1 ENS Live Breaking News

3వ దశకి అధికారులు సిద్దం కావాలి..

కోవిడ్ - 19 మూడవ దశ రావచ్చునన్న నిపుణుల సూచనల నేపథ్యంలో  చిన్న  పిల్లలపై  కరోనా తీవ్ర ప్రభావం చూపకుండా ముందుగానే నియంత్రించేందుకు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో కోవిడ్ మూడోదశను నియంత్రించేందుకు అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సమీక్ష నిర్వహించారు.  కోవిడ్ మూడోదశ ప్రభావం నుండి చిన్నారులను కాపాడేందుకు అధికారులంతా సమర్ధవతంగా కోవిడ్ నియంత్రణ జాగ్రత్తలు సత్వరం చేపట్టాలని  జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు కోవిడ్ నియంత్రణపై  తీసుకుంటున్న చర్యల కంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని అన్నారు.  కోవిడ్ నియంత్రణకు  శాఖల  వారీగా అధికారులు చేపట్టవల్సిన విధులను సూచించారు. ఎక్కువగా మహిళా శిశు సంక్షేమ శాఖ, మెడికల్ అండ్ హెల్త్, పంచాయితీ రాజ్, గ్రామీణాభృవృద్ది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యా శాఖా, మెప్మా, గిరిజణాభివృద్ది శాఖలు చేపట్టవలసిన అంశాలపై జిల్లా కలెక్టర్ వివరించారు. ఫెయిత్ ఆర్గనైజింగ్ సంస్థలతో మాట్లాడి కోవిడ్ -19 అప్రాప్రియేట్ బిహేవియర్ పై అవగాహన కల్పించాలన్నారు.  గతంలో ఒక్క మాస్క్ మాత్రమే వాడేవారమని, ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా రెండు మాస్క్ లు వినియోగించాలని సూచించారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ ను వెంట ఉంచుకొని వాడుతుండాలని తెలిపారు. వాడేసిన మాస్క్ లను మూడురోజుల పాటు ఒక కవర్ లో పెట్టి తరువాత పారిశుద్ధ్య వాహనాలకు వాటిని అందించాలన్నారు. 
సాధ్యమైనంత  ఎక్కువగా కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రతలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.   అధికారులు, సిబ్బంది క్షేత్ర స్ధాయికి వెళ్ళి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.  జిల్లా స్థాయి నుండి గ్రామీణ స్థాయి వరకు కోవిడ్ -19 పై ప్రచురించిన పోస్టర్లు ప్రదర్శించాలన్నారు.  గ్రామ , వార్డు సచివాలయాలు, మండల కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఆర్ టి సి, రవాణా శాఖల కార్యాలయాల వద్ద పోస్టర్లు ప్రదర్శించి ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు.  కోవిడ్ -19 మూడవ దశ అప్రమత్తతపై తీసుకోవలసిన చర్యలపై జిల్లా టాస్క్ ఫోర్స్ ప్రతినిధి హర్షిత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించడం జరిగింది.  అనంతరం కోవిడ్ -19 మూడవ దశకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తల పై ప్రచురించిన గొడపత్రులను  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జిల్లా అధికారులతో కలసి  ఆవిష్కరించారు. ఈసమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్లు దినేష్ కుమార్, ప్రశాంతి, శ్రీధర్ రెడ్డి, అనుపమ అంజలి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వినాయకం, డి.ఆర్.వొ. కొండయ్య, గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాలరావు, వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారిణి యాస్మిన్, ఆయాశాఖ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-07-05 15:52:50

పాల వెల్లువ విజయవంతం కావాలి..

