1 ENS Live Breaking News

జిల్లాకు 175 డిజిటల్ లైబ్రరీలు..

శ్రీకాకుళం జిల్లాకి 175 డిజిటల్ లైబ్రరీలు మొదటి దశలో మంజూరు అయ్యాయని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివ్రుద్ధి కార్యక్రమాలపై బుధవారం మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, డిజిటల్ లైబ్రెరీలకు జూలై 20 నాటికి స్థలం సేకరించి భవన నిర్మాణం ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. అంతేకాకుండా విభిన్న ప్రతిభావంతుల పరికరాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు, మూడు నెలలుగా మండలాల్లో పరికరాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్. కూర్మారావు మాట్లాడుతూ జగనన్న పచ్చ తోరణం క్రింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టామన్నారు. మండలాల వారీగా ఇచ్చిన లక్ష్యాలను అదిగమించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు డా. కె.శ్రీనివాసులు, ఆర్. శ్రీరాములు నాయుడు, అర్.డి.ఓ ఐ.కిశోర్,  జిల్లా పరిషత్ సీఈఓ బి. లక్ష్మీపతి, జిల్లా పంచాయతీ అధికారి వి. రవి కుమార్, ఆర్ అండ్ బి ఎస్.ఇ కె.కాంతిమతి, పంచాయతీ రాజ్ ఎస్.ఇ బ్రహ్మయ్య తదితులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-07 14:22:09

కోవిడ్ నివారణకు ఒకరోజు వేతనం..

 శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ - 19 నివారణకు డాక్టర్ బి.ఆర్. అంభేథ్కర్ యూనివర్సిటీ సిబ్బంది ఒక రోజు వేతనం విరాళంగా ఇచ్చినట్లు వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎన్. వెంకటరావు వెల్లడించారు.  యూనివర్సిటీ సిబ్బంది అందరూ ఒక రోజు వేతనం చెక్కును కలెక్టర్ కార్యాలయం ఆయన చాంబర్ లో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ కు  వి.సి. అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యూనివర్శిటీ తరపున జిల్లా యంత్రాగంతో భాగస్వాములై కోవిడ్ నియంత్రణలో పాల్గొంటున్నామన్నారు. తమవంతు సహకారంగా ఈ విరాళాన్ని అందించినట్టు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనివిర్శిటీ ఆచార్యలు పాల్గొన్నారు.


Srikakulam

2021-07-07 14:21:05

విప‌త్తుల‌ నిర్వ‌హ‌ణకు నూతన పద్ధతులు..

తిరుమలలో ప్రమాదాల నివారణకు ఆధునిక ప‌ద్ధ‌తులు అమ‌లు చేయ‌డంలో భాగంగా గ్యాస్  ట్యాంకర్లను మోల్డెడ్‌ స్ట్రక్చర్లలో ఉంచే విధానం అవ‌లంబించాల‌ని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని తన చాంబర్లో బుధవారం ఆయన అధికారులతో సమీక్షించారు.  నూతన సాంకేతిక పరిజ్ఞానంతో గ్యాస్ నిల్వ ఉంచడం వల్ల ప్రమాదాలను అరికట్టడం, తీవ్రతను తగ్గించడం గురించి డిప్యూటి చీఫ్ ఇన్స్ పెక్టర్  ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్ ఈవో కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం ఈవో మాట్లాడుతూ తిరుమలలో గ్యాస్ ట్యాంకర్ల ను నిల్వ ఉంచే పద్ధతుల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందన్నారు. ప్రమాదం జరిగినపుడు ప్రజలు, ఉద్యోగులు ఎలా స్పందించాలనే అంశం మీద మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. గృహ, వ్యాపార అవసరాలకు గ్యాస్ వినియోగించే వారికి కూడా అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలని ఈవో సూచించారు. అధికారులతో సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు.అదనపు ఈవో  ధర్మారెడ్డి, సివిఎస్వోగోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు పాల్గొన్నారు.

తిరుమల

2021-07-07 14:17:50

4రోజులు సచివాలయాలకి వెళ్లండి..

మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయాలను జోనల్ కమిషనర్లు వారంలో 4 రోజులు తప్పని సరిగా సందర్శించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన జివిఎంసి ఆదేశించారు.  బుధవారం ఈ మేరకు ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను  ప్రవేశపెట్టిందని, దానిని నిర్వీర్యం అవ్వకుండా చూడాల్సిన బాధ్యత మన మీదే ఉందని తెలిపారు. ప్రతి ఉన్నతాధికారి వారంలో నాలుగు రోజులు, వార్డు ప్రత్యేక అధికారులు రెండు రోజులు సచివాలయాన్ని సందర్శించి, సచివాలయాల్లో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు వివరాలు చార్ట్ రూపంలో ప్రదర్శించాలని, అత్యవసర సేవల ఫోన్ నెంబర్లు, అన్ని రకాల రిజిస్టర్లు,  కోవిడ్ పోస్టర్లు, కంప్యూటర్ల పనితీరు, ప్రజలు పెట్టుకున్న ఆర్జీల వివరాలు, 2021-22 క్యాలెండర్, వై.ఎస్.ఆర్. బీమా, మత్స్యకారుల భీమా పనితీరును, బయోమెట్రిక్ హాజరు విదానం, సిబ్బంది డైరీ, మూమెంట్ రిజిస్టర్ తదితర వివరాలను పరిశీలించాలని ఆదేశించారు. మురికివాడల అభివృద్ధి పై 10వ తేదీన అందరికీ శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, 11వ తేదీ నుండి ఎన్యుమరేషణ్ మొదలు పెట్టాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హాజరుకాని వార్డు ప్రత్యేక  అధికారులపై ఆగ్రహం వ్యక్తపరుస్తూ, వారికి ఛార్జ్ మెమో ఇవ్వాలని  కమిషనర్ ఆదేశించారు. 

GVMC office

2021-07-07 14:09:12

జగనన్న పాలవెల్లువతో ఆర్ధిక భరోసా..

మహిళరైతుల ఆర్ధిక పురోగతికి ‘జగనన్న పాల వెల్లువ’ పధకం ఎంతగానో ఉప యోగపడుతుందని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం చిలకలూరిపేట నియోజకవర్గం, యడ్లపాడు మండలం, లింగారావు పాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, చిలకలూరిపేట నియోజకవర్గ శాసన సభ్యురాలు విడదల రజని, సంయుక్త కలెక్టర్(రైతుభరోసా - రెవెన్యూ) ఏ.ఎస్ దినేష్ కుమార్, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జె.పి. వెంకటేశ్వర్లు, డి.ఆర్.డి.ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద నాయక్, గురజాల రెవెన్యూ డివిజన్, నరసరావుపేట ఇన్ చార్జ్ ఆర్.డి.వొ  పార్ధసారధిలు పాల్గొన్నారు.  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలను కల్పించి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఎక్కువగా మహిళల పేరున అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. మహిళా రైతులు పాడి పరిశ్రమాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్  పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళా రైతుల ఆర్థికాభివృద్ధి కోసం జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. వ్యవసాయంలో ఆదాయం సీజన్ బట్టి వస్తుందనీ, పాడి పరిశ్రమలో నిరంతర ఆదాయం రైతు కుటుంబాలకు వచ్చే అవకాశాలున్నాయని  జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం పశుసంపదను రుణాల రూపంలో అందిస్తుందని తెలిపారు. మహిళలు ఉత్సాహంతో పని చేసి పాడి పరిశ్రమ అభివృద్ధికి ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమం  విజయానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపు నిచ్చారు. గతంలో కో - ఆపరేటివ్  సొసైటిల ద్వారా పాడి పరిశ్రమ డైయిరీలు కొనసాగేవని, కొన్ని కారణాల వలన ఆ డైయిరీలు కొనసాగించలేదన్నారు. గుజరాత్ లో అమూల్ సంస్థ ఏర్పాటుకు మహిళలు కృషి చేశారని గుర్తు చేశారు. అదే విధంగా ఏపిలో కూడా మహిళలు ఒక కమిటీగా ఏర్పడి నాణ్యమైన పాలను ఉత్పత్తి చేసి లాభాలను గడించాలని కోరారు. డైయిరీ వ్యవస్థలకు  జీవం పోసేందుకు జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ద్వారా మహిళలకు పుష్కలంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. 

చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడదల రజని మాట్లాడుతూ ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమంలో అమూల్ సంస్థ ద్వారా పాల సేకరణ ప్రభుత్వమే చేస్తుందని తెలిపారు. ప్రతీ పధకంలో మహిళలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అవకాశం కల్పించారన్నారు. ఆసరా, చేయూత, ఇళ్ళ స్థలాలు, అమ్మవడి వంటి  పధకాలను ఎక్కువగా అక్కచెల్లెలమ్మలకే అవకాశం కల్పించారని కొనియాడారు. తోటి మహిళగా ప్రభుత్వం చేపట్టిన మహిళా సంక్షేమ పధకాలను చూసి గర్వపడుతున్నానని అన్నారు. ఆటోమెషన్ పద్ధతిలో మహిళలు తెచ్చిన పాలను అమూల్ సంస్థ  నాణ్యతను పరిశీలించి అధిక మొత్తంలో నగదును చెల్లిస్తుందని తెలిపారు. నాదెండ్ల మండలంలో నలుగురు రైతులతో నేరుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆత్మీయతతో మాట్లాడిన తీరును ఎప్పటికీ మరువబోనని గుర్తుచేశారు. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సంక్షేమ పధకాలన్నింటిలో మహిళలకు అత్యుత్తమ అవకాశాలను కల్పించడం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమైందన్నారు. పాడి పరిశ్రమను నమ్ముకున్న ప్రతీ ఒక్క మహిళ రైతుకు అండగా ముందుండి నడిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. 

సంయుక్త కలెక్టర్( రైతుభరోసా – రెవెన్యూ) దినేష్ కుమార్ మాట్లాడుతూ ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమం ద్వారా మహిళా రైతులందరికీ మేలు జరుగుతుందని అన్నారు. మహిళలు ఆర్ధికంగా లబ్ధిపొందేందుకు జగనన్న పాల వెల్లువ పధకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా రైతుల కోసం  అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. మహిళా పాడి రైతులంతా ఒక కమిటీగా ఏర్పడి పశువుల నుంచి వచ్చే నాణ్యమైన పాలను అమూల్ పాల కేంద్రాలలో  లాభసాటిగా అమ్ముకోవచ్చునన్నారు. మహిళా రైతులు ఉత్పత్తి చేసిన పాల ధరలను మహిళా సంఘ కమిటీలే నిర్ణయించుకునే వీలుందని అన్నారు. ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా మహిళలకు రుణాలను ఇప్పించి, పశువులను కొనుగోలు చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు. అమూల్ కేంద్రాలకు పాలు పోస్తున్న ప్రతీ మహిళా రైతు జవాబుదారీతనంతో పని చేసి పారదర్శకంగా అభివృద్ధిని సాధించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ది, సంక్షేమ  పధకాలను  ప్రతీ మహిళ ఉపయోగించుకోవాలని సంయుక్త కలెక్టర్ కోరారు. 
సభాకార్యక్రమానికి ముందు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, చిలకలూరిపేట నియోజకవర్గ శాసన సభ్యురాలు విడదల రజని, సంయుక్త కలెక్టర్(రైతుభరోసా - రెవెన్యూ) ఏ.ఎస్ దినేష్ కుమార్, అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి లింగారావు పాలెంలో ఇంటింటికి వెళ్ళి జగనన్న పాల వెల్లువ కార్యక్రమం కరపత్రాలను అందించి, ఈ పధకం వల్ల కలిగే వివరించడం జరిగింది. అనంతరం వెటర్నరీ ఆసుపత్రిలో గోపూజ నిర్వహించారు. మహిళా రైతులకు పశుదాణా, మినరల్ మిక్చర్ ను పంపిణీ చేశారు. సమావేశంలో మైనార్టీ సంక్షేమశాఖ అధికారి మస్తాన్ షరీఫ్, లింగాపురం గ్రామ సర్పంచ్ కరీమ్, తహాశీల్ధార్ శ్రీనివాసరావు, ఎమ్పిడివొ మాధవి తదితరులు పాల్గొన్నారు.

Chilakaluripet

2021-07-07 14:03:44

ప్రతిపైసా సద్వినియోగం కావాల్సిందే..

ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనేంట్ క్రింద వచ్చిన ప్రతి పైసా సద్వినియోగం కావాల్సిందేనని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ అన్నారు. గ్రామ సచివాయం, రైతు భరోసా కేంద్రం, వెల్ నెస్ కేంద్రం తదితర భవనాల నిర్మాణం, ప్రగతి పట్ల బుధ వారం మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ను జిల్లా కలెక్టర్ నిర్వహించారు. భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనేంట్ క్రింద వచ్చిన ప్రతి పైసాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం వంద నుండి 120 కోట్ల రూపాయలను పనులు పూర్తి చేయక నష్టపోతున్నామని కలెక్టర్ తెలిపారు. ఇంజినీరింగ్ సహాయకుల సేవలను పెద్ద ఎత్తున ఉపయోగించాలని ఆయన ఆదేశించారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి భవనాలు పూర్తి చేయాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే వారం నాటికి ప్రగతి ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ భవనాలకు ఇసుక సమస్య ఉండకుండా అన్ని చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు.స్థలం అందజేసినప్పటికి పనులు ప్రారంభించని ఏఇలపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పనులు చేస్తూ బిల్లులను జనరేట్ చేయాలని ఆయన ఆదేశించారు. తహశీల్దార్, ఎం.పి.డి.ఓ సమన్వయంతో పనిచేసి అన్ని భవనాల నిర్మాణం ప్రారంభించాలని ఆయన అన్నారు.

 ఒకే గుత్తేదారుకు అన్ని పనులు చేయించడం వల్ల నిర్మాణ పనులు జాప్యం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. రోజు వారీ లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. టెక్కలి పంచాయతీ రాజ్ కార్యనిర్వాహక ఇంజినీర్ ఆధ్వర్యంలో జరుగతున్న పనుల్లో  ప్రగతి చాలా తక్కువగా ఉందని కలెక్టర్ అన్నారు. 757 భవనాల పనులు సరాసరిన చేపట్టినప్పటికీ వారానికి రూ.3. కోట్లు ఖర్చు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రారంభం కాని పనులపై సమీక్షించాలని టెక్కలి సబ్ కలెక్టర్ ను ఆదేశించారు. కంచిలి, సోంపేట, కోటబొమ్మాళి, పొందూరు, వీరఘట్టం మండలాలలో నిర్మాణాల ప్రగతి అతి తక్కువగా ఉందని ఆయన అన్నారు. పొందూరులో 84 భవనాలకు కేవలం 40 భవనాల నిర్మాణం మాత్రమే ప్రారంభించడాన్ని జిల్లా కలెక్టర్ ప్రశ్నించారు. తక్షణం మిగిలిన 44 పనులు ప్రారంభించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి వారం సమీక్షిస్తామని, ప్రగతి లేని అధికారులపై  చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత గుర్తించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రాధాన్యతని ఇస్తున్నారని ఆయన వివరించారు. ప్రతి చోట కోవిడ్ నియమ నిబంధనలను పాటించాలని, ప్రజలకు అవగాహన కలిగించాలని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు డా. కె.శ్రీనివాసులు, ఆర్. శ్రీరాములు నాయుడు, అర్.డి.ఓ ఐ.కిశోర్,  జిల్లా పరిషత్ సీఈఓ బి. లక్ష్మీపతి, జిల్లా పంచాయతీ అధికారి వి. రవి కుమార్, ఆర్ అండ్ బి ఎస్.ఇ కె.కాంతిమతి, పంచాయతీ రాజ్ ఎస్.ఇ బ్రహ్మయ్య తదితులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-07 13:36:17

మెప్మా పీడిగా రవికుమార్..

ప్రకాశం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రాజెక్ట్ డైరెక్టర్ గా తేళ్ల రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు.  ఇప్పటివరకు ఉలవపాడు ఎంపీడీవోగా పనిచేస్తున్న రవికుమార్ ను మెప్మా పీడీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన ఆయన వెంటనే ప్రకాశం భవనానికి చేరుకుని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. గతంలో డి.ఆర్.డి.ఏ. ఏపీడీగా రెండేళ్లు పని చేసిన విషయాలను జిల్లా కలెక్టర్ కు ఆయన వివరించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (ఆర్ బి అండ్ ఆర్ )శ్రీ జె.వెంకట మురళి, తదితరులు పాల్గొన్నారు.

Ongole

2021-07-06 15:06:16

ఆరు లైన్ల రహదారి అభివృద్ధికి చర్యలు..

