1 ENS Live Breaking News

వైఎస్సార్ భీమా నిరుపేదలకు ధీమా..

దురదృష్టవశాత్తూ కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు పెద్ద దిక్కుగా   దేశంలో ఎక్కడ లేని విధంగా పూర్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్ బీమా పథకంను అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.  గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్ విధానంలో  2021–22 ఆర్దిక సంవత్సరంకు వైఎస్సార్ బీమా పథకంను కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ బీమా పథకం కు 2021–22 సంవత్సరానికి గాను రాష్ట్రంలో రూ.1.32 కోట్ల పేద కుటుంబాలకు దాదాపు రూ.750 కోట్ల వ్యయంతో ఉచిత బీమా రక్షణ కల్పిస్తున్నామన్నారు. బీమా పధకం నుంచి  కేంద్రం తప్పుకున్నా పేదలకు ఒక్క రూపాయి భారం పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరిస్తూ సాయం అందిస్తున్నదని తెలిపారు. పేద కుటుంబంలో 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల సంపాదించే వ్యక్తి మరణిస్తే రూ.లక్ష ఆర్ధిక సాయం అందేలా, 18 నుంచి 70 సంవత్సరాల వయస్సుగల సంపాదించే వ్యక్తి ప్రమాదంలో మరణించిన, శాశ్వత అంగవైకల్యం పొందినా  కుటుంబానికి రూ. 5 లక్షల బీమా పరిహారం అందిస్తారని తెలిపారు. 
  
      ఇప్పటి వరకు 6,89, 580 కుటుంబాలలో సర్వే పూర్తి చేసారు. రానున్న రెండు రోజుల్లో మిగతా కుటుంబాలలో సర్వే పూర్తి చేసేందుకు వార్డు సచివాలయాలలోని   వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు,  వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ, వాలంటీర్లు చర్యలు తీసుకుంటున్నారు.  వైఎస్సార్ బీమా 2021–22   సంవత్సరంలో నమోదు అయిన పలువురు లబ్ధిదారులకు పాలసీ పత్రాలు, బీమా కార్డులను జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) శ్రీధర్ రెడ్డి,  శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, కల్పలత, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మెహమ్మద్ ముస్తఫా, నగరపాలక సంస్థ మేయరు కావటి శివనాగ మనోహర్ నాయుడుతో కలిసి అందించారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) శ్రీధర్ రెడ్డి,  శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, కల్పలత, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మెహమ్మద్ ముస్తఫా, నగరపాలక సంస్థ మేయరు కావటి శివనాగ మనోహర్ నాయుడు, మార్కెట్ యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, రాష్ట్ర కృష్ణబలిజ, పూసల సంక్షేమ మరియు అభివృద్ధి కార్పోరేషన్ చైర్పర్సన్ కోలా భవానీ మణికంఠ, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్ పాల్గొన్నారు.  గుంటూరు జిల్లాలో ఉన్న 14,91,412  బియ్యం కార్డు కుటుంబాలకు  వైఎస్సార్ బీమా పధకం అమలు చేయనున్నారు.  

Guntur

2021-07-01 13:37:57

సీఎస్ఆర్ నిధులు ఉపాది చూపాలి..

సిఎస్ఆర్ నిధులు సక్రమంగా వినియోగిస్తే ఎందరికో దారిచూపిస్తాయని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. గురువారం టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో ఈనెల 1వ తేదీన స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ సహకారంతో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని,  వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఆయన గ్రామ సర్పంచ్ మన్నం శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ లిమిటెడ్  కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ లో భాగంగా 9 లక్షల రూపాయల విలువ చేసే 45 కుట్టుమిషన్ లను అందించడం 45 మంది మహిళలకు ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు.స్పందన డైరెక్టర్ వి.శివరామిరెడ్డి ప్రసంగిస్తూ కారుమంచి గ్రామ అభివృద్ధి లో తమ తోడ్పాటు ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు.అనంతరం జరిగిన వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా జరిగిన సభలో వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ కరోనా నేపథ్యంలో దాదాపు 800 మంది డాక్టర్లు మరణించడం బాధాకరమన్నారు.వందలాది వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యసేవలను అందించారన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 16 మెడికల్ కాలేజీలను ప్రారంభించడం,కరోనా నేపథ్యంలో 1.3 లక్షల కోట్ల రూపాయలను నగదు రూపంలో నేరుగా లబ్ధిదారుల అకౌంట్స్ లో వేయడం  అభిలషణీయన్నారు.జులై 1 న జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రాణాలను అర్పించిన వైద్య సిబ్బందికి సంతాపం తెలుపుతూ సభ మౌనం పాటించింది.వ్యాక్సినేషన్ ల ఫలితంగా ప్రపంచంలో మశూచి, కలరా, పోలియో, ప్లేగు లాంటి వ్యాధులను నిర్మూలించగలిగామని నేడు కరోనా నివారణకు వ్యాక్సినేషన్ ను అందరూ వేయించుకోవడమే పరిష్కారమని లక్ష్మణరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మన్నం శ్రీనివాస్,ఉప సర్పంచ్ ముంతా లక్ష్మి, గ్రామ పెద్దలు బత్తుల కృష్ణ, చిట్టేల రామిరెడ్డి,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ డి.ఎన్ వెంకటేశ్వర్లు, సూపర్ వైజర్ వి.ఝాన్సీలక్ష్మి,లేజియా రాణి, హెల్త్ అసిస్టెంట్ సురేష్,వార్డు నెంబర్ లు ప్రసంగించారు.