జగనన్న పాల వెల్లువ పధకం ద్వారా మహిళా రైతుల జీవితాల్లో ఆర్ధిక స్వావలంబన కల్పించేందుకు  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి  చర్యలు తీసుకున్నట్లు  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్  పేర్కొన్నారు.  సోమవారం కలెక్టరేట్ లోని ఎస్.ఆర్. శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధ్యక్షతన జిల్లా అధికారులతో జగనన్న పాలవెల్లువ పధకం అమలులో భాగంగా సమీక్షా సమావేశం జరిగింది. కార్యక్రమానికి జిల్లా సంయుక్త కలెక్టర్లు దినేష్ కుమార్, ప్రశాంతి, శ్రీధర్ రెడ్డి, అనుమ అంజలి, డిఆర్వొ కొండయ్య ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో మంగళవారం 6వ తేది నుంచి 10వ తేది వరకు జగనన్న పాల వెల్లువ కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు  చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఐదురోజుల పాటు గ్రామాల్లో మహిళా పాడి పరిశ్రమ రైతుల సంక్షేమం కోసం జగనన్న పాల వెల్లువ పధకంను  పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. పశు సంవర్ధకశాఖ,  జిల్లా సహకార శాఖ, వెలుగు, మెప్మా, శాఖలతో పాటు అనుబంధశాఖలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పిలుపునిచ్చారు.
జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ 6 తేది నుంచి 10 వ తేది వరకు గుంటూరు జిల్లాలో జగనన్న పాల వెల్లువ పేరుతో చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను జిల్లా అధికారులకు వివరించారు. తొలి రోజున జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని స్థానిక శాసన సభ్యులు నియోజక వర్గాల్లో ప్రారంభిస్తారని పేర్కొన్నారు. రెండో రోజున పాడి పరిశ్రమ ఉన్న ప్రతీ రైతు ఇంటికీ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు వెళ్ళి  అమూల్ కేంద్రాలకు పాలు పోసేవిధంగా చైతన్యం తీసుకురావాలని కోరారు. 8వ తేదిన రైతుదినోత్సవం నిర్వహిస్తున్న రైతుభరోసా కేంద్రాల వద్ద ప్రత్యేక పాలవెల్లువ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెల్పుతూ,  అక్కడే మహిళా  రైతులకు రుణాల ద్వారా పశువులను అందజేస్తారని తెలిపారు. 9వ తేదిన పాడి పశువులను నమ్ముకొని జీవనాధారం పొందే మహిళా రైతులకు పలు బ్యాంకుల ద్వారా రుణాలను అందించి పశువులను కొనుగోలు చేసి అందివ్వనున్నారు. పాడిరైతులకు ఆర్ధిక సహకారం అందించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. 10వ తేదిన క్షేత్రస్థాయిలో  బాగా పనిచేస్తున్న మహిళా రైతుల సేవలను గుర్తించి వారికి సత్కారంతో పాటుగా తగిన విధంగా గౌరవించనున్నామని తెలిపారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నత మైన సంకల్పంతో  మహిళల అభ్యన్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. 
  అనంతరం జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు  రూపొందించిన ప్రచార పోస్టర్లను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జిల్లా సంయుక్త కలెక్టర్లు ప్రశాంతి, శ్రీధర్ రెడ్డి, అనుపమ అంజలి,  ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వినాయకం, డి.ఆర్.వొ. కొండయ్య లతో కలసి ఆవిష్కరించారు. 

Guntur

2021-07-05 15:41:05

లక్ష్యాలు అధిగమించేలా పనిచేయాలి..

 ప్రభుత్వ ప్రతిష్టాత్మక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్దేశించిన లక్ష్యాలు సాధించేలా పర్యవేక్షణ, క్షేత్రస్థాయి అధికారులతో జిల్లా అధికారులు నిరంతరం సమీక్షించి పనులు వేగవంతం  అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్  యాదవ్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సీసీఆర్సీ కార్డుల జారీ, ఉపాధి హామీ పధకం పనులు, ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ పై సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ (హౌసింగ్ ) అనుపమ అంజలితో కలిసి  జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ కౌలు రైతులకు పంట రుణాల మంజూరుకు సీసీఆర్సీ కార్డులను వెంటనే అందించాలన్నారు. ఆర్బీకే పరిధిలోని క్షేత్రస్థాయి ఉద్యోగి వరకు లక్ష్యాలు నిర్దేశించి ప్రతి రోజు సీసీఆర్సీ కార్డుల జారీ పురోగతిపై సమీక్ష జరిపి వివరాలను అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్ కార్డు ఉన్న వారికి 100 రోజులు పనిదినాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ, ఆర్బీకేలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు, బీఎంసీ భవనాల నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి బిల్లులు మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. పనులు పర్యవేక్షిస్తున్న ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీలకు బిల్లులు సక్రమంగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సమావేశంలో తెనాలి సబ్ కలెక్టర్ డా. నిధి మీనా, జిల్లా రెవెన్యూ అధికారి పి కొండయ్య, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, పంచాయితీ రాజ్ ఎస్ఈ నతానియేల్, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు విజయభారతి, డీఎంహెచ్వో డా. యాస్మిన్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి దుర్గాబాయి, లీడ్ బ్యాంక్ మేనేజరు రాంబాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Guntur

