1 ENS Live Breaking News

మెగాగృహ నిర్మాణాలకు సిద్ధంకావాలి..

శ్రీకాకుళం జిల్లాలో జూలై 1, 3,4 తేదీల్లో జరిగే మెగా గృహ నిర్మాణాల శంఖుస్ధాపనకు సిద్ధం కావాలని మండల అధికారులను గృహ నిర్మాణం జాయింట్ కలెక్టర్ హిమాంశు కౌశిక్ పిలుపునిచ్చారు. మంగళ వారం కలెక్టర్ కార్యాలయం నుండి మండల ప్రత్యేక అధికారులు, మండల స్ధాయి అధికారులతో మెగా హౌసింగ్ డ్రైవ్ పై వీడియో కాన్ఫరెన్సును నిర్వహించారు. నిర్ధేశించిన మూడు రోజుల్లో అత్యధిక సంఖ్యలో శంఖుస్ధాపన కార్యక్రమాలు చేపట్టి గృహ నిర్మాణాలు ప్రారంభించాలని ఆదేశించారు. కొద్ది రోజుల్లో ఆషాడమాసం వస్తుందని ఆ నెలలో నిర్మాణాలు ప్రారంభించుటకు ముందుకు రావడంలో సంశయం ప్రదర్శించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నెల రోజుల పాటు పనులు ప్రారంభం కాకపోవడం వలన జిల్లా ప్రగతి బాగా తగ్గుతుందని, పేదల ఇళ్ళ నిర్మాణం వెనుకబడిపోతుందని ఆయన చెప్పారు. త్వరగా గృహ నిర్మాణాలు ప్రారంభించడం వలన నిర్మాణాలు త్వరగా పూర్తి అవుతాయని కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేయవచ్చని ఆయన సూచించారు. జిల్లాలో దాదాపు 51 వేల మంది సొంత ఇళ్ళ పట్టాలు కలిగిన వారు ఉన్నారని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. ఇళ్ళ నిర్మాణాలకు సామగ్రిని అందజేయడంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జెసి అన్నారు. జిల్లాలో ప్రతి లే అవుట్ లో ఇళ్ళ నిర్మాణాలకు సమస్య తలెత్తకుండా నీటి సౌకర్యం కల్పించాలని ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజనీర్లను ఆదేశించారు. బోర్లు లేనప్పుడు కనీసం రవాణా ద్వారా నీటి సరఫరాను కల్పించాలని ఆయన స్పష్టం చేసారు. బుధ వారం నాటికి ఇంజనీరింగు సహాయకులు మార్కింగు చేయాలని, ఎక్కువ మంది మేస్త్రీలను సిద్ధంగా ఉంచాలని ఆయన సూచించారు. మూడు రోజులు లబ్దిదారులను తమ స్ధలాల వద్దుకు తీసుకు వచ్చే బాధ్యతను వాలంటీర్లకు ప్రభుత్వం అప్పగించిందని, వాలంటీర్ల యాప్ లో నమోదు చేయాలని ఆయన తెలిపారు. శంఖుస్ధాపన చేసిన ఫోటో, జియో ట్యాగింగు చేసిన ఫోటోలను యాప్ లో అప్ లోడ్ చేయాలని ఆయన సూచించారు. మండలాల్లో ఇళ్ళ నిర్మాణ పనులు త్వరితగతిన జరిగే బాధ్యత మండల ప్రత్యేక అధికారులదేనని ఆయన స్పష్టం చేసారు. మండల స్ధాయి అధికారుల భాగస్వామ్యంతో ప్రత్యేక అధికారులు ప్రగతి పథంలో నడిపించాలని హిమాంశు పేర్కొన్నారు. ఇళ్ల శంఖు స్ధాపన కార్యక్రమం వేగవంతంగా జరుగుటకు అన్ని స్ధాయిల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అవసరమని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధుల సహకారంతో లబ్దిదారులు నిర్మాణాలకు త్వరగా ముందుకు వచ్చి పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. జిల్లాలో 14 పెద్ద లే అవుట్ లకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని ప్రత్యేక అధికారులను ఆదేశించారు.

      ఈ వీడియో కాన్ఫరెన్సులో గృహ నిర్మాణ సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ టి.వేణుగోపాల్, ఇపిడిసిఎల్ పర్యవేక్షక ఇంజనీరు ఎల్.మహేంద్రనాథ్, మండల ప్రత్యేక అధికారులు - జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మిపతి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, బి.సి కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు, ఎస్.డి.సి పి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
 

Srikakulam

2021-06-29 12:36:58

7లోగా కాపునేస్తం దరఖాస్తులివ్వండి..

 కాపు నేస్తం పథకానికి జూలై 7వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనను జారీ చేస్తూ అర్హులైన ఓసి-కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళలు అర్హులని వివరించారు. జూన్ 24వ తేదీ నాటికి 45-60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలని ఆయన తెలిపారు. అర్హులైన వ్యక్తులు వాలంటీర్ ను సంప్రదించి సంబంధిత సచివాలయంలో జూలై 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని ఆయన సూచించారు. దరఖాస్తు చేస్తున్న అర్హులైన అభ్యర్ధులు విధిగా ఆధార్ ప్రామాణీకరణ (EKYC) చేసుకొని ఉండాలని ఆయన స్పష్టం చేసారు. YSR కాపు నేస్తం పథకం క్రింద అర్హులైన మహిళా లబ్దిదారులకు రూ.15 వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 2020-21 సంవత్సరంలో  ప్రారంభించబడిన ఈ పథకం క్రింద మొదటి సంవత్సరం 2020-21 సం.లో  శ్రీకాకుళం జిల్లాలో 5786 మంది లబ్దిదారులకు రూ.8.68 కోట్లు నేరుగా లబ్దిదారుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. 2021-22 సం.నకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు ఉన్న లబ్దిదారులకు జూలై 24వ తేదీన ముఖ్య మంత్రి  చేతుల మీదుగా ఆర్ధిక సహాయం ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు.

Srikakulam

2021-06-29 12:34:27

ప్రణాళిబద్దంగా విశాఖ అభివ్రుద్ధి..

 కార్యనిర్వాహక రాజధానిగా మారబోతున్న విశాఖ నగరాన్ని ప్రణాళికాయుతంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.  మంగళవారం కలెక్టరు కార్యాలయంలో ఎం.పి. విజయసాయిరెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. విశాఖను మురికి వాడల రహిత నగరంగా తీర్చి దిద్దేందుకు, అదే క్రమంలో పేదలందరికీ స్వంత ఇల్లు చేకూర్చనున్నట్లు తెలిపారు.  నెల రోజులలో నగరంలో గల మురికి వాడల పరిధి,  అక్కడ నివశిస్తున్న ప్రజల వివరాలు  అధికారులు సేకరిస్తారని, దాని ప్రకారం మెట్రో నగర స్వరూపంలో  అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తామన్నారు.  నగరాన్ని కాలుష్య రహిత నగరంగా, పూర్వపు ఉష్టోగ్రతల మాదిరిగా ఆహ్లాదంగా వుండేందుకు  హరిత విశాఖగా మార్చేందుకు  లక్ష మొక్కలను నాటేందుకు సంకల్పించామన్నారు.  నగరంలో గుర్తించిన ఖాళీ స్థలాల్లో పార్కులను, వాకింగ్ ట్రాక్ లను రూపొందించ నున్నట్లు వెల్లడించారు.  ఈ కార్యక్రమాలన్నీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.  ఇప్పటికే ఎన్.ఏ.డి. ఫ్లైవోవర్ పూర్తి కావస్తోందని,  నగరం నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రోడ్ కనెక్టివిటీ కల్పించేందుకు  జాతీయ రహదారికి సమాంతరంగా  విశాఖ–భీమిలి-భోగాపురం బీచ్ కారిడార్ రూపొందిస్తున్నట్టు చెప్పారు.  

