ప్రజలు అవస్థలు పడేవారన్నారు. అటువంటి సమస్యలను అధిగమించేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లోనే ఆధార్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయించడం వలన ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రస్తుతం సచివాలయాల్లో గ్రామ/వార్డు వాలటీర్లు చేస్తున్న పనులతో పాటు  ఆధార్ సమస్యల పరిష్కారం కోసం అదనపు డిజిటల్ సిబ్బందిని నియమించి తగిన శిక్షణను ఇచ్చి వారికి ఆధార్ నమోదు పరికరాలు(కంప్యూటర్ల) ను అందజేశామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 31 మండల కేంద్రాల సచివాలయాలకు ఆధార్ కేంద్రాలను  ఏర్పాటు చేసి  31 ఆధార్ నమోదు పరికరాలు (కంప్యూటర్ల) ను కేటాయించామన్నారు. వాటిలో 9 కేంద్రాలకు  ఆధార్ నమోదు పరికరాలు గతంలోనే అందించామని, రెండో దఫా  22 ఆధార్ నమోదు పరికరాలు డిజిటల్ సిబ్బందికి ఈ రోజు అందిచినట్లు తెలిపారు. ప్రతీ ఒక్క డిజిటల్ అసిస్టెంట్  బాధ్యతతో పనిచేసి ఆన్ లైన్ లో ప్రజల ఆధార్ సమస్యలను పరిష్కరించాలని  పేర్కొన్నారు. ఎటువంటి ఫిర్యాదులు రాకుండా డిజిటల్ సిబ్బంది పని చేయాలని  సంయుక్త కలెక్టర్ ప్రశాంతి సూచించారు. ఆధార్ నమోదులో వస్తున్న సమస్యలను సకాలంలో గుర్తించడంతో పాటుగా వాటిని  పరిష్కరించేందుకు ప్రజలు తగిన దృవీకరణ  పత్రాలను చూపిన తరువాతే వాటిని అను సంధానం చేసి  సమస్యను పరిష్కరించాలన్నారు. గతంలో ఆధార్ నమోదు కేంద్రాలలో ప్రజల  సమస్యలను పరిష్కరించేందుకు డిజిటల్ సిబ్బంది స్వప్రయోజనాలకు ఆశపడి ఇబ్బందులు పాలు అయ్యారని గుర్తుచేశారు. అటువంటి వాటి జోలికి పోకుండా నిబద్ధతతో డిజిటల్ అసిస్టెంట్ లు పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ/వార్డు సచివాలయాల  అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జిల్లా కో ఆర్డినేటర్, డిజిటల్ అసిస్టెంట్స్, సచివాలయాల డిజిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-07-09 13:04:50

విరివిగా పారిశుధ్య పనులు జరగాలి..

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని అన్నివార్డుల్లో పారిశుద్ధ్య పనులను విధిగా నిర్వర్తించాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు శానిటరీ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన 6వ జోన్ 69 వ వార్డు పరిధిలోని కాపు తుంగ్లాం, రెడ్డి తుంగ్లాం, ఎస్సీ కాలనీ, బి.హెచ్.పి.వి. తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఇంటి నుండి తడి-పొడి చెత్త సేకరించాలని,  కాలువలను, రోడ్లను శుభ్రంచేయాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేకుండా చూడాలని, చెత్త వేసిన వారిపై నిఘా ఉంచి వారి వద్ద నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని, యూజర్ చార్జీలు యాప్ ద్వారా వసూలు చేయాలని, లిట్టర్ బిన్లు శుభ్రపరచాలని, కాలువలలోనూ, లిట్టర్ బిన్ల చుట్టూ బ్లీచింగ్ జల్లించాలని, చెత్తను వెంట వెంటనే డంపింగ్ యార్డుకు తరలించాలని, శానిటరీ ఇన్స్పెక్టరును, వార్డు సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి రోజు చెత్త సేకరణకు వస్తున్నారా లేదా అని స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులైన  మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని, నీటి నిల్వలు లేకుండా చూడాలని, శానిటరీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ పర్యటనలో వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వార్డు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. 
    

విశాఖ సిటీ

2021-07-09 13:02:24

విశాఖను మురికివాడ రహితంగా మార్చాలి..

