1 ENS Live Breaking News

ఎస్ఈబి పై మహిళా పోలీసులకి శిక్షణ..

గ్రామ సచివాలయ మహిళా పోలీసులు స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో(ఎక్సైజ్ శాఖ) నిర్వహించే కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి వుండాలిని  ప్రత్తిపాడు ఎస్ఈబి సిఐ అజయ్ కుమార్ సింగ్ సూచించారు. బుధవారం 7వ బ్యాచ్ మహిళా పోలీసులకు ఎక్సైజ్ పోలీసు స్టేషన్ లో విధులుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, మహిళా పోలీసులు గ్రామాల్లోని నాటు సారా, అక్రమ మద్యం అమ్మకాలు, సారా తయారీ తదితర విషయాలపై ఎప్పటి కప్పుడు స్టేషన్ కి  సమాచారం అందించాలన్నారు. గ్రామాల్లో సారాఅమ్మకాలు జరగకుండా చూసే బాధ్యత మహిళా పోలీసులదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం మధ్య నియంత్రణ విషయంలో ప్రత్యేక ప్రణాళిక తో ముందుకెళుతున్న సమయంలో అన్ని గ్రామాల్లోనూ అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. ఇందులో భాగంగా సచివాలయ పరిధిలోని మహిళా పోలీసులు ఈ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులను పాటిస్తూ, ప్రభుత్వ లక్ష్యాల్లో భాగస్వామ్యం కావాలన్నారు. అనంతరం స్టేషన్ లో ముద్దాయిలపై కేసులు రాసే విధానం,  రికార్డులు, వివిధ మధ్యం కేసుల్లో పట్టుబడ్డవారిని ఏ విధంగా ఖైదు చేస్తారో చూపిస్తూ  సిఐ మహిళా పోలీసులకు అవగాహన కల్పించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో మహిళా పోలీసులు జిఎన్ఎస్ శిరీష, పిఎస్ఎస్ కళాంజలి, పి.ఉషారాణి, చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

Prathipadu

2021-06-30 11:57:23

అప్పన్నకు సీఆర్పీఎఫ్ ఏడీజీపీ పూజలు..

సింహాలచంలోని శ్రీశ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని సీఆర్పీఎఫ్ అడిషనల్ డీజీపీ రష్మీ శుక్లా, సీఆర్పీఎఫ్ ఐజీ మహేశ్ చంద్ర లడ్డా, 198 వ బెటాలియన్ కమాండెంట్ కెకె చాంద్ లు బుధవారం  దర్శించుకున్నారు. వారికి ఆలయ ఏఈఓ రాఘవ కుమార్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు స్వామికి ప్రత్యేక పూజలు చేసి, కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ అధికారులు అధికారులకు  స్వామి వారి ప్రసాదం తో పాటు వేద పండితులు ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా  ఇటీవలే పరిశుభ్రం చేసిన నరసింహ అవతారాలు వాటి విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. స్థలపురాణం, కళ్యాణ మండపం గురించి  ఆలయ సిబ్బంది ఐపీఎస్ అధికారులకు  వివరించారు. శిఖర దర్శనం చేసుకుని ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రశంసించారు. వరాహ, నరసింహస్వామి ఒకే అవతారంలో  దర్శనమివ్వడం అపురూపమని రష్మీ శుక్లా అభిప్రాయపడ్డారు.

Simhachalam

2021-06-30 05:35:20

Tadepalle

2021-06-29 15:18:26

మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా సక్సెస్ కావాలి..

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా కార్యక్రమం విజయవతం చేయడానికి ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా-రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ తెలిపారు. మంగళవారం మద్యాహ్నం సత్తెనపల్లి పట్టణంలో 2, 3 వార్డు సచివాలయాలను జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా-రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో పని చేస్తున్న వార్డు సచివాలయ సెక్రటరీలు, సిబ్బంది విధులను పరిశీలించారు. వార్డు సచివాలయంలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పధకాలను అడిగి తెలుసుకున్నారు. గృహనిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంతమందిని మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా ద్వారా సన్నద్ధం చేశారని ప్రశ్నించారు. 2, 3 వార్డుల పరిధిలో మొత్తం 174 మంది లబ్ధిదారులను ప్రభుత్వం జగనన్న కాలనీల్లో ఇల్లు నిర్మించుకునేందుకు గుర్తించడం జరిగిందని సచివాలయ  అడ్మిన్ సెక్రటరీ ఎం. విజయలక్ష్మీ, ఇంజనీరింగ్ సెక్రటరీ సుశ్మితలు  తెలిపారు. వీరిలో బీమవరం గ్రామ శివారుల్లో రెండు చోట్ల లే అవుట్ల ను గుర్తించి అర్హత కలిగిన లబ్ధిదారులకు  ఇళ్ళ స్థలాలు కేటాయించినట్లు  జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ కు వివరించారు. ఇప్పటి వరకు 30 మంది లబ్ధిదారులు ఇళ్ళు కట్టుకునేందుకు ముందుకు వచ్చారని అన్నారు.. మిగతా 144 మందికి స్థానిక కౌల్సిలర్ లు, మెప్మా నోడల్ అధికారిణి  నాగేశ్వరీలతో కలిసి అబ్ధిదారులతో బుధవారం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా-రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహనిర్మాణాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా, ఆ సమస్యలను తమ దృష్టికి తీసుకు వస్తే పరిష్కార మార్గాలను  చూపుతామన్నారు. అవసరమైతే ఆర్ధిక ఇబ్బందులు ఉన్న గృహనిర్మాణ లబ్ధిదారులకు స్ర్తీశక్తి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఈ  కార్యక్రమంలో సత్తెనపల్లి మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసరావు, తహాశీల్ధార్ రమణ కుమారి,గృహనిర్మాణశాఖ అధికారులు, వార్డు సచివాలయ సబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sattenapalle

2021-06-29 14:26:32

రేపు అందరికీ కోవిడ్ ఫస్ట్ డోస్ వేక్సిన్..