ఆరు లైన్ల రహాదారి అభివృద్ధి కోసం ప్రతిపాదనలు తయారుచేయాలని రోడ్లు, భావనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు తెలిపారు. మంగళవారం  జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, వి.ఎం.ఆర్.డి.ఎ. కమిషనర్ కోటేశ్వరరావు, రెవెన్యూ అధికారులతోను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ అభివృద్ధిలో భాగంగా పలు ప్రాజెక్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విశాఖ పోర్టు నుంచి భోగాపురం వరకు 6 లైన్ల రహదారి కొరకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఇప్పటివరకు రహదారుల అభివృద్ధి పై చేసిన సర్వే వివరాలను ముఖ్య కార్యదర్శికి తెలియపరిచారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జివిఎంసి ప్రధాన ఇంజినీరు రవి కృష్ణంరాజు, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, పర్యవేక్షక ఇంజినీరు గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.   

విశాఖ సిటీ

2021-07-06 14:50:06

అక్షయ పాత్ర సేవలు శ్లాఘనీయం..

విశాఖ జిల్లా కోవిడ్ రెండవ దశ వ్యాప్తి సమయంలో ఐదు లక్షల ఆహార పొట్లాలను పేదలకు అందించి వారి ఆకలి తీర్చిందిని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కొనియాడారు. అక్షయపాత్ర ఫౌండేషన్ వారు ఈ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ నుంచి కోవిడ్ రోగులకు వారి సహాయకులు, నిరాశ్రయులకు రోజుకు  25 కేంద్రాల ద్వారా 5,000 ఆహార పొట్లాలు   ప్రతీరోజూ పంపిణీ చేశారని, కొన్ని పేద కుటుంబాలకు 5,000 నిత్యావసర సరుకులు అందించారని మేయర్ తెలిపారు. ఎక్కడ పేద ప్రజలు ఆకలితో ఉన్నారో వారి ఆకలిని తీర్చడం కోసం పురాణాలలో పేర్కొన్న అక్షయపాత్ర పేరుకు తగ్గట్టుగా వారి ఆకలి తీరుస్తుందని తెలిపారు. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానని అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్. నిష్క్రించిన భక్త దాస్ కు మరియు వారి వాలంటీర్లకు జివిఎంసి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్షయ పాత్ర ఫౌండేషన్ సేవలను నాకు ఎంతో స్ఫూర్తిని కలిగించాయని, పేదలను ఆదుకోవడానికి మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

విశాఖ సిటీ

2021-07-06 14:47:41

పట్టణాలుగా YSR జగనన్న కాలనీలు..

 న‌వ‌ర‌త్నాలు లో భాగంగా పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మం కోసం రాష్ట్రంలో సుమారు 16వేల లేఅవుట్ల‌ను రూపొందించ‌డం జ‌రిగింద‌ని, ఇవ‌న్నీ భ‌విష్య‌త్తులో ప‌ట్ట‌ణాలుగా రూపొందుతాయ‌ని, రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. అన్ని లేఅవుట్ల‌లో ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల‌ మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. అర్హులైన ప్ర‌తీఒక్క‌రికీ ఇళ్లు మంజూరు చేయాల‌న్న‌ది ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి ల‌క్ష్య‌మ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి పాముల పుష్ప‌శ్రీ‌వాణితో క‌లిసి, పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మంపై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ముందుగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ, జిల్లాలో 98,206 మందికి ఇళ్లు మంజూరు చేశామ‌ని చెప్పారు.  ఈనెల 1,3,4 తేదీల్లో పెద్ద ఎత్తున శంకుస్థాప‌నా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి, సుమారు 48,981 ఇళ్ల‌ను గ్రౌండింగ్ చేశామ‌ని తెలిపారు. ముఖ్య‌మంత్రి ఆశ‌యాల‌కు అనుగుణంగా పేద‌లంద‌రికీ సొంతింటి క‌ల‌ను నిజం చేసేందుకు జిల్లా యంత్రాంగం ప‌నిచేస్తోంద‌ని చెప్పారు. జిల్లాలో మంజూరైన వివ‌రాలు, లేఅవుట్లు, ప‌నుల ప్ర‌గ‌తిని ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ద్వారా, జాయింట్ క‌లెక్ట‌ర్ (హౌసింగ్‌) మ‌యూర్ అశోక్ వివ‌రించారు.

