1 ENS Live Breaking News

అల్లూరి ఆశయ సాధనకు కృషి..

స్వాతంత్య్ర సమరయోధులు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకై ఈ ప్రభుత్వం కృషిచేస్తుందని గృహనిర్మాణ శాఖ సంయుక్త కలెక్టర్ హిమాంశు కౌశిక్ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు 124వ జయంతి వేడుకలు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా జరిగాయి. తొలుత అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి జె.సి,  రెవిన్యూ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి పోరాట స్ఫూర్తి అందరికి ఆదర్శమని, అతి చిన్న వయసులోనే మహోజ్వల శక్తిగా అల్లూరి ఎదిగారని కొనియాడారు. ఆయన చేసిన సాయుధ పోరాటం స్వతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమని అభివర్ణించారు. ఆయన స్పూర్తితో భగత్ సింగ్ వంటి వీరులు ముందుకు వచ్చారని గుర్తుచేశారు. గిరిజన హక్కుల కోసం ఆయన చేసిన పోరాట స్ఫూర్తి ఇప్పటికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని గిరిజనులకు విద్య, వైద్యంతో పాటు సమాన హక్కులు, ఆర్.ఐ.డి.ఎఫ్ పట్టాలు, ఇళ్ల పట్టాలు, గృహానిర్మాణాలు  వంటి కార్యక్రమాలను ప్రతీ సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలో ఒక ఐ.ఏ.ఎస్ అధికారి ద్వారా చేపడుతున్నట్లు వివరించారు. అల్లూరి వంటి మహనీయులు గిరిజనుల అభివృద్ధి కోసం ఏమి ఆశించారో వాటన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు టి.వేణుగోపాల్, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి సిహెచ్.రాజేశ్వరరావు, ఇతర అధికారులు, కలెక్టర్ కార్యాలయ విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-04 10:25:00

మెగా గ్రౌండింగ్ లో జిల్లానే ప్రథమం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించిన మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా కార్యక్రమంలో 200 శాతానికి పైగా ఇల్లు నిర్మాణాలను ప్రారంభించి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు టి.వేణుగోపాల్ వెల్లడించారు. ఈ మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమం విజయవంతం కావడానికి  వాలంటీరు దగ్గర నుండి అధికారుల వరకు నిర్విగ్నంగా కృషిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో ఈ కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించేందుకు మార్గ నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, సంయుక్త కలెక్టర్లు డా.కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములు నాయుడు, గృహ నిర్మాణ శాఖ సంయుక్త కలెక్టర్ హిమాంశు కౌశిక్ లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లాలో ఇంత భారీస్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా కేంద్ర కార్యాలయం నుండి ప్రత్యేక అభినందనలు లభించాయని చెప్పారు. జూలై 3న పొన్నాడలో నిర్వహించిన గ్రౌండింగ్ మేళా కార్యక్రమంలో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వీడియో కాలింగ్ ద్వారా నేరుగా లబ్దిదారులతో  మాట్లాడి జిల్లా యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లను తెలుసుకొని సంతోషాన్ని వ్యక్తపరిచారని చెప్పారు. లబ్ధిదారులు ఇంకా ఎవరైనా ముందుకు వస్తే వాటిని కూడా గ్రౌండింగ్ చేయించి ఇదే వేగంతో, ఇదే స్ఫూర్తితో భూమి పూజ మొదలుపెట్టి ఇల్లు పూర్తయ్యేంత వరకు భాద్యత వహించాలని జిల్లా కలెక్టర్ ఆశీస్తున్నారని, ఆయన ఆశయ సాధనకు అందరు అధికారుల సహకారంతో ఈ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాష్ట్రంలో జిల్లాను గౌరవ ప్రధమైన స్థానంలో నిలిపి ప్రభుత్వం నిర్దేశించిన 92 వేల గృహాలను పూర్తిచేసి ,  ఫేజ్ - 2 క్రింద మిగిలిన 30 వేలు గృహాలను కూడ తీసుకువచేందుకు కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Srikakulam

2021-07-04 10:22:58

అప్పన్నకు అరకేజీ చందనం సమర్పణ..