విశాఖను మురికివాడలు లేని విశాఖగా రూపు దిద్దడమే ప్రధాన కర్తవ్యం అని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. శుక్రవారం ఆమె గురజాడ కలాక్షేత్రంలో మురికి వాడల అభివృద్ధిపై వార్డు సచివాలయ కార్యదర్శుల శిక్షణా కార్యక్రమంలో జివిఎంసి కమిషనర్  డా. జి. సృజనతో కలసి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, విశాఖ త్వరలో పరిపాలనా రాజధాని అవుతున్న తరుణంలో జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి నగారాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, అందుకు వారికి ధన్యావాదాలు తెలియ జేస్తున్నామని, జివిఎంసి పరిధిలో 793 మురికివాడలు గుర్తంచబడ్డాయని, మురికి వాడలలో కనీస మౌళిక వసతులైన రోడ్లు, డ్రైన్లు, కమ్యునిటీ హాల్స్, కళ్యాణ మండపాలు, విద్యుత్, త్రాగు నీరు లాంటి వసతుల కల్పనకు ఈ ఆదివారం ప్రతీ ఒక్క సచివాలయ కార్యదర్శి సచివాల పరిధిలో ఉన్న కుటుంబాల వివరాలు సేకరించడం కొరకు ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుందని, ఒకే గృహంలో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయో లేదా అద్దెకి ఉన్న వారితో సహా సర్వే చేయాలని ఈ  సర్వే పారదర్శకంగా, నిక్కచ్చిగా జరగాలని అప్పుడే ప్రజలకు అవసరమైన మౌళిక వసతులు కల్పించడానికి వీలవుతుందని  కార్యదర్శులకు పిలుపునిచ్చారు. 
అనంతరం, జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన మాట్లాడుతూ మురికివాడల అభివృద్ధిపై వార్డు సచివాలయ కార్యదర్శులకు జివిఎంసి పరిధిలో ఉన్న మురికివాడల వివరాలు అక్కడ జనాభా, వారికి కల్పించవలసిన మౌళిక వసతులు, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా జివిఎంసి పరిధిలో మొత్తం 793 మురికివాడలు గుర్తించబడ్డాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి మురికివాడల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. ముఖ్యంగా ఈ సర్వేలో మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థలాల్లో లేదా ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లో నివసిస్తున్నారో వాటి వివరాలు, ఆయా మురికివాడల పరిధి, సరిహద్దులు, ఎన్ని కుటుంబాలు వారు నివసిస్తున్నారు, అక్కడ జనాభా ఎంత, వారికి కావలసిన మౌళిక వసతులు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ సర్వే ఈ ఆదివారం ప్రతి ఇంటికి కార్యదర్శులు వెళ్లి యాప్ ద్వారా వివరాలను పొందుపరచడం జరుగుతుందని, దీనికి వార్డు కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఆర్.డబ్ల్యూ.ఎస్ సంఘాల వారు, ప్రజలు సహకరించి ఈ సర్వేను విజయవంతం చేయాలని కమిషనర్ తెలిపారు.

 ఈ కార్యక్రమంలో ప్రధాన ఇంజినీరు రామ కృష్ణంరాజు,  చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, యుసిడి (పి.డి.)  వై. శ్రీనివాస రావు తదితరులు మురికివాడల అభివృద్ధి పై సచివాలయ సిబ్బందికి శిక్షణ తో పాటు కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఎ.వి.రమణి, అందరు జోనల్ కమిషనర్లు, పర్యవేక్షక ఇంజినీరులు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, యుసిడి సిబ్బంది, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.     

విశాఖ సిటీ

2021-07-09 13:00:37

పోర్టు కాలుష్యంపై ప్రత్యేక చర్యలు..