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలలో  బుధవారం హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 45 సంవత్సరాలు దాటిన వారికి కోవాగ్జిన్ ఫస్ట్ డోస్ టీకాలు పంపిణీ చేస్తారని జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు.  అలాగే కోవాగ్జిన్ ఫస్ట్ డోస్ టీకా వేయించుకుని 28 రోజుల వ్యవధి పూర్తయిన వారికి రెండవ డోస్ టీకాలు వేస్తారని  తెలియజేశారు.  జిల్లాలో కోవాగ్జిన్ ఫస్ట్ డోసు తీసుకుని సెకండ్ డోస్ వేయించుకోవలసిన వారు ఇంకా 10 వేల మంది వరకూ ఉన్నారని వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.   

Kakinada

2021-06-29 14:22:43

నాణ్యమైన విద్యకు ఏపీ కేరాఫ్ అడ్రస్..

రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్ధికీ నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్  రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. మంగళవారం గుంటూరు జిల్లా క్రోసూరు మండలం విప్పర్ల గ్రామంలో నాబార్డ్ – ఆర్ఐడిఎఫ్  రూ.7.25 కోట్ల నిధులతో నిర్మించనున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శంఖుస్థాపన చేసి శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పెదకూరపాడు శాసన సభ్యులు నంబూరు  శంకరరావు  అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ 2009 లో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు అయిన తరువాత 360 మంది విద్యార్థులకు గాను 160 మంది మాత్రమే చదువు కొంటున్నారన్నారని అన్నారు. పాలిటెక్నిక్ కళాశాలకు సొంత భవనం లేక అరకొర వసతులతో పక్కనే ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల గదులలో నడుస్తుండటం బాధాకరామన్నారు.  గతంలో పని చేసిన ప్రజా ప్రతినిధులు ఈ సమస్యపై కొంతైనా దృష్టి సారించి వుంటే పాలిటెక్నిక్ కళాశాలకు శాశ్వత భవనం సమకూరి వుండేదన్నారు.  రెండు సంవత్సరాల కాలంలోనే  విద్యార్డుల కలను నెరవేర్చే దిశగా పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానానికి కృషి చేసిన  పెదకూరపాడు శాసన సభ్యులు శంకరరావును మంత్రి అభినందించారు. కేవలం 18 నెలల కాలంలోనే అన్ని సౌకర్యాలతో కూడిన పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణం పూర్తయ్యేలా పక్కా ప్రణాళికతో అధికారులు పని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో నూతన భవనంలో వృత్తివిద్యా కోర్సులను కూడా ప్రవేశపెడతామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతిదీవెన వంటి సంక్షేమ పధకాలను అమలు చేసి  అక్కచెల్లమ్మల కుటుంబాలలో తోబుట్టువుగా మారిపోయారన్నారు.  రాష్ట్రంలో నాడు - నేడు ద్వారా జరుగుతున్న పాఠశాలల అభివృద్ధిని పక్కన ఉన్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ కేబినేట్ కమిటీ  ఆమోదించి అమలు చేసే ఆలోచనలో ఉందంటే ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాల పనితీరును రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. రూ.7.25 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న ఈ పాలిటెక్నిక్ కళాశాల భవనానికి భవిష్యత్ అవసరాల దృష్ట్యా కావలసిన నిధులు మంజూరు చేసి, అక్కడే అదనపు భవనాలను నిర్మించి రాష్ట్రంలోనే ఆదర్శ పాలిటెక్నిక్ కళాశాలగా నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్  వెల్లడించారు.
 
  నరసారావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ పల్నాడు ప్రాంతానికి పాలిటెక్నిక్ కళాశాలకు సొంత  భవనం సమకూరడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, పెదకూరపాడు శాసన సభ్యులు నంబురు శంకరరావు ల ఫలితం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చదువుకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారనడానికి అమ్మ ఒడి, విద్యా వసతి దీవెన, విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, నాడు – నేడు పధకాల ద్వారా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల అభివృద్దే ఉదాహరణ అన్నారు.  కరోనా విపత్కర పరిస్థితులల్లో కూడా పిల్లల ఆరోగ్య పరిస్థితిని సరిదిద్ది పౌష్టికాహారం అందించేందుకు అమ్మ ఒడి ఉపయోగపడిందన్నారు.  ఇప్పటికే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 360 మందికి గాను 160 మంది విద్యార్దులు చదువుతున్నారని, తగినంత మంది అధ్యాపకులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.  దీంతో పాటు పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్డుల శాతాన్ని పెంచేందుకు ఇక్కడే  వసతి గృహాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ ను కోరారు.. 