 శ్రీశ్రీశ్రీ  శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) వారికి విశాఖ బుచ్చిరాజుపాలెం గవరవీధికి చెందిన భక్తుడు మారిశెట్టి లీలాఈశ్వరరావు, సూర్యకళ దంపతులు ఆదివారం  అరకేజీ చందనం సమర్పించారు. ట్రస్టు బోర్డు సభ్యుడు సూరిశెట్టి సూరిబాబు, దినేష్ రాజు ఆధ్వర్యంలో  చందనం సమర్పించారు.  ఆలయ ఏఈఓ రాఘవ కుమార్ కు రూ. 10,116 (పదివేల నూట పదహారు)ను సమర్పించి చందనం చెక్కను ప్రసాదంగా పొందారు. అనంతరం స్వామివారిని దర్శించుకుకొని తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. స్వామివారిని దర్శించుకుని ఇక్కడే చందనం సమర్పిస్తే వెంటనే చందనం చెక్కను ప్రసాదంగా ఇస్తామని రాఘవ కుమార్ వివరించారు.

Simhachalam

2021-07-04 07:39:23

అప్పన్నకు ICDSజెడీ శ్రీలత పూజలు..

సింహాచలం  శ్రీశ్రీశ్రీ  శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) వారిని మహిళా శిశు సంక్షేమశాఖ జాంట్ డైరెక్టర్, డిప్యూటీ కలెక్టర్ ఆర్.శ్రీలత తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి చేరుకున్నవారికి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన సింహాద్రి అప్పన్నకు ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ప్రసాదం అందజేయగా, వేద పండితులు ఆశీర్వాదం అందించారు. జెడీతోపాటు పెందుర్తి సిడిపిఓ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

Simhachalam

2021-07-04 06:56:40

రాజమండ్రి పాత బ్రిడ్జికి అల్లూరి పేరు..

తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి-కొవ్వూరు పాత వంతెనకు ప్రభుత్వం శ్రీ అల్లూరి సీతారామరాజు వంతెనగా నామకరణం చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వంతెన  ఫోటో పెడుతూ, కోట్స్ రాశారు. 2021వ సంవత్సరానికి అల్లూరి జన్మించి 124 సంవత్సరాలు పూర్తవుతుంది. నాటి నుంచి నేటి వరకూ అల్లూరి పేరుతో చారిత్రక చిహ్నాలు ఏమీలేవు.  74ఏళ్ల స్వాంత్ర్య భారత దేశంలో తెల్లవాడిని మట్టికరిపించి తెలుగువాడి పౌరుషాన్ని ప్రదర్శించిన అల్లూరి ఏ ప్రభుత్వమూ సముచిత స్థానాన్ని ఇవ్వలేదు. ఆయన పేరు, జీవిత చరిత్రతో మ్యూజియం, క్రిష్ణదేవిపేట, విశాఖ జిల్లాలను అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా మారుస్తామన్నహామీలు కూడా నెరవేరలేదు. కానీ ఎప్పుడో బ్రిటీషు కాలంలో నిర్మించిన కొవ్వూరు-రాజమండ్రి వంతెనకు మాత్రం అల్లూరి పేరు పెడుతున్నట్టు ప్రకటించడం నేడు చర్చనీయాంశం అవుతుంది.

Rajahmundry

2021-07-03 15:25:40

అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు..

శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్యశ్రీ నిబంధనలను అతిక్రమించి అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని సంయుక్త కలెక్టర్, ఆరోగ్యశ్రీ అదనపు ముఖ్యకార్యనిర్వహణాధికారి డా. కె.శ్రీనివాసులు హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ నిబంధనలు ఉల్లంఘించి వసూళ్లకు పాల్పడిన రాగోలు జెమ్స్ ఆసుపత్రి అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీచేసారు. జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పౌందిన పేషెంట్ నుండి డబ్బులు వసూలు చేసినట్లు రుజువైనందున జిల్లా క్రమశిక్షణ కమిటీ ద్వారా వసూలు చేసిన డబ్బులు కంటే పదిరెట్లు అధికంగా ఒక లక్షా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల పది రూపాయలు ( రూ.1,29,410/-లు ) జరిమానా విధించినట్లు జె.సి తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స పొందిన వారి దగ్గర నుండి ఆసుపత్రి వర్గాలు ఎటువంటి వసూళ్లకు పాల్పడరాదని, పాల్పడినట్లు రుజువైతే ఆయా ఆసుపత్రుల అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Srikakulam