విశాఖ పోర్టు నుంచి వెలువడే కాలుష్య నివారణకు చర్యలు చేపట్టినట్టు జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె నాలుగవ జోన్ 39 వ వార్డు కోట వీధి పరిసర ప్రాంతాలలో జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, వార్డు కార్పొరేటర్ డా. మహమ్మద్  సాధిక్ తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ విశాఖ పోర్ట్ ట్రస్ట్ కు చెందిన భారీ వాహనాల వలన శబ్ద, వాయు కాలుష్యం అధికంగా ఉందని, భారీ వాహనాలు ఎక్కువగా తిరగడం వలన రోడ్డులు, భూగర్భ పైపులు ద్వంసం అవుతున్నాయని, పోర్టు భారీ వాహనాలకు మరో మార్గం ద్వారా పంపించేందుకు  పోర్ట్ చైర్మన్ తో మాట్లాడతామని తెలిపారు. పాత పోస్టాఫీసు బస్సులు ఆగు ప్రదేశంలో ప్రయాణీకులకు మరుగుదొడ్లు సదుపాయం లేదని, వాటిని వెంటనే నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కాలువలలో పూడికలు తొలగించనందుకు వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే పూడికలు తీయించాలని ఆదేశించారు. భూగర్భ మురుగు కొరకు తీసిన గోయ్యలను కాంక్రీటు తో పూడ్చి , ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఇపిడిసిఎల్ వార్డు భూగర్భ ఎలక్ట్రికల్ పైపులను బయటకు వదలి ఆ గోయ్యలును పూడ్చనందుకు ఇపిడిసిఎల్ వారికి నోటీసు ఇచ్చి, వారి వద్ద నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని అధికారులను అదేశించారు. డోర్ టు డోర్ చెత్త సేకరించే పద్దతిని స్థానిక ప్రజలకు అడిగి తెలుసుకున్నారు. భూగర్భ మురుగు నీటిలో ఎటువంటి వ్యర్ధ పదార్ధాలు, నేప్కిన్స్, డ్రైపర్సు వేయరాదని సూచించారు. స్థానిక చేపల  బజారులో చెత్త బుట్టలు ఏర్పాటు చేయాలని ప్రధాన వైధ్యాధికారిని ఆదేశించారు. 
సెయింట్ జాన్ హై స్కూలు(హెరిటేజ్ బిల్డింగు) శిధిలావస్థలో ఉందని, దానిని తొలగించి నూతనంగా బిల్డింగు నిర్మించాలని, టిడ్కో ఇళ్ళ నిర్మాణ పనులు ఇంకా మొదలు పెట్ట లేదని, స్థానిక సచివాలయం మార్పుచేయాలని, ఫేరీ రోడ్డులో ఉన్న అంగన్వాడి కేంద్రంలో విద్యుత్ దీపాలు లేవని, ఆ ప్రాంతంలో ఉన్న పార్కుకు మరమత్తులు చేయించాలని కార్పొరేటర్ తెలపగా, మేయర్, కమిషనర్ వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, నాలుగవ జోనల్ కమిషనర్ బి.వి.రమణ, పర్యవేక్షక ఇంజినీరు శివ ప్రసాద రాజు, కార్య నిర్వహాక ఇంజినీర్లు గణేష్ బాబు, శ్రీనివాస రావు, చిరంజీవి, ఎఎంఒహెచ్ కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.     

విశాఖసిటీ

2021-07-09 12:56:08

చైతన్య యాత్రలతో రైతులకు అవగాహన..