2021-07-05 15:38:41

ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలి..

పర్యావరణ సమతుల్యతకు, మానవాళీ మనుగడకు మొక్కలు ప్రధాన ఆధారమవుతాయని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్  ముందు ఉన్న పార్క్ నందు  జర్నలిస్ట్,  సామాజిక కార్యకర్త సురేశ్ బాబు,  ఎస్.ఎన్..జి ఫౌండేషన్ ఛైర్మన్ కందుల శారదా వాణి ల  ఆద్వర్యంలో అందించిన మొక్కలను జిల్లా కలెక్టర్  వివేక్ యాదవ్,  సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా- రెవెన్యూ) ఏ.ఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్(సచివాలయాలు- అభివృద్ధి), ప్రశాంతి,  సంయుక్త కలెక్టర్ ( ఆసరా- సంక్షేమం) శ్రీధర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ (గృహనిర్మాణం) అనుపమ అంజలి, డి.ఆర్.వొ కొండయ్య నాటి వాటికి నీటిని అందించారు.   ఈ  సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వర్షాకాలంలో ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా మొక్కలు నాటాలని పిలుపు నిచ్చారు. మొక్కలు పెంచడం ద్వారా ప్రతీ ఒక్కరూ స్వచ్ఛమైన గాలిని పీల్చుతూ ఆరోగ్యవంతంగా జీవించవచ్చునని జిల్లా కలెక్టర్ తెలిపారు.  ఈ కార్యక్రమంలో  ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వినాయకం, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి యాస్మిన్, జడ్పీ సీఈవొ చైతన్య, డి.ఆర్. డి.ఏ పి.డి ఆనంద నాయక్, డ్వామా పి.డి శ్రీనివాసరెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారులు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-07-05 15:36:17

41మందికి కారుణ్య నియామకాలు..

గుంటూరు జిల్లాలో వివిధ శాఖలందు వివిధ స్థాయిలలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేయుచూ మరణించిన వారి యొక్క కుటుంబ సభ్యులలో అర్హులైన 25 మందికి సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ హాలులో జిల్లా కలెక్టరు  వివేక్ యాదవ్ కారుణ్య నియామకముల క్రింద నియామక పత్రములు అందజేసినారు. ఇందులో వివిధ శాఖలలో 4 జూనియర్ సహాయకులు, 3 జూనియర్ అకౌంటెంట్లు, 12 టైపిస్టులు, 2 వి.ఆర్.ఓ.లు; 4 ఆఫీసు సబార్డినేట్లు గా ఉద్యోగములిస్తూ ఉత్తర్వులను జారీచేసియున్నారు. వీరిలో కోవిడ్ ద్వారా మృతి చెందిన 3 ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా కారుణ్య నియామకముల క్రింద ఉద్యోగములు ఇచ్చుట జరిగినది. అదే విధముగా వైద్య ఆరోగ్య శాఖ నందు 4 మెడికల్ ఆఫీసర్లు;   3 ఫిజియోతెరపిస్ట్లు  3 ఎ.ఎన్.ఎం.లు గా మరియు పంచాయతీ రాజ్ శాఖ నందు 5 డిజిటల్ అసిస్టెంట్లు గా మరియు మత్స్య శాఖ నందు 1 గ్రామ మత్స్య సహాయకులు గా మొత్తము 41 మందికి కలెక్టరు వారు నియామక పత్రములు అందజేసినారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ నూతనంగా ఉద్యోగాలు పొందిన వారు  బాధ్యతగా విధులు నిర్వహిస్తూ సంబంధిత శాఖకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమములో జిల్లా రెవిన్యూ అధికారి  పి.కొండయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి  జె.యాస్మిన్, మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు ఎ.వి.రాఘవ రెడ్డి, కలెక్టరు వారి కార్యాలయము పరిపాలనా అధికారి  కె.సాంబశివ రావు, సెక్షన్ సూపరింటెండెంట్ అయ్యాంగారు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.   