రాజ్య సభ సభ్యులు వి.విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ సింహాచలం పంచగ్రామాల సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటువన్నామన్నారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీకి కట్టుబడి వున్నామని తెలిపారు. విజయనగరం, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్లతో నిష్పక్షపాతంగా సర్వే చేయిస్తామన్నారు. వారు భూములను పరిశీలించి నివేదిక సమర్పిస్పారని చెప్పారు. 
 దేవాలయ భూముల ఆక్రమణలు, బదిలీలు, అమ్మకాలపై  ఎస్టేట్ అబాలిషన్ చట్టం,  ల్యాండ్ సెటిల్ మెంట్ చట్టం, అనామలీస్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.  ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేయడం, ఆక్రమించడంలో కారకులైన వారిపైన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవన్నారు.  సింహాచలం  దేవస్థాన భూముల విషయంలో ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూముల సమస్యను కోర్టు ఆదేశాల మేరకు రెగ్యులర్ చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో విశాఖ నగర మేయరు జి.వి.హరి కుమారి, అనకాపల్లి శాసన సభ్యులు గుడివాడ అమర్ నాధ్ పాల్గొన్నారు.  అంతకు ముందు పర్యాటక శాఖా మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎం పి వి.విజయసాయిరెడ్డి కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరు, జి.వి.ఎం సి కమీషనరు, జాయింట్ కలెక్టర్లు ఇతర రెవెన్యూ జి.వి.ఎం.సి. అధికారులతో విశాఖా నగర అభివృద్థి, భూ సంబంధిత విషయాలను గురించి  సమీక్షించారు.

Visakhapatnam

2021-06-29 12:32:55

పేదల సొంతింటి కలను సాకారం చేయాలి..

పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు మెగా హౌసింగ్ గ్రౌన్దింగ్ కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు.    సోమవారం మధ్యాహ్నం  సత్తెనపల్లి పట్టణంలోని వెంకటేశ్వర గ్రాండ్ కళ్యాణ మండపంలో  నవరత్నాలు   పేదలందరికీ ఇళ్ళు మెగా హౌసింగ్ గ్రౌన్దింగ్ సమీక్షా సమావేశ కార్యక్రమం జరిగింది.  కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, సత్తెనపల్లి శాసన సభ్యులు అంబటి రాంబాబు, సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్ ) అనుపమ అంజలి,  గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణు గోపాలరావు లు పాల్గొన్నారు.  సమావేశంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్  మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 31 లక్షల మందికి ఇంటి పట్టాలను  మంజూరు చేసిందన్నారు.  ఇది చారిత్రాత్మకమైన గొప్ప కార్యక్రమమని జిల్లా కలెక్టర్ కొనియాడారు. మహిళల పేరుతొ పట్టాలు అందించడం ద్వారా వారికి ఆస్తి హక్కును కల్పించిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. జూలై 1, 3 మరియు 4 వ తేదీ లలో మెగా హౌసింగ్  గ్రౌన్దింగ్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 30 జగనన్న కాలనీ లే అవుట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  మొత్తం 5270 మంది లబ్దిదారులకు  గృహాలను  నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు  తెలిపారు. ఇందులో 4683 మందికి ఇళ్ళ స్థలాలను కేటాయించడం జరిగిందన్నారు.   587  మందికి స్వంత   ఇళ్ళ స్థలాలు ఉన్న వారికి గృహ నిర్మాణాలను చేపట్టేందుకు అనుమతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు.  ఇప్పటికే 764 మంది గృహాలకు గ్రౌన్దింగ్ కార్యక్రమం పూర్తి అయినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.  4506 మంది లబ్దిదారులకు మెగా గృహ నిర్మాణ  గ్రౌన్దింగ్  కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ల్యాండ్ లేవలింగ్ పనులు  మహాత్మా గాంధీ  జాతీయ గ్రామీణ ఉపాధి హామి  పధకం  ద్వారా చేపడుతున్నట్లు వెల్లడించారు.  లబ్దిదారులకు ఇప్పటికే ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుందన్నారు.  గృహ నిర్మాణాలకు కావలసిన నిర్మాణ సామాగ్రి ఇనుము, ఇటుక, సిమెంట్ వంటి వాటిని తక్కువ ధరకు ప్రభుత్వమే అందిస్తుందన్నారు.  గృహ నిర్మాణాలకు సంబంధించి మేస్త్రీ లను ముందుగానే క్రోడీకరించుకుని, వారికి  తగిన శిక్షణ అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  గృహ నిర్మాణాల ప్రారంభ దశ మొదలుకొని పూర్తి అయ్యే నాటికి దశల వారీగా బిల్లుల చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  ఇళ్ళ నిర్మాణాల సమయంలో లబ్దిదారులకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు స్త్రీ శక్తి బ్యాంకు ద్వారా డ్వాక్రా  గ్రూపులలో సభ్యులుగా ఉన్న మహిళా లబ్దిదారులకు ఋణాలు ఇప్పించే  ప్రక్రియను  చేపట్టాలని ఆదేశించారు.

 

          నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు మాట్లాడుతూ లబ్దిదారులకు ఇళ్ళు కట్టించి గృహ ప్రవేశాలు చేయించినప్పుడే లక్ష్యం  సాధించినట్లు అవుతుందని అన్నారు.  స్థానిక సర్పంచ్ లు, వార్డు కౌన్సిలర్లను అధికారులు సమన్వయం  పరచుకుని   నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.  ఏ కార్యక్రమంలోనైనా ప్రారంభ దశలో సమస్యలు రావడం సహజమని, వాటిని అధిగమిస్తూ లక్ష్యాన్ని సాధించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. 

 

          సత్తెనపల్లి శాసన సభ్యులు అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలు పేదలందరికీ పధకంలో లబ్దిదారులకు స్థలాలను ఇవ్వడమే కాకుండా గృహాలను నిర్మించి  అందిస్తున్నారని కొనియాడారు.  లబ్దిదారులు గృహ ప్రవేశం చేసే దాకా ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.   రాష్ట్రంలోనే  సత్తెనపల్లి నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు గృహ నిర్మాణాల కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. 

           సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్ ) అనుపమ అంజలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సత్తెనపల్లి నియోజకవర్గానికి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పధకం  ద్వారా లబ్దిదారులకు కేటాయించిన ఇంటి స్థలాలు, గృహ నిర్మాణాలకు సంబంధించి ఏర్పాటు చేసిన మౌళిక వసతుల వివరాలను తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు మెగా గృహ నిర్మాణ గ్రౌన్దింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు  కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

 

          సమావేశంలో సత్తెనపల్లి పట్టణ మున్సిపల్  కౌన్సిలర్లు, నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాల సర్పంచ్ లు, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస రావు, తహశీల్దార్ రమణ కుమారి, యంపీడీఓ సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పార్ధసారధి,  గృహ శాఖ, విద్యుత్, నీటి పారుదల, ఏ.పీ ఫైబర్  శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Guntur

2021-06-28 15:05:59

40వేల గ్రౌండింగ్ లక్ష్యాన్ని అధిగమించాలి..