చైతన్య యాత్రల ద్వారా రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా- రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ పేర్కొన్నారు.  9 -7- 2021 నుంచి 23 -7- 2021 వరకు డాక్టర్ వైయస్ ఆర్ రైతు భరోసా పై రైతులను చైతన్యవంతం చేయాలన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్తు ఎదురుగా ఉన్న కృషిభవన్ ఆవరణలో డాక్టర్ వైయస్ ఆర్ రైతు భరోసా చైతన్య వాహన యాత్రలను సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా- రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా- రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పెదకూరపాడు, ప్రతిపాడు, పెదకాకాని, వట్టిచెరుకూరు, గుంటూరు రూరల్ మండలాల్లో క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ, పశు సంవర్ధక, ఉద్యానవనం, పట్టు పరిశ్రమ ,మార్కెటింగ్, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించామన్నారు. గ్రామాలలో రైతుల సమస్యలపై అవగాహన కల్పించేందుకు పై శాఖల అధికారులు, సిబ్బంది వాహనాలను ఉపయోగించుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు విత్తనాలపై అవగాహన కల్పించేందుకు విలేజ్ అసిస్టెంట్స్, మండల అధికారులు, వ్యవసాయ క్షేత్ర అధికారులు రైతుల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ పద్ధతిని లాభసాటిగా ఉండేవిధంగా ప్రదర్శన చేయాలన్నారు. రైతులు పండించిన పంటకు మార్కెట్ లో అధిక ధరలు వచ్చేవిధంగా చూడాలన్నారు. వరి ని ఎక్కువగా రైతులు పండించడం వలన ఆ పంట మార్కెట్ కు వచ్చేసరికి ధర తగ్గుతుందనే అపోహ రైతుల్లో ఉందన్నారు. అలాంటి అపోహాలకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆర్బికె గ్రామాల పరిధిలోని వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేయాల్సిన వరి వంగడాల లక్షణాలు తట్టుకునే చీడ, పీడల గురించి అవగాహన కల్పిచాలన్నారు. నీటి వసతి తక్కువ ఉన్న ప్రాంతాల్లో బోర్లకింద ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చునన్నారు. రైతులు తప్పని సరిగా అధీకృత డీలర్ల దగ్గర విత్తనాలు కొనుగోలు చేయాలని, సదరు రశీదును పంటకాలం పూర్తి అయ్యేవరకు భద్ర పరుచుకోవాలని, అనధికార విత్తన విక్రయాల సమాచారమును రైతులు తక్షణమే స్థానిక వ్యవసాయ, పోలీసు అధికారులకు తెలియజేయాలన్నారు. యంత్ర సేవ కేంద్రాలు  ఆర్బికె పరిధిలో రైతు సంఘాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కస్టమ్ హైరింగ్ కేంద్రాల వివరాలను రైతులకు తెలయజేయాలన్నారు. ఈ క్రాఫ్ అప్లికేషన్స్ వారి గ్రామాల్లో పండించే అన్ని వ్యవసాయ ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశుగ్రాస, సామాజిక అటవీశాఖ, మత్స్యశాఖలకు సంబంధించిన  సర్వేనంబర్ల విస్తీర్ణం రైతు వివరాలతో సమోదు చేస్తారన్నారు. ఈ క్రాఫ్ లో నమోదు కాబడిన రైతుల వివరాలను రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. పెట్టుబడిని తగ్గించి సమగ్ర పంటల విధానంలో నాణ్యమైన అధిక దిగుబడిని సాధించాలని రైతులను కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు విజయభారతి, ఉప సంచాలకులు ఐ. మురళి, పి. రామాంజనేయులు. సహాయ సంచాలకులు కె.వి. శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-07-09 12:51:45

రాష్ట్రంలో పల్లెసీమలన్నీ ప్రగతిబాట..

రాష్ట్రంలోని పల్లెలన్నీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ముందుచూపుతో ప్రగతిబాటలో పయనిస్తున్నాయని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన శుక్రవారం జిల్లాలోని టెక్కలి డివిజన్ పరిధిలోగల టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా టెక్కలిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. రూ.75 లక్షలతో నిర్మించిన, కార్పొరేట్ బ్యాంకులకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఉన్న పలు విభాగాలను అతిథులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఇచ్చాపురం టౌన్ 15వ వార్డ్ బెల్లుపడ వద్ద రూ.80 లక్షలతో నిర్మించే హాస్పటల్ కు శంఖుస్థాపన చేశారు. ఇచ్చాపురం టౌన్ లో 1వ వార్డ్ లో రూ. 80 లక్షలతో నిర్మించే అర్బన్ హెల్త్ సెంటర్ కు శంకుస్థాపన చేసారు. ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో రూ1.84 కోట్లతో నిర్మాణం కానున్న పబ్లిక్ హెల్త్ సెంటర్ హాస్పిటలకు శంఖుస్థాపన చేశారు. ఈదుపురం గ్రామంలో డిసిసిబి బ్యాంకు శాఖని ప్రారంభించారు. అక్కడే 1.84 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సాగుతోందని అన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి, సంక్షేమ బాటలో నడిపించిన చరితార్థుడని అన్నారు. తండ్రి వారసుడిగా, ఆయన ఆశయాలే ఊపిరిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల ముందుకు వచ్చారని తెలిపారు. రైతులను సీఎం జగన్ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారన్నారు. పంట దిగుబడి తగ్గితే బీమా వచ్చేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపర్చడానికి ప్రభుత్వం విశేషకృషి చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో ప్రజలు ఇచ్చిన వినతులను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్వీకరించారు. ఇచ్చాపురంలో తాగునీటి సమస్య, సోంపేట థర్మల్ విద్యుత్ వ్యతిరేక పోరాటంలో కేసులు నమోదు చేసిన 725 మందిపై కేసులు ఎత్తివేయాలని, వారిలో చాలామంది విద్యార్థులు ఉండటం కారణంగా వారి భవిష్యత్తుకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.  వీటి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