Tangutur

2021-07-01 13:34:19

పేదల కుటుంబాల్లో సొంతింటి వెలుగులు..

రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగేంత వరకు పేద ప్రజలకు ఎలాంటి భయము, సంక్షేమ పథకాలకు ఆటంకం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్  చెప్పారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  ఆదిమూలపు సురేష్ గురువారం భూమి పూజ చేశారు.  అనంతరం ఆ గ్రామంలోని లేఅవుట్ లో కొత్తగా ఏర్పాటు చేసిన బోరును ఆయన ప్రారంభించారు. పేద కుటుంబాలన్నింటికి జగన్ మోహన్ రెడ్డి పెద్ద కొడుకుగా నిలిచి సంక్షేమ పథకాలను సమర్ధంగా అమలు చేస్తున్నారని మంత్రి సురేష్ తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రెండేళ్లలో 90% హామీలను అమలు చేశారని ఆయన వివరించారు. జవాబుదారీ తనంతో ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. సెంటు భూమి, ఉండటానికి గూడు లేదనే దిగులు ఉండరాదని రాష్ట్ర ప్రభుత్వం  నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహిస్తుందన్నారు.  రాజకీయ పార్టీలు, కుల మతాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని 37 లేఅవుట్లలో 2,800 గృహాలు నిర్మిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గొబ్బూరు గ్రామంలోని జగనన్న కాలనీని రూ.1.50 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. గృహాలు నిర్మించుకోడానికి ప్రతి కుటుంబానికి రూ.1.80 లక్షల నగదును ప్రభుత్వం ఇస్తుందన్నారు. నేటికి స్థలం లేని వారు ఆందోళన చెందరాదని, సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోనే ఇంటి స్థలం కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నంతవరకు గృహ నిర్మాణాలకు ఎలాంటి ఆటంకం లేదని ఆయన భరోసా ఇచ్చారు.

              మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు చేర వేసే పేద ప్రజల పక్షపాతి ప్రభుత్వమని  మంత్రి  సురేష్ అభివర్ణించారు. గ్రామ సచివాలయాలతో ప్రభుత్వ పరిపాలన గ్రామాలలోని ప్రజలకు చేరువయ్యిందన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో పేదల బాధలు, ఇబ్బందులు తెలుసుకున్న జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే నవరత్నాలు పేరుతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. పారదర్శకంగా పరిపాలన సాగిస్తూ దేశ చరిత్రలోనే ఏపీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టారని ఆయన కితాబిచ్చారు. చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మేనమామ బాధ్యత తీసుకున్నారని చెప్పారు. పండుగుల మాదిరిగా సంక్షేమ క్యాలెండర్, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నిబద్ధతగల సీఎంగా చరిత్రకెక్కరని ఆయన వివరించారు. దేవరాజు గట్టు పునరావాస కాలనీలో త్వరలోనే గృహ నిర్మాణాలను ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు.  గొబ్బూరు గ్రామంలో పేదలైన లబ్ధిదారులకు ప్రభుత్వమే గృహాలను నిర్మించి చేస్తుందని ఆయన తెలిపారు.

        నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా 612 లే అవుట్ లో విజయవంతంగా గృహ నిర్మాణాలు ప్రారంభించామని జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ కె.వి.ఎస్.సాయినాథ్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 22 వేల ఇళ్ల నిర్మాణం మొదలయ్యాయన్నారు. మిగిలిన 46 వేల గృహాల నిర్మాణ పనులు ప్రారంభం కోసం ఈ నెల ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో నిర్మించనున్న గృహాలకు రూ.1512 కోట్ల నిధుల విడుదల అయ్యాయన్నారు. జగనన్న కాలనీలలో నీరు, విద్యుత్, రహదారులు, కాల్వలు  మౌలిక సదుపాయాల కల్పనకు రూ.30 వేల కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే సిమెంటు, ఇనుము లబ్ధిదారులకు అందజేస్తున్నామని ఆయన వివరించారు.  కార్యక్రమంలో మార్కాపురం ఆర్డిఓ ఎం వి శేషి రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ రాజేంద్ర, డిఈ శ్రీనివాసరావు, స్థానిక తహసిల్దార్, ఎంపీడీవో, గ్రామ సర్పంచ్ అంగిరేకుల ఆదినారాయణ,  తదితరులు పాల్గొన్నారు.

గొబ్బూరు

2021-07-01 13:29:17

మౌళిక సదుపాయాల కల్పనకు క్రుషి..

మహా విశాఖ నగర పరిధిలో నివాసిత ప్రాంత ప్రజలకు మౌళిక వసతులు కల్పించాలని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె ఐదవ జోన్ 57వ వార్డు పరిధిలోని ఆశవాని పాలెం, శ్యాం నగర్, మర్రిపాలెం తదితర ప్రాంతాలలో జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, డిప్యుటీ మేయర్ జియ్యాని శ్రీధర్, పశ్చిమ నియోజక వర్గ సమన్వయ కర్త డా. మల్లా విజయ ప్రసాద్, వార్డు కార్పొరేటర్ ముర్రు వాణి తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ కాలనీలోని ప్రజలకు త్రాగునీరు, విద్యుత్, పారిశుధ్యం లాంటి మౌళిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆశవాని పాలెం లోని గెడ్డలో పూడిక అధికంగా ఉన్నదని అది నేవల్ అధికారుల ఆధీనంలో ఉన్నందున వారితో సంప్రదించి కాలువలో పూడిక తీయించి, మురుగు సాఫీగా పోయే విధంగా చర్యలు చేపట్టాలని, మర్రిపాలెం లోని కాలువలను శుభ్రం చేయాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. ఆశావాని పాలెం లోని గెడ్డను ఆనుకొని ఉన్న స్థలం ప్రైవేటు వ్యక్తులదా   లేదా జివిఎంసికి సంబంధించినదా, స్థానిక ఎం.ఆర్.ఒ. ఆఫీసు సర్వేయర్ మరియు జివిఎంసి సర్వేయర్తో సంయుక్తంగా సర్వే చేయించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. కోర్టులో పెండింగు లో ఉన్న ఖాళీ స్థలాల కేసుల వివరాలను తెలపాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ ప్రదేశాలలో పొదలు, చెత్త అధికంగా ఉన్నందున స్థలం యొక్క యజమానులతో సంప్రదించి వాటిని తొలగించాలని తెలియజేసి లేని యెడల మన సిబ్బందితో తొలగించి, స్థల యజమానికి జరిమానా విధించాలన్నారు. పశ్చిమ నియోజక వర్గ సమన్వయ కర్త డా. మల్లా విజయ ప్రసాద్, స్థానిక కార్పొరేటర్ ముర్రు వాణి ఆశవాని పాలెం కాలనీలోని సెప్టిక్ ట్యాంకును క్లీనింగ్ చేయించాలని, కాలువలు, రోడ్డులు పాడైనవని తెలియపరచగా, సెప్టిక్ ట్యాంకు ను వెంటనే శుభ్రపరచాలని, కోలనీలో రోడ్లను, కాలువల నిర్మాణానికి, ఎర్రగెడ్డ ప్రాంతంలో  రైటైనింగ్ వాల్ నిర్మాణానికి, శ్యాం నగర్ లో కాలువలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.  ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఐదవ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కార్య నిర్వాహక ఇంజినీర్లు రత్నాల రాజు, శ్రీనివాస్ (వాటర్ సప్ప్లై), చిరంజీవి (మెకానికల్), ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ ఏడుకొండలు, ఎఎంఒహెచ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-07-01 13:23:32

గోదారమ్మకు మంత్రి అవంతి పూజలు..