  పెదకూరపాడు శాసన సభ్యులు నంబూరు శంకరరావు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో పెను మార్పులను   తీసుకువచ్చి విద్యా పట్ల తమకున్న  అంకితభావాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చాటిచెప్పారని అన్నారు.  శ్రీ కృష్ణార్జునుల అనుబంధాన్ని గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను విద్యా శాఖ మంత్రి తూ.చా తప్పకుండా అమలు చేస్తున్నారని  నంబురు శంకరరావు కొనియాడారు. రూ. 7.25 కోట్లతో క్రోసూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ను నిర్మిస్తున్నామన్నారు. పద్దెనిమిది నెలల్లోనే  భవన నిర్మాణాన్ని  అన్ని వసతులతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.  పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. 

  సత్తెనపల్లి శాసన సభ్యులు అంబటి రాంబాబు మాట్లాడుతూ గత పది సంవత్సరాలు గా మరుగున పడిన పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణం కొరకు శాసన సభ్యులు నంబూరు  శంకరరావు చేసిన కృషి అభినందనీయమన్నారు. రాష్ట్రంలో 33 శాతంగా ఉన్న నిరక్షరాస్యతను సున్నా శాతానికి తీసుకొచ్చే విధంగా పిల్లల చదువుల కొరకు అమ్మఒడి వంటి పథకం ప్రారంభించిన ఘనత కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు.  రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చే నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు పధకం ద్వారా  కొన్ని లక్షల కుటుంబాలలో వెలుగులు నింపే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారన్నారు. 

  సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ క్రోసూరు పరిధిలోని విప్పర్ల గ్రామం వద్ద పెదకూరపాడు  శాసన సభ్యులు నంబురు శంకర రావు చొరవతోనే 4.50 ఎకరాల స్థలంలో పాలిటెక్నిక్ కళాశాలకు సొంత భవనాన్ని నిర్మించేందుకు అవకాశం కల్పించగలిగామన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంజనీరింగ్ విద్య కన్నా రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ది చెందేందుకు నైపుణ్యం కలిగిన యువతను తయారు చేసుకోవలసిన ఆవశ్యకతను గుర్తు చేశారు. పల్నాడు ప్రాంతంలో ఉన్నత విద్యకు తగిన ప్రాధాన్యత కల్పించేందుకు పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణానికి అవసరమైన భూమిని పెదకూరపాడు  శాసన సభ్యులు నంబురు శంకర రావు  స్థానిక రైతులతో మాట్లాడి భూమిని సేకరించి విద్య శాఖకు అందించడం జరిగిందన్నారు.  
 
  సంయుక్త కలెక్టర్ ( సచివాలయాలు, అభివృద్ది ) పి. ప్రశాంతి మాట్లాడుతూ గత రెండేళ్లుగా పాలిటెక్నిక్ కళాశాలకు సొంత భవనం లేదన్న విషయాన్ని పెదకూరపాడు శాసన సభ్యులు నంబురు శంకర రావు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు.  ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యా వ్యవస్థను దారిలో పెట్టేందుకు విద్యా శాఖ మంత్రి కృషి చేస్తున్నారన్నారు.  వీరిద్దరి చొరవతో క్రోసూరు పాలిటెక్నిక్ కళాశాలకు సొంత భవనం నిర్మించుకోవడానికి అవకాశం కలిగిందన్నారు.  ప్రస్తుతం విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల వలన విద్యార్డులకు నేరుగా ఇంటికే పాఠ్య పుస్తకాల పంపిణీ, నాడు – నేడు పధకం ద్వారా పాఠశాల అభివృద్ది, పిల్లల ఆరోగ్య పరిరక్షణనకు పౌష్టికాహారం వంటి కార్యక్రమాలను విద్యాశాఖ ద్వారా ప్రభుత్వమే నిర్వహిస్తున్నదన్నారు. ఒక్క జిల్లాలోనే రెండు మెడికల్ కళాశాలలు రావడం ఎంతో కష్టతరమైనప్పటికీ ముఖ్యమంత్రి చొరవతో వాటికి శంఖుస్థాపన చేసి పనులు ప్రారంభించారన్నారు.  జిల్లాలో మూడు పాలిటెక్నిక్ కళాశాలలు వుంటే గుంటూరు లో రెండు, క్రోసూరులో ఒకటి  ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

  కార్యక్రమంలో విద్య శాఖ రీజనల్  జాయింట్ డైరెక్టర్ పద్మారావు, ఏ.పి.ఎస్.డబ్ల్యూ.ఐ.డి.సి ఈ.ఈ కరుణాకర్ రెడ్డి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ కే.వి. రమణ రావు, క్రోసూరు మండల తహశీల్దారు, యంపీడీఓ,  క్రోసూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ వెంపా జ్వాలా లక్ష్మీ నరసింహారావు, విప్పర్ల  గ్రామ సర్పంచ్  నర్రా శేషయ్య, క్రోసూరు ఉప సర్పంచ్ షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. 

Krosur

2021-06-29 14:20:22

దిశయాప్ ప్రతీ మహిళ సెక్యూరిటీ గార్డ్..