       ఈ కార్యక్రమాలలో మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, డిసిఎంఎస్ అద్యక్షులు పిరియా సాయిరాజ్,మున్సిపల్ ఛైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, ఉపాధ్యక్షులు ఉలాల విజయభారతి, తహశీల్దార్ మురళి, మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, స్థానిక నాయకులు నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాలా(లల్లూ), సర్తు సరేంద్ర, పిరియా విజయ, నిమ్మన దాసు, కడియాల ప్రకాశ్, దువ్వు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Srikakulam

2021-07-09 12:47:27

ప్రతీరోజు 200 గృహాలు గ్రౌండింగ్ జరగాలి..

శ్రీకాకుళం జిల్లాలోని ప్రతీ మండలంలో రోజుకి 200 గృహాలు గ్రౌండింగ్ కావాలని గృహనిర్మాణ శాఖ సంయుక్త కలెక్టర్ హిమాంశు కౌశిక్ గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా కార్యక్రమంపై గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ జిల్లాలో 92 వేలు గృహాలు గ్రౌండింగ్ కావలసి ఉండగా ఇప్పటివరకు 69 వేలు మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని చెప్పారు. ఈ నెల 1,2 మరియు 4వ తేదీలలో మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన సంగతి విదితమే. అందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 92 వేలు గృహాలకు గ్రౌండింగ్ జరగాల్సిఉండగా 69 వేలు మాత్రమే గ్రౌండింగ్ కావడంపై జె.సి అసంతృప్తి వ్యక్తం చేశారు.   హౌసింగ్ గ్రౌండింగ్ వెనుకబడి ఉండటం వలన రాష్ట్రస్థాయిలో జిల్లా 11వ స్థానానికి చేరుకుందని అన్నారు. కావున గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జె.సి సూచించారు. ప్రతి మండలంలో రోజుకి 200 గృహాలు గ్రౌండింగ్ అయితేనే లక్ష్యాన్ని సాధించగలమని జె.సి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ విషయమై గృహ నిర్మాణ శాఖ ఇంజినీర్లు, మండల తహసీల్దారు, ఎం.పి.డి.ఓలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సహాయ సహకారాలు తీసుకొని లక్ష్యాన్ని అధిగమించాలని అధికారులను జె.సి ఆదేశించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు టి.వేణుగోపాల్, సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-09 12:45:22

కేజీ చందనం సమర్పించిన భక్తులు..

సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ న్రుసింహస్వామివారికి విశాఖ రవీంద్రనగర్ కు చెందిన బాబురావు - సత్యవతి దంపతులు శుక్రవారం అరకేజీ చందనం సమర్పించారు. అదేవిధంగా బోయపాలెం వాస్తవ్యులు  ఈశ్వరరావు-లక్ష్మి దంపతులు మరో అరకేజీ చందనం సమర్పించారు. ఈ మేరకు రూ.10,116 (పదివేల నూట పదహారు) చొప్పున ఏఈఓ రాఘవకుమార్ అందించి రసీదు పొందారు. అనంతరం దాతలకు స్వామివారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-07-09 12:43:39

రూ.60 లక్షల పరికరాలు వితరణ..