Guntur

2021-07-05 15:10:08

మార్కెట్ విలువ ప్రకారం అద్దెలు వసూలు..

నగరంలో మార్కెట్ విలువ ప్రకారం దుకాణాల అద్దెలు వసూలు చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన రెవిన్యూ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె డి.సి.ఆర్., జోనల్ కమిషనర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతోను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు జివిఎంసి ఆదాయం పెంపునకు  కృషిచేయాలని, ప్రతి జోన్ లో ఉన్న దుకాణాలు అద్దె మార్కెట్ విలువ ప్రకారం ఉండాలని, దుకాణాలలో లీజు గడువు దాటిన వారు ఉన్నయెడల, అలాంటి గుత్తేదారులను గుర్తించి, వారికి తొలగింపు నోటీసు ఇచ్చి ఖాళీ చేయించాలన్నారు. దుకాణాలను వేలంపాటలో దక్కించుకున్న గుత్తేదారులు, ఇతరులకు అద్దెకి  ఇస్తున్న వారని  గుర్తించాలని, కాలపరిమితి దాటిన గుత్తేదారులును ఖాళీ చేయించి, మరలా కొత్తగా వేలంపాట నిర్వహించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గుత్తేదారులు దుకాణాల కాల పరిమితి దాటినా కూడా జివిఎంసికి అద్దె చెల్లించకుండా ఉన్నవారిని తొలగింపు నోటీసు ఇచ్చి  ఖాళీ చేయించాలని ఆదేశించారు. కోర్టులో పెండింగు లో ఉన్న కేసులను మినహాయించి మిగిలిన వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రెవెన్యూ అధికారి జివిఎంసికి రావాల్సిన బకాయిలను వసూలు  చేసి ఆదాయాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. 

GVMC office

2021-07-05 15:05:42

30 రోజుల్లోగా బీమా చెల్లింపులు జరగాలి..

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వై.యస్.ఆర్.బీమా, వై.యస్.ఆర్.మత్య్సకార భరోసా, వై.యస్.ఆర్.పశునేస్త పరిహార పథకం క్రింద అందిస్తున్న బీమాను నెల రోజుల్లోగా లబ్ధిదారులకు చెల్లింపులు జరగాలని జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు  అధికారులను ఆదేశించారు. సోమవారం సంయుక్త కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బీమా చెల్లింపులపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మత్సశాఖ మరియు పశు సంవర్ధక శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కుటుంబ పెద్ద మృతితో  ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు వై.యస్.ఆర్.బీమా పథకాన్ని ప్రభుత్వం అమలుచేస్తోందని,  వై.యస్.ఆర్.బీమా  పధకం ద్వారా అందించే ఆర్ధిక సహాయంతో ఆ కుటుంబం సంతోషంగా ఉండాలనేదే ప్రభుత్వ ధ్యేయమని గుర్తుచేసారు. అటువంటి బీమా పథకం చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని, ఇకపై అటువంటివి పునరావృతంకారాదని ఆయన స్పష్టం చేసారు. జాప్యానికి గల కారణాలు తెలుసుకొని తక్షణమే వాటిని పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో మత్స్యకార భరోసా పథకం క్రింద ప్రతీ మత్స్యకార కుటుంబానికి రూ.10వేలు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కావున ఆ చెల్లింపులు జరిగేలా చూడాలని జె.సి ఆదేశించారు. వై.యస్.ఆర్.పశునేస్త పరిహార పథకం చెల్లింపు వివరాలు తెలుసుకున్న ఆయన జిల్లాలో 5,400 పశువులు, గొర్రెలు మృతిచెందడంతో వాటికి సంబంధించిన చెల్లింపులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో బీమా పథకానికి సంబంధించి మృతి చెందిన వాటి వివరాలను 15 రోజుల్లోగా సేకరించి సమాచారం అందజేయాలని, మరో 15 రోజుల్లో బీమా చెల్లింపులు జరిగిపోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఎటువంటి సమస్యలు తలెత్తిన వాటిని తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని జె.సి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, పశు సంవర్దక శాఖ సంయుక్త సంచాలకులు ఎ.ఈశ్వరరావు, మత్స్య శాఖ సహాయ సంచాలకులు టి.సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-05 15:02:39

