1 ENS Live Breaking News

8న ఆరెండు ప్రాజెక్టుల నీటి విడుదల..

శ్రీకాకుళం జిల్లాలోని తోటపల్లి ఓల్డు రెగ్యులేటర్, మడ్డువలస రిజర్వాయర్ నుంచి ఈ నెల 8వ తేదీన ఖరీఫ్ కు నీటిని విడుదల చేయాలని నిర్ణయించామని జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీరు పి.సుధాకర రావు తెలిపారు. తోటపల్లి పాత రెగ్యులేటర్ నుండి విడుదల చేసే నీటి వలన  వీరఘట్టాం, పాలకొండ, వంగర మండలాలకు చెందిన 31,708 ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఆయన వివరించారు. మడ్డువలస రిజర్వాయర్ ప్రాజెక్టు నుండి విడుదల చేసే నీటి వలన వంగర, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, పొందూరు, జి.సిగడాం మండలాలకు చెందిన 24,877 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుందని ఆయన చెప్పారు. సాగు నీరు సాఫీగా సరఫరా అగుటకు సంబంధిత కార్యనిర్వాహక ఇంజనీర్లు తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రెండు ప్రాజెక్టుల నుండి సాగు నీరు ఖరీఫ్ కు విడుదల అంశాన్ని రైతులు గమనించి నీరు వృధా కాకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 

Srikakulam

2021-07-06 13:08:40

వారికి ట్రేడ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి..

పర్యాటక రంగంలో వ్యాపార భాగస్వాములై సేవలందిస్తున్న హోటల్స్, రెస్టారెంట్లు, టూర్ ఆపరేటర్లందరూ ఏ.పి.టి.ఏ ట్రేడ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని రాష్ట్ర పర్యాటక ప్రాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి, మేనేజింగ్ డైరక్టర్ యస్.సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన జారీచేసారు.  పర్యాటక అభివృద్ధి సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన ప్రభుత్వం ద్వారా పలు రాయితీలు పొందవచ్చని సూచించారు. గతేడాది ప్రారంభించిన పర్యాటక వ్యాపార రిజిస్ట్రేషన్ విధానంలో ఇప్పటివరకు వివరాలు నమోదుచేయని వారందరూ వెంటనే పూర్తిచేసుకోవాలని పేర్కొన్నారు. www.aptourism.gov.in వెబ్ సైట్ లో వ్యాపార వివరాలు సులువుగా నమోదుచేసుకునేవిధంగా ఏర్పాటుచేయడం జరిగిందని ఆయన స్పష్టం చేసారు.  టూర్ ఆపరేటర్లు, హోటల్స్, రెస్టారెంట్లు నిర్వహించేవారందరూ ఏ.పి.టి.ఏ ట్రేడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన వివరించారు. పర్యాటక రంగంలో సేవలందిస్తున్న వ్యాపార భాగస్వాములకు ఇదొక మంచి అవకాశమని, పర్యాటక రంగం వెబ్ సైట్ నందు నమోదు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు, రిజిస్ట్రేషన్ విధానం సహా అన్ని వివరాలు పొందపరచినట్లు ఆయన తెలిపారు. ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నా 63099 42033 మొబైల్ నెంబరుకు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.  

Srikakulam

2021-07-06 12:53:34

ఉపాది పనుల్లో పురోగతి పెంచాలి..

ఉపాధిహామీ పథకం అనుసంధాంతో చేపడుతున్న అభివృద్ధి పనులలో మరింత పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్  ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం స్థానిక ప్రకాశం భవనంలోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విరివిగా మొక్కలు నాటించాలని కలెక్టర్ చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్షించే అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సచివాలయాలు, ఆర్.బి. కె.లు, వై.ఎస్.ఆర్. హెల్త్ క్లినిక్ లు, బి.ఎమ్.సి.యు.లు భవనాల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలన్నారు. పునాది స్థాయిలో ఉన్న భవనాలకు సాంకేతిక అడ్డంకులు తొలగించేలా చూడాలన్నారు. సచివాలయాల భవన నిర్మాణాలపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. ప్రతి సోమవారం మండల స్థాయి అధికారులతో సమీక్షించుకోవాలన్నారు. నవరత్నాలు- పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో గృహాల నిర్మాణాలు ప్రారంభమయ్యేలా ప్రోత్సహించాలన్నారు. లేఅవుట్లలో సమస్యలుంటే తక్షణమే పరిష్కరించాలని, కోర్టు పరిదిలోని స్థలాల పరిష్కరానికి చర్యలు తీసుకోవాలన్నారు. గృహాల మ్యాపింగ్, జియో
ట్యాగింగ్ తప్పనిసరిగా చేయాలన్నారు.
             వై.ఎస్.ఆర్. భరోసా పథకం కింద అర్హులైన లబ్దిదారులందరికి సకాలంలో పింఛన్ పంపిణి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వేగంగా పరిష్కరించాలన్నారు. పింఛన్ పంపిణికి అవసరమైన యంత్రాలలో సాంకేతిక
పరమైన సమస్యలు రాకుండా చూడాలన్నారు. నాడు-నేడు కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆయన పలు సూచనలు చేశారు. సమావేశంలో జె.సి.లు జె. వెంకట మురళి, టి.ఎస్. చేతన్, కె.ఎస్. విశ్వనాథన్, కె.క్రిష్ణవేణి, డి.ఆర్.ఓ. డి. తిప్పే నాయక్, వ్యవసాయ శాఖ జె.డి. శ్రీనివాసరావు, పి.ఆర్. ఎస్.ఇ. కొండయ్య, డ్వామా పి.డి. శీనారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Ongole

2021-07-06 12:50:48

ఆయన సంగీతమంటే ఎంతో గౌరవం..