శ్రీకాకుళంజిల్లాలో కోవిడ్ సెకెండ్ వేవ్ నుండి ప్రస్తుతం బయటపడ్డామని, చాలావరకు కేసులు తగ్గుముఖం పట్టాయని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. శుక్రవారం  కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సుమారు రూ.60 లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, హెచ్.ఎఫ్.ఎన్.సిలు, ఐసియు పారా మానిటర్లు, ఎన్ – 95 మాస్కులు, శానిటైజర్లను డా. రెడ్డీస్ ల్యాబ్ జిల్లా కలెక్టర్ కు అందజేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సెకెండ్ వేవ్ నుండి బయటపడినప్పటికీ థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ ప్రారంభమైనట్లు వార్తలు కూడా వచ్చాయని, ఇటువంటి తరుణంలో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఫార్మాస్యూటికల్ కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత క్రింద కొన్ని పరికరాలను అందజేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగా  పైడి భీమవరంలోని డా. రెడ్డీస్ ల్యాబ్ ముందుకువచ్చి దాదాపు రూ.60 లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, హెచ్.ఎఫ్.ఎన్.సిలు, ఐసియు పారా మానిటర్లు, ఎన్ – 95 మాస్కులు, శానిటైజర్లను ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. దీంతో పాటు జిల్లాలోని మూడు చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లను ( నిమిషానికి 200 లీటర్లు సామర్ధ్యం ) నెలకొల్పబోతున్నట్లు కలెక్టర్ చెప్పారు.  ఇప్పటికే రూ.25 లక్షలతో రణస్థలం వద్ద ఆక్సిజన్ ప్లాంటును నెలకొల్పడం జరిగిందని,  త్వరలో పాలకొండ, రాజాం ప్రాంతాల్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటుచేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇవేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చిన పరికరాలు, జిల్లాలో స్వంతంగా కొనుగోలు చేసి కొన్ని పరికరాలను సిద్ధం చేసామని చెప్పారు. వీటితో జిల్లాలో థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొని ముందుకువెళ్లే అవకాశం ఉంటుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేసారు. రూ.60 లక్షల విలువైన పరికరాలను అందజేసిన డా. రెడ్డీస్ ల్యాబ్ కు  అభినందనలు తెలిపిన కలెక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తరపున పరికరాలు ఇచ్చేందుకు కృషిచేసిన ఎచ్చెర్ల ఎచ్చెర్ల గొర్లె కిరణ్ కుమార్ ను కలెక్టర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్, డా. రెడ్డీస్ ల్యాబ్ సీనియర్ డైరక్టర్ కె.వి.యస్.ఎన్.రాజు, అసోసియేట్ డైరక్టర్ వి.ఆర్.జోగారావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. జి.సుమన్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-07-09 12:39:16

సుందర శ్రీకాకుళం లక్ష్యంగా పనిచేయాలి..

శ్రీకాకుళంను సుందర నగరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్  శ్రీకేష్ లాఠకర్ అన్నారు. ప్రతి పౌరుని లక్ష్యం కావాలని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నగరంలోని పెదపాడు చెరువును, నాగావళి నదిలో నిర్మిస్తున్న డైక్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. చెరువు మంచి పర్యాటక ఆకర్షణ కాగలదని, సుందరంగా తయారు చేయడం వలన నగరానికి మరింత శోభ చేకూరుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. మన ఊరు మన చెరువు కార్యక్రమం కింద పెదపాడు చెరువు సుందరీకరణ పనులు చేపట్టాలని ఆయన చెప్పారు. విభిన్న ఏజెన్సీలు కాకుండా ఒకే ఏజెన్సీ పనులను చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పనులు పూర్తి చేయుటకు నిర్దిష్ట గడువు కచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ముందుగా చెరువు సరిహద్దులను గుర్తించాలని వాటికి మార్కింగ్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. వాకింగ్ ట్రాక్ ఏర్పాటుచేయాలని దానితో పాటుగా సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయుటకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇరువైపులా మొక్కలు నాటి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాలని ఆయన అన్నారు. పెద్దపాడు గ్రామంలోనూ, చెరువు చుట్టుపక్కల ఎక్కడ బహిరంగ మలవిసర్జన ఉండకుండా అన్ని చర్యలు చేపట్టాలని గ్రామ సర్పంచ్ కలగ శ్రీనివాస్ కు కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఇంటి వద్ద మరుగుదొడ్లు ఉన్నాయని, వాటిని విధిగా వినియోగించాలని ఆయన స్పష్టం చేశారు. నిరంతరం నీటి సరఫరా లేనప్పుడు ఇంటివద్ద నీటి తొట్టెలు ఏర్పాటు చేసుకుని తద్వారా వినియోగించాలి ఆయన పేర్కొన్నారు.  గ్రామ, నగర పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వలన ఆహ్లాదకర, ఆరోగ్యకర వాతావరణం తయారవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రవర్తనా పరమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని సూచిస్తూ బహిరంగ మల విసర్జనకు పూర్తిగా నిలుపుదల చేయాలని కోరారు. శ్రీకాకుళం నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. నగరపాలక అధికారులు తెలవారుతుండగానే రహదారులపై ఉండాలని ఆయన ఆదేశించారు. పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అనేక చోట్ల చెత్త కుప్పలు కనిపిస్తున్నాయని తద్వారా నగర పారిశుద్ధ్యానికి, ఆహ్లాదానికీ, సుందరీకరణకు ఆటంకంగా ఉంటుందని కలెక్టర్ అన్నారు. ప్రత్యేక అధికారి హోదాలో నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను వ్యక్తిగతంగా తనిఖీ చేయనున్నట్లు కలెక్టర్ చెప్పారు. 