              అనంత‌రం మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ శాఖ‌ల‌వారీగా, అంశాల‌వారీగా స‌మీక్షించారు. సంబంధిత అధికారుల‌నుంచి వివ‌రాలు తెలుసుకున్నారు. ఎంఎల్ఏల‌ను అడిగి క్షేత్ర‌స్థాయిలో స‌మ‌స్య‌ల‌ను, కార్య‌క్ర‌మం ప్ర‌గ‌తిని తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా బొత్స మాట్లాడుతూ, అర్హ‌త ఉన్న ప్ర‌తీపేద‌వాడికి ఇళ్లు మంజూరు చేయాలన్న‌ది ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి ల‌క్ష్య‌మ‌ని అన్నారు.  రాష్ట్రంలో సుమారు 30ల‌క్ష‌ల మందికి ఇళ్లు మంజూరు చేయ‌డం జ‌రిగింద‌ని, వీటిలో తొలివిడ‌త 15ల‌క్ష‌ల ఇళ్ల‌ను నిర్మిస్తున్నామ‌ని చెప్పారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో తొలివిడ‌త‌లోనే 90శాతం ఇళ్ల‌ను మంజూరు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. మిగిలిన ఆరు మండ‌లాల్లో కూడా త్వ‌ర‌లోనే ఇళ్లు మంజూరు చేస్తామ‌ని, ఈ మేర‌కు ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ నెలాఖ‌రులోగా ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గ ఎంఎల్ఏల‌తో స‌మావేశాన్నినిర్వ‌హించి, గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మంలో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని, వాటిని ప‌రిష్క‌రించేందుకు కృషి చేయాల‌ని హౌసింగ్ జెసిని ఆదేశించారు. ఇప్ప‌టికే రూపొందించిన లేఅవుట్ల‌ను మార్చ‌డం కుద‌ర‌ద‌ని, ఆ లేవుట్ల‌లోనే క‌నీస మౌలిక వ‌స‌తుల‌ను ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. కొత్త లేఅవుట్ల‌ను రూపొందించేట‌ప్పుడు, ప్ర‌భుత్వ భూముల‌కే ప్రాధాన్య‌త‌నివ్వాల‌ని, ప్ర‌భుత్వ భూమి అందుబాటులో లేన‌ప్పుడు మాత్ర‌మే ప్ర‌యివేటువి సేక‌రించాల‌ని సూచించారు.

                 అన్ని లేఅవుట్ల‌లో సిసి రోడ్లు, అండ‌ర్‌గ్రౌండ్ డ్రేనేజి, అండ‌ర్ గ్రౌండ్ విద్యుత్ స‌దుపాయం, త్రాగునీరు, ఆసుప‌త్రి, ఫైబ‌ర్ నెట్ త‌దిత‌ర ఊరికి కావాల్సిన‌ క‌నీస మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని, దీనికోసం స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ను రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. గృహ‌నిర్మాణాలు సాగేందుకు వీలుగా ఈ నెలాఖ‌రు నాటికి అన్ని లేఅవుట్ల‌లో బోర్లు త‌వ్వించి, నీటి స‌దుపాయం క‌ల్పించాల‌న్నారు. ల‌బ్ద‌దారుల‌కు సిమ్మెంటు, ఐర‌న్ కొర‌త రాకుండా, మండ‌లాల వారీగా గోదాముల‌ను ఏర్పాటు చేసి, త‌గినంత స్టాకు ఉంచాల‌ని సూచించారు. జిల్లాలో  ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇసుక కొర‌త రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, వారం రోజుల్లో మూడు ఇసుక స్టాకు పాయింట్ల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని గ‌నుల‌శాఖ‌ను ఆదేశించారు. జిల్లాలోని థ‌ర్డ్ ఆర్డ‌ర్ రీచ్ ల నుంచి గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మానికి ఉచితంగా, ఇత‌ర సాధార‌ణ నిర్మాణాల‌కు, ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర‌కు ఇసుకను అంద‌జేయాల‌ని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఎక్క‌డ ఇసుక త‌గినంత‌ అందుబాటులో ఉన్నా, ఆ రీచ్‌కు అనుమ‌తినివ్వాల‌ని, అప్పుడే గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మం స‌జావుగా పూర్త‌వుతుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

               ఈ స‌మీక్షా స‌మావేశంలో ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, ఎమ్మెల్సీ పి.సురేష్ బాబు, ఎంఎల్ఏలు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, శంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు, బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, అల‌జంగి జోగారావు, క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, జాయింట్ క‌లెక్ట‌ర్లు డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌, స‌బ్ క‌లెక్ట‌ర్ భావ‌న‌, ఐటిడిఏ పిఓ ఆర్‌.కూర్మ‌నాధ్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, హౌసింగ్ పిడి ఎస్‌వి ర‌మ‌ణ‌మూర్తి, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, నియెజ‌క‌వ‌ర్గ‌, మండ‌ల ప్ర‌త్యేకాధికారులు, సంబంధిత‌ శాఖ‌ల అధికారులు, హౌసింగ్ డిఇలు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-06 14:32:14

కాలనీల్లో మౌళిక సదుపాయాలు కల్పించండి..