డా.మంగళం పల్లి బాలమురళీకృష్ణ సంగీతంలో  ఎంతో  ఖ్యాతి  గడించారని,  వారు మన తెలుగు వారు అవడం గర్వకారణమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖా మాత్యులు  ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.  మంగళవారం ఉదయం వి.ఎం.ఆర్.డి.ఎ బాలల ప్రాంగణంలో  డా. మంగళంపల్లి బాల మురళీ కృష్ణ, 92వ జయంతోత్సవాలు  సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో  ఘనంగా  నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా  కార్యక్రమానికి  ముఖ్య అతిధిగా  విచ్చేసిన  మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు  మాట్లాడుతూ మంగళంపల్లి బాలమురళీకృష్ణ  తన సంగీత పరిజ్ఞానంతో  దేశ విదేశాలలో  ఖ్యాతి గడించారన్నారు.  ప్రపంచంలో ఏ గాయకుడు  పాడలేనటువంటి పాటల నెన్నింటినో పాడారన్నారు.  ఎన్నో ఉన్నతమైన  బిరుదులు, సత్కారాలతో పాటు గౌరవ డాక్టరేట్లు అందుకున్నారన్నారు.  అయితే ప్రస్తుత సమాజంలో  పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలను  తెలియజేయాలని, కళల పట్ల  అభిరుచిని పెంపొందించాలన్నారు.  రాబోయే తరాలకు  వారి గొప్పదనాన్ని తెలియజేయాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం కళలను, కళాకారులను ప్రోత్సహిస్తుందని, విజయనగరం, విజయవాడలలో సంగీత కళాశాలలను అభివృద్ది పరుస్తామని తెలియజేశారు. ఎన్నో తరాల నుండి మన సంస్కృతి సంప్రదాయాలు నిలిచాయంటే వాటిలోని గొప్పదాన్ని తెలుసుకోవాలన్నారు. మన కళాకారులను, వారి గొప్పదనాన్ని తక్కువ చేసి చూడరాదని, వారిని ప్రోత్సహించాలన్నారు.  జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ మాట్లాడుతూ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ప్రముఖ వాగ్గేయ కారుడిగా ఎన్నో కచేరీలు చేశారన్నారు.  పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని, వారిలోని సంగీత జ్ఞానాన్ని గుర్తించి  జీవితాంతం అదే దారిలో  కొనసాగారన్నారు. వారి జయంతోత్సవాలను  నిర్విహించుకోవడం గర్వ కారణమన్నారు.  వారి స్సూర్తితో  సంగీతంలో  కృషి చేయాలన్నారు.  అంతరించి పోతున్న కళలను  కాపాడుకోవాలని,  అదే  వారికి ఘన నివాళి అని తెలియజేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో  మేయరు జి. వెంకట హరి కుమారి, జి వి ఎం సి కమీషనరు డా.జి.సృజన, సాంస్కృతిక శాఖ డైరక్టరు మల్లిఖార్జునరావు ప్రసంగించారు. తదుపరి 9 మంది కళాకారులకు మంత్రివర్యులు, జిల్లా కలెక్టరు సన్మానం గావించారు. సన్మానాలు పొందిన వారు :వంకాయల  వెంకటరమణమూర్తి, .డా. పంతుల రమా,  ఎం .శ్రీనివాస నరసింహమూర్తి, కె. సరస్వతీ విద్యార్ధి, గురువిల్లి అప్పన్న, డా. మండపాక శారద, ధనవాడ ధర్మారావు, డా.  బి.కె .డి ప్రసాద్, ధనుంజయ పట్నాయక్.  ఈ కార్యక్రమంలో  పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్లు పి.అరుణ్ బాబు, కల్పనా కుమారి, పలువురు  అధికారులు , అధిక సంఖ్యలో  ప్రేక్షకులు హాజరయ్యారు.

విశాఖ సిటీ

2021-07-06 12:47:44

అన్నివర్గాల భద్రతపై ప్రభుత్వం ద్రుష్టి..

భారత ప్రభుత్వం సర్వవ్యాప్త అభివృద్థికి నిరంతరం కృషిచేస్తోందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖా మాత్యులు థావర్ చంద్ గెహ్లట్ పేర్కొన్నారు.  శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు నిధులతో మంజూరు చేసిన జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్దులకు ఉపకరణములు పంపిణీ కార్యక్రమంలో మంగళవారం ఆయన వర్చ్యువల్ విధానంలో పాల్గొని మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ప్రపంచం కరోనా మహమ్మారి బారిన పడుతున్న ప్రస్తుత పరిస్థితులలో, భారత ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల భద్రత , ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, విభిన్న సామర్థ్యం ఉన్నవారు దివ్యంగ్జన్ మానవ వనరులలో అంతర్భాగమన్నారు. కోవిడ్ -19 మహమ్మారి నుండి ఉత్పన్నమయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సీనియర్ సిటిజన్లకు భారత ప్రభుత్వ ADIP పథకం కింద మరియు జాతీయ వయోశ్రీ పథకం కింద సీనియర్ సిటిజన్లకు వివిధ సహాయక పరికరాలను అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, సుమారు 3 కోట్ల రూపాయలతో పార్లమెంటు సభ్యులు నిధుల నుండి వివిధ పరికరాలను కొనుగోలు చేసి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు పంపిణీ చేయడమనేది ఒక మంచి కార్యకమమని పార్లమెంటు సభ్యులు కె. రామమోహన్ నాయుడుని ఆయన అభినందించారు.   2638 మంది లబ్దిదారులకు 4502 ఉపకరణములు గుర్తించుట జరిగిందన్నారు.  రాష్ట్రంలో ఉన్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని వివిధ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.  పాలక పక్షము, మిత్ర పక్షములు రెండూ కలసికట్టుగా ఉంటే ఆయా ప్రాంతాలు అభివృద్థి చెందుతాయన్నారు.  దివ్యాంగులకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు.  వీరి కోసం ప్రభుత్వం ఫించన్లు, తదితర పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. 