2021-07-03 15:04:45

శానిటేషన్ విధులు నిర్వర్తించాల్సిందే..

రాష్ట్ర ప్రభుత్వం పట్టణ పురపాలక శాఖల్లో- ఏర్పాటు చేసిన వార్డు శానిటేషన్,  పర్యావరణ కార్యదర్శులకి ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారం విధులు నిర్వర్తించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. జి.ఒ.నెం.650 ప్రకారం వార్డు శానిటరీ కార్యదర్శులకు కొన్ని విధులు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ముఖ్యంగా సచివాలయం పరిధిలో కనీసం 3 గంటలు అవుట్ డోర్ వర్క్ లకు  వెళ్లడం,  తడి-పొడి చెత్త 100% సేకరణ చేయించడం, బహిరంగ ప్రదేశాల్లో,  కమ్యూనిటీ హాల్ లోనూ,  ప్రజా మరుగుదొడ్లు మొదలైన చోట్ల పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలన్నారు.  ఆన్ లైన్ బల్క్ వెస్ట్ మేనేజ్మెంట్ సిష్టం అమలు, ప్రతి ఇంట్లో, బయట వేస్ట్ జనరేటర్ లకు అవసరమైన సాంకేతిక సహాయం అందించాలన్నారు. సేంద్రియ ఎరువుల తయారుచేయు పద్ధతుల పై మహిళలకు అవగాహన కల్పించడంతోపాటు  రోడ్లపై పశు  సంచారం లేకుండా చూడాలన్నారు. సచివాలయ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలోని రోగులకు వివరాల సేకరణ, నిషేధిత ప్లాస్టిక్ ను అమ్మకాలు జరగకుండా చూడాలని, లైన్ డిపార్ట్మెంట్ వారితో కలసి వెస్ట్ మేనేజ్మెంట్ అమలుకు అవసరమైన సమాచారం ఇవ్వాలన్నారు. నగరంలో 100% చెట్లు బ్రతికే విధంగా చర్యలు  తీసుకోవడంతో పాటు వార్డులోని సమస్యలను అధికారులకు తెలియజేయాలన్నారు.   వారికి ప్రభుత్వం 15 సాధారణ సెలవులు,  పబ్లిక్ సెలవులు  వర్తిస్తాయని అన్నారు.  వార్డు శానిటేషన్,  పర్యావరణ కార్యదర్శులు వారి విధి నిర్వహణ నిమిత్తం  జివిఎంసి  లోని  ప్రజా ఆరోగ్య శాఖకు  అనుసంధానం చేయబడ్డారన్నారు. వారంతా కేటాయించిన విధులు ప్రకారం ఉదయం 6 గంటల నుంచి పనివేళలు మొదలవుతాయని కమిషనర్ స్పష్టం చేశారు.

GVMC office

2021-07-03 15:02:51

5నుంచి మంత్రి బొత్స జిల్లా ప‌ర్య‌ట‌న‌..