సీజనల్ వ్యాధులపై అవగాహన అవసరం..

మహా విశాఖ నగర పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు అధికారులను ఆదేశించారు.  సోమవారం 4వ జోన్ 30 వ వార్డులో జాలారి పేట,  ఎం.ఎస్.ఎఫ్-4 ప్రాంతాలను పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వ్యాపించకుండా జాలారిపేటలో వ్యాధులపై అవగాహనా శిబిరాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని, వ్యాధుల  కారకాలైన దోమల నివారణకు ఇళ్ల పరిసరాలను పొడిగా ఉండే విధంగా చూడాలని, నీటి నిల్వలు ఉండకుండా చూడాలని, వారంలో ఒక రోజు “డ్రై” డే పాటించాలని ప్రజలకు సూచించారు. తడి-పొడి చెత్తను వేరు వేరుగా పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. రోడ్లను, కాలువలను శుభ్రం చేసి చెత్తను వెంటనే డంపింగ్ యార్డ్ కు  తరలించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. వార్డు శానిటరీ కార్యదర్శులు ప్రతి రోజు కనీసం మూడు గంటలు వీధుల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించాలని ఆదేశించారు. ఎం.ఎస్.ఎఫ్-4 ను సందర్శించి చెత్త తరలించే వాహనాలు శుభ్రంగా ఉంచాలని, వాటిని ఒక క్రమపద్ధతిలో పార్కింగ్ చేయాలని అసిస్టెంట్ ఇంజనీర్(మెకానికల్) ను ఆదేశించారు. ఎం.ఎస్.ఎఫ్. చుట్టూ మొక్కలు నాటించాలని ఎం.ఎస్.ఎఫ్. ఇంచార్జ్ ను ఆదేశించారు. ఈ పర్యటనలో బయాలజిస్ట్  దొర, శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాసరాజు, ఎంఎస్ఎఫ్ ఇంచార్జి అప్పలరాజు, అసిస్టెంట్ ఇంజనీర్, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-07-05 15:00:57

లెత చారిటబుల్ ట్రస్ట్ సరుకుల వితరణ..

నిరుపేదలకు తమవంతు సేవలందిస్తున్న  విశాఖలోని “లెత చారిటబుల్ ట్రస్ట్” సేవలు మరువలేనివని జివిఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. సోమవారం సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా  2వ జోన్ 12వ వార్డు లోని నెహ్రూ నగర్ లో అరవై పేద కుటుంబాలకు రూ.2500లు విలువ చేసే సామగ్రిని ఆమె పంపిణీ చేశారు.  మేయర్ మాట్లాడుతూ కరోనా వలన చాలా పేద కుటుంబాలకు పనులు లేక రోడ్డున పడుతున్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందని తెలిపారు. పేద కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన లేదా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శివారెడ్డిని ఆమె అభినందించారు. నిరుపేదలను ఆదుకోవడానికి మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మేయర్  పిలుపు నిచ్చారు.  చారిటబుల్ ట్రస్ట్ లకు ప్రభుత్వం తరఫున సహకారం అందించడానికి తాము ముందుంటామని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో “లెత  చారిటబుల్ ట్రస్ట్” సభ్యులు శివారెడ్డి, వార్డ్ కార్పొరేటర్ అక్రమాని రోహిణి, వైసిపి వార్డ్ అధ్యక్షులు సుబ్బారెడ్డి, నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-07-05 14:58:53

నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు..