ఎంపీ కింజరాపు రామమోహన్ నాయుడు మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న దివ్యాంగులు వారికి ఆర్థిక స్తోమత లేక వివిధ రకాల ఉపకరణాలు కొనుగోలు చేసుకోలేని వారు ఎందరో ఉన్నారన్నారు.  జిల్లాలో 2638 మందిని గుర్తించడమైనదని, వారికి 4502 ఉపకరణాలను పంపిణీ చేయడం జరుగుతుందని, వీటి విలువ సుమారు 3 కోట్ల రూపాయలతో పార్లమెంటు నిధుల నుండి కొనుగోలు చేసినట్లు చెప్పారు.  ఇందులో బ్యాటరీతో నడచే మూడు చక్రాల సైకిళ్లు, వినికిడి యంత్రాలు, తదితరమైన ఉపకరణాలు ఉన్నాయన్నారు.  దివ్యాంగులు అందరితో సమానంగా ఉండే విధంగా  ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.  ఉపకరణాలు మంజూరు చేసిన కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారిత మంత్రిత్వ శాఖా మాత్యులు థావర్ చంద్ గెహ్లట్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రంలో జిల్లా నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, వర్చ్యుల్ విధానంలో ఢిల్లీ నుండి సామాజిక న్యాయ మరియు సాధికారిత శాఖ సంయుక్త కార్యదర్శి డా. ప్రభోత్ షేత్, తదితరులు మాట్లాడారు.  అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పార్లమెంటు సభ్యులు కింజరాపు రామమోహన్ నాయుడు, దివ్యాంగులకు ఉపకరణాలు అందజేశారు.

Srikakulam

2021-07-06 12:43:02

దుకాణాల వద్ద 3రంగుల చెత్త డబ్బాలుండాలి..

ప్రతీ దుకాణం ముందు మూడు రంగుల చెత్త డబ్బాలు ఉండేలా చూడాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు శానిటరీ అధికారులను ఆదేశించారు. మంగళవారం  ఆయన ఎనిమిదవ జోన్ 90వ వార్డులోని బుచ్చిరాజు పాలెం, సుసర్ల కాలనీ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ దుకాణాల ముందు మూడు రంగుల చెత్త డబ్బాలు ఉండాలని, లేని యెడల వారి వద్ద నుండి అపరాధ రుసుం  వసూలు చేయాలని, నిషేదిత ప్లాస్టిక్ అమ్మ కుండా చూడాలని ఆదేశించారు. ప్రతీ ఇంటినుండి చెత్త సేకరణను పరిశీలించి, పారిశుధ్య సిబ్బందికి తగు సూచనలిచ్చారు. తడి-పొడి మరియు ప్రమాధకరమైన చెత్తనూ వేరు వేరుగా తీసుకోవాలని, రోడ్డ్లు, కాలువలు ఎప్పటికప్పుడు శుభ్ర పరిచి, చెత్తను డంపింగు యార్డుకు తరలించాలని, పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యం వహించరాదని సిబ్బందిని హెచ్చరించారు. దోమలు నివారణకు చర్యలు చేపట్టాలని, వీదులలో ఫాగింగు  చేయాలని తెమీ పాస్ ద్రావం నిల్వ ఉన్న నీటి కుండీలలో కలపాలని, పరిసరాలను పొడిగా ఉండేలా చూడాలని, డస్ట్ బిన్లు, లిట్టర్ బిన్లను శుభ్రపరచాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ చక్రధర్, శానిటరీ సూపర్వైజర్ అప్పారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొనారు.  

విశాఖ సిటీ

2021-07-06 12:34:31

ప్ర‌జ‌ల గుమ్మం వ‌ద్ద‌కే ప్ర‌భుత్వ పాల‌న..