మెగా గ్రౌండింగ్ మేళా ద్వారా 40 వేల సూచ‌నాత్మ‌క ల‌క్ష్యానికి మించి నిర్మాణాలు ప్రారంభ‌య్యేలా చూడాల‌ని, కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లోని కోర్టుహాల్ నుంచి ఇళ్ల నిర్మాణాల మెగా గ్రౌండింగ్ మేళా ద్వారా పెద్దఎత్తున జ‌ర‌గ‌నున్న శంకుస్థాప‌నలకు సంబంధించి స‌న్న‌ద్ధ‌త కార్యాచ‌ర‌ణ‌పై జేసీ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ‌, జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి, జేసీ (హెచ్‌) ఎ.భార్గ‌వ్ తేజ‌ల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి జిల్లా, డివిజ‌న‌ల్‌, మండ‌ల‌స్థాయి అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ప్ర‌భుత్వం యూనిట్‌కు ఇచ్చే 1,80,000కు అద‌నంగా ల‌బ్ధిదారుల‌కు ఎస్‌హెచ్‌జీ లింకేజీ ద్వారా ప్రాథ‌మికంగా రూ.50 వేల అడ్వాన్సు రుణాలు కూడా అందించ‌నున్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే రూ.40 కోట్లు అందించామ‌ని, మ‌రో రూ.200 కోట్ల‌ను అందించేందుకు డీఆర్‌డీఏ, మెప్మా విభాగాలు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణానికి ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న మౌలిక వ‌స‌తుల‌తో పాటు మెటీరియ‌ల్, ఆర్థిక స‌హ‌కారం త‌దిత‌ర అంశాల‌పై గ్రామ‌, వార్డు వాలంటీర్లు ల‌బ్ధిదారుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి, ఇళ్ల నిర్మాణాల‌కు ముందుకొచ్చేలా ప్రోత్స‌హించాల‌ని... ఈ మేర‌కు వాలంటీర్లకు మార్గ‌నిర్దేశ‌నం చేయాల‌ని సూచించారు. సెప్టెంబ‌ర్‌లో వైఎస్సార్ ఆస‌రా ద్వారా జిల్లాలోని మ‌హిళ‌ల‌కు దాదాపు రూ.1200 కోట్లు మొత్తం కూడా అందుబాటులోకి రానుంద‌ని వెల్ల‌డించారు. మేళాను విజ‌య‌వంతం చేసేందుకు వీలుగా వాలంటీర్‌, ల‌బ్ధిదారుల ట్యాగింగ్‌; ప్లాట్ల మార్కింగ్‌, లేఅవుట్‌లో నిర్మాణ సామ‌గ్రి నిల్వ‌, నీటి స‌ర‌ఫ‌రా త‌దిత‌రాల‌కు సంబంధించిన పెండింగ్ ప‌నుల‌ను వెంట‌నే పూర్తిచేయాల‌ని ఆదేశించారు. మండ‌ల‌స్థాయి అధికారుల‌కు స‌హాయంగా ఉండేందుకు లేఅవుట్‌ల వారీగా ఏర్పాటుచేసిన నోడ‌ల్ బృందాల‌కు క్షేత్ర‌స్థాయిలో ఎదురయ్యే స‌మ‌స్య‌ల ప‌రిష్కారంతో పాటు సూచ‌న‌లు, స‌ల‌హాలు అందించేందుకు జిల్ల‌స్థాయి కంట్రోల్‌రూంలో విద్యుత్‌, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, మైనింగ్‌, పంచాయ‌తీరాజ్ వంటి స‌మ‌న్వ‌య శాఖ‌ల సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాల‌న్నారు. ప్ర‌జాప్ర‌తినిధులు, స‌ర్పంచ్‌ల క్రియాశీల భాగ‌స్వామ్యంతో స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మండ‌లాల వారీగా ప్ర‌ణాళిక‌లు రూపొందించి, ఇళ్ల నిర్మాణ లక్ష్యాల‌ను చేరుకోవాల‌ని సూచించారు. గ్రౌండింగ్ యాప్ అందుబాటులోకి వ‌చ్చిన వెంట‌నే వాలంటీర్ల‌కు శిక్ష‌ణ ఇవ్వాల‌న్నారు. ఇళ్ల నిర్మాణాల మెగా గ్రౌండింగ్ మేళా సంద‌ర్భంగా లేఅవుట్ల‌లో కోవిడ్ జాగ్ర‌త్త‌లు పాటించేలా చూడాల‌ని, ఇందుకోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. మెగా గ్రౌండింగ్ సంద‌ర్భంగా రోజువారీ ల‌క్ష్యాల‌ను సాధించ‌డంలో పురోగ‌తిపై మండ‌లాల వారీగా ఎప్ప‌టిక‌ప్పుడు సమీక్షించనున్న‌ట్లు క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. స‌మావేశంలో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం స‌బ్ క‌లెక్టర్ ఇలాక్కియా, రంప‌చోడ‌వ‌రం స‌బ్ క‌లెక్ట‌ర్ క‌ట్టా సింహాచ‌లం, అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ గీతాంజ‌లి శ‌ర్మ‌, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, హౌసింగ్ పీడీ జి.వీరేశ్వ‌ర‌ప్ర‌సాద్‌, జిల్లా, డివిజ‌న‌ల్‌, మండ‌ల‌స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-28 14:24:52

హౌసింగ్ గ్రౌండింగ్ పక్కాగా జరగాలి..

రాష్ట్ర ప్రభుత్వం జూలై 1, 3, 4 వ తేదీల్లో పెద్ద ఎత్తున చేపట్టనున్న ఇళ్ల గ్రౌండింగ్ కు అన్ని విధాలా పక్కాగా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లోని విసి హాల్ నుంచి ఇళ్ల గ్రౌండింగ్, కోవిడ్, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, అంగన్వాడీ కేంద్రాల భవనాలు తదితర అంశాలపై మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్ లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్ లు, తహసీల్దార్ లు, ఎంపిడిఓలు, తదితరులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్, ఏ.సిరి, నిశాంతి, గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఇళ్ల గ్రౌండింగ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, జిల్లాలో 30 వేల ఇళ్ల గ్రౌండింగ్ చేపట్టాలని లక్ష్యం కేటాయించగా, జూలై 1, 3, 4 వ తేదీల్లో ప్రతిరోజు 10 వేలు చొప్పున ఇళ్లను గ్రౌండింగ్ చేయాలన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లా, మండల, సచివాలయ స్థాయిలో ప్రతి ఒక్క అధికారికి ఇళ్ల గ్రౌండింగ్ పై పూర్తి అవగాహన ఉండాలని, ప్రతి ఒక్కరూ ఏమేం చేయాలి అనే దానిపై పూర్తిగా తెలిసి ఉండాలన్నారు. ఇళ్ల గ్రౌండింగ్ పై ఎంపిడివోలు, తహసీల్దార్ లు, మున్సిపల్ కమిషనర్లకు ఓరియంటేషన్ ఇచ్చామని, మండల స్పెషల్ ఆఫీసర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మంగళవారం  లబ్ధిదారులకు ఇళ్ల గ్రౌండింగ్ పై అవగాహన కల్పించాలన్నారు. ఎక్కువగా ఆప్షన్ 1, 2 కింద ఇళ్లు గ్రౌండింగ్ జరిగేలా చూడాలన్నారు. ఇలా గ్రౌండింగ్ లో ఆరోగ్య, వ్యవసాయ సిబ్బంది మినహా ఇతర అన్ని శాఖల అధికారులు ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. వార్డు మెంబర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులను, ఎన్జీవోలను భాగస్వామ్యం చేసి ఇళ్ల గ్రౌండింగ్ ని విజయవంతం చేయాలన్నారు.

ఇళ్ల గ్రౌండింగ్ రోజు సంబంధిత లబ్ధిదారులు ఖచ్చితంగా వచ్చేలా చూడాలని, ఇంటి స్థలంలో మార్కింగ్ ఇవ్వాలని, ఎర్త్ వర్క్ వరకు పనులు జరగాలని, ఇందుకోసం అవసరమైన ఇసుక, సిమెంట్ సిద్ధంగా ఉంచాలన్నారు. ఇళ్ల గ్రౌండింగ్ కోసం అవసరమైన పనిముట్లు, ఇతర వసతులు అన్ని కల్పించాలన్నారు. వాలంటీర్లకు లబ్ధిదారులను జతచేసి వారు స్థలం వద్దకు వచ్చేలా చూడాలని, ఇళ్ల గ్రౌండింగ్ అయ్యాక ఫోటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. గ్రౌండింగ్ కోసం అవసరమైన ఆర్థిక సహాయం అందించేలా చూడాలని, లబ్ధిదారులను లేఔట్ వద్దకు తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. కొన్ని లేఅవుట్లలో నీటి వసతి, విద్యుత్ సరఫరా పూర్తి కాలేదని, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి రెండు రోజుల్లో పనులు పూర్తి చేయాలన్నారు. ఆయా మండలాల వారు వారికి కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు కట్టుదిట్టంగా, సీరియస్ గా పని చేయాలన్నారు. ముందుగానే ఏ రోజు ఏ లబ్ధిదారులు గ్రౌండింగ్ చేస్తారు అనేది జాబితా సిద్ధం చేయాలని, ఎలాంటి లోపాలు లేకుండా సక్రమంగా ప్రణాళిక వేసుకొని అవగాహన కల్పించి ఇలా గ్రౌండింగ్ జరిగేలా చూడాలన్నారు.

కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గినా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఐఈసి యాక్టివిటీ లను ఖచ్చితంగా పాటించాలన్నారు. నో మాస్క్ నో ఎంట్రీ, నోమాస్క్ నో సేల్, నో మాస్క్ నో రైడ్ ని అమలు చేయాలన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం, కాంటాక్ట్ ట్రెసింగ్ చేయడం, శాంపిల్స్ సేకరించడం చేయాలన్నారు. అలాగే గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణంలో వేగం పెంచాలన్నారు. ఆయా భవన నిర్మాణాల్లో పురోగతి చూపించాలని, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయా భవనాల నిర్మాణంలో వెనుకబడిన మండలాల్లో వేగవంతంగా చేపట్టాలని, జూలై నెలాఖరు లోపు ఆయా భవన నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. భూమి రికార్డుల స్వచ్చికరణకు సంబంధించి జిల్లాలోని ఐదు పైలెట్ గ్రామాల్లో రెండు రోజుల లోపు పరిశీలన (గ్రౌండ్ టు థింగ్) పూర్తి చేయాలన్నారు. ప్రతి మండలంలోనూ ఒక గ్రామంలో రీ సర్వే యాక్టివిటీ వెంటనే మొదలుపెట్టాలన్నారు. ఇందుకు సంబంధించి ఆర్డీవోలు, తహశీల్దార్లు రీ సర్వే పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఈ సందర్భంగా హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నిశాంతి మాట్లాడుతూ ఇళ్ల గ్రౌండింగ్ కు సంబంధించి జూలై 1,3, 4 వ తేదీన ఎవరెవరు లబ్ధిదారులు గ్రౌండింగ్ చేస్తారు అనేదానిపై జాబితా ముందుగానే సిద్ధం చేయాలన్నారు. పెద్దఎత్తున ఇళ్ల గ్రౌండింగ్ నేపథ్యంలో ఒక రోజు ముందుగానే మార్కింగ్ ఇవ్వాలన్నారు. మండలాల వారీగా వారికి కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గాయత్రీదేవి, హౌసింగ్ పీడీ వెంకటేశ్వర్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడు, జిల్లా పరిషత్ సీఈవో భాస్కర్ రెడ్డి, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, డిఆర్డిఎ పిడి నరసింహారెడ్డి, మెప్మా పిడి రమణారెడ్డి, అడిషనల్ డిఎంహెచ్ఓ రామసుబ్బయ్య, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ నీరజ, డిసిహెచ్ఎస్ రమేష్ నాథ్, సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి కృపాకర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-28 14:21:40

సమగ్ర భూ సర్వేకి రైతులు సహకరించాలి..

రాష్ట్రంలోని భూ సమస్యలు, భూ తగాదాల పరిష్కారం కోసం సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పధకం  ద్వారా చేపట్టిన భూముల రీ సర్వే కార్యక్రమంను విజయవంతం చేసేందుకు రైతులందరూ  సహకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ పేర్కొన్నారు.  సోమవారం దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పధకం ద్వారా గ్రామం హాద్దు రాళ్ళ ఏర్పాటు కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్, రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత తో కలసి పాల్గొన్నారు.  దేవరపల్లి అగ్రహారం గ్రామ శివారు పొలాల్లో గ్రామ హద్దు రాయి ఏర్పాటుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్, రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషా రాణి , ల్యాండ్ రికార్డ్స్, సర్వే సెటిల్మెంటు కమీషనర్ సిద్ధార్ధ జైన్, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, మంగళగిరి శాసన సభ్యులు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, తెనాలి శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్, సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవిన్యూ ) ఏ.ఎస్. దినేష్ కుమార్  శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.  సంబంధిత పొలాల రైతులతో కలసి   హద్దురాయిని సర్వే అధికారులు ఏర్పాటు చేసారు. అనంతరం  దేవరపల్లి అగ్రహారం లోని మండల పరిషత్ పాఠశాల ఆవరణలో సర్వేకి సంబంధించి వినియోగించే సాంకేతిక పరికరాల ప్రదర్శనను మంత్రులు పరిశీలించారు.  సర్వేలో వినియోగించే గొలుసు, క్రాస్ స్టాఫ్, యారోస్, టేపు, థియోడలైట్, ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ ( ఈటీఎస్), కంటిన్యూ ఆపరేటింగ్ సిస్టం ( కార్స్ ) పరికరాల పనితీరును సర్వేయర్లు మంత్రులకు  వివరించారు.   
  ఈ సందర్భంగా గ్రామస్తులతో నిర్వహించిన సభను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ జ్యోతి వెలిగించి ప్రారంభించి  మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్న మూడు సంవత్సరాల కాలంలో శాస్త్రీయ పరిజ్ఞానం, భూముల సర్వేపై సమగ్ర అవగాహన ఉన్న సీనియర్ అధికారుల పర్యవేక్షణలో సర్వే ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో  రూ. వెయ్యి కోట్ల నిధులతో భూముల రీ సర్వేకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం, రోవర్స్ తో భూముల సర్వే చేయడం చాలా గొప్ప కార్యక్రమమన్నారు. దేశంలో బ్రిటిష్ కాలంలో వంద సంవత్సరాల క్రితం జరిగిన భూముల సర్వే వలన అనేక భూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు.  గ్రామాల్లో సెంటు భూమి కోసం ప్రాణాలు ఇచ్చిన రైతులు ఉన్నారన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన, సర్వే ఆఫ్ ఇండియా సౌజన్యంతో పూర్తి నిబద్ధత, సుశి క్షతమైన బృందంతో రీ సర్వే కార్యక్రమం జరుగుతుందని, దీనిని రైతులు పూర్తిగా వినియోగించు కోవాలన్నారు.  దేవరపల్లి గ్రామంలో హద్దు రాయి ఏర్పాటు  చేస్తున్నప్పుడు రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేసారని, రీ సర్వే వలన వారి దీర్ఘకాలిక భూ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆనందం వ్యక్తం చేశారన్నారు.  భూ  తగాదాల పరిష్కారం కోసం  వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పధకం ద్వారా జరుగుతున్న భూ సర్వేకి రైతులు పూర్తిగా మద్దతు ఇవ్వాలన్నారు. ప్రజా సంకల్పం యాత్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే చిత్తశుద్దితో అమలు చేస్తున్నారన్నారు.  విద్య, వైద్య, ఇతర సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఉహించిన దానికంటే మిన్నగా రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన చేస్తున్నారన్నారు. కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ  నివారణ చర్యలు తీసుకుంటున్నారన్నారు. అక్షరాస్యత పెంచేందుకు అమ్మ ఒడి కార్యక్రమం, ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకు ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారన్నారు.   ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వుంటే,  ఒకేసారి 14 మెడికల్ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి పనులు ప్రారంభించారన్నారు. పేదలందరికీ ఇళ్ళ పధకం ద్వారా నివాసయోగ్యమైన అన్ని సౌకర్యాలు కల్పించి ఇంటి పట్టాలు పంపిణీ చేయడంతో పాటు, జగనన్న కాలనీ లను గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నారన్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా ఇంటి పట్టాలు పంపిణీ చేసే సమయంలో రెవిన్యూ శాఖా మంత్రిగా నేను ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మరిన్ని మంచి  కార్యక్రమాలు ప్రజలకు, రైతులకు చేయడానికి మీ అందరి  చల్లని ఆశీస్సులు కావాలన్నారు.  
  రాష్ట్ర  హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ  దేశంలో ఎక్కడా లేని విధంగా భూ సమస్యల  శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్రంలోని భూముల రీ సర్వేని వైఎస్సార్ జగనన్న  శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పధకంను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి  చేపట్టడం జరిగిందన్నారు. భూ వివాదాలకు సంబంధించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు ఎక్కువగా వుంటున్నాయన్నారు.  దేవరపల్లి అగ్రహారంలో డిసెంబర్ 2020 లో భూ సర్వేని ప్రారంభించి గ్రామ హద్దు రాళ్ళు నేడు ఏర్పాటు చేసుకోవడం  జరిగిందన్నారు. గతంలో మండలానికి ఒక సర్వేయర్ మాత్రమే ఉండడంతో రైతులు పొలాలు  సర్వే కోసం నెలల తరబడి ఇబ్బందులు పడాల్సి ఉండేదన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి సచివాలయంలో సర్వేయర్ ను నియమించి, సర్వేని సులభతరం చేశారన్నారు.  సమగ్ర భూ సర్వేలో ప్రభుత్వమే పొలాలు సర్వే చేసి హద్దు రాళ్ళను సైతం ఏర్పాటు చేస్తుందన్నారు.  రానున్న మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో సమగ్ర భూ రీ సర్వేని పూర్తిచేసి భూ  సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు.  గ్రామాల్లోని రైతులకు భవిష్యత్తులో భూ సమస్యలు లేకుండా రీ సర్వేని చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పధకం  ద్వారా  సమగ్ర  భూముల రీ సర్వే గొప్ప కార్యక్రమంను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారన్నారు.  దేశంలో 1930, 1950 లో భూముల సర్వే జరిగిందని, ఎంతో కష్టతరమైన సమగ్ర భూముల రీ సర్వేని ప్రభుత్వం చేపట్టడం జరిగిందన్నారు. స్పందనలో 90 శాతం భూ సమస్యలే వస్తున్నాయని, రీ సర్వే ద్వారా హద్దులు ఏర్పాటు చేయడం వలన  భూ తగాదాలు పూర్తిగా తగ్గి పోతాయన్నారు.  జిల్లా ఫైలేట్ ప్రాజెక్ట్ దేవరపల్లి అగ్రహారంలో భూ సర్వేని ప్రారంభించామని, నాలుగు రెవిన్యూ డివిజన్లలోను ఒక్కో గ్రామాన్ని ఫైలేట్ ప్రాజెక్ట్ గా తీసుకుని సమగ్ర సర్వే చేస్తున్నామన్నారు.  సర్వే పై నిష్ణాతులైన అధికారులు, సర్వేయర్ల ను వినియోగించుకుని  స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుల సమిష్టి  సహకారంతో నిర్దేశించిన సమయంలో రీ సర్వేని పూర్తి చేస్తామన్నారు.  
  సంయుక్త కలెక్టర్ ( రైతు  భరోసా, రెవిన్యూ ) ఏ.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పధకం  ద్వారా  జిల్లాలో ఫైలేట్ ప్రాజెక్ట్ క్రింద దేవరపల్లి అగ్రహారంలో ప్రారంభించిన సమగ్ర భూముల రీ సర్వే కార్యక్రమం గ్రామస్తుల భాగస్వామ్యంతో ముమ్మరంగా కొనసాగుతున్నదన్నారు.  రీ సర్వేపై విలేజ్ సర్వేయర్లు, మండల సర్వేయర్లకు, విఆర్ ఓ లకు ఈటియస్, కార్స్ వినియోగంపై మూడు విడతల శిక్షణ ఇచ్చామన్నారు.  రీ సర్వేపై గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామస్తులకు పుర్తిస్తాయిలో అవగాహన కల్పించామన్నారు.  రీ సర్వేలో భాగంగా డ్రోన్ ద్వారా విలేజ్ హద్దులు డీ మార్కింగ్ చేసి ఆబాది, నాన్ ఆబాది ప్రాంతాలను మార్కింగ్ చేయడం  జరిగిందన్నారు.  ఆబాది ప్రాంతంలో ప్రభుత్వ భూములను సంబంధిత  శాఖల భాగస్వామ్యంతో మార్కింగ్  చేస్తామన్నారు. ప్రస్తుతం ప్రైవేటు  స్థలాల సర్వే ప్రారంభిస్తున్నామన్నారు. రీ సర్వే  వలన రైతుల పొలాల నుండి సరుకులను మార్కెట్ కు తీసుకువెళ్లేందుకు వీలుగా రహదారిని రైతుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  దేవరపల్లి అగ్రహారం ను స్పూర్తిగా తీసుకుని అన్ని గ్రామాల్లోను పొలాల మధ్య రహదారులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  
  మంగళగిరి శాసన సభ్యులు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, తెనాలి శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ రైతుల పక్షపాతిగా, రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్రంలోని భూములు రీ సర్వే చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు.  రాష్ట్రంలో భూ వివాదాలు, సమస్యలు లేకుండా భూముల అమ్మకం, కొనుగోలుకు  ఇబ్బంది వుండకూడదని రూ. వెయ్యి కోట్లతో భూముల రీ సర్వేని చేపట్డడం జరిగిందన్నారు.  భూ సర్వే సందర్భంగా ఉత్పన్నమైన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక న్యాయస్థానం సైతం ఏర్పాటు చేసి పరిష్కరించనున్నారన్నారు.  రాష్ట్రంలో భూ సర్వే కార్యక్రమంలో చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచి పోతుందన్నారు.  గ్రామాల నుండి దేశాల వరకు భూ సరిహద్దుల వల్లే సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. రైతుల దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రీ సర్వేని  రైతులు విజయవంతం చేయాలన్నారు. 
  సభలో గ్రామ రైతులు మాట్లాడుతూ రీ సర్వే ద్వారా పంట పొలాల నుండి సరుకులను మార్కెట్ కు తీసుకువెళ్లేందుకు రహదారి  ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సర్వే పూర్తి అయితే ఒకే ప్రాంతంలో ఐదారు సర్వే నెంబర్లలో ఉన్న ఒకే రైతు భూములకు ఒకే సర్వే నెంబర్ కేటాయించడం రైతులకు ఉపయోగంగా ఉంటుందన్నారు. రీ సర్వేకు రైతులు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామన్నారు. 
  సభ అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ విలేకరులతో మాట్లాడుతూ గ్రామ సచివాలయాలలోని భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుగా సమగ్ర భూ రీ సర్వే ద్వారా భూ రికార్డులను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడం జరుగుతుందన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో రైతులు, ప్రజలు భూ సమస్యలు, తగాదాలు పరిష్కరించాలని విన్నపాలు చేయడంతో అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పధకం  ద్వారా రాష్ట్రంలోని భూముల రీ సర్వేకి శ్రీకారం చుట్టారన్నారు.  రాష్ట్రంలోని భూములన్ని మూడు విడతలలో రీ సర్వే చేసి భూ యజమానులకు శాశ్వత భూ హక్కు కల్పించనున్నారన్నారు.  భూములకు సంబంధించి గతంలో జరిగిన పొరపాట్లను  శాస్త్రీయంగా, సాంకేతికంగా సర్వే ఆఫ్ ఇండియా సౌజన్యంతో భూముల రీ సర్వేని ప్రభుత్వ చేస్తుందన్నారు.  రైతులు భూ సర్వేపై అపోహలు పడకుండా రీ సర్వేకి సహకరించాలన్నారు.  సర్వే  పూర్తి అయినా, సమస్యలు ఏమైనా వుంటే ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి  పరిష్కరించడం జరుగుతుందన్నారు. అన్ని రెవిన్యూ డివిజన్లలో , మండలాల్లో, గ్రామాల్లో భూ సర్వే పూర్తి అయితే రైతులకు, ప్రజలకు  ప్రయోజనం చేకూరుతుందన్నారు. 
  సభ అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్, రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత పూలమాలలు వేసి నివాళులర్పించారు.  
  ఈ కార్యక్రమంలో సర్వే శాఖ  అసిస్టెంట్ డైరెక్టర్ చలపతిరావు,  ఇన్ చార్జ్ తెనాలి ఆర్ డి ఓ భాస్కర రెడ్డి,  తహసీల్దార్ మల్లేశ్వరి, యంపీడీఓ కుసుమ కుమారి,  గ్రామసర్పంచ్ కుషిభాయ్,  సర్వే ఇన్స్పెక్టర్స్ వై. రామకృష్ణ రెడ్డి, నాయక్, మండల సర్వేయర్లు, విలేజ్ సర్వేయర్లు, రెవిన్యూ అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 