డైక్ త్వరగా పూర్తి చేయాలి: నాగావళి నదిలో నిర్మిస్తున్న డైక్ ను అతి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణం తీవ్ర జాప్యం అయిందని ఆయన పేర్కొన్నారు.  వర్షాలకు ముందే వీలైనంత ఎక్కువ పనులను చేపట్టాలని ఆయన చెప్పారు. నగరంలో రివర్ ఫ్రంట్ పార్క్ ఉండటం వలన మరింత శోభ చేకూరుతుందని ఆయన అన్నారు. నగరంలో చేపడుతున్న  పనులపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.  

      ఈ కార్యక్రమంలో వంశధార పర్యవేక్షక ఇంజినీర్ డోల తిరుమల రావు, మున్సిపల్ కమిషనర్ సిహెచ్. ఓబులేసు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు అధికారి హెచ్. కూర్మా రావు, ప్రజారోగ్య కార్యనిర్వాహక ఇంజనీర్ పి.సుగుణాకర రావు, నగరపాలక  ఇంజనీర్ రమణ మూర్తి, ప్రజారోగ్య శాఖ డిఇ దక్షిణామూర్తి, తాహసిల్దార్ వై.వి.ప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-09 12:33:34

చెత్త రహిత నగరానికి సహకరించండి..

మహా విశాఖనగరం మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారమే ముఖ్య భూమికని జివిఎంసి కమిషనర్ డా. జి.సృజన అన్నారు. గురువారం ఆమె 4వ జోన్ 30వ వార్డు పరిధిలోని కొత్త జాలారి పేట, రెల్లివీధి మెయిన్ రోడ్డు పరిసర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరాన్ని “డస్ట్ బిన్ ఫ్రీ సిటీ” గా తీర్చిదిద్దేందుకు ప్రజల సహాయ సహకారాలు అవసరమన్నారు. రోడ్డు అడ్డంగా ఉన్న ఇంటి నిర్మాణ సామగ్రిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. వార్డులలో సరిపడే పారిశుధ్య సిబ్బంది ఉన్నారని,  పిన్ పాయింట్ వారిగా కార్మికులను సర్దుబాటు చేసి, ఎవరికి నిర్దేశించిన పనిని వారిచే చేయించాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త అధికంగా ఉందని, చెత్త వేసే వారిపై నిఘా ఉంచి వారి నుండి అపరాధ రుసుము వసూలు చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్లును ఆదేశించారు. ప్రతి రోజూ చెత్త తరలించే వాహనాలు డిప్లోయ్మెంట్ ప్రకారం వస్తున్నాయా అని శానిటరీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది ప్రతిరోజు ఇంటింటికి వచ్చి తడి-పొడి చెత్త సేకరణ చేస్తున్నదీ లేనిదీ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కొద్ది రోజుల్లో డస్ట్ బిన్లను, లిట్టర్ బిన్లను తొలగిస్తామని ప్రతి ఇంటికి మూడు రంగుల చెత్త డబ్బాలు ఇవ్వడం జరుగుతుందని, వాటితో తడి-పొడి మరియు ప్రమాదకరమైన చెత్తగా విభజించి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని ప్రజలకు సూచించారు. ప్రతి దుకాణం ముందు మూడు రంగుల చెత్త డబ్బాలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వీధి లైట్లు వెలగడం లేదని స్థానిక ప్రజలు తెలుపగా సాయంత్రం లోగా వీధి లైట్లు వెలిగించాలని సహాయక ఇంజినీరు(ఎలక్ట్రికల్)ను ఆదేశించారు.  
ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, నాలుగవ జోనల్ కమిషనర్ బి.వి.రమణ, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, పి.శ్రీనివాస రావు, గణేష్ కుమార్, వెటర్నరి  డాక్టరు కిషోర్, సహాయక ఇంజినీరు విల్సన్, ఎస్.ఎస్. శ్రీనివాస రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నాజీ, వార్డు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.   

విశాఖ సిటీ

2021-07-08 15:25:03