1 ENS Live Breaking News

పూర్వీకుల జ్ఞాపకార్థం మొక్కలు నాటండి..

ఆంధ్రప్రదేశ్ లో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి  జనరంజక పాలన సాగిస్తున్నారని విజయనగరం ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరం లోని 4వ డివిజన్ పూల్ బాగ్ కాలనీ మంగళ వీధి ప్రాంతంలో పాదాల అమ్మ చదును ప్రాంతంలో జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్,  ప్రజా ప్రతినిధులు,ఆ ప్రాంత ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. నగరాన్ని హరిత వనం గా తీర్చిదిద్దేందుకు పటిష్టవంతంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో వారి పూర్వీకుల జ్ఞాపకార్థం మొక్కలు పెంచే విధంగా  ప్రజలకు కూడా బాధ్యతను అప్ప చెప్తున్నా మన్నారు. మొక్కలు నాటడం ఒక ఎత్తయితే, దానిని సంరక్షించి కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో నెల రోజుల పాటు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం ద్వారా,  హరిత నగరం గా తీర్చిదిద్దేందుకు ప్లాంటేషన్ మంత్ గా నిర్వహించనున్నామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా ప్రజల ముందుకు తీసుకు వెళుతున్నాం అని అన్నారు. మెగా వ్యాక్సిన్ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రధాన కారణం వాలంటరీ, సచివాలయ వ్యవస్థ తో పాటు అధికారులకు భాగస్వామ్యం కూడా ఎంతైనా ఉందన్నారు. గృహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం కూడా విజయవంతం కావడానికి కారణం అందరి సమిష్టి కృషి  తోనే సాధ్యమైంది అన్నారు. ముఖ్యమంత్రి చేపడుతున్న ప్రజారంజక పాలన  చూసి,ఇతర రాష్ట్రాలలో కూడా అమలు చేస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ మాట్లాడుతూ జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం ద్వారా 108 శాతానికిపైగా మొక్కలు నాటి రాష్ట్రంలోని జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. గృహ నిర్మాణ శంకుస్థాపన విషయంలో కూడా 24 వేలకు పైగా శంకుస్థాపనలు చేసి రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు విషయంలో కూడా 94 శాతానికిపైగా టీకాలు వేసి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాల అమలు లో ప్రథమ స్థానం లో ఉండేవిధంగా అందరి భాగస్వామ్యం తో కలసి పని చేస్తున్నామన్నారు. పరిశుభ్రత, పచ్చదనం, ఆరోగ్యమే లక్ష్యాలుగా పనిచేస్తూ ప్రజలను చైతన్యవంతులన చేస్తూ, అందరి భాగస్వామ్యంతో విజయనగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు కు కృషి చేస్తున్నామన్నారు. నగర మేయర్ శ్రీమతి వెంపడాపు విజయలక్ష్మి, 4వ డివిజన్ కార్పొరేటర్ మారోజు శ్రీనివాసరావు లు మాట్లాడుతూ నగర అభివృద్ధికి రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వీరి సూచనలతో నగర పాలక వర్గం అంతా నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం ఆ ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే కోలగట్ల, జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ చేతుల మీదుగా మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్చార్జిలు యస్.వి.వి. రాజేష్, ముద్దాడ మధు, ముచ్చు శీను, జిల్లా సామాజిక అటవీ విభాగ అధికారి జానకిరామ్, నగర కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, ఎం. ఈ  దిలీప్, డి ఇ అప్పారావు, నాల్గవ డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-02 13:27:37

ఫించన్ల పంపిణీలో రెండో స్థానం

విజయనగరం జిల్లాలో వై ఎస్ ఆర్ ఫించన్ కానుక పథకంలో వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, కళాకారులు తదితర వర్గాల వారికి ఫించను మొత్తాల పంపిణీ 92.38 శాతం పూర్తి అయినట్లు జిల్లా కలెక్టర్ డా ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. జిల్లాలో 3,31,216 మందికి ఫించన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 3,05,964 మందికి వాలంటీర్లు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఒక వైపు మెగా హౌసింగ్ మేళా లో సేవలందిస్తునే మరో వైపు ఫించన్లు పంపిణీ చేయడం ద్వారా వాలంటీర్లు తమ సామర్థ్యాన్ని నిరూపించారని కలెక్టర్ వారిని అభినందించారు. ఫించన్ మొత్తాల పంపిణీ లో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.