Duggirala

2021-06-28 13:40:55

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి..

మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని వార్డులో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. సోమవారం ఆమె జివిఎంసి కమిషనర్ డా. జి.సృజనతో కలిసి 3వ జోన్ 17వ వార్డులోని ఉషోదయ జంక్షన్ పరిసర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ,  17వ వార్డులో పారిశుధ్య పనితీరు అద్వానంగా ఉందని,  శానిటరి ఇన్స్పెక్టరు, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా చూడాలని,  బహిరంగ ప్రదేశాలలో చెత్త వేసిన వారికి అపరాధ రుసుము వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎ.పి. ఇపిడిసిఎల్ వారు  భూగర్భఎలక్ట్రిసిటీ కొరకు తీసిన గొయ్యలను సరిగ్గా పూడ్చక పోవడం, వైర్లు పైకికనిపించే విధంగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వెంటనే ఇపిడిసిఎల్ వారితో సంప్రదించి వాటిని సరిచేయించాలని అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రికల్ పోల్ కు ఉన్న సపోర్ట్ పోల్ పాడైనందున వెంటనే దాన్ని మార్పించాలని కార్యనిర్వాహక ఇంజనీర్(ఎలక్ట్రికల్) విభాగం వారిని ఆదేశించారు. భూగర్భ డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని వాటిని వెంటనే సరిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మురికి కాలవలలో మంచినీటి పైపులైన్లు ఉండటం గమనించి వెంటనే వాటిని మార్పించాలని అధికారులను ఆదేశించారు. వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని కాలువలు, రోడ్డులు శుభ్రం చేయాలని, నీటి నిల్వలు లేకుండా చూడాలని శానిటరి అధికారులను ఆదేశించారు. 
స్థానిక ప్రజలతో మాట్లాడుతూ, సీజనల్ వ్యాదులైన డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా ఇళ్ళలోని ఫ్రిజ్ వెనుక భాగంలో నీటిని, కుండీలలో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, వారంలో ఒక్క రోజు “డ్రై” డే పాటించాలని సూచించారు. డోర్ టు డోర్ చెత్త తీసుకొనుటకు పారిశుధ్య సిబ్బంది సరిగా రాలేదని, వీధి దీపాలు సరిగా వెలగలేదని, మంచినీటి కొళాయిలు ఫోర్స్ గా రావడం లేదని స్థానిక ప్రజలు మేయర్, కమిషనర్ కు తెలియపరచగా,  వెంటనే స్పందించి సంబంధిత అధికారులను ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం సోషల్ క్లబ్ శ్రీరామ గ్రంధాలయం శిధిలావస్థలో ఉండడంతో దాని స్థానంలో నూతనంగా భవనం నిర్మించాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. స్థానిక కార్పొరేటర్ గేదల లావణ్య స్థానిక సమస్యలపై మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకురాగా  వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 
ఈ పర్యటనలో 17వ వార్డు కార్పొరేటర్ గేదల లావణ్య, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, మూడవ జోనల్ కమిషనర్ కె. శివ ప్రసాద్, కార్యనిర్వాహక ఇంజినీరు(మెకానికల్) చిరంజీవి, కార్యనిర్వాహక ఇంజినీరు(వర్క్స్) శ్రీనివాస్, కార్యనిర్వాహక ఇంజినీరు(స్మార్ట్ సిటీ) సుధాకర్, ఎసిపి భాస్కర బాబు, ఎఎంఒహెచ్ రమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.    