రాష్ట్ర పుర‌పాల‌క పట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి  బొత్స స‌త్య‌నారాయ‌ణ జూలై 5 నుంచి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. జిల్లా క‌లెక్ట‌ర్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం పుర‌పాల‌క మంత్రి 4వ తేదీ ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు విజ‌య‌న‌గ‌రంలోని త‌న నివాసానికి చేరుకుంటారు. 5న ఉద‌యం 11 గంట‌ల‌కు న‌గ‌రంలోని మునిసిప‌ల్ కార్పారేష‌న్ కార్యాల‌యం రెండు, మూడో అంత‌స్థుల‌ను ప్రారంభిస్తారు. మ‌ధ్యాహ్నం 3-00 గంట‌ల‌కు చీపురుప‌ల్లిలో మోడ‌ల్ డిగ్రీ క‌ళాశాల‌ను ప్రారంభిస్తారు. చీపురుప‌ల్లి మండ‌లం క‌ర్లాంలో సొసైటీ భ‌వ‌నానికి శంకుస్థాప‌న చేస్తారు. ఇదే గ్రామంలో ఇంటింటికీ తాగునీటి స‌ర‌ఫ‌రా చేసే ప‌థ‌కాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం విజ‌య‌న‌గ‌రం చేరుకుంటారు. 6న బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తారు. ఉద‌యం 10 గంట‌ల‌కు తెర్లాం మండ‌లం పెరుమాలిలో, 11 గంట‌ల‌కు బొబ్బిలి మండ‌లం పారాదిలో గ్రామ స‌చివాల‌య భ‌వ‌నాల‌ను ప్రారంభిస్తారు. కార్య‌క్ర‌మాల అనంత‌రం మ‌ధ్యాహ్నం విజ‌య‌న‌గ‌రం చేరుకుంటారు. 7,8 తేదీల్లో జిల్లాలో ఏర్పాట‌య్యే కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Vizianagaram

2021-07-03 14:09:09

అప్పన్నకు చందనం సమర్పణ..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహ(సింహాద్రి అప్పన్న)స్వామికి శనివారం గాజువాకకు చెందిన కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి, ఐశ్వర్య- అవినాష్ దంపతులు  రూ.10.116, కాకి గోవింద రెడ్డి చెరో అరకేజీ చందనం కోసం రూ.10.116  అరకేజీ చొప్పున చందనం సమర్పించారు. ట్రస్టు బోర్డు సభ్యుడు దినేష్ రాజు ఆధ్వర్యంలో చందనం సమర్పించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన చందనం సమర్పించే అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు. చందనం సమర్పించిన భక్తుల తరపున దినేష్ రాజుకి  చందనం ముక్కతోపాటు ఆలయ ఏఈఓ రాఘవ కుమార్  ప్రసాదాన్ని అందించారు.  ఈ కార్యక్రమంలో ట్రస్టుబోర్డు సభ్యుడు సూరిశెట్టి సూరిబాబు పాల్గొన్నారు.

Simhachalam

2021-07-03 13:12:16

అప్పన్న ఆలయంలో భద్రత కట్టుదిట్టం..

 విశాఖలోని  సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ (సింహాద్రి అప్పన్న)స్వామి వారి దేవస్థానంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా ఇక్కడ పనిచేసే గార్డుల వద్ద మొబైల్ -మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆలయంలోకి మొబైల్స్ పోన్స్ తీసుకెళ్లడం నిషేధించారు. వాటిని భద్రపరిచేందుకు ఆలయం వద్దే  కౌంటర్లు ఏర్పాటుచేశారు. అయినా కొంతమంది భక్తులు తెలియక మొబైల్స్ స్విచాఫ్ చేసి బ్యాగుల్లో వేసి తీసుకెళ్లడం దేవస్థానం ఈఓ సూర్యకళ స్వయంగా తెలుసుకున్నారు. దీంతో సెక్యూరిటీ గార్డులను డిటెక్టర్లు ఇచ్చి దేవస్థానం లోపల మొబైల్ నిషేధాన్ని తప్పకుండా అమలుచేయాలని ఆదేశించారు. శనివారం వీటి పరిశీలన మొదలైంది. ఆలయ ఏఈఓ రాఘవ కుమార్ స్వయంగా వాటిని తనిఖీ చేశారు. మొబైల్స్ తో ఎవర్నీ లోపలకు వదలొద్దని భద్రతా సిబ్బందిని, క్యూలైన్ల దగ్గరున్న పోలీసులను ఆదేశించారు. 