మహా విశాఖ నగరపాలక సంస్థ నాలుగవ జోన్ పరిధిలోని భీమ్ నగర్ లో ఉన్న 210, 212, టీఎస్ఆర్ కాంప్లెక్స్ లో 214, 215 ఉన్న వార్డు సచివాలయాలను సోమవారం జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ కార్యదర్శులు హాజరు పట్టి, వారి జాబ్ చార్టును, డైరీని, ప్రజలు పెట్టుకున్న ఆర్జీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్దకే అన్ని సంక్షేమ పధకాలు అందించాలనే ఉద్దేశ్యంతో వార్డు సచివాలయ వ్యవస్థ ను ప్రవేశ పెట్టడం జరిగిందని, దానిని కార్యదర్శులు నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు సంక్షేమ పధకాలు అందించాలని తెలిపారు. కార్యదర్శులు వారి జాబ్ చార్టు అధాఎఅమ్గా విధులు నిర్వహించాలని చేసిన పనిని వెంటవెంటనే డైరీలో పొందుపరచాలని, బయటకు విధులు నిర్వర్తించుటకు వెళ్ళినప్పుడు మూమెంట్ రిజిస్టర్ లో పూర్తి వివరాలు వ్రాయాలని, కార్యదర్శులు సచివాలయంలో ఉండి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను, ఆర్జీలను పెండింగులో ఉంచకుండా వెంటనే నమోదు చేసి పై అధికారికి పంపాలని, శానిటరీ కార్యదర్శులు కనీసం మూడు గంటలు వార్డులో పర్యటించి డోర్ టు డోర్ చెత్త సేకరణ, కాలువలు, రోడ్డ్లు శుభ్రం చేయించాలని తెలిపారు. ఏ వార్డులో ఉండవలసి సచివాలయాలు అదే వార్డులో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని జోనల్ కమిషనర్  బి.వి.రమణ ను ఆదేశించారు. 

విశాఖ సిటీ

2021-07-05 14:55:08

పందుల సంచారాన్ని అరికట్టండి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి సోమవారం జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనతో కలసి ఐదవ జోన్, 70వ వార్డు పరిధిలోని చట్టివానిపాలెం, శ్రీనివాస నగర్, ఎర్ర గెడ్డ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  హైవే పై ఉన్న ఎలెక్ట్రికల్ పోల్స్ ను తొలగించి సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. వార్డులో పందులు అధికంగా ఉన్నాయని, వాటిని ఈ రోజే తొలగించాలని ప్రధాన వైధ్యాదికారిని ఆదేశించారు. చట్టివానిపాలెం లోని కాలువలు, రోడ్డులు “ఐలా” వారి అధీనంలో ఉన్నాయని, “ఐలా” కమిషనర్ ను సంప్రదించి రోడ్డులు, కాలువలు శుభ్రం చేసేలా మాట్లాడతానని వార్డు కార్పొరేటర్ కు తెలిపారు. రోడ్డు మధ్య భాగంలో భూగర్భ డ్రైనేజ్ కొరకు తవ్విన గోయ్యలను సరిగా పూడ్చక పోవడంతో రోడ్డు గుంటలుగా ఉన్నాయని, వాటిని వెంటనే పూడ్చి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మహిళా సంక్షేమ భవనం ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో పార్కు, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని, అంగడివాడి సెంటర్ ను ప్రాధమిక ఆరోగ్య కేంద్రంగా ఉపయోగిస్తున్నందున, అంగన్వాడి కేంద్రాన్ని మరో చోటుకు మార్చాలని, శ్రీనివాస్ కాలనీ, ఎర్రగెడ్డ ఏరియాలో మంచినీటి పైపు లైను వేయాలని కార్పొరేటర్ మేయర్, కమిషనర్ కు తెలుపగా, వాటిని పరిశీలిస్తామని, మంచినీటి పైపు లైను కు ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో 70వ వర్డు కార్పొరేటర్ ఉరుకూటి రామచంద్ర రావు, వార్డు వై.ఎస్.ఆర్.సి.పి. ఇంచార్జ్ తిప్పల దేవాన్ రెడ్డి, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ శ్రీధర్, కార్యనిర్వాహక ఇంజినీర్లు  ప్రసాద్ బాబు, చిరంజీవి, వెంకట రావు, శ్రీనివాస్, ఉప  కార్యనిర్వాహక ఇంజినీర్ తదితర అధికారులు పాల్గొన్నారు.              