గుంటూరు నగరానికి చెందిన గృహనిర్మాణ లబ్ధిదారుల కోసం పేరేచర్ల లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ లే అవుట్ లో మౌలిక వసతుల  కల్పనకు చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు.  మంగళవారం ఉదయం  మేడికొండూరు మండలం, పేరేచర్ల లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ లే అవుట్ ను  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మద్దాలి గిరిధర్, సంయుక్త కలెక్టర్ (గృహ నిర్మాణం) అనుపమ అంజలి, జిల్లా గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణు గోపాలరావు, మున్సిపల్ కమీషనర్ చల్లా అనురాధ లతో కలిసి పరిశీలించారు. మొత్తం 409.01 ఎకరాల స్థలంలో రహదారులను ఏర్పాటు చేసి 18,090 ప్లాట్లుగా విభజించినట్లు గృహనిర్మాణశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.లే అవుట్ కు సంబంధించిన బ్లూ ప్రింట్ నమూనా ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రాష్ట్రంలో రెండో పెద్ద లే అవుట్ గా ప్రభుత్వం గుర్తించిన పేరేచర్ల లే అవుట్ లో   మౌలిక వసతుల కల్పనకు చర్యలు  తీసుకోవాలని తాడికొండ శాసన సభ్యురాలు శ్రీదేవి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మద్దాలి గిరిధర్ లు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ను కోరారు. లే అవుట్ లో కొన్నిచోట్ల   లోతట్టు ప్రాంతం ఉండటంతో ఆ ప్రాంతాన్ని మెరక చేసేందుకు వెంటనే ప్రణాళికలను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. లో లెవల్ మెరకను పెంచేందుకు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా సమీప చెరువులోని మట్టిని వినియోగించుకునేలా అధికారులు ప్రణాళికలను తయారు చేసి పంపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారులు త్వరిత గతిన గృహనిర్మాణ పనులు  చేపట్టేలా చూడాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులకు సూచించారు.  

     ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య, గుంటూరు ఆర్.డి.వొ భాస్కర్ రెడ్డి, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, జెడ్పి సిఇవొ చతన్య, పంచాయితీరాజ్ ఎస్.ఇ నతానియేల్, మేడికొండూరు తహాశీల్ధార్ కరుణ కుమార్, ఎంపిడివొ ఎం.శోభారాణి, ఏపి ఫైబర్ అధారులు, సచివాలయ సెక్రటరీలు,వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-07-06 13:34:25

నైరా ఆచార్యులకు అరుదైన గౌరవం..

కెనడా, టొరొంటోలో ఆగష్ట్ 17 నుంచి 31వరకు జరిగే అంతర్జాతీయ వ్యవసాయ ఆర్ధిక శాస్త్రవేత్తల సదస్సుకు నైరా వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ ఆర్ధికశాస్త్ర విభాగానికి చెందిన ఆచార్యులు డా.వాన రాజేంద్రప్రసాద్ కు ఆహ్వానం అందినట్లు కళాశాల అసోసియేట్ డీన్ డా. ఎ.వి.రమణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీచేసారు.భారత దేశంలో కోవిడ్ అనంతర నేపధ్యంలో తిరుగువలసలు,సంబంధిత ఆహార భద్రత తద్వారా సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి డా. రాజేంద్రప్రసాద్ ప్రతిపాదించిన కార్యాచరణ ప్రణాళికను ఈ సదస్సులో చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. రైతులను,ఔత్సాహిక యువతను వ్యవసాయ ఉత్పత్తిదారులను సంఘాలుగా ఏర్పరచి వివిధ కాలాల్లో ఖాళీగా ఉంటున్న వ్యవసాయ భూములను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగులోకి తెచ్చి గ్రామాల్లోని నిరుద్యోగాన్ని పారద్రోలడమే లక్ష్యమని చెప్పారు. తద్వారా సుస్థిర వ్యవసాయాభివృద్ధి, ఆహార మరియు పోషకభద్రతను దేశంలో సాధించవచ్చని డా. వి.రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయ పడినట్లు ఆయన తెలిపారు. సుస్థిర వ్యవసాయాభివృద్ధిపై ఇప్పటికే ఒక జాతీయ వెబినార్,నాబార్డు సహకారంతో రాష్ట్ర స్థాయి దృశ్యమాధ్యమ సదస్సులను నిర్వహించినట్లు అసోసియేట్ డీన్ వివరించారు. పెరుగుతున్న ఆయకట్టు ద్వారా కోవిడ్ అనంతర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో సాంధ్ర వ్యవసాయాభివృద్ధి సాధన అనే ప్రోజెక్ట్ భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసిఎఆర్) సంబంధించిన జాతీయ వ్యవసాయాభివృద్ధి నిధి ( ఎన్ఎఎస్ఎఫ్) పరిశీలనలో ఉన్నట్లు తెలియజేసారు.  డా. వి.రాజేంద్రప్రసాద్ అంతర్జాతీయ సదస్సుకు ఎంపికకావడం పట్ల ఆర్ధిక శాస్త్ర విభాగాధిపతి డా. ఎన్.సునంద, బోధన, బోధనేతర సిబ్బంది తదితరులు హర్షం వ్యక్తం చేసినట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. 