Simhachalam

2021-07-03 13:00:32

అప్పన్నకు ఉపరాష్ట్రపతి కుమార్తె పూజలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న)స్వామి వారిని శనివారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ దర్శించుకున్నారు. ఆమె అత్త, మావయ్య ఇతర కుటుంబ సభ్యులుసింహాద్రినాథునికి పూజలు చేశారు. అందరికీ ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు , వేద పండితులు ఆశీర్వదం అందించారు. శ్రీ స్వామివారి ప్రసాదాలను అధికారులు అందించారు. మొత్తం 15 మంది కుటుంబ సభ్యులు. శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులు ముందుగానే 4500 పెట్టి 15 అతిశీఘ్రదర్శనం టికెట్లు తీసుకోవడం విశేషం. 

Simhachalam

2021-07-03 12:49:31

సుందరంగా YSRజగనన్న కాలనీలు..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్ జగనన్న కాలనీలలో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించి సుందరమైన గ్రామాలుగా తీర్చిదిద్దనున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం పాయకరావుపేట మండలం  పి ఎల్ పురం గ్రామంలో మెగా గ్రౌండింగ్ హౌసింగ్ మేళా కార్యక్రమం లో మంత్రి పాల్గొని గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.  పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబూరావు మాట్లాడుతూ   ఇల్లు లేని అర్హులైన ప్రతి నిరుపేదకు సొంత ఇంటి కల సాకారం  కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. పాయకరావుపేట నియోజక వర్గంలో  సుమారు 5218 మంది అర్హులైన లబ్ధిదారులకు 102 లేఅవుట్ లలో ఇళ్ల స్థలాలను కేటాయించడం జరిగింది. పాయకరావుపేట మండలం పీఎల్ పురంలో 1233 మంది లబ్ధి దారులకు ఇళ్ళ స్థలాలను మంజూరు చేశారు. మెగా గ్రౌండింగ్ హౌసింగ్ మేళాలో  నర్సీపట్నం ఇంచార్జ్ ఆర్ డి ఓ ,అనిత, పాయకరావుపేట ప్రత్యేకఅధికారి విశ్వేశ్వరరావు,హౌసింగ్ డి ఇ మల్లికార్జున, తాసిల్దర్ సత్యనారాయణ,ఇతర అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

Payakaraopeta

2021-07-03 12:25:22

సేంద్రీయ ఎరువుల తయారీపై అవగాహన..

మహావిశాఖ నగర పరిధిలోని మహిళలకు సేంద్రీయ ఎరువు తయారీపై  అవగాహన పెంచాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులు ఆదేశించారు. శనివారం ఆమె రెండవ జోన్ ఐదవ వార్డు పరిధిలోని మడురవాడ, గణేష్ నగర్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సేంద్రీయ ఎరువు తయారు చేయు పద్దతులను మహిళా సంఘాల ద్వారా మహిళలకు అవగాహన పెంచాలని, ఇంటిలో వాడే కాయగూరల తొక్కలు, పండ్లు తొక్కలను ఉపయోగించి సేంద్రీయ ఎరువు తయారుచేయు విధానాన్ని తెలపాలని అన్నారు. గణేష్ నగర్ లో ఒక గృహిణి సేంద్రీయ ఎరువు తయారు చేయు పద్దతిని పరిశీలించి, ఆమెను అభినందించారు. ఈమెను ఆదర్శంగా చేసుకొని మరికొంత మందిని సేంద్రీయ ఎరువు తయారీకు ప్రోత్సహించాలని, డోర్ టు డోర్ చెత్త సేకరణ చేస్తున్నదీ లేనిదీ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తడి-పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని, ప్రతీ రోజు పారిశుధ్య సిబ్బంది వస్తున్నదీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు. వార్డులో మంచి నీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు శుద్ధి చేసిన త్రాగు నీరు అందించాలని, గడువులోపు కొళాయి కనక్షనులు ఇవ్వాలని, సహాయక ఇంజినీరు(వాటర్ సప్ప్లై)ను  ఆదేశించారు.  వార్డులో పందులు అధికంగా ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని వెటర్నరి డాక్టరును ఆదేశించారు. రానున్న వర్శాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాదులైన మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబల కుండా ముందు జాగ్రత చర్యలు తీసుకోవాలని, ఇళ్ళ పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూడాలని, వారంలో ఒక్క రోజు “డ్రై” డే పాటించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎఎంఒహెచ్ కిషోర్ ను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, రెండవ జోనల్ కమిషనర్ బి.రాము,   కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి (మెకానికల్), శంకర్(వర్క్స్), శ్రీనివాస్(వాటర్ సప్ప్లై), ఎఎంఒహెచ్ / వెటర్నరి డాక్టరు కిషోర్, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ వంశీ, సహాయక ఇంజినీరు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-07-03 12:21:39