మహిళలంతా దిశ యాప్ తమ ఫోన్లలో ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా ఆపద సమయంలో అది సెక్యురిటీ గార్డ్ గా పనిచేస్తుందని ప్రముఖ న్యాయవాధి, సామాజిక వేత్త రహిమున్నీసాబేగం పేర్కొన్నారు. మంగళవారం విశాఖలో ఆమె దిశ యాప్ వినియోగంపై మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం చాలా మంచి రక్షణ వ్యవస్తను దిశ యాప్ ద్వారా రూపొందించిందన్నారు. దీనిని అత్యవసర సమయంలో వినియోగించడం ద్వారా పోలీసుల నుంచి సహాయ సహకారాలు అందుతాయన్నారు. ప్రతీ ఒక్క మహిళ సెల్ ఫోనులో దిశ యాప్ ఇనిస్టాల్ చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. తద్వారా దుండగల నుంచి రక్షించుకోవడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ యాప్ మహిళల ఫోన్లలో ఉంటే ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లేంత దైర్యం కూడా వస్తుందన్నారు. అనంతరం దిశ యాప్ యొక్క ప్రాముఖ్యత, దీనిని ఏ విధంగా వినియోగించాలో కూడా సహచర మహిళా లాయర్లకు వివరించినట్టు చెప్పారు. త్వరలో మహిళలకు, విద్యార్ధినిలకు చైతన్యం తీసుకు రావడం కోసం ప్రత్యేకంగా పాల్గొనే కార్యక్రమాల్లో దిశ యాప్ కోసం ప్రస్తావిస్తానని ఆమె వివరించారు. కాలేజీ వెళ్లే యువతులే కాకుండా ఇంట్లో ఉండే మహిళలు కూడా అత్యవసర సమయంలో దీనిని ఉపయోగించవచ్చునన్నారు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు కూడా ఈ యాప్ ని ఇనిస్టాల్ చేసుకోవాలని ఆమె సూచించారు. యాప్ ఇనిస్టాల్ చేసుకున్న ప్రతీ ఒక్కరూ మరో ముగ్గురు...వారంతా ఒక్కొక్కరూ ముగ్గురు ముగ్గురితో యాప్ ని స్వచ్ఛందంగా ఇనిస్టాల్ చేయించడానికి ముందుకి రావాలని రహిమున్నీసాబేగం కోరారు.

Visakhapatnam

2021-06-29 13:22:10

న్యాయబంధు యాప్ వినియోగించాలి..

కేంద్రప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో, న్యాయ మంత్రిత్వ‌శాఖ ఇటీవ‌ల రూపొందించిన న్యాయ‌బంధు యాప్ (ఆప్‌) అంద‌రికీ బంధువు లాంటిద‌ని, జిల్లా న్యాయ‌సేవ‌ల అధికార సంస్థ కార్య‌ద‌ర్శి, సీనియ‌ర్ సివిల్ జ‌డ్జి వి.ల‌క్ష్మీరాజ్యం పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన బ్లూజీన్స్ వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ యాప్ గురించి న్యాయ సేవాధికార సంస్థ‌లోని ప్యాన‌ల్‌ న్యాయ‌వాదుల‌కు వివ‌రించారు. పేద‌లు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డ్ తెగ‌ల వారు, మ‌హిళ‌లు, పిల్ల‌లు, వ‌ర‌దలు, తుఫాన్లు, అగ్నిప్ర‌మాద బాధితులు, అత్యాచార బాధితులు, అల్పాదాయ వ‌ర్గాల ప్ర‌జ‌లు ఈ యాప్ ద్వారా ఉచితంగా న్యాయ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చ‌ని సూచించారు. క‌రోనా స‌మ‌యంలో ఈ యాప్‌ద్వారానే ప్ర‌జ‌ల‌కు ఉచితంగా న్యాయ సేవ‌లు మ‌రింత చేరువ అయ్యాయ‌ని తెలిపారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి మొబైల్ ఫోన్‌లోకి ఈ యాప్‌ను ప్ర‌తీఒక్క‌రూ డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని, దీనిపై ప్ర‌జ‌ల్లో విస్తృత‌మైన ప్ర‌చారం చేయాల‌ని సూచించారు. జులై 10న జ‌రిగే జాతీయ లోక్ అదాల‌త్‌ను క‌క్షిదారులు వినియోగించుకోవాల‌ని సూచించారు. దీనికి ముంద‌స్తుగా జులై 1 నుంచి జ‌రిగే  లోక్ అదాల‌త్‌ల‌ను కూడా వినియోగించుకోవాల‌ని, దీనికి ప్యాన‌ల్ న్యాయ‌వాదులు త‌మ‌ పూర్తి స‌హ‌కారాన్ని అందించాల‌ని కోరారు.  

Vizianagaram

2021-06-29 12:59:28

ఉద్యోగులు సమయ పాలన పాటించాలి..