ప్ర‌జ‌ల గుమ్మం వ‌ద్ద‌కు ప్ర‌భుత్వ పాల‌న తీసుకువెళ్లాల‌న్న‌దే సీఎం వై ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆశ‌య‌మ‌ని, దానికోసమే గ్రామ, వార్డు స‌చివాల‌య వ్య‌వస్థ ఏర్పాటు జరిగిందని రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. పాద‌యాత్ర సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేరుస్తామ‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల‌కోసం రానున్న రోజుల్లో మ‌రిన్ని సంక్షేమ అభివృద్ధి ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడ‌తామ‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల్లో కుల‌, మ‌త‌, వ‌ర్గ‌, రాజ‌కీయ వివ‌క్ష అనేదే లేకుండా అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ అందించ‌డ‌మే ప్ర‌భుత్వం ధ్యేయ‌మ‌ని చెప్పారు. బొబ్బిలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో రాష్ట్ర పుర‌పాల‌క మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మంగ‌ళ‌వారం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా తెర్లాం మండ‌లం పెరుమాలి, బొబ్బిలి మండ‌లం పారాదిల్లో ఒక్కొక్క‌టి రూ.40 ల‌క్ష‌ల వ్య‌యంతో కొత్త‌గా నిర్మించిన గ్రామ స‌చివాల‌య భ‌వ‌నాల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ తెర్లాం మండ‌లం పెరుమాలిలో నెలరోజుల్లో తాగునీటి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పారు. గ్రామంలో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు జ‌రుగుతున్న తీరును గ్రామ సచివాల‌య ఉద్యోగుల‌తో స‌మీక్షించారు. ముందుగా గ్రామంలోని స‌చివాల‌యంలోని ఉద్యోగుల‌ను, వ‌లంటీర్ల‌ను మంత్రి ప‌రిచ‌యం చేసుకొని వారు అందిస్తున్న సేవ‌ల గురించి తెలుసుకున్నారు. ఆ త‌ర్వాత ఫించ‌న్లు, అమ్మ ఒడి, రైతుభ‌రోసా, పేద‌లంద‌రికీ ఇళ్లు త‌దిత‌ర ప‌థ‌కాల అమ‌లుపై ఆరా తీశారు. రైతుభ‌రోసా ప‌థ‌కంలో 325 మంది ద‌ర‌ఖాస్తు చేస్తే వారిలో 25 మంది అన‌ర్హులుగా పేర్కొంటూ తిర‌స్క‌రించార‌ని, ఏ కార‌ణాల‌తో తిర‌స్క‌రించార‌ని మంత్రి స‌చివాల‌య ఉద్యోగుల‌ను ప్ర‌శ్నించారు. తిర‌స్క‌ర‌ణ‌కు గ‌ల కార‌ణాల‌ను స‌చివాల‌య సిబ్బంది వివ‌రించారు. గ్రామంలో ఏదైనా ప‌ధ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసిన వారు అన‌ర్హులైతే వారి ద‌ర‌ఖాస్తును ఏ కార‌ణంతో తిర‌స్క‌రించిందీ స్ఫ‌ష్టంగా తెలియ‌జేయాల్సి ఉంద‌న్నారు.

పారాదిలో క‌మ్యూనిటీ హాల్‌ను మంజూరు చేస్తామ‌ని, చంపావ‌తి నుంచి గ్రామానికి సాగునీటి స‌ర‌ఫ‌రాకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేస్తామ‌ని చెప్పారు. అర్హులైన వారు ఎవ‌రైనా ఇళ్లు మంజూరు కాకుండా వుంటే మ‌రోసారి ప‌రిశీలించి ఇళ్లు మంజూరు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.  రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేద‌లు ఎవ‌రూ ఉండ‌కూడ‌ద‌న్న‌దే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ల‌క్ష్య‌మ‌ని, ఈ మేర‌కు అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఇళ్లు మంజూరు చేస్తామ‌న్నారు. 
తెర్లాం మండ‌లం వెల‌గ‌వ‌ల‌స వ‌ద్ద ఆ గ్రామ మాజీ స‌ర్పంచ్ ఇటీవ‌లే మ‌ర‌ణించిన చేపేన జ‌గ‌న్నాధం నాయుడు విగ్ర‌హాన్ని మంత్రి ఆవిష్క‌రించారు. 
ఈ కార్య‌క్ర‌మాల్లో ఎం.పి. బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, ఎమ్మెల్యే శంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు, తూర్పుకాపు కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ మామిడి శ్రీ‌కాంత్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ డా.ఆర్‌.మ‌హేష్ కుమార్‌, పార్వ‌తీపురం స‌బ్ క‌లెక్ట‌ర్ భావ‌న‌, జిల్లాప‌రిష‌త్ సి.ఇ.ఓ. టి.వెంక‌టేశ్వ‌ర‌రావు, పంచాయ‌తీరాజ్ ఇ.ఇ. ఎం.ఇ.ఎన్‌.వెంక‌ట‌రావు, డి.పి.ఓ. సుభాషిణి, డిప్యూటీ క‌లెక్ట‌ర్ హెచ్‌.వి.జ‌య‌రాం త‌దిత‌రులు పాల్గొన్నారు.

Therlam

2021-07-06 12:31:01

నగరంలో గెడ్డలు ప్రక్షాళన చేయాలి..

మహావిశాఖ నగర పరిధిలోని అన్ని గెడ్డలను, మురికి వాగులను ప్రక్షాలన చేయాలని జివిఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం మంగళవారం ఆమె రెండవ జోన్ 13వ వార్డు పరిధిలోని శ్రీ కాంత్ నగర్, లక్ష్మి నగర్ తదితర ప్రాంతాలలో  కమిషనర్ డా. జి. సృజనతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గెడ్డలను శుభ్రం చేయాలని  మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కమిషనర్ కి సూచించారు. గెడ్డలలో పూడిక తీత పనులను చేపట్టాలని, వర్షా కాలంలో గెడ్డలు పొంగకుండా నీరు సాఫీగా వెళ్ళే ఏర్పాటు చేయాలన్నారు. గెడ్డలు ఆక్రమణలు తొలగించి, ఆక్రమణకు గురి కాకుండా చూడాలని ఆదేశించారు. త్రాగు నీరు సమృద్ధిగా వస్తున్నదీ లేనిదీ, పారిశుధ్య సిబ్బంది ప్రతీ రోజు చెత్త సేకరణ తదితర అంశాలను ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు. విజన్ స్కూలు ప్రక్కన ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణ లేకుండా చూడాలని వి.ఆర్.ఒ. కు సూచించారు. గెడ్డల అడుగు భాగంలో కాంక్రీట్ వేయాలని, రీటైనింగ్ వాల్స్ నిర్మించాలని శ్రీకాంత్ నగర్ లో కళ్యాణ మండపం నిర్మించాలని, లక్ష్మి నగర్ లో సచివాలయం ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో అంగన్వాడి కేంద్రం లేదా కమ్యునిటీ హాలు నిర్మించాలని, శ్రీ కాంత్ నగర్ నుండి దుర్గ బజారు వరకు రోడ్డును నిర్మించాలని స్థానిక కార్పొరేటర్ కె. సునీత కోరగా మేయర్, కమిషనర్  పరిశీలిస్తామని తెలిపారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్య అధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, రెండవ జోనల్ కమిషనర్ బి. రాము, కార్య నిర్వాహక ఇంజినీరు చిరంజీవి, శ్రీనివాస్, రాయల్ బాబు,, సహాయక ఇంజినీర్లు, టి.పి.ఒ.లు, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-07-06 12:26:37