గండి పోచమ్మ అమ్మవారి దయతో పర్యాటక ప్రాంతాలు, గోదావరి నదీ ఆలయాలు అభివ్రుద్ధి చెందాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం మంత్రి గండి పోచమ్మ వారిని దర్శించుకుని అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ గోదావరి జల హారతి పూజా కార్యక్రమాలు నిర్వహించి పాపికొండలు విహార యాత్ర పున ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న దేవాలయాలను కూడా అభివృద్ధి పరచి భవిష్యత్ తరాలకు అందిస్తామన్నారు. గోదావరి తీరం వెంబడి పర్యాటకుల తాకిడి కి అనుగుణంగా బోటింగ్ పాయింట్లు పెంచామన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఎక్కడ నిర్లక్ష్యానికితావులేకుండా  పలురకాల శిక్షణలో ఇప్పించి ఆయా శిక్షణ పొందిన వారిని ఈ లాంచీల లో నియమించినట్టు చెప్పారు. స్థానిక శాసన సభ్యురాలు ధనలక్ష్మి మాట్లాడుతూ. ప్రతి అంశంలోనూ నిర్లక్ష్యానికి తావులేకుండా విహారయాత్ర కొనసాగేలా పర్యవేక్షణ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిందన్నారు . రాజానగరం ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా మాట్లాడుతూ పర్యాటకం అనగానే తూర్పుగోదావరి జిల్లా అందరి దృష్టిని ఆకర్షిస్తోందని పురుషోత్తపట్నం రామవరపు ఆవ ప్రాంతాన్ని ఏనుగు కొండ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని పర్యాటక మంత్రి ని కోరారు. రాష్ట్ర పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరు చోట్ల పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి పరిచి 6 స్టార్ హోటల్స్ నిర్మించాలని యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. అదేవిధంగా ప్రముఖ దేవాలయాలు కలిగిన ఏడు ప్రాంతాలకు అభివృద్ధి పరచి పర్యాటకంగా ఆదాయాన్ని ఆర్జించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్ రామ్ మాట్లాడుతూ జిపిఎస్ అనుసంధానంతో పర్యాటక రక్షణ వ్యవస్థ బలోపేతం చేయడం జరిగిందని కాకినాడ మచిలీపట్నం పోర్టు ల ద్వారా లైసెన్సులు ఇవ్వడం జరుగుతుందని ఆయ కోర్టుల మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ అనంత బాబు ఐ టి డిఎ వివో ప్రవీణ్ ఆదిత్య సబ్ కలెక్టర్ సింహాచలం పర్యాటక శాఖ సిబ్బంది రమణ మురళి తదితరులు పాల్గొన్నారు.

Rajahmundry

2021-07-01 13:11:44

పర్యాటకుల భద్రతకే ప్రాధాన్యత..