 ప్ర‌భుత్వ ఉద్యోగులంతా త‌ప్ప‌నిస‌రిగా స‌మ‌య పాల‌న, క్ర‌మ‌శిక్ష‌ణ‌ పాటించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశాలు జారీ చేశారు. మండ‌ల కార్యాల‌యాలు, గ్రామ‌, వార్డు స‌చివాల‌య సిబ్బంది ప్ర‌తీఒక్క‌రూ నిర్ణీత వేళ‌కు కార్యాల‌యాల‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించారు. ఎవ‌రైనా కార్యాల‌యం నుంచి బ‌య‌ట‌కు వెళ్లే ప‌క్షంలో, ఉన్న‌తాధికారుల‌నుంచి అనుమ‌తి తీసుకోవాల‌ని, విధుల్లో భాగంగా బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు, త‌ప్ప‌నిస‌రిగా మూవ్‌మెంట్ రిజిష్ట‌ర్‌లో వివ‌రాలు న‌మోదు చేయాల‌న్నారు. ఉద్యోగుల స‌మ‌య పాల‌న పాటిస్తున్న‌దీ లేనిదీ, మండ‌ల స్థాయి అధికారులు త‌నిఖీ చేయాల‌ని కోరారు. ప్ర‌జ‌ల‌నుంచి వ‌చ్చే ఆర్జీల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు, నిర్ణీత స‌మ‌యంలోగా పరిష్క‌రించాల‌ని, చేయ‌లేక‌పోతే అందుకు కార‌ణాల‌ను కూడా వారికి తెలియ‌జేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

Vizianagaram

2021-06-29 12:56:58

భారీగా పెరిగిన కార్మికుల వేతనాలు..

క‌నీస వేత‌నాలు భారీగా పెరిగాయి. సాధార‌ణ కార్మికుల‌తోపాటు, నైపుణ్యం గ‌ల కార్మికుల వేత‌నాల‌ను గ‌ణ‌నీయంగా పెంచుతూ, క‌నీస వేత‌న క‌మిటీ  నిర్ణ‌యం తీసుకుంది.  జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ అధ్య‌క్ష‌త‌న క‌లెక్ట‌ర్‌ క్యాంపు ఆఫీసులో మంగ‌ళ‌వారం క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. వివిధ శాఖ‌ల అధికారుల‌తో ముందుగా క‌లెక్ట‌ర్ చ‌ర్చించారు. గ‌త ఏడాది ధ‌ర‌ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం, కొత్త ధ‌ర‌ల‌ను ఖ‌రారు చేశారు. అన్ స్కిల్డ్ లేబ‌ర్‌కు క‌నీస వేత‌నాన్ని గ్రామీణ ప్రాంతంలో రూ.350, ప‌ట్ట‌ణ ప్రాంతంలో రూ.375 గా నిర్ణ‌యించారు. గ‌తంలో ఈ వేత‌నం గ్రామాల్లో రూ. 315,  ప‌ట్ట‌ణంలో రూ.335గా ఉండేది. సెమీ స్కిల్డ్ వేత‌నాలు గ్రామీణ ప్రాంతంలో రూ.390 నుంచి రూ.435కు, ప‌ట్ట‌ణ ప్రాంతంలో రూ.410 నుంచి రూ.450కి పెంచారు. స్కిల్డ్ లేబ‌ర్ వేత‌నాల‌ను గ్రామీణ ప్రాంతంలో రూ.475 నుంచి రూ.525, ప‌ట్ట‌ణ ప్రాంతంలో రూ.500 నుంచి రూ.550కు హెచ్చించారు. హైలీ స్కిల్డ్ లేబ‌ర్‌కు గ్రామీణ ప్రాంతంలో రూ.625 నుంచి రూ.675కు, ప‌ట్ట‌ణ ప్రాంతంలో రూ.630 నుంచి రూ.680కి పెంచుతూ కొత్త వేత‌నాల‌ను ఖ‌రారు చేశారు. ఈ వేత‌నాలు 2021 జులై 1 నుంచి 2022 జూన్ 30 వ‌ర‌కూ అమ‌ల్లో ఉంటాయి. ఈ స‌మావేశంలో జిల్లా ముఖ్య ప్ర‌ణాళికాధికారి జె.విజ‌య‌ల‌క్ష్మి,  డిప్యుటీ క‌మిష‌న‌ర్ ఆఫ్ లేబ‌ర్ సిహెచ్ పురుషోత్తం, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, ఆర్‌డ‌బ్ల్యూఎస్ ఎస్ఇ ప‌ప్పు ర‌వి, ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ జిఎం ప్ర‌సాద‌రావు, రెవెన్యూ, ఆర్అండ్‌బి, ట్రాన్స్‌కో త‌దిత‌ర శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-29 12:48:45

స్కానింగ్ కేంద్రాల్లో తనిఖీలు చేయాలి..

లింగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల నియంత్ర‌ణ చ‌ట్టం (పీసీ అండ్ పీఎన్‌డీటీ యాక్ట్) ప‌టిష్టంగా అమ‌ల‌య్యేలా చూడాల‌ని, స్కానింగ్ కేంద్రాల్లో ఆక‌స్మిక త‌నిఖీల సంఖ్య‌ను పెంచాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి జిల్లా, డివిజ‌న‌ల్ అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ నుంచి జిల్లాస్థాయి మ‌ల్టీ మెంబ‌ర్ అప్రాప్రియేట్ అథారిటీ-డీఎల్ఎంఎంఏఏ (పీసీ అండ్ పీఎన్‌డీటీ యాక్ట్) స‌మావేశం వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రిగింది. తొలుత స‌మావేశ అజెండా అంశాల‌ను డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు వివ‌రించారు. అనంత‌రం జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో ప్ర‌స్తుతం 317 స్కానింగ్ కేంద్రాలు ప‌నిచేస్తున్నాయ‌ని, వీటిలో 35 ప్ర‌భుత్వం ప‌రిధిలో ఉండ‌గా, 282 ప్రైవేటు కేంద్రాల‌ని వెల్ల‌డించారు. జిల్లాలో స్కానింగ్ కేంద్రాలు స‌క్ర‌మంగా ప‌నిచేసేలా చూడాల‌ని, ఎక్క‌డా ఉల్లంఘ‌న‌లు జ‌ర‌క్కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. క‌లెక్ట‌ర్ నేతృత్వంలో చ‌ట్టం అమలుపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటుంద‌న్నారు. 2021, జ‌న‌వ‌రి నుంచి జూన్ వ‌ర‌కు డివిజ‌న‌ల్ స్థాయి ప్రోగ్రామ్ అధికారులు, ఆర్‌డీవోలు 201 ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించార‌ని.. డివిజ‌న‌ల్ స్థాయిలో షెడ్యూల్ ప్ర‌కారం ఆక‌స్మిక త‌నిఖీలు జ‌రిగేలా చూడాల‌ని, అందుబాటులో ఉన్న 16 మంది ప్రోగ్రామ్ అధికారులు క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రిస్తూ త‌నిఖీలు చేప‌ట్టాల‌ని సూచించారు. గ్రామ, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలోని మ‌హిళా పోలీసులను కూడా భాగ‌స్వాముల‌ను చేయాలన్నారు. 2021, జ‌న‌వ‌రి నుంచి జూన్ వ‌ర‌కు డివిజ‌న‌ల్ స్థాయి ప్రోగ్రామ్ అధికారులు 18 డెకాయ్ ఆప‌రేష‌న్లు చేప‌ట్టార‌ని.. అయితే ఈ సంఖ్య‌ను బాగా పెంచాల‌ని ఆదేశించారు. జిల్లాలో కొత్త‌గా ‌స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేష‌న్‌కు 13, రెన్యువ‌ల్ కోసం 57 ద‌ర‌ఖాస్తులు రాగా, పూర్తిస్థాయి త‌నిఖీల అనంత‌రం వాటికి ఆమోదం తెలిపిన‌ట్లు వెల్ల‌డించారు. చ‌ట్టం అమ‌లుకు సంబంధించి ఫిర్యాదులు తెలియ‌జేసేందుకు జిల్లాస్థాయిలో 1800-425-3365 టోల్‌ఫ్రీ నెంబ‌రు అందుబాటులో ఉంద‌ని జేసీ (డీ) కీర్తి చేకూరి వివ‌రించారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం స‌బ్ క‌లెక్ట‌ర్ ఇలాక్కియా, 4వ అడిష‌న‌ల్ జ‌డ్జ్ ఎన్‌.శ్రీనివాస‌రావు, అడిష‌న‌ల్ ఎస్‌పీ క‌ర‌ణం కుమార్‌, డీసీహెచ్ఎస్ డా. టి.ర‌మేష్ కిశోర్‌, ఆరోగ్య శ్రీ జిల్లా స‌మ‌న్వ‌యక‌ర్త పి.రాధాకృష్ణ, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ‌, ఛేంజెస్ ఎన్‌జీవో ప్ర‌తినిధి కె.వెంక‌టేశ్వ‌ర‌రావు, జిల్లా, డివిజ‌న‌ల్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-29 12:46:18

కొండవాలు కాలువల్లో చెత్తలు వేయొద్దు..

కొండవాలు ప్రాంత ప్రజలు వ్యర్ధాలను కాలువలలో వేయకూడదని జివిఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. మంగళవారం ఆమె నాలుగవ జోన్ 36వ వార్డు రంగిరిజు వీధి, బాబా కొండ తదితర ప్రాంతాలలో  కమిషనర్ డా. జి. సృజనతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండ ఎగువ భాగంలో ఉన్న వారు కాలువలలో చెత్త  వేయడం వలన దిగువ భాగంలో చెత్త పూడిక పోయి కాలువలు పొంగి మురుగు బయటకు వచ్చేస్తుందన్నారు. కాలువలలో చెత్త తొలగించక పోవడంతో మురుగు నీరు సరిగా ప్రవహించలేదని దీనిని వెంటనే తొలగించాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. భూగర్భ డ్రైనేజిలో పూడిక పేరుకు పోయి యు.జి.డి. నాళాలు వద్ద మురుగు నీరు బయటకు వస్తుందని, నాళాలు లోని చెత్తను తొలగించాలన్నారు. మురుగు నీరు సాఫీగా పోయే విధంగా చూడాలని, భూగర్భ డ్రైనేజి కనక్షన్ కోసం  తీసిన గొయ్యలు సరిగా పూడ్చక పోవడం వలన రాళ్ళు, మట్టి పైకి తేలి ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందన్నారు. వెంటనే ఆ రోడ్డు బాగు చేయాలని సహాయక ఇంజినీరును ఆదేశించారు. కొండపైన ఉన్న సులాభ్ కాంప్లెక్స్ వినియోగంలో లేనందున దానిని కమ్యునిటీ హాలుగా మార్చాలని, పోలమాంబ గుడివద్ద నూతనంగా ఒక కమ్యునిటీ హాలు నిర్మించుటకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. 