కోవిడ్ నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలి..

కోవిడ్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీవై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పై మంగళవారం తాడేపల్లిలోని సి.ఎమ్. క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి వీక్షణ సమావేశం నిర్వహించారు. కోవిడ్ మూడవ దశను సమర్థంగా ఎదుర్కోవడానికి అవసరమైన ఏర్పాట్లతో పాటు వైద్యులను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించారు. కోవిడ్ రెండవ  దశలోనూ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారి, కలెక్టర్ వరకు అందించిన సేవలు సాహోసోపేతమైనవని ఆయన ప్రశంసించారు. కోవిడ్ సోకిన వారికి ఆరోగ్యశ్రీ క్రింద మెరుగైన వైద్యం అందేలా సి.సి. కెమేరాల నిఘా పెంచాలన్నారు. ప్రజలు దోపిడికి  గురికాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ల పై ఉందన్నారు. ఈ నెల ఎనిమిదవ
తేదీ నుంచి 23వ తేదీవరకు రైతు చైతన్య యాత్రలు వైభవంగా నిర్వహించాలన్నారు. e-క్రాపింగ్ విధానంపై కలెక్టర్లు ప్రత్యేక ద్యాస పెట్టాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా బహుళ ప్రయోజనాలు రైతులకు కల్పించడం, అన్ని విధాల మేలు జరి గేలా చూడాలన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు - క్రాపింగ్ నూతన విధానంపై సలహా మండలి సమావేశాలు విధిగా నిర్వహించాలన్నారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ప్రకాశం జిల్లాలో మరింత పురోగతి సాధించేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. కోవిడ్ విపత్తు సమయంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేస్తూ ఉపాధిహామి పథకం కింద పేదోడికి పనులు కల్పించడం అభినందనీయమన్నారు.
 
ఉపాధి హామీ పనులు జిల్లాలో బాగా చేశారని, 85 శాతం పురోగతి సాధించడంపై కలెక్టర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా కలెక్టర్లు,
జిల్లా సంయుక్త కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు ప్రతివారం సచివాలయాలను తనిఖీలు చేయాలన్నారు. ఇంటి స్థలాలు కావాలని దరఖాస్తులు చేసుకున్న 90 రోజులలోనే ఇంటి పట్టాలు కేటాయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నవరత్నాలు- పేదలందరికి ఇళ్లు కార్యక్రమాలలో భాగంగా గృహనిర్మాణాలను అధికశాతం ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. గిరిజనులకు పంపిణి చేసిన అటవీ భూమి
అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెలలో వై.ఎస్.ఆర్. రైతుదినోత్సవం, వై.ఎస్.ఆర్. కాపునేస్తం, జగనన్న విద్యాదీ వెన పథకాలకు లబ్దిదారుల జాబితాను ముందుగానే సచివాలయాలలో ప్రకటించాలన్నారు.  సమావేశంలో జిల్లానుంచి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జె.సి.లు జె. వెంకట మురళి, టి.ఎస్. చేతన్, కె.ఎస్. విశ్వనాథన్, కె. క్రిష్ణ వేణి, డి.ఆర్.ఓ. డి. తిప్పే నాయక్, సి.పి.ఓ, డి. వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
               

Ongole

2021-07-06 12:20:40

5.09 లక్షల ఇళ్లకు మంచినీటి కుళాయిలు..