విశాఖ సిటీ

2021-07-05 14:52:45

స‌చివాల‌యాన్ని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌..

విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ ప‌రిధిలోని రెండు స‌చివాల‌యాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ సోమ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. పాత‌బ‌స్టాండ్‌, నాగ‌వంశ‌పు వీధి స‌మీపంలోని 25,26 స‌చివాల‌యాల‌ను ఆయ‌న సంద‌ర్శించి, అటెండెన్స్ రిజిష్ట‌ర్‌ను త‌న‌ఖి చేశారు. మూవ్‌మెంట్ రిజ‌ష్ట‌ర్‌ను ప‌రిశీలించారు. ఆన్‌లైన్ విన‌తులు, ఇత‌ర పెండింగ్ ప‌నుల‌పై వాక‌బు చేశారు. ఆయా డివిజ‌న్ల‌లో అమ‌లు జ‌రుగుతున్న ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల వివ‌రాల‌ను తెలుసుకున్నారు. సిబ్బంది అంతా స‌కాలంలో విధుల‌కు హాజ‌రు కావాల‌ని, బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా మూవ్‌మెంట్ రిజిష్ట‌ర్‌లో న‌మోదు చేయాల‌ని ఆదేశించారు. వ‌చ్చిన అర్జీల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించాల‌ని, ప‌రిష్క‌రించ‌లేని వాటిని, అందుకు గ‌ల కార‌ణాల‌ను అర్జీదారునికి తెలియ‌జేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

Vizianagaram

2021-07-05 14:43:00

మన్నెం వీరుడు అల్లూరికి ఘన నివాళి..

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 124వ జయంతి సందర్భంగా ఆదివారం కలెక్టర్‌ కార్యాలయంలోని వీడియోకాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి  పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన యోధులలో అల్లూరి ఒకరని తెలిపారు.  మన్యం ప్రజల హక్కుల కోసం, వారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం చివరికి వారి ప్రాణాలను రక్షించడానికి తన ప్రాణాలు సైతం అర్పించి మన్యం గుండెల్లో గిరిపుత్రుల జీవితాల్లో అల్లూరి సీతారామరాజు శాశ్వతంగా నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్. దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్‌ (ఆసరా , సంక్షేమం) కే శ్రీధర్‌ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారిణి దుర్గాబాయి, ఎస్‌ఎస్‌ఏ పీవో యం.వెంకటప్పయ్య, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు అమర సుబ్బయ్య, సత్యనారాయణ  తదితరులు పాల్గొన్నారు. 

Guntur

2021-07-04 14:30:32

శ్రీ సోమేశ్వర ఆలయానికి భూమిపూజ..

వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం అహోబిలాపురం గ్రామంలోని భానుకోట శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి  వెల్లం పల్లి శ్రీనివాస్, టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డిలు ఆదివారం భూమి పూజ  శాస్త్రోక్తంగా నిర్వహించారు. గణపతి పూజతో ఈ కార్యక్రమాలు ప్రారంభించి వాస్తుహోమం, నవగ్రహ ఆరాధన, నవరత్న స్థాపన, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు అర్చన, నైవేద్యం, హారతి సమర్పించారు.  ఈ ఆలయంలో రూ.3.54 కోట్ల వ్యయంతో టిటిడి అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో త్రితల రాజగోపుర నిర్మాణం, శివాలయం, అమ్మవారి ఆలయం, ముఖమండపం పునర్నిర్మాణం, ధ్వజస్తంభం, బలిపీఠం ఏర్పాటు, వినాయక స్వామివారి ఆలయ నిర్మాణం, ఆలయ ప్రాకారం నిర్మాణం తదితర పనులు ఉన్నాయి.