విశాఖ సిటీ

2021-06-28 13:38:15

ఉద్యోగులకు పెట్రోల్ స్మార్ట్ కార్డులు ..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ఉద్యోగులు హెచ్పీ పెట్రో స్మార్ట్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని  మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పిలుపునిచ్చారు. సోమవారం జివిఎంసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 700 మంది జివిఎంసి ఫీల్డ్ ఉద్యోగులకు పెట్రోల్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ,  గతంలో కూపన్లు పద్దతి ద్వారా ఫీల్డ్ ఉద్యోగులకు పెట్రోలు పంపిణీ చేసేవారని, దానివలన జాప్యం అవుతున్నందున వాటి స్థానంలో స్మార్ట్ కార్డులను ఎంపిక చేశారని పేర్కొన్నారు. ఈ పద్దతి కోసం 17 పెట్రోల్ బంకులను ఎంపిక చేశారన్నారు.  జివిఎంసి ఫీల్డ్ ఉద్యోగులు ఏ బంకులోనైననూ ఈ స్మార్ట్ కార్డుల ద్వారా పెట్రోల్ ను వినియోగించు కోవచ్చునని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక ఇంజినీరు (మెకానికల్) చిరంజీవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు కోటేశ్వరరావు, ఫీల్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.   

GVMC office

2021-06-28 13:30:22

నిర్మాణ మేళా విజయవంతం కావాలి..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకానికి సంబంధించి జూలై 1,3,4 తేదీల్లో జరిగే మెగా గ్రౌండింగ్ ను విజయవంతం చేయాలని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత తెలిపారు.  సోమవారం కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళు పథకం కింద కొమరగిరి అర్బన్ లేఔవుట్లో  నిర్వహించే మెగా గ్రౌండింగ్ పై  ఎలక్ట్రిసిటీ, ఆర్డబ్ల్యూఎస్, గృహ నిర్మాణం, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, ఇతర శాఖల అధికారులతో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ పుండ్కర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత, కాకినాడ పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ సుంకర పావని తిరుమల కుమార్, జాయింట్ కలెక్టర్(గృహ నిర్మాణం)ఏ. భార్గవ్ తేజ ముఖ్య అతిథులుగా పాల్గొని,అధికారులకు గ్రౌండింగ్  నిర్వహణ ఏర్పాట్లపై  దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ కాకినాడ పట్టణ ప్రజలకు సొంతింటి కల నెరవేర్చే విధంగా కొమరగిరి వద్ద  సుమారుగా మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో వేల కోట్ల రూపాయలు వెచ్చించి లేఔవుటును సిద్ధం చేయడం జరిగిందన్నారు.ఈ లేఔవుట్ ను లెవలింగ్, ఇతర అన్ని వసతులతో సుందరంగా తీర్చిదిద్దటంలో పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చూపిన చొరవ, కృషి మరువలేనిదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కొమరగిరి లేఔవుట్ లోనే ఈ పథకాన్ని ప్రారంభించటం గొప్ప విశేషమన్నారు. కొమరగిరి అర్బన్ లేఔవుట్ లో ఇల్ల స్థలం  మంజూరైన ప్రతి ఒక్క లబ్ధిదారుడు గృహం నిర్మించుకునే విధంగా  రహదారులు, త్రాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.జూలై 1,3,4 తేదీల్లో నిర్వహించే గ్రౌండింగ్  కార్యక్రమంలో పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొని, గృహ నిర్మాణ పనులు  చేపట్టే విధంగా అధికారులు లబ్ధిదారులను ప్రోత్సహించాలని వంగా గీత తెలిపారు.
    పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన ప్రోత్సాహంతో  కొమరగిరి అర్బన్ లేఔవుట్ లో గత సంవత్సరం డిసెంబర్ 25న  అత్యంత వైభవంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగిందన్నారు. సుమారుగా మూడు వేల మంది కాకినాడ పట్టణ వాసులకు కొమరగిరి లేఔవుట్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగిందన్నారు.ఇల్ల స్థలం  పొందిన ప్రతి ఒక్క లబ్ధిదారుడు గృహ నిర్మాణ పనులు చేపట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జూలై 1,3,4 తేదీల్లో కొమరగిరి లేఔవుట్లో గృహ నిర్మాణ పనులకు సంబంధించి జరిగే గ్రౌండింగ్  కార్యక్రమంలో ఎటువంటి సమన్వయ లోపం లేకుండా అధికారులు అందరూ సమిష్టిగా కృషిచేసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే తెలిపారు.
    జాయింట్ కలెక్టర్( గృహ నిర్మాణం) ఏ.భార్గవ్ తేజ మాట్లాడుతూ కొమరగిరి లేఅవుట్ లో జరిగే గ్రౌండింగ్ కార్యక్రమం పండగ వాతావరణం తలపించే విధంగా  లబ్ధిదారులు అందరూ గృహ నిర్మాణాలు చేపట్టే విధంగా అధికారులు అందరూ కృషి చేయాలన్నారు. కొమరగిరి అర్బన్  లేఔవుట్ లో తొలి దశ కింద 12,500 గృహాలు నిర్మించడం జరుగుతుందన్నారు. కాకినాడ పట్టణ పరిధిలో స్వయం సహాయ సంఘాలకు సంబంధించి సుమారుగా 3038 మంది మహిళలలు లబ్ధి పొందుతున్నారు.
        కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్  మాట్లాడుతూ కాకినాడ పట్టణం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి కొమరగిరి అర్బన్ లేఔవుట్లో మొత్తం 29 వార్డులో జులై 01న  4వ వార్డు నుంచి 13వ వార్డు పరిధిలోని వెయ్యి మందికి,  03న  27వ వార్డు నుంచి 36వ  అవార్డు పరిధిలోని వెయ్యి మందికి,  04న 37వ  వార్డు నుంచి 46వ వార్డు పరిధిలో ఉన్న వెయ్యి మందికి(42వ వార్డు మినహా) గ్రౌండింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం లబ్ధిదారులు గ్రౌండింగ్ లో పాల్గొనే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కమిషనర్ తెలిపారు.
     ఈ సమావేశం లో ఏడిసి సిహెచ్. నాగనరసింహారావు, హౌసింగ్ పీడీ జి. వీరేశ్వర ప్రసాద్,మెప్మా పీడీ కె.శ్రీ రమణి, వివిధ శాఖల ఇంజనీర్లు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-28 13:18:42

గ్రానైట్ కూలీలకు కరోనాటీకా తప్పనిసరి..