గ్రామీణ ప్రాంతాల్లో  5.09 లక్షల గృహాలకు ట్యాప్ కనెక్షన్ల ద్వారా తాగునీరు సరఫరా చేయడానికి ప్రణాళిక రూపొందించామని జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ చెప్పారు. జల జీవన్ మిషన్ కింద గ్రామీణ నీటి సరఫరాపై  జిల్లాస్థాయి ప్రణాళిక కమిటీ సమావేశం మంగళవారం స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్ లో జరిగింది. జల జీవన్ మిషన్ కింద గ్రామాలలో ప్రతి గృహానికి సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంతో పనిచేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.  ప్రస్తుతం 5.09 లక్షల గృహాలకు నీరు అందించాలని రూ.889.44 కోట్లతో ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి నివేదించామన్నారు. నీటి సరఫరా వ్యవస్థ నిర్మాణం కోసం రూ.36.97 కోట్లతో ప్రణాళిక రూపొందించగా,  రూ.490.20 కోట్లతో పైప్ లైన్ల నిర్మాణం చేపట్టాలని,  రూ.190.70 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించాలని ప్రణాళిక రూపొందించామన్నారు.  నూతనంగా నీటి వనరుల ఏర్పాటు కోసం రూ.56.17 కోట్లు, కొత్తగా ట్యాంకులు నిర్మించడానికి రూ.44.41 కోట్లు, మరో రూ.70.99 కోట్లు అనుబంధంగా వివిధ పనులకు నిధులు వెచ్చించాలని సమగ్ర ప్రణాళికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించిన విషయాలను ఆయన వివరించారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ కింద 2024 సంవత్సరం వరకు రూ 527.17 కోట్లు మంజూరు చేస్తూ అధికారికంగా అనుమతులిచ్చిందన్నారు.
            జల వనరులు తక్కువగా ఉన్న ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్యలు రాకుండా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ చెప్పారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జల జీవన్ మిషన్ కింద రానున్న మార్చి నాటికి ఒక లక్ష, 62వేల, 330 గృహాలకు నీటి కనెక్షన్ లు ఇవ్వడానికి రూ.227.27 కోట్లు వెచ్చించాలని ప్రణాళిక రూపొందించినట్లు ఆయన వివరించారు. ఈ పనులు ఇప్పటివరకు11.66 శాతం పురోగతిలో ఉన్నాయన్నారు. గడిచిన మూడు నెలలలో రూ.3.03 కోట్ల నిధులు వెచ్చించి 18,930 గృహాలకు ట్యాప్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలలో నీటి సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని ఆయన సూచించారు.  గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు జల జీవన్ మిషన్ కింద స్వచ్ఛమైన తాగునీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీటి సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. పైపులైన్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు. నిర్మాణ పనుల పరిశీలనకు సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్ లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. వారంతా నిరంతరం పర్యవేక్షించేలా చూడాలన్నారు. ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటి నాణ్యతను  గుర్తించే ల్యాబ్ లు సమర్థంగా పనిచేయాలన్నారు. గతేడాది లక్ష్యంలో 65.04 శాతం పురోగతి సాధించిన విషయాలను ఆయన గుర్తు చేశారు. రూ.260.19  కోట్ల నిధులతో  95,456 గృహాలకు ట్యాప్ కనెక్షన్ లు ఇవ్వగలిగామని ఆయన తెలిపారు.

సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) టి. ఎస్. చేతన్, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ మర్థన్ఆలీ,  జడ్పీ సీఈఓ దేవానందరెడ్డి, డ్వామా పి.డి.  శీనారెడ్డి, డిఆర్డీఏ పిడి బి.బాబురావు,  ఆర్ డబ్ల్యూఎస్ డీఈ మహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Ongole

2021-07-06 12:15:37

జంతువులతో వ్యాధులను తగ్గించొచ్చు..

జంతువులను శాస్త్రీయ పద్ధతులలో పెంచుకోవడం వలన వాటి నుంచి సంక్రమించే వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా. యం.కిశోర్ పేర్కొన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా స్థానిక పశు సంవర్ధక శాఖ కార్యాలయ ప్రాంగణంలో రేబిస్ వ్యాధి నిరోధక టీకాల శిబిరం మరియు అవగాహన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జె.డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ నేడు ప్రతీ ఇంట్లో జంతువులను పెంచుకోవడం అలవాటుగా మారిందని అన్నారు. జంతువులతో మానవుని సహచర్యం ఎంతో ప్రాచీనమైందని, ప్రతి మనిషి పశు పక్ష్యాదుల నుండి ఉత్తత్తి అయ్యే పాలు, గ్రుడ్లు, మాంసంపై ఆధారపడియున్నారని తెలిపారు. జంతువుల నుండి మనుషులకు మరియు మనుషుల నుండి జంతువులకు సంక్రమించు వ్యాధులను జూనోటిక్ వ్యాధులని పిలుస్తారని చెప్పారు. జంతువుల సహచర్యం వలన సుమారు 280 వ్యాధుల వరకు సంక్రమించే అవకాశమున్నట్లు గుర్తించడం జరిగిందని అన్నారు. జూనోటిక్ వ్యాధులు చాలారకాలు ఉన్నప్పటికీ వాటి గురించి భయపడవలసిన అవసరం లేదని తెలిపారు. ఆరోగ్య విజ్ఞానంపై అవగాహన కల్పించడం వ్యక్తిగత పరిశుభ్రత, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మానుకోవడం వలన కొంతమేర నివారించుకోవచ్చని చెప్పారు. అలాగే జంతువులకు సరైన సమయంలో టీకాలను వేయిస్తూ, శాస్ర్తీయ పద్ధతులలో పెంచుకోవడం వలన జూనోటిక్ వ్యాధుల  నుండి పూర్తి రక్షణ పొందవచ్చని సూచించారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం రోజున ప్రతీ ఏటా శిబిరాలను నిర్వహించడం మరియు జూనోటిక్ వ్యాధులపై అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు. కోవిడ్ నేపధ్యంలో ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, కోవిడ్ నిబంధనల మేరకు జంతువులకు టీకాలను వేయించి రేబిస్ వంటి వ్యాధుల నుండి రక్షణ పొందాలని ఆయన ఆశించారు. జూనోటిక్ వ్యాధులపై అవగాహన పెంపొందించే కరపత్రాలను ఇతర అధికారులతో కలిసి విడుదల చేసారు. అలాగే జూనోటిక్ వ్యాధులు సోకకుండా ఉండేందుకు రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించారు.

        ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం డివిజన్ డెప్యూటీ డైరక్టర్ డా. యం.జగన్నాథం, యస్.ఎల్.బి.పి డెప్యూటీ డైరక్టర్ డా. ఎ.ఈశ్వరరావు, వి.పి.సి డెప్యూటీ డైరక్టర్ డా. మనోజ్ కుమార్, ఇ.ఓ., డి.ఎల్.డి.ఏ డెప్యూటీ డైరక్టర్ డా. చంద్రశేఖర్, వి.పి.సి సహాయ సంచాలకులు డా. మాదిన ప్రసాదరావు, పశు సంవర్ధక శాఖ  పశు వ్యాధుల వైద్యులు మరియు సహాయ సంచాలకులు డా. మోహిని కుమారి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-06 12:05:43

లక్ష్యానికి మించి మొదలైన నిర్మాణాలు..

న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్ల నిర్మాణాల మెగా గ్రౌండింగ్ మేళాలో 40 వేల ల‌క్ష్యానికి మించి దాదాపు 56 వేల నిర్మాణాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని, ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములైన ప్ర‌తి ఒక్క‌రికీ అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. మంగ‌ళవారం క‌లెక్ట‌రేట్‌లో పేద‌ల‌కు ఇళ్లు కార్య‌క్ర‌మంపై జేసీ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ‌, జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (హెచ్‌) ఎ.భార్గ‌వ‌తేజ‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ నిర్మాణాలు ప్రారంభ‌మైన ఇళ్లు మూడు నెలల్లో పూర్త‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఎస్‌హెచ్‌జీ లింకేజీ అడ్వాన్సు రుణాలు అందించాల‌ని సూచించారు. ఇళ్లు క‌ట్టుకునేందుకు ముందుకొచ్చే ల‌బ్ధిదారుల‌ను గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల వారీగా గుర్తించి ప్రోత్స‌హించాల‌న్నారు. ఈ మొత్తం ప్ర‌క్రియ‌లో ప్ర‌జాప్ర‌తినిధుల కీల‌క భాగ‌స్వామ్యంతో గ్రౌండింగ్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని, లేఅవుట్‌లో మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ ప‌నుల‌ను పూర్తిచేయాల‌న్నారు. జిల్లాలో తొలిద‌శ‌లో మంజూరైన 1,48,000 ఇళ్ల నిర్మాణాల పూర్తికి రూపొందించిన ప్ర‌ణాళిక అమ‌లుకు గృహ‌నిర్మాణ‌, రెవెన్యూ, పంచాయ‌తీరాజ్‌, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, మున్సిప‌ల్ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. స‌మావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, హౌసింగ్ పీడీ జి.వీరేశ్వ‌ర ప్ర‌సాద్‌, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, మెప్మా పీడీ కె.శ్రీర‌మ‌ణి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-07-06 12:04:02

ఈనె 8న ఘనంగా రైతు దినోత్సవం..

స్వర్గీయ డా. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 8 న రైతు దినోత్సవాన్ని  ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రైతుకు పంటల పై, ఎరువులు, విత్తనాల, పురుగు మందులు పై  అవగాహన పెంచడానికి   ఈ నెల 9 నుండి  రైతు చైతన్య యాత్రలను నిర్వహించాలన్నారు.  రైతు భరోసా కేంద్రాల్లో, మండల, జిల్లా స్థాయి లో వ్యవసాయ సలహా మండలి సమావేశాలు జరపాలన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళ వారం స్పందన పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి  కోవిడ్, ఖరీఫ్ సన్నద్ధత, ఉపాధి హామీ, సచి వాలయాల తనిఖీ, అర్బన్ క్లినిక్స్, హౌసింగ్ గ్రౌండింగ్స్, ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు తదితర అంశాల పై సమీక్షించారు.   రాష్ట్రంలో  కోవిడ్ పొజిటివిటీ రేట్  2.89 శాతానికి తగ్గిందని, ఇందు కోసం పని చేసిన జిల్లా కలెక్టర్ నుండి ఆశ వర్కర్, వాలంటీర్ వరకు అందరికి అభినందనలని అన్నారు. అయితే ఫీవర్ సర్వే మాత్రం నిరంతర జరగాలని, కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే ఉండాలని అన్నారు.  ఈ నెలలో కాపు నేస్తం జగనన్న ప్రారంభాలు ఉన్నాయని, వీటి కోసం అర్హులైన  లబ్ది దారులను  ఎంపిక చేయాలని ఆదేశించారు. ఉపాధిహామీ పనుల్లో  17.18 కోట్ల పనిదినాలు కల్పించి జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపినందుకు జిల్లా కలెక్టర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ  వీడియో కాన్ఫరెన్స్ లో   జిల్లా నుండి  జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్,   సంయుక్త  కలెక్టర్ (రైతు భరోసా మరియు రెవెన్యూ) డా.జి.సి.కిశోర్ కుమార్, సంయుక్త  కలెక్టర్ (హౌసింగ్) మయూర్ అశోక్,  జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జె.వెంకట రావు ,  డి.ఆర్.ఓ గణపతి రావు,అగ్రికల్చర్ జెడి ఆశా దేవి, సిపిఓ విజయ లక్ష్మి, డి ఎంహెచ్ఓ డా.రమణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-06 12:03:02

మెరుగైన సేవలకే సచివాలయాలు..