నిరుపేదల ఇంటి కల నెరవేరుతుంది..

వైఎస్సార్‌ జగనన్న కాలనీలలో పండుగ వాతవరణంలో అనందోత్సహాలతో పేదలందరికీ ఇళ్ళ పథకం లబ్ధిదారులు ముమ్మరంగా ఇంటి నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ పేర్కొన్నారు. శనివారం తుళ్ళూరు మండలం పెదపరిమి గ్రామంలోని పేదంలందరికీ ఇళ్ళు వైఎస్సార్‌ జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్, తాడికొండ శాసన సభ్యులు ఉండవల్లి శ్రీదేవితో కలిసి పాల్గొన్నారు. కాలనీలోని పలు ఇళ్ళకు కలెక్టర్‌ వివేక్‌ యాదవ్, శాసన సభ్యులు ఉండవల్లి శ్రీదేవి లబ్ధిదారులతో కలిసి శంకుస్థాపనలు చేశారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ మాట్లాడుతూ నవరత్నలు పేదలందరికీ ఇళ్ళ పథకం ద్వారా జిల్లాలో మొదటి విడతలో దాదాపు 1,22,000 ఇళ్ళకు పైగా నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు జూలై 1, 3, 4 తేదీలలో మెగా హౌసింగ్‌ గ్రౌండింగ్‌ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. మెగా హౌసింగ్‌ గ్రౌండింగ్‌ మేళాలో 60,000 ఇళ్ళ నిర్మాణ పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శనివారం ఒక్క రోజే దాదాపు 14,000 పైగా ఇళ్ళకు శంకుస్థాపన చేయాలని లక్ష్యాలు నిర్దేశించామన్నారు. మొదటి విడతలో మంజూరు చేసిన 95 శాతం ఇళ్ళ నిర్మాణం పూర్తి చేస్తేనే కేంద్రం వెంటనే రెండవ విడత ఇళ్ళను మంజూరు చేస్తుందన్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారులు ఇళ్ళ నిర్మాణాలు చేపట్టేలా నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు, తహశీల్దారులు, సచివాలయ ఉద్యోగులు, స్థానిక శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారన్నారు.

 తాడికొండ శాసనసభ్యులు డా. ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  రూ. 10 లక్షల విలువగల స్ధిరాస్తిని పేదలందరికీ ఇళ్ళ పధకం ద్వారా ఇంటి స్థలం, పక్కా ఇళ్ళు నిర్మించి ఇస్తున్నారని అక్కా, చెల్లమ్మలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 15 లక్షలకు ఇళ్ళ నిర్మాణాలకు  శంకుస్థాపనలు చేస్తున్నారని, ఇంత భారీ ఎత్తున ఇళ్ళ నిర్మాణం దేశంలో ఎక్కడ జరగటం లేదన్నారు. తాడికొండ నియోజకవర్గంలో 68 వైఎస్సార్ జగనన్న కాలనీలలో 6000 మందికి పైగానే ఇంటి పట్టాలు అందించామన్నారు. పెదపరిమి గ్రామంలో తొమ్మిదిన్నర ఎకరాలలో వైఎస్సార్ జగనన్న కాలనీని ఏర్పాటు చేశారన్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన మౌలిక సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించటం జరిగిందని, ప్రభుత్వం రూ.1.80 లక్షల ఆర్ధిక సహాయంతో పాటు, ఇసుక ఉచితంగా సరఫరా చేస్తుందని, రాయితీ పై సిమెంట్, ఇనుము ఇతర నిర్మాణ సామగ్రి రాయితీపై అందిస్తుందన్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీలను   రహదారులు, మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ సౌకర్యాలతో   పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారన్నారు.  ప్రతి ఒక్క లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేసుకునేలా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జిల్లా, మండల స్థాయి అధికారులు, సచివాలయ ఉద్యోగులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారన్నారు.