రంగిరిజు వీధిలో మధ్యలో పెద్ద చెట్టు ఉండడంవలన పాములు అధికంగా వస్తున్నాయని, ఆ చెట్టును తొలగించాలని స్థానికలు తెలియపరచగా చెట్టు కొమ్మలను తొలగించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వార్డులో చెత్త సేకరణకు సరిపడే పారిశుధ్య సిబ్బంది ఉన్నారని, ప్రతి రోజు డోర్ టు డోర్ చెత్త సేకరించాలని, తడి-పొడి మరియు ప్రమాధకరమైన చెత్తగా విభజించిన చెత్తను తీసుకోవాలని, చెత్త నిర్వహణ ప్రక్రియపై మహిళా సంఘాలు, వార్డు సచివాలయ కార్యదర్శుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. స్థానిక కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్ వార్డులో ఉన్న కొన్ని సమస్యలను మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకురాగా, వారు స్పందించి వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ పర్యటనలో స్థానిక కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, నాలుగవ జోనల్ కమిషనర్ బి.వి.రమణ, పర్యవేక్షక ఇంజినీరు శివప్రసాద రాజు, కార్యనిర్వాహక ఇంజినీరు చిరంజీవి, శ్రీనివాస్, గణేష్ కుమార్, వెటర్నరి డాక్టరు కిషోర్, ఎసిపి అమ్మోజి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు సత్యనారాయణ, సహాయక ఇంజినీరు తదితర అధికారులు పాల్గొన్నారు.   

విశాఖ సిటీ

2021-06-29 12:42:32

మెగాగృహ నిర్మాణాలకు సిద్ధంకావాలి..

శ్రీకాకుళం జిల్లాలో జూలై 1, 3,4 తేదీల్లో జరిగే మెగా గృహ నిర్మాణాల శంఖుస్ధాపనకు సిద్ధం కావాలని మండల అధికారులను గృహ నిర్మాణం జాయింట్ కలెక్టర్ హిమాంశు కౌశిక్ పిలుపునిచ్చారు. మంగళ వారం కలెక్టర్ కార్యాలయం నుండి మండల ప్రత్యేక అధికారులు, మండల స్ధాయి అధికారులతో మెగా హౌసింగ్ డ్రైవ్ పై వీడియో కాన్ఫరెన్సును నిర్వహించారు. నిర్ధేశించిన మూడు రోజుల్లో అత్యధిక సంఖ్యలో శంఖుస్ధాపన కార్యక్రమాలు చేపట్టి గృహ నిర్మాణాలు ప్రారంభించాలని ఆదేశించారు. కొద్ది రోజుల్లో ఆషాడమాసం వస్తుందని ఆ నెలలో నిర్మాణాలు ప్రారంభించుటకు ముందుకు రావడంలో సంశయం ప్రదర్శించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నెల రోజుల పాటు పనులు ప్రారంభం కాకపోవడం వలన జిల్లా ప్రగతి బాగా తగ్గుతుందని, పేదల ఇళ్ళ నిర్మాణం వెనుకబడిపోతుందని ఆయన చెప్పారు. త్వరగా గృహ నిర్మాణాలు ప్రారంభించడం వలన నిర్మాణాలు త్వరగా పూర్తి అవుతాయని కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేయవచ్చని ఆయన సూచించారు. జిల్లాలో దాదాపు 51 వేల మంది సొంత ఇళ్ళ పట్టాలు కలిగిన వారు ఉన్నారని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. ఇళ్ళ నిర్మాణాలకు సామగ్రిని అందజేయడంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జెసి అన్నారు. జిల్లాలో ప్రతి లే అవుట్ లో ఇళ్ళ నిర్మాణాలకు సమస్య తలెత్తకుండా నీటి సౌకర్యం కల్పించాలని ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజనీర్లను ఆదేశించారు. బోర్లు లేనప్పుడు కనీసం రవాణా ద్వారా నీటి సరఫరాను కల్పించాలని ఆయన స్పష్టం చేసారు. బుధ వారం నాటికి ఇంజనీరింగు సహాయకులు మార్కింగు చేయాలని, ఎక్కువ మంది మేస్త్రీలను సిద్ధంగా ఉంచాలని ఆయన సూచించారు. మూడు రోజులు లబ్దిదారులను తమ స్ధలాల వద్దుకు తీసుకు వచ్చే బాధ్యతను వాలంటీర్లకు ప్రభుత్వం అప్పగించిందని, వాలంటీర్ల యాప్ లో నమోదు చేయాలని ఆయన తెలిపారు. శంఖుస్ధాపన చేసిన ఫోటో, జియో ట్యాగింగు చేసిన ఫోటోలను యాప్ లో అప్ లోడ్ చేయాలని ఆయన సూచించారు. మండలాల్లో ఇళ్ళ నిర్మాణ పనులు త్వరితగతిన జరిగే బాధ్యత మండల ప్రత్యేక అధికారులదేనని ఆయన స్పష్టం చేసారు. మండల స్ధాయి అధికారుల భాగస్వామ్యంతో ప్రత్యేక అధికారులు ప్రగతి పథంలో నడిపించాలని హిమాంశు పేర్కొన్నారు. ఇళ్ల శంఖు స్ధాపన కార్యక్రమం వేగవంతంగా జరుగుటకు అన్ని స్ధాయిల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అవసరమని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధుల సహకారంతో లబ్దిదారులు నిర్మాణాలకు త్వరగా ముందుకు వచ్చి పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. జిల్లాలో 14 పెద్ద లే అవుట్ లకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని ప్రత్యేక అధికారులను ఆదేశించారు.