గ్రానైట్ క్వారీలు, పరిశ్రమలలో పనిచేస్తున్న వలస కూలీలకు కోవిడ్ పరీక్షలు చేసి,
టీకాలు వేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గ్రానైట్ క్వారీలు, పరిశ్రమలు, రవాణ రంగాలలో కోవిడ్ వ్యాప్తిని అరిక ట్టడం పై సోమవారం స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో ఆయన సమావేశం నిర్వహించారు. కోవిడ్ మూడవ దశ, బ్లాక్ ఫంగస్, డెల్టాప్లస్ వేరియంట్ వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని కోవిడ్ పరీక్షలు విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. కోవిడ్ మూడవదశ ప్రమాదం పొంచి ఉన్నందున అధికారులు అప్రమత్తం కావాలన్నారు. ముఖ్యంగా గ్రానైట్ క్వారీలు,
పరిశ్ర మలు, ఇటుక బట్టీలు, నిర్మాణ రంగ ప్రాంతాలు, రవాణ రంగ ప్రాంతాలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఇలా జిల్లాలో 1,953 ప్రాంతాలలో పొరుగు జిల్లాలు, ఇతర రాష్ట్రాలనుంచి వలస కార్మికులు అధికంగా వస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాలలో ఒక వారంలో 26 వేలమందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. 45 సంవత్సరాలు దాటిన వారందరికి కరోనా నివారణ టీకా వేయించాలన్నారు. కోవి డ్ నిబంధనల పై అవగాహన కల్పిస్తూ ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్ర పరచుకోవడం, విధిగా పాటించేలా చూడాలన్నారు. పండ్లతోటల వద్ద కార్మికులకు కోవిడ్ పరీక్షలు చేసేలా ప్రత్యేక బ్రుందాలను నియమించాలని కలెక్టర్ తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా జిల్లా సరిహద్దులున్న మండలాలోను కోవిడ్ పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాలు, వివిధ జిల్లాలక ు వెళ్తున్న లారీ, కారు డ్రైవర్లకు పరీక్షలు చేసి టీకా వేయాలన్నారు. కోవిడ్ వ్యాప్తి అరికట్టడంలో అధికారులతో పాటు వివిధ రంగాలలోని యూనియన్లు, సంఘాల ప్రతినిధులు భాగస్వాములు కావాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 5.5 శాతం కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని, కేసుల నమోదు శూన్యం కావాలన్నారు. కరోనా వైరస్ జిల్లాలో తగ్గిపోయిందని భావన విడిచి పెట్టాలని, ప్రజలంతా జాగ్రత్తలు పాటించేలా ప్రచారం చేయాలన్నారు. కొత్త వైరస్ ప్రమాదాన్ని ముందుగా గుర్తించి ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్థి) టి.ఎస్. చేతన్, వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ పి. రత్నావళి, జిల్లా పరిశ్రమల శాఖ జి.ఎమ్. చంద్రశేఖర రెడ్డి,
భూగర్భ గనుల శాఖ డి.డి. నర్సింహారెడ్డి, ఉప కార్మిక కమిషనర్ శ్రీనివాసరావు, కోవిడ్ కంట్రోల్ రూమ్ ఇన్‌ఛార్జి డాక్టర్ తిరుమల రావు, గ్రానైట్ క్వారీల ఓనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చంద్రారెడ్డి, కార్యదరి ్శ శుభాస్కర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Ongole

2021-06-28 13:03:56

ప్రజాప్రతినిధులు సహకారం అవసరం..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో అన్ని స్థాయిల్లోని ప్ర‌జాప్ర‌తినిధులు పేద‌ల గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మాన్ని త‌మ సొంత కార్య‌క్ర‌మంలా భావించి ఇందులో భాగ‌స్వాములు కావ‌డం ద్వారా విజయ‌వంతం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ కోరారు. ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇళ్ల నిర్మాణ కార్య‌క్ర‌మాన్ని వాక్సినేష‌న్ త‌ర‌హాలో పెద్ద ఎత్తున‌ చేప‌ట్టాల‌ని భావిస్తున్నార‌ని చెప్పారు. మ‌న జిల్లా నుంచి జూలై 1,3,4 తేదీల్లో నిర్వ‌హించే మెగా గ్రౌండింగ్ మేళాలో త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో లబ్దిదారులు ఇళ్లు నిర్మించుకునేలా వారిని ప్రోత్స‌హించి ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డంలో జిల్లాలోని పార్ల‌మెంటు స‌భ్యులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స‌హ‌క‌రించాల‌ని కోరారు. మెగా గ్రౌండింగ్ మేళాల నిర్వ‌హ‌ణ‌పై జిల్లాకు చెందిన ఎంపి, ఎం.ఎల్‌.సి., ఎమ్మెల్యేల‌తో క‌లెక్ట‌ర్ సోమ‌వారం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఒక స‌మావేశం నిర్వ‌హించారు. ఈ గ్రౌండింగ్ మేళా ఉద్ద్యేశ్యాల‌ను, ఈ మేళాల్లో గృహ‌నిర్మాణాల‌కు సంబంధించి జిల్లా యంత్రాంగం నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను గురించి వారికి క‌లెక్ట‌ర్ వివ‌రించారు. పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మంలో జిల్లాలో 75వేల‌ ఇళ్ల‌ను నిర్మించాల్సి ఉంద‌ని, జూలై 1వ తేదీన మంచి ముహూర్తం ఉంద‌ని చెబుతున్నార‌ని మొద‌టి రోజే అధిక సంఖ్య‌లో ల‌బ్దిదారుల‌తో ఇళ్ల ప‌నులు ప్రారంభించేలా చొర‌వ చూపాల‌ని సూచించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అన్ని లే అవుట్ల‌లో ఇప్ప‌టికే నీటిస‌ర‌ఫ‌రా, విద్యుత్ త‌దిత‌ర సౌక‌ర్యాలు క‌ల్పించామ‌ని కలెక్ట‌ర్ తెలిపారు. ప‌ట్ట‌ణాల్లోనూ ఈనెల 30 నాటికి లే అవుట్ల‌లో నీటి వ‌స‌తి క‌ల్పిస్తామ‌న్నారు. ఇళ్ల నిర్మాణాల‌కు ఉచితంగా ఇసుక స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని, దీనికోసం ఏడు లేదా ఎనిమిది మంది ల‌బ్దిదారులు ఒక గ్రూపుగా ఏర్ప‌డితే వారికి ఒకేసారి అవ‌స‌ర‌మైన ఇసుక స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. సిమెంటు ఒక్కో ఇంటికి రూ.235 ధ‌ర‌తో 90 బ‌స్తాలు అందిస్తామ‌న్నారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ల‌బ్దిదారులు ఇళ్లు నిర్మించుకునేలా శాస‌న‌స‌భ్యులు వారిని ప్రోత్స‌హించాల‌ని కోరారు. ప్ర‌తి రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒక జాయింట్ క‌లెక్ట‌ర్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించామ‌ని, ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏ స‌మ‌స్య వున్నా వారిని సంప్ర‌దించాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

ప‌లువురు శాస‌న‌స‌భ్యులు మాట్లాడుతూ ల‌బ్దిదారులు గ్రూపులుగా ఏర్ప‌డి ఇళ్లు నిర్మించుకుంటేనే వారికి ఇళ్ల నిర్మాణ ఖ‌ర్చు త‌గ్గుతుంద‌ని, ఈ విష‌యంలో వారిలో అవ‌గాహ‌న క‌ల్పించాల్సి వుంద‌న్నారు. అదేవిధంగా ఇళ్ల నిర్మాణాలు చేప‌ట్టే ల‌బ్దిదారులకు స‌కాలంలో అవ‌స‌ర‌మైన మేర‌కు సిమెంటు స‌ర‌ఫ‌రా చేయాల‌ని గ‌జ‌ప‌తిన‌గ‌రం ఎమ్మెల్యే బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య కోరారు. నెల్లిమ‌ర్ల‌, సాలూరు, పార్వ‌తీపురం నియోజ‌క‌వ‌ర్గాల్లో లేఅవుట్ల‌కు సంబంధించిన ఉన్న స‌మ‌స్య‌ల‌ను ఆయా శాస‌న‌స‌భ్యులు బ‌డుకొండ అప్ప‌ల‌నాయుడు, రాజ‌న్న‌దొర‌, అల‌జంగి జోగారావు వివ‌రించారు. స‌మావేశంలో ఎం.పి. బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ ఇసుక స‌ర‌ఫ‌రా చేస్తారో వివ‌రించాల‌ని కోరారు. 7 నుంచి 8 మంది క‌ల‌సి ఒక ఇండెంట్ పెట్టుకుంటే జెపి సంస్థ వారి స్థ‌లం వ‌ద్ద వారికి సంబంధించిన ఇసుక స‌ర‌ఫ‌రా చేస్తుంద‌ని హౌసింగ్ పి.డి. ర‌మ‌ణ‌మూర్తి తెలిపారు.
 