Srikakulam

2021-07-06 13:32:07

ఎల్‌డీఎంగా ఎస్‌.శ్రీనివాస‌రావు..

తూర్పుగోదావ‌రి జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి (ఎల్‌డీఎం)గా ఎస్‌.శ్రీనివాస‌రావు కాకినాడ‌లోని కార్యాల‌యంలో  మంగ‌ళ‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అనంత‌రం ఆయ‌న క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. గుజ‌రాత్‌లోని సూర‌త్‌లో యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజ‌ర్‌గా ప‌నిచేసి జిల్లాకు ఎల్‌డీఎంగా వ‌చ్చిన శ్రీనివాస‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమలుచేస్తున్న న‌వ‌ర‌త్నాలు కార్య‌క్ర‌మాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లుచేసేందుకు కృషిచేయ‌నున్న‌ట్లు తెలిపారు. పాల‌నా యంత్రాంగం, బ్యాంకుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ జిల్లా ప్ర‌గ‌తిప‌థంలో ప‌య‌నించేలా విధులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. వ్య‌వ‌సాయ‌, పారిశ్రామిక రంగాల్లో జిల్లా అభివృద్ధి సాధిస్తోంద‌ని, మ‌రింత అభివృద్ధికి బ్యాంకుల నుంచి ప్రోత్సాహం అందేలా చూస్తామ‌న్నారు. జిల్లాలోని గౌర‌వ ప్ర‌జాప్ర‌తినిధుల స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించ‌నున్న‌ట్లు తెలిపారు. గ‌తంలో ఎల్‌డీఎంగా ప‌నిచేసిన జె.ష‌ణ్ముఖ‌రావు ఈ ఏడాది మే 31న ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.

Kakinada

2021-07-06 13:26:44

అప్పన్నకు రూ.50వేలు విరాళం..

విశాఖలోని పెద వాల్టేర్ డాక్టర్స్ కాలనీకి  చెందిన విశ్వనాధం సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారికి మంగళవారం రూ.50,000 (యాభై వేలు) విరాళంగా ఇచ్చారు. ఈమేరకు ఆలయ సిబ్బందికి పీఆర్వో ఆఫీసు కౌంటర్ లో చెక్ అందించారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ, జనవరి 12న తన పేరుతో అన్నదానం చేయాలని కోరారు. గతంలోనూ విశ్వనాథం స్వామివారికి రూ.50,000 విరాళంగా ఇచ్చారు. అనంతరం దాతలకు ఆలయ అధికారులు స్వామివారి దర్శనం కల్పించి, ప్రసాదాన్ని అందజేయగా.. వేద పండితులు ఆశీర్వచన కల్పించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-07-06 13:23:47

అప్పన్నకు SEZ కమిషనర్ పూజలు..

విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ డెవలప్మెంట్ కమిషనర్ ఏ. రామ మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా మంగళవారం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహబస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన అప్పన్నకు ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం కప్ప స్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు.  ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ సిబ్బంది  స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అంతకు ముందు ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆలయ సిబ్బంది వివరించారు. దేవస్థానంలో తిరిగి ఆలయ శిల్పకళా సంపదను సందర్శించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

Simhachalam

2021-07-06 13:19:19