    అనంతరం మందడం గ్రామంలో గ్రామ సచివాలయం –2 భవనంను, గ్రామంలో సీసీ రోడ్లను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, తాడికొండ శాసనసభ్యులు ఉండవల్లి శ్రీదేవితో కలిసి ప్రారంభించారు.

    ఈ కార్యక్రమంలో గుంటూరు రెవెన్యూ డివిజన్ అధికారి భాస్కరరెడ్డి, తాడికొండ నియోజకవర్గం ప్రత్యేక అధికారి భాస్కర నాయుడు, తుళ్ళూరు తహశీల్దారు సంజీవకుమారి, యంపీడీఓ ఏ. శ్రీనివాస్, హౌసింగ్, సచివాలయ, రెవెన్యూ ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Thullur

2021-07-03 12:18:39

వారంలో 3రోజులు కోవిడ్‌పై ప్ర‌చారం..

కోవిడ్ ముప్పు పూర్తిగా తొల‌గిపోలేద‌ని, ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ కోరారు. ప్ర‌తీఒక్క‌రూ వ్యాధి సోక‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల‌ని సూచించారు. త‌ప్ప‌నిస‌రిగా మాస్కును ధ‌రించాల‌ని, భౌతిక దూరాన్ని పాటించాల‌ని, చేతుల‌ను త‌ర‌చూ శుభ్రం చేసుకోవాల‌ని సూచించారు.  కోవిడ్‌పై అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను నిరంత‌రం కొన‌సాగిస్తామ‌ని, దీనిలో భాగంగా వారంలో మూడు రోజుల‌పాటు వినూత్నంగా, ప్ర‌త్యేక‌ ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నామ‌మ‌ని తెలిపారు. ప్ర‌తీ సోమ‌వారం నో మాస్క్‌-నో ఎంట్రీ నినాదంతో ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు కార్యాల‌యాల్లోకి మాస్కులు లేకుండా అనుమ‌తించ‌కూడ‌ద‌ని,  మంగ‌ళ‌వారం నో మాస్క్‌- నో రైడ్‌ నినాదంతో, వాహ‌న ఛోద‌కులు, ప్ర‌యాణీకులు త‌ప్ప‌నిస‌రిగా మాస్కుల‌ను ధ‌రించాల‌ని,  బుధ‌వారంనాడు మాస్క్ లేదు-అమ్మ‌కం లేదు అన్న నినాదంతో, మాస్కులు ధ‌రించ‌ని కొనుగోలు దారుల‌కు దుఖాణ‌దారులు స‌రుకులు, వ‌స్తువుల‌ను విక్ర‌యించ‌కూడ‌ద‌న్న ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేస్తామ‌న్నారు. ప్ర‌ధానంగా గ్రామీణ ప్రాంతాల్లో దృష్టి కేంద్రీక‌రించి, ఈ  ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను రూపొందిస్తున్న‌ట్లు వెళ్ల‌డించారు. దీనిలో భాగంగా బ్యాన‌ర్లు, ఫ్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తామ‌ని, క‌ర‌ప‌త్రాలు, వాల్‌పోస్ట‌ర్లును పంపిణీ చేస్తామ‌ని తెలిపారు. జాత‌ర్లు, మ‌త‌ప‌ర‌మైన ప్ర‌దేశాల‌వ‌ద్ద మైకుల‌ద్వారా ప్ర‌చారం చేస్తామ‌ని తెలిపారు. క‌రోనా ర‌హిత జిల్లాగా తీర్చిదిద్ద‌డానికి జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి ప్ర‌తీఒక్క‌రూ త‌మ స‌హాకారాన్ని అందించాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.

Vizianagaram

2021-07-03 11:23:54