స‌మావేశంలో ఎం.ఎల్‌.సి. సురేష్‌బాబు,విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు, చీపురుప‌ల్లి ఇన్‌చార్జి మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, ఎస్‌.కోట ఎమ్మెల్యే క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, జాయింట్ క‌లెక్ట‌ర్‌లు డా.మ‌హేష్ కుమార్‌, డా.కిషోర్ కుమార్‌, అశోక్ మ‌యూర్, వెంక‌ట‌రావు, విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్‌.ఇ., గ‌నుల‌శాఖ ఏ.డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-28 12:59:06

స్పందనకు 87 వినతులు..

విజయనగరం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన టెలి స్పందనకు 12 ఫోన్ కాల్స్ అందాయి. కోవిడ్  దృష్ట్యా  ప్రజల  నుండి వినతులను స్వీకరించడానికి నిర్వహిస్తున్న స్పందనకు బదులుగా టెలి స్పందన నిర్వహించి టెలిఫోన్ ద్వారా వినతులను  స్వీకరించాలని కలెక్టర్ నిర్ణయించారు. అయినప్పటికి సోమవారం త్వరలో చేపట్టనున్న గృహ నిర్మాణాలకు సంబంధించి ఇళ్ల పట్టాల సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ ను కలసి తమ వినతులను అందజేసారు.  స్పందనలో డి.ఆర్.ఓ. ఎం.గణపతిరావు కూడా వినతులను అందుకున్నారు. స్పందనలో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఇదే వేదిక ద్వారా జిల్లా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Vizianagaram

2021-06-28 12:56:49

మెగామేళాలో జిల్లాలక్ష్యం 75 వేల ఇళ్లు..

 నవరత్నాలు- పేదలందరికి ఇళ్ళు క్రింద చేపడుతున్న గృహ  నిర్మాణాల మెగా మేళా లో వ్యవసాయ, ఆరోగ్య  శాఖలు తప్ప మిగిలిన శాఖలన్నిటిని భాగస్వామ్యం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ తెలిపారు.  జిల్లా కు 75 వేల గృహాలను లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని,   అధికారులు  వారి లక్ష్యాలను సాధించి తమ సమర్ధతను చూపించుకోవాలని అన్నారు.  లక్ష్యాలను సాధించని వారి పై చర్యలు తప్పవని ఈ సందర్భంగా  హెచ్చరించారు. సోమవారం సంయుక్త కలెక్టర్లతో కలసి  కలెక్టర్ మండల బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఇంకా రెండు రోజులే  గడువు ఉన్నందున కార్యక్రమ నిర్వహణకు అవసరమగు ఏర్పాట్లను , కార్యాచరణ ప్రణాళికలను తయారు చేసుకొని సన్నద్ధంగా  ఉండాలని ఆదేశించారు.  జూలై 1 వ తేదీనే మొత్తం గ్రౌండ్ అయ్యేలా ప్రణాళికలు వేసుకోవాలని, వీలు కాని వారు మాత్రమే  మిగిలి ఉండాలని, వారివి  3, 4  తేదీలలో పూర్తి చేయాలనీ అన్నారు. లబ్ది దారులను వారికీ  కేటాయించిన ప్లాట్  వద్దకు తీసుకు రావడం, ప్లాట్ మార్కింగ్ చేయడం, భూమి పూజల కు కావలసిన సామగ్రిని  , ఇసుక, సిమెంట్, ఇటుక తదితర ఏర్పాటు చేయడం,  ఈ కార్యక్రమాన్ని ఫోటో తీసి యాప్ లో అప్ లోడ్ చేయడం ముఖ్యమైన పని అన్నారు.  లబ్ది దారులు  100 మంది కంటే ఎక్కువ వున్న చోట షామియానా ఏర్పాటు చేయాలన్నారు.  ఈ ప్రరంభాలను  ముఖ్యమంత్రి కార్యాలయం నుండి గంట గంటకు పర్యవేక్షించే ఏర్పాటు చేసారని, అదే విధంగా జిల్లా నుండి సి.పి.ఓ కార్యాలయం నుండి ఒక బృందం పర్యవేక్షిస్తుందని తెలిపారు.  అనంతరం  సంయుక్త కలెక్టర్లు డా. కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్, అశోక్ మయూర్  లు తమ సలహాలను, సూచనలను అందించారు. 
 జిల్లాకు ప్రత్యేకాధికారి నియామకం : 
జిల్లాకు ప్రత్యెక పర్యవేక్షణాధికారిగా సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి  సాల్మన్ ఆరోఖ్య రాజ్ ను  ప్రభుత్వం నియమించిందని , వారు ఎక్కడైనా  ఎప్పుడైనా ఆకష్మికంగా తనిఖీ చేయవచ్చునని కలెక్టర్ అన్నారు.  అదే విధంగా జిల్లా నుండి జే.సి (రెవిన్యూ) గజపతి నగరం,  బొబ్బిలి  నియోజక వర్గాలకు, జే.సి అభివృద్ధి డా. మహేష్ కుమార్ ను నెల్లిమర్ల, చీపురుపల్లి, జే.సి ఆసరా జే. వెంకట రావు కు సాలూరు నియోజక వర్గానికి ఇంచార్జ్ లుగా నియమించామన్నారు. జే.సి హౌసింగ్ మయూర్ అశోక్ ను విజయనగర, ఎస్.కోట  నియోజకవర్గాలకు కేటాయించగా , ఐ టి డి ఎ ప్రోజ్ర్ట్ అధికారి కుర్మనాద్ ను పార్వతి పురం, కురుపాం నియమించడం జరిగిందన్నారు.  వీరితో పాటు  ప్రతి నియోజక వర్గానికి ఒక సీనియర్ జిల్లా అధికారిని ఇంచార్జ్ గా నియమించామన్నారు. మండల ప్రత్యేకాధి కారులు  ఆయా ఇంచార్జ్ లకు రిపోర్ట్ చేయవలసి ఉంటుందని, ఏదైనా  సమస్య వస్తే సంబంధిత  ప్రత్యేకాధికారిని సంప్రదించాలని అన్నారు. 
ప్రజా ప్రతినిధులు సహకరించాలి:
 పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక అని, ఈ మెగా ప్రారంభ  మేళా కు   అత్యంత ప్రాధాన్యత నిచ్చి విజయవంతం గావించాలని   జిల్లా  కలెక్టర్ ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేసారు. సర్పంచ్ లకు, మున్సిపల్ కౌన్సిలర్తో , కార్పొరేటర్లతో, శాసన సభ్యులు, ఎం.పి లతో  టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడి ప్రజా ప్రతినిధులంతా ఈ మేళా కు తప్పక హాజరు కావాలని కోరారు.   ప్రజలను చైతన్య పరచి పెద్ద సంఖ్యలో ప్రారంభాలు జరిగేలా తోడ్పడాలన్నారు.  లబ్ది దారులను వారికీ కేటాయించిన ప్లాట్ వద్దకు వచ్చేలా చేయడం లో వాలంటీర్ లకు సూచించాలని అన్నారు.   ఈ కార్యక్రమాన్ని ఎన్నికల నిర్వహణ లా, ఒక వాక్సినేషన్ కార్యక్రమం లా జరగాలన్నారు. 

Vizianagaram

2021-06-28 12:52:43

తల్లుల వేక్సిన్ లో విజయనగరమే ఫస్ట్..

ఐదేళ్ల లోపు వ‌య‌స్సు గ‌ల పిల్ల‌ల త‌ల్లుల‌కు కోవిడ్ వాక్సిన్ ఇవ్వ‌డంలో రాష్ట్రంలోనే విజ‌య‌న‌గ‌రం అగ్ర‌స్థానంలో నిలిచింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. రాష్ట్రంలో స‌గ‌టున 66శాతం త‌ల్లుల వాక్సినేష‌న్ జ‌రుగ‌గా, మ‌న జిల్లాలో 94శాతం మంది ఐదేళ్ల‌లోపు వ‌య‌స్సు గ‌ల బాల‌ల త‌ల్లుల‌కు వ్యాక్సినేష‌న్ పూర్తిచేశామ‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. జిల్లాలో 88,517 మంది ఐదేళ్ల‌లోపు పిల్ల‌ల త‌ల్లుల‌కు వ్యాక్సిన్ ఇవ్వాల్సి వుండ‌గా 83,174 మందికి ఆదివారం నాటికే వ్యాక్సిన్ వేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ మేర‌కు గ‌రిష్ట స్థాయిలో  వ్యాక్సినేష‌న్ సాధించ‌డంలో కృషిచేసిన ఏ.ఎన్‌.ఎం.లు, ఆశ కార్య‌క‌ర్త‌లు, వ‌లంటీర్ల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ అభినందించారు.

Vizianagaram

2021-06-28 11:05:06