ప్ర‌భుత్వ సేవ‌ల‌ను నేరుగా ప్ర‌జ‌ల ముంగిట‌కు తీసుకెళ్లేందుకు  ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ ద్వారా వాలంటీర్ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ల‌ను తీసుకొచ్చార‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, స‌హ‌కార‌, మార్కెటింగ్‌, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు పేర్కొన్నారు. సోమ‌వారం క‌ర‌ప మండ‌లంలోని పాత‌ర్ల‌గ‌డ్డ గ్రామంలో నూత‌నంగా నిర్మించిన గ్రామ స‌చివాల‌య శాశ్వ‌త భ‌వ‌నాన్ని కాకినాడ ఎంపీ వంగా గీతతో క‌లిసి మంత్రి క‌న్న‌బాబు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ వాలంటీర్‌, స‌చివాల‌య వ్య‌వ‌స్థల‌ ద్వారా వినూత్న పాల‌న సాగిస్తూ మ‌న రాష్ట్రం దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తోంద‌న్నారు. కుల‌, మ‌త‌, రాజ‌కీయాల‌కు అతీతంగా అర్హ‌త ఒక్క‌టే ప్రాతిప‌దిక‌గా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల‌ను అందిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల‌కు అన్ని విధాలా సేవ‌లు అందించేందుకు గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌తో పాటు రైతు భ‌రోసా కేంద్రాలు (ఆర్‌బీకేలు), వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బ‌ల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు త‌దిత‌రాల‌కు శాశ్వ‌త భ‌వ‌నాల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న నిర్మిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. కాకినాడ గ్రామీణ నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి, ఆద‌ర్శ‌వంత‌మైన నియోజ‌క‌వ‌ర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్య‌త క్ర‌మంలో నిధులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు తెలిపారు. 

పేద‌ల‌కు నేరుగా సంక్షేమం..
పేద‌ల‌కు పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో నేరుగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తున్న ఏకైక రాష్ట్రం మ‌న‌దేన‌ని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అందిస్తున్న ప‌థ‌కాల‌ను లబ్ధిదారులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. గ్రామంలో డ్రెయిన్లు లేక ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అదేవిధంగా ఎస్సీ, అరుంధ‌తీ వీధుల్లోని డా. బీఆర్ అంబేడ్క‌ర్‌, బాబూ జ‌గ్జీవ‌న్‌రాం విగ్ర‌హాల‌కు షెల్ట‌ర్లు నిర్మించాల‌ని స‌ర్పంచ్ ఏసుబాబు కోర‌గా.. మంత్రి క‌న్న‌బాబు స్పందించి, వాటి నిర్మాణాల‌కు నిధుల‌ను మంజూరు చేయించ‌నున్న‌ట్లు తెలిపారు. కార్య‌క్ర‌మం అనంత‌రం మ‌న‌బ‌డి-నాడు నేడు ద్వారా ఆధునికీక‌రించిన ప్రాథ‌మికోన్న‌త పాఠ‌శాల‌ను మంత్రి, ఎంపీ సంద‌ర్శించారు. పాఠ‌శాల‌లో విద్యార్థుల సంఖ్య‌ను పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. యండ‌మూరులో ప‌ర్య‌టించి నూత‌నంగా నిర్మించిన బ‌స్‌షెల్ట‌ర్‌, ఆర్‌వో ప్లాంటుల‌ను ప్రారంభించారు. కార్య‌క్ర‌మంలో ఎంపీడీవో క‌ర్రె స్వ‌ప్న‌, ఎంఈవో కె.బుల్లికృష్ణ‌వేణి, డీటీ పి.శ్రీనివాస‌రావు, ఈవోపీఆర్‌డీ సీహెచ్ బాలాజీ వెంక‌ట‌ర‌మ‌ణ‌, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Karapa

2021-07-05 16:03:12

నిరుపేదలకు మాస్కులు పంపిణీ..

విశాఖ నగరంలో రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో ధాన్ ఫౌండేషన్ మూడు రోజుల నుంచి 3వేల మాస్కులు పంపిణీ చేసినట్టు నిర్వాహకులు కె.రమాప్రభ తెలియజేశారు. ఈ మేరకు సోమవారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు.  నగరంలోని 4 సమాఖ్యల పరిధిలో వున్న 80 వార్డు సచివాలయాలలో  1000 మంది ఆటో సిబ్బందికి, 1000 మంది డొమెస్టిక్ వర్కర్స్,  1000 మంది వీధి వర్తకులకు పంపిణీ చేసినట్టు అందులో వివరించారు. మొదటి విడతగా 3000 మాస్కులను అందజేశామని విరవించిన సంస్థ రిలయన్స్ ఫౌండేషన్ లాక్ డౌన్ పీరియడ్ లో కూడా ధాన్ ఫౌండేషన్ కి డ్రై రేషన్ కిట్లు పేద ప్రజలకు ఇచ్చామని పేర్కొంది. ఆరిలోవ, ఎస్ ఐ జి నగర్, పెద్ద జాలారి పేట, ఎఫ్ ఎం సి, మల్కాపురం, శ్రీహరిపురం, ప్రసాద్ గార్డెన్స్, కొబ్బరితోట, వెలంపేట ఏరియాలలో ఈ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో  సమాఖ్య జీవనోపాధి అసోసియెట్లు ఆది లక్ష్మి, అరుణ, సూర్య కుమారి హెల్త్ అసోసియేట్ దేవి , అసోసియేట్ లు పాల్గొన్నట్టు ప్రకటనలో తెలియజేశారు.

Visakhapatnam

2021-07-05 15:57:33