రాష్ట్రంలో పర్యాటకుల భద్రతే ధ్యేయంగా 9 కమాండ్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి పర్యవేక్షణ వ్యవస్థలు బలోపేతం చేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు ముత్తం శెట్టి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన గండి పోచమ్మ ఆలయం వద్ద పాపికొండలు విహారయాత్రలు పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఆదేశాల మేరకు పర్యాటకుల భద్రత రక్షణ కొరకు గండి పోచమ్మ పోచవరం రాజమహేంద్రవరం పశ్చిమగోదావరి జిల్లాలో సింగంపల్లి పేరంటాలపల్లి విశాఖ జిల్లా రుషికొండ గుంటూరు జిల్లా నాగార్జునసాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం కృష్ణాజిల్లా బేరం పార్క్ లవద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ లో జలవనరుల శాఖ పర్యాటక శాఖ పర్యాటక శాఖ సిబ్బంది పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు అందుబాటులో ఉంటారని మీరు లాంచీల రాకపోకలు, పర్యాటకుల రక్షణకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. ప్రస్తుతం పర్యాటకశాఖ కు రెండు లాంచీలు ప్రైవేట్ సంబంధించి నాలుగు లాంచీలు లైసెన్స్ లకొరకు అనుమతులు పొందాయని ఆయన స్పష్టం చేశారు. కంట్రోల్ రూమ్ లో సీసీటీవీ సర్వే లెను అగ్నిమాపక కేంద్రాలు ప్రాథమిక చికిత్స కిట్టు లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ పి ఎ.సిస్టం కంప్యూటర్ సెటప్ సమాచారవ్యవస్థ టికెట్ కౌంటర్ ఉంటాయని పాపికొండలు బోటింగ్ ఆపరేటింగ్ కొరకు నాలుగు చోట్ల కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. లాంచీల లో కెపాసిటీకి తగిన విధంగా పర్యాటకులను ఎకించుకోవాలని సూచించారు. లాంచీల లో లైఫ్ జాకెట్లు అగ్నిమాపక యంత్రాలు ప్రాథమిక చికిత్స కిట్టు శాటిలైట్ ఫోన్ నావిగేషన్ మరియు కమ్యూనికేషన్ పరికరాలు బైనాక్యులర్స్ పిఎ సిస్టం లు అందుబాటులో ఉంటాయన్నారు. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర  ప్రభుత్వం పటిష్టమైన భద్రతా వ్యవస్థ ను అమల్లోకి తెచ్చింది అన్నారు. కరోనా మూలంగా పర్యాటక యాత్రను పునరుద్ధరించడానికి సమయం పట్టిందని 2019 సెప్టెంబర్ 15 న కచులూరు వద్ద జరిగిన ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగడంతో పర్యాటక పరంగా సమూలమైన మార్పులను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని తదనుగుణంగా భద్రతా వ్యవస్థను పటిష్టపరచడం జరిగిందన్నారు. పడవలలో పర్యాటకులు మద్యం సేవించ రాదని పాపికొండలు  ప్రకృతిని ఆస్వాదించాలని ఆయన స్పష్టం చేశారు. గోదావరి తీరం వెంబడి ఉన్న గిరిజనులకు రవాణా వ్యవస్థను పునరుద్ధరించడానికి పర్యాటక పరంగా ఉపాధి పొందుతున్న 200 మంది ఉపాధిని పెం దించడానికి గురువారం పాపికొండలు విహార యాత్ర ప్రారంభించడం జరిగిందన్నారు. పాలవరం ప్రాజెక్టు వద్ద ఇమేజ్ పార్కును రెస్టారెంట్లను అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపట్టామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రులకు జీవనాడి అని నెల రోజుల తర్వాత పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర పర్యాటకులు దృష్టి పోలవరం ఉభయగోదావరి ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలను ఆకర్షించే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ అనంత బాబు ఐ టి డిఎ వివో ప్రవీణ్ ఆదిత్య సబ్ కలెక్టర్ సింహాచలం పర్యాటక శాఖ సిబ్బంది రమణ మురళి తదితరులు పాల్గొన్నారు.

Rajahmundry

2021-07-01 13:09:51

ఉన్నత పదవితో "ఉమాకాంత్" మళ్ళీ రావాలి..

విశాఖ సాక్షి బ్యూరో చీఫ్ గా  గరికిపాటి ఉమాకాంత్ ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించారని లీడర్ పత్రిక సంపాదకులు వివి.రమణమూర్తి కొనియాడారు. విశాఖపట్నం నుండి తిరుపతికి  బదిలీ అయిన సందర్భంగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో గురువారం సాక్షి బ్యూరో చీఫ్ ఉమాకాంత్ కి ఘనంగా సత్కరించారు. వి జె ఎఫ్ పాలకవర్గం ఆయనకు శాలువా కప్పి మెమొంటో అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  రమణమూర్తి పాల్గొని మాట్లాడారు. విశాఖలో అడుగు పెట్టింది మొదలు ప్రజా సమస్యలపై,  పార్టీ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు అనేక వార్తలు వ్రాసి మన్నలను పొందారన్నారు. ప్రజలకు ఇటు పార్టీకి చక్రంలా పనిచేయడం సామాన్య విషయం కాదన్నారు. ఎంతో సున్నితమైన, కల్మషం లేని ఉమాకాంత్ మరింత ఉన్నత పదవిలో మళ్ళీ త్వరలోనే విశాఖ కు రావాలని ఆకాంక్షించారు. వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, అందరితో మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుని వి జి ఎఫ్ కుటుంబ సభ్యుడిగా కలిసి ఐదేళ్ళు గడిచాయన్నారు. అప్పన్న పాదాల చెంత నుండి తిరుపతి వెంకన్న స్వామి ఆశీస్సులతో అక్కడికి బదిలీ కావడం ఆనందంగా ఉందన్నారు. ఆయన రాసిన వార్తలు పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది అని కొనియాడారు. సాక్షి బ్యూరో చీఫ్ ఉమాకాంత్ మాట్లాడుతూ  తన 27ఏళ్ల జర్నలిజంలో ఎక్కువ కాలం పని చేసింది వైజాగ్ లోనే అన్నారు. అనేక జిల్లాల్లో పనిచేసి  ఐదేళ్ల క్రితం వైజాగ్ కు ట్రాన్స్ఫర్ అయిందన్నారు. కానీ ఇక్కడికి  ఇష్టపడి రాలేదని, వైజాగ్ బదిలీ లోనే తన తండ్రి చనిపోయారు అని గుర్తు గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు విశాఖను వదిలి వెళ్లడం చాలా బాధ కలిగిస్తుందన్నారు.  విశాఖ లో అడుగుపెట్టిన మొదటి రోజే యుగంధర్ రెడ్డి, మీడియా లెజెండ్ రమణ మూర్తి ని కలవడం జరిగిందన్నారు. అలాగే వీ జే ఎఫ్ తో కూడా మంచి తత్స సంబంధాలు ఏర్పడ్డాయి అన్నారు. తను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ఉమాకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  బీసీ కమిషన్ సభ్యుడు పక్కి దివాకర్, డాక్టర్ రామ్ కుమార్, వీ జే ఎఫ్ కార్యదర్శి చోడిశెట్టి దుర్గారావు, ఉపాధ్యక్షుడు నాగరాజు పట్నాయక్, జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, ఈరోతి ఈశ్వర్ రావు, ఎమ్మెస్సార్ ప్రసాద్, పైల దివాకర్ , మాధవ్, గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-07-01 12:50:01