      ఈ వీడియో కాన్ఫరెన్సులో గృహ నిర్మాణ సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ టి.వేణుగోపాల్, ఇపిడిసిఎల్ పర్యవేక్షక ఇంజనీరు ఎల్.మహేంద్రనాథ్, మండల ప్రత్యేక అధికారులు - జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మిపతి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, బి.సి కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు, ఎస్.డి.సి పి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
 

Srikakulam

2021-06-29 12:36:58

7లోగా కాపునేస్తం దరఖాస్తులివ్వండి..

 కాపు నేస్తం పథకానికి జూలై 7వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనను జారీ చేస్తూ అర్హులైన ఓసి-కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళలు అర్హులని వివరించారు. జూన్ 24వ తేదీ నాటికి 45-60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలని ఆయన తెలిపారు. అర్హులైన వ్యక్తులు వాలంటీర్ ను సంప్రదించి సంబంధిత సచివాలయంలో జూలై 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని ఆయన సూచించారు. దరఖాస్తు చేస్తున్న అర్హులైన అభ్యర్ధులు విధిగా ఆధార్ ప్రామాణీకరణ (EKYC) చేసుకొని ఉండాలని ఆయన స్పష్టం చేసారు. YSR కాపు నేస్తం పథకం క్రింద అర్హులైన మహిళా లబ్దిదారులకు రూ.15 వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 2020-21 సంవత్సరంలో  ప్రారంభించబడిన ఈ పథకం క్రింద మొదటి సంవత్సరం 2020-21 సం.లో  శ్రీకాకుళం జిల్లాలో 5786 మంది లబ్దిదారులకు రూ.8.68 కోట్లు నేరుగా లబ్దిదారుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. 2021-22 సం.నకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు ఉన్న లబ్దిదారులకు జూలై 24వ తేదీన ముఖ్య మంత్రి  చేతుల మీదుగా ఆర్ధిక సహాయం ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు.

Srikakulam

2021-06-29 12:34:27

ప్రణాళిబద్దంగా విశాఖ అభివ్రుద్ధి..

 కార్యనిర్వాహక రాజధానిగా మారబోతున్న విశాఖ నగరాన్ని ప్రణాళికాయుతంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.  మంగళవారం కలెక్టరు కార్యాలయంలో ఎం.పి. విజయసాయిరెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. విశాఖను మురికి వాడల రహిత నగరంగా తీర్చి దిద్దేందుకు, అదే క్రమంలో పేదలందరికీ స్వంత ఇల్లు చేకూర్చనున్నట్లు తెలిపారు.  నెల రోజులలో నగరంలో గల మురికి వాడల పరిధి,  అక్కడ నివశిస్తున్న ప్రజల వివరాలు  అధికారులు సేకరిస్తారని, దాని ప్రకారం మెట్రో నగర స్వరూపంలో  అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తామన్నారు.  నగరాన్ని కాలుష్య రహిత నగరంగా, పూర్వపు ఉష్టోగ్రతల మాదిరిగా ఆహ్లాదంగా వుండేందుకు  హరిత విశాఖగా మార్చేందుకు  లక్ష మొక్కలను నాటేందుకు సంకల్పించామన్నారు.  నగరంలో గుర్తించిన ఖాళీ స్థలాల్లో పార్కులను, వాకింగ్ ట్రాక్ లను రూపొందించ నున్నట్లు వెల్లడించారు.  ఈ కార్యక్రమాలన్నీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.  ఇప్పటికే ఎన్.ఏ.డి. ఫ్లైవోవర్ పూర్తి కావస్తోందని,  నగరం నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రోడ్ కనెక్టివిటీ కల్పించేందుకు  జాతీయ రహదారికి సమాంతరంగా  విశాఖ–భీమిలి-భోగాపురం బీచ్ కారిడార్ రూపొందిస్తున్నట్టు చెప్పారు.  

రాజ్య సభ సభ్యులు వి.విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ సింహాచలం పంచగ్రామాల సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటువన్నామన్నారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీకి కట్టుబడి వున్నామని తెలిపారు. విజయనగరం, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్లతో నిష్పక్షపాతంగా సర్వే చేయిస్తామన్నారు. వారు భూములను పరిశీలించి నివేదిక సమర్పిస్పారని చెప్పారు. 
 దేవాలయ భూముల ఆక్రమణలు, బదిలీలు, అమ్మకాలపై  ఎస్టేట్ అబాలిషన్ చట్టం,  ల్యాండ్ సెటిల్ మెంట్ చట్టం, అనామలీస్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.  ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేయడం, ఆక్రమించడంలో కారకులైన వారిపైన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవన్నారు.  సింహాచలం  దేవస్థాన భూముల విషయంలో ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూముల సమస్యను కోర్టు ఆదేశాల మేరకు రెగ్యులర్ చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో విశాఖ నగర మేయరు జి.వి.హరి కుమారి, అనకాపల్లి శాసన సభ్యులు గుడివాడ అమర్ నాధ్ పాల్గొన్నారు.  అంతకు ముందు పర్యాటక శాఖా మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎం పి వి.విజయసాయిరెడ్డి కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరు, జి.వి.ఎం సి కమీషనరు, జాయింట్ కలెక్టర్లు ఇతర రెవెన్యూ జి.వి.ఎం.సి. అధికారులతో విశాఖా నగర అభివృద్థి, భూ సంబంధిత విషయాలను గురించి  సమీక్షించారు.

Visakhapatnam

2021-06-29 12:32:55