రాష్ట్రంలో దేవాదాయ శాఖకు చెందిన ఒక్క సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వమని దేవాదాయ శాఖ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఆదివారం సోమేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శంకుస్థాపన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆలయాలకు చెందిన భూముల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. మరమ్మత్తులకు గురైన ఆలయాల జీర్ణోద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు.  ఈ కార్యక్రమంలో  ఎంపి ఆవినాష్ రెడ్డి,  ఎమ్మెల్సీ  బిటెక్ రవి, జిల్లా కలెక్టర్  హరి కిరణ్, జాయింట్ కలెక్టర్  గౌతమి, రావుల కొలను సర్పంచ్   మహేశ్వర రెడ్డి,టీటీడీ సిఈ  నాగేశ్వరరావు, ఎస్ఈ  జగదీశ్వర రెడ్డి, డిప్యూటి ఈవో రమణ ప్రసాద్, పడ ఓఎస్డీ 
అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

Ahobilam

2021-07-04 13:32:21

సి.ఎం వైఎస్.జగన్ పర్యటనకు పటిష్ట భద్రత..

రాష్ట్ర ముఖ్యమంత్రి  వై ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 8, 9నజిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్.పి  కే.కే.ఎన్ అన్బురాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయం లో జిల్లాలోని డి.ఎస్.పి లు, సి.ఐ లతో  సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ, కడప, ఇడుపులపాయ, పులివెందుల, బద్వేలు లలో సి.ఎం పర్యటన ఉంటుందన్నారు. బద్వేలు కు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. హెలిపాడ్, రూట్ బందోబస్త్, పబ్లిక్ మీటింగ్ వద్ద అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మైదుకూరు డి.ఎస్.పి విజయ్ కుమార్ ను ఆదేశించారు. కడప నగరానికి సంబంధించి ఆర్ట్స్ కళాశాల మైదానం, మహావీర్ సర్కిల్, సి.పి బ్రౌన్ లైబ్రరీ, వై.ఎస్.రాజా రెడ్డి క్రికెట్ స్టేడియం వద్ద, రిమ్స్ హెలిప్యాడ్, కడప విమానాశ్రయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే పులివెందులలోని సి.ఎం పర్యటించే ప్రాంతాలు, ఇడుపులపాయ వై.ఎస్.ఆర్ ఘాట్ వద్ద, సి.ఎం నివాసం వద్ద చెక్ పోస్టు లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

ఇడుపులపాయ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించి అణువణువూ క్షుణ్ణంగా జల్లెడ పట్టాలని ఆదేశించారు. పులివెందుల టౌన్ లో హెలిప్యాడ్, హెలిప్యాడ్ నుండి సి.ఎం వెళ్లే రూట్ మొత్తం బ్యారికేడ్లతో పాటు బస్ స్టాండ్ సర్కిల్, పూలంగళ్ల సర్కిల్ వద్ద, బహిరంగ సభాస్థలి వద్ద తగినంత బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.   సందులు, గల్లీల్లో పోలీసులను మొహరించాలని ఆదేశించారు. బాంబు డిస్పోజల్ టీం లు సి.ఎం పర్యటించే ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. డి.ఎఫ్.ఎం.డి (డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ), హెచ్.హెచ్. ఎం.డి (హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ ) లతో అందరినీ తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలన్నారు. సమావేశంలో ఎస్.బి డి.ఎస్.పి బి.వెంకట శివారెడ్డి, ఏ.ఆర్ డి.ఎస్.పి రమణయ్య, మైదుకూరు డి.ఎస్.పి విజయ్ కుమార్, పులివెందుల డి.ఎస్.పి శ్రీనివాసులు, రాయచోటి డి.ఎస్.పి శ్రీధర్, జమ్మలమడుగు డి.ఎస్.పి నాగరాజు, రాజంపేట డి.ఎస్.పి శివభాస్కర్ రెడ్డి, ఫ్యాక్షన్ జోన్ డి.ఎస్.పి చెంచుబాబు, ఎస్సి, ఎస్టీ సెల్ డి.ఎస్.పిలు సుధాకర్, రవికుమార్, సి.ఐ లు పాల్గొన్నారు.

Kadapa

2021-07-04 12:21:29