అప్పన్నకు రూ. 1,00,001 విరాళం..

 సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారికి విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన గోపి. జగన్మోహన్ రావు లక్ష ఒక్క రూపాయలు (రూ. 1,00,001) విరాళం అందించారు. గురువారం దేవస్థానంలోని పీఆర్వో కార్యాలయ కౌంటర్ లో చెక్ అందించారు. తన భార్య గోపి,రాధ  ప్రధమ వర్దంతి 09-07-2021 జరుగుతోందని ఆరోజు ఆమె జ్ఞాపకార్థం ఈ నెల 9 వ తేదీన అన్నదానం చేయాలని కోరారు. అంతేకాకుండా తమ పెళ్లి రోజైన 20-04-21న కూడా అన్నదానం చేయాలని గోపి.జగన్మోహన్ రావు కోరారు. స్వామివారి దయతో తమ ఇద్దరు కొడుకులుఅమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా సెటిలయ్యారని ఆయన చెప్పారు. అంతకు ముందు స్వామివారిని దర్శించుకొని తీర్ధ ప్రశాదాలతోపాటు, వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-07-01 12:45:13

ప్రభుత్వ కార్యాలయాలు యథాతధం..

రాష్ట్ర ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాలో కర్ఫ్యూ సమయాలను రాత్రి 6 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకూ సడలించిన నేపద్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు  జూలై 1వ తేదీ నుంచి యథావిధిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే  జిల్లాలోని అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో జూలై 1వ తేదీ నుండి ఉదయం 6-30 గంటల నుండి మద్యాహ్నం 1-00 గంట వరకూ ప్రామాణిక కోవిడ్ నియంత్రణ మార్గదర్శకాలను పాటిస్తూ భక్తులు దైవదర్శనం, ప్రార్థనలు జరుపుకునేందుకు అనుమతి జారీ చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 7వ తేదీ వరకూ రాత్రి 6 గం.ల నుండి ఉదయం 6 గం.ల వరకూ జిల్లాలో కర్ఫ్యూ అమలులో ఉంటుందని, కోవిడ్ నియంత్రణ, అత్యవసర సేవల కొరకు అనుమతించిన వ్యక్తులు మినహా కర్ఫ్యూ సమయంలో ప్రజలెవరు బహిరంగ ప్రదేశాలలో సంచరించరాదని ఆయన తెలిపారు. ఫార్మశీలు, ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ లాబ్ లు, అత్యవసర సేవా సంస్థలు మినహా కర్ఫ్యూ వేళల్లో షాపులు, ఎస్టాబ్లిష్మెంట్లు, ఆఫీసులు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు రాత్రి 6 గంటలకు విధిగా మూసి వేయాలని ఆదేశించారు.  కోవిడ్ నియంత్రణ, ప్రజారోగ్య భద్రత దృష్ట్యా  కర్ఫ్యూ సడలింపు సమయాల్లో కూడా జిల్లా అంతటా 144 సెక్షన్ అమలులో ఉంటుందని, బహిరంగ ప్రదేశాలలో 5 గురు అంతకు మించి వ్యక్తులు గుమిగూడడం నిషేదమని తెలియజేశారు.  ఈ ఉత్తర్వులను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా, డివిజనల్, మండల, గ్రామ స్థాయి అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 

Kakinada

2021-07-01 12:20:49

వైద్యవిద్యార్ధుల రక్తదానం స్పూర్తిదాయకం..

కరోనా విపత్కర సమయంలో రక్తం దానం చేయడానికే జూనియర్ డాక్టర్లు ముందుకి రావడం శుభ పరిణామమని ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రన్సిపాల్ డా.సుధాకర్ పేర్కొన్నారు.  గురువారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఏఎంసీలో జరిగిన కార్యక్రమంలో జూనియర్ వైద్యులు 30 మంది రక్తదానం చేశారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, వైద్య విద్య చదువుకునే సమయంలోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టే వైద్యులకు మంచి భవిష్యత్తు వుంటుందన్నారు. ఒకరు రక్తదానం చేయడం ద్వారా 8 మంది ప్రాణాలు కాపాడవచ్చుననే నినాదంతో వైద్యవిద్యార్ధులు చేస్తున్న ఈ రక్తదాన కార్యక్రమం ఎందరికో స్పూర్తిగా వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఏ.శ్యామలాదేవి, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ రాజ్ గ్రుబక్షాని తదితరులు పాల్గొన్నారు..
 

కెజిహెచ్

2021-07-01 12:09:11

ఇరిగేషన్ శాఖ మంత్రి జిల్లాకు రాక..

రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనీల్ కుమార్ శుక్రవారం జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 08.00గం.లకు విశాఖపట్నంలో బయలుదేరి ఉదయం 11.00గం.లకు వంశధార ఫేజ్ –2 వద్దకు చేరుకుంటారు. అక్కడ ఫేజ్ –2 క్రింద జరుగుతున్న స్టేజ్ –2 పనులను తనిఖీచేస్తారని కలెక్టర్ చెప్పారు. అక్కడ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12.30గం.లకు శ్రీకాకుళంకు చేరుకుంటారు. మధ్యాహ్నం 02.00గం.లకు మాజీ మంత్రివర్యులు మరియు శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు గారిని సందర్శించనున్నారు. సాయంత్రం 04.00గం.లకు నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్న ఆయన సాయంత్రం 05.00గం.లకు ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు. 

Srikakulam

2021-07-01 11:49:49

డెల్టా ప్లస్ కాదు డెల్టా వేరియంట్ మాత్రమే..

విశాఖలోని  జీవీఎంసీ జోన్ 1 మధురవాడ వాంబేకాలనీలో మొదటి డెల్టా ప్లస్ కేసు నమోదయ్యిందనే విషయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది. డెల్టా ప్లస్ అంటూ జరిగే ప్రచారంపై జిల్లా వాసులెవరూ కంగారు పడొద్దని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.సూర్యనారాయణ భరోసా ఇచ్చారు. ఆ కేసు  డెల్టా వెరియంట్ మాత్రమేనని వివరించారు. ఈ మేరకు బుధవారం రాత్రి మీడియాకి ప్రకటన విడుదల చేశారు. సెకెండ్ వేవ్ లో చాల మందికి ఈ విధంగా ఫలితం వచ్చిందని..ఈ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రస్తుతం డెల్టా ప్లస్ కలవరం పెడుతున్న నేఫథ్యంలో పాజిటివ్ వచ్చిన సాంపిల్స్ హైద్రాబాద్ పంపి ఫలితాలు వచ్చాక నిర్థారణ చేస్తున్నామని ఆయన వివరించారు. ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన  ఆమె పరిస్థితి బాగానేఉందన్న డిఎంహెచ్ఓ ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.

Visakhapatnam

2021-06-30 16:33:42

మధురవాడ డెల్టా ప్లస్ మొదటి కేసు..

విశాఖలోని  జీవీఎంసీ జోన్ 1 మధురవాడ వాంబేకాలనీలో మొదటి డెల్టా ప్లస్ కేసు నమోదయ్యింది. 51సంవత్సరాల మహిళకు మధురవాడ పి హెచ్ సి లో సిబ్బంది కరోనా టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. లక్షణాలను గుర్తించి సిబ్బంది మరో సారి శాంపిల్స్ తీసి హైదరాబాద్ ల్యాబ్ పంపారు. అక్కడ పరీక్షచేసిన ల్యాబ్ సిబ్బంది అది డెల్టా ప్లస్ గా రిపోర్టు ఇచ్చారు.  హైదరాబాద్ ల్యాబ్  ల్యాబ్ రిపోర్ట్ డెల్టా ప్లస్ గా రావడంతో... వైద్యసిబ్బంది అప్రమత్తం అయ్యారు. వార్డు వాలంటీర్ల సహాయంతో కేసు నమోదు అయిన ప్రాంతంతోపాటు చుట్టు పక్కల ప్రదేశాలను శానిటేషన్ చేసి బారికేడ్లతో పరిసర ప్రాంతాలను మూసివేసారు. మరింత సమాచారం తెలియాల్సి వుంది..

Madhurawada

2021-06-30 16:19:25

ఎస్వీ గోశాల‌ పనులు వేగం పెంచండి..

తిరుప‌తి శ్రీ వేంక‌టేశ్వ‌ర గోసంర‌క్ష‌ణ‌శాల‌లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను బుధ‌వారం టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి త‌నిఖీ చేశారు.ఈ సంద‌ర్భంగా స్వామివారికి వాడిన పుష్పాలు, అదేవిధంగా పంచ‌గ‌వ్యాల‌తో కూడిన మిశ్ర‌మంతో అగ‌ర‌బ‌త్తిల త‌యారీకి ఏర్పాటు చేస్తున్న షెడ్డు, ప‌శువుల దాణా గోడౌన్‌, దాణా మిక్సింగ్ ప్లాంటుల‌ను ఈవో అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. అనంత‌రం గోశాల‌లోనికి ప్ర‌వేశించేందుకు నూత‌నంగా ఏర్పాటు చేసిన రోడ్డు, ఆర్చిల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు. మొత్తం గోశాలలో ప‌శువుల సంఖ్య‌, వాటికి అందిస్తున్న‌ దాణా వివ‌రాలు గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రినాథ‌రెడ్డి, ఈవోకు వివ‌రించారు. త‌రువాత‌ ఇంజినీరింగ్ అధికారులు గోశాలలో చేప‌ట్టిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ఈవోకు వివ‌రించారు.   ఈవో వెంట సిఇ  నాగేశ్వ‌ర‌రావు, ఎస్ ఇ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఎస్ ఇ ఎల‌క్ట్రిక‌ల్  వెంక‌టేశ్వ‌ర్లు, డిఇ  ర‌వికుమార్‌రెడ్డి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-06-30 16:13:03

స్మార్ట్ సిటీ పనులు చాలావరకూ పూర్తి..

భారత ప్రభుత్వ, గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా స్మార్ట్ సిటీ పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా విశాఖపట్నం నుంచి గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సి.ఇ.ఒ./జివిఎంసి  కమిషనర్ డా. జి.సృజన పాల్గొన్నారు. బుధవారం ఆయన ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాలలోని 100 నగరాలలో అమలవుతున్న స్మార్ట్ సిటీ పనులపై ఆరా తీశారు. స్మార్ట్ సిటీ పనులు యొక్క భౌతిక, ఆర్థిక పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ డా. జి.సృజన జివిఎంసిలో స్మార్ట్ సిటీ పనులు దాదాపు పూర్తయ్యాయని, కొన్ని పనులు కోవిడ్-19 కారణంగా కొద్దిగా ఆలస్యం అయ్యాయని వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ విశాఖపట్నంలో స్మార్ట్ సిటీ పనులపై సంతృప్తి  వ్యక్తపరుస్తూ, మిగిలిన పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఆదేశించి నిధులను ఏమైనా రావలసి ఉంటే వెంటనే విడుదల చేస్తామని తెలియజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ను జాయింట్ డైరెక్టర్ అండ్ మిషన్ డైరెక్టర్, ఎం.ఒ.హెచ్.యు.ఎ., గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరుపున కునాల్ కుమార్ మోడరేట్ చేయగా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరుపున ఎం.ఎ. & యు.డి. ప్రత్యేక కార్యదర్శి రామ్  మనోహర్ పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-06-30 16:10:03