Vizianagaram

2021-07-01 16:23:36

సొంతింటి కల వైఎస్సార్సీపీతో సాధ్యం..

నిరుపేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి నెరవేరుస్తున్నారని మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. గురువారం నగరంలోని 5వ జోన్ 54వ వార్డు పరిధిలోని  ఆశవాని పాలెంలో నగర మేయర్ జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనతో కలిసి పేదల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం వైఎస్.జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల్లో భాగంగా జివిఎంసి పరిధిలో ఇంకా 3844 ఇళ్లు కట్టించాల్సి వుందన్నారు. వాటి నిమిత్తం నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉండి, ఇల్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొదటి రోజు జివిఎంసి అన్ని జోన్ లలో  కలిపి 1388 ఇళ్లకు భూమిపూజ చేయడం జరిగిందని, మిగిలినవి ఈ నెల 3, 4 తేదీలలో శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. ఇల్లు నిర్మించుకొనుటకు కావలసిన సామగ్రిని ప్రభుత్వమే సమకూరుస్తుందని, నిర్మాణ సామాగ్రి ఏ ప్రాంతంలో లభిస్తుందో పూర్తి వివరాలు లబ్ది దారులకు తెలిజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యుటీ మేయర్ జియ్యాని శ్రీధర్, పశ్చిమ నియోజక వర్గ సమన్వయ కర్త   డా. మల్లా విజయ ప్రసాద్, వార్డు కార్పొరేటర్ ముర్రు వాణి, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఐదవ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కార్య నిర్వాహక ఇంజినీర్లు రత్నాల రాజు, శ్రీనివాస్ (వాటర్ సప్ప్లై), చిరంజీవి (మెకానికల్), ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ ఏడుకొండలు, ఎఎంఒహెచ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-07-01 15:22:06

సీఎం పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలి..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పర్యటన కోసం అన్ని రకాల ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం సాయంత్రం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉన్న డిపిఆర్సీ భవనంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాయదుర్గంలో పర్యటిస్తారని, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పర్యటన కొనసాగే అవకాశముందన్నారు. సీఎం పర్యటనలో భాగంగా ముందుగా రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ కి ముఖ్యమంత్రి చేరుకుంటారని, అనంతరం 74 ఉడేగోళం గ్రామం వద్ద రైతు భరోసా కేంద్రం భవనాన్ని, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, గ్రామ సచివాలయ భవనాలను ప్రారంభిస్తారన్నారు. తర్వాత రాయదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో ఏర్పాటుచేసిన వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ ను ప్రారంభించి తదనంతరం మలకల్మురు రోడ్డులో ఉన్న విద్యార్థి స్కూల్ వద్ద బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లను ముందస్తుగానే ఈ నెల 3వ తేదీ రాత్రి కల్లా పూర్తి చేయాలన్నారు. అధికారులంతా రాత్రి పగలు పని చేసి ఏర్పాట్లు వేగంగా చేపట్టాలని, ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించి బాధ్యతగా వారికి కేటాయించిన పనులు చేపట్టాలన్నారు.

రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ ని వెంటనే సిద్ధం చేయాలని, హెలిప్యాడ్ వద్ద బారికేడ్లు, అప్రోచ్ రోడ్లు, పార్కింగ్, వెయిటింగ్ ఏరియా తదితర అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆర్అండ్బి ఎస్ఈని ఆదేశించారు. హెలిప్యాడ్ నుంచి రైతు భరోసా కేంద్రం వరకు అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రాయదుర్గం పట్టణం అంతా పరిశుభ్రంగా ఉండాలన్నారు. అన్ని ప్రాంతాలవారీగా పరిశీలన చేసి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ ని ఆదేశించారు. సీఎం పర్యటన కాన్వాయ్ సంబంధించి వాహనాలు సిద్ధంగా ఉంచాలని డిటిసిని, ఎక్కడా విద్యుత్ సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈని ఆదేశించారు. 74 ఉడేగోళంలోని రైతు భరోసా కేంద్రాన్ని వెంటనే పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ జెడిని, అక్కడే నిర్మిస్తున్న వెల్నెస్ సెంటర్ను పూర్తిచేయాలని, ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు సిద్ధంగా ఉంచాలని, కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని డిఎంఅండ్హెచ్ఒకి సూచించారు. సభకు హాజరయ్యే ప్రజలకు భోజనాలు, తాగునీటి సౌకర్యం ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించే చోట్ల రోడ్లన్నీ సిద్ధం చేయాలని, నియమ నిబంధనల ప్రకారం అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. బహిరంగ సభ వద్ద స్టాల్స్ ఏర్పాటు చేపట్టాలని, వ్యవసాయ శాఖ, మత్స్య, ఉద్యాన శాఖ, ఆప్కాబ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఏపీ సీడ్స్, డైయిరి తదితర శాఖలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రహదారులు, పంచాయతీ, మున్సిపల్, ఆరోగ్య, విద్యుత్ శాఖ తదితర అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన అన్ని రకాల వసతుల కల్పనకు సీరియస్ గా రాత్రి పగలు పని చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా రోజుల తర్వాత జిల్లా పర్యటనకు వస్తున్నారని, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా అవసరమైన ఏర్పాట్లన్నీ వేగంగా పూర్తి చేయాలన్నారు. రాయదుర్గం మండలం లోని 74 ఉడేగోళం గ్రామం వద్ద నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రాన్ని వెంటనే పూర్తి చేసి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలన్నారు. ఆర్బికే వద్ద లెవెలింగ్ పనులు పూర్తి చేసి అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్ వర్కర్లకు గ్లౌజులు ఇవ్వాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనని విజయవంతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ గాయత్రి దేవి, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, డిఎంఅండ్హెచ్ఓ కామేశ్వర ప్రసాద్, డిఆర్డిఎ పిడి నర్సింహారెడ్డి, మెప్మా పిడి రమణా రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ వరప్రసాద్, జడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి, హార్టికల్చర్ డిడి సతీష్, డిపిఓ పార్వతి, ఆర్ డి వో లు నిశాంత్ రెడ్డి, గుణ భూషణ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మధుసూదన్, వివిధ శాఖల అధికారులు, తహశీల్దార్ లు, తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-07-01 14:59:54

ఖాళీ స్థలాలను పార్కులుగా మార్చండి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి పరచాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె జివిఎంసి ప్రధాన ఇంజినీరు రామకృష్ణ రాజు, ఎ.డి.హెచ్., పర్యవేక్షక ఇంజినీరులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో తేది.15.08.2021లోపు ప్రజలకు ఉపయోగ పడే విధంగా అన్ని ఖాళీ ప్రదేశాలలో వాకింగ్ ట్రాక్ లు, ట్రీ ప్లాంటేషన్ లు పూర్తీ చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకు రావాలని, అక్టోబర్ నెలలోపు నగరంలో 10 “థీం” పార్కులు అభివృద్ధి పరచాలని, వాటిలో ప్రజలకు ఆహ్లాదంతో పాటు, విజ్ఞానం అందించే విధంగా బటర్ ఫ్లై పార్కు, ట్రాఫిక్ సిగ్నల్ పార్కు, వ్యాయామ పార్కు, హెర్బల్ గార్డెన్ పార్కు, పాల్మ్స్ పార్క్, అరోమా ట్రీ పార్క్, రైన్ బో ట్రీ పార్క్ మొదలగు వివిధ రకాల పార్కులు అభివృద్ధి పరచి ప్రజలకు అందుబాటులోనికి తీసుకు రావాలని ఆదేశించారు. స్మార్ట్ సిటీ నిధులతో తయారవుతున్న నాడు-నేడు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో 42 పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను కొత్తగా నిర్మించి 4 నెలలలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, విచ్చేయు సందర్భంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రారంభోత్సవానికి అందుబాటులోనికి ఉంచాలని తెలిపారు. 

విశాఖ సిటీ

2021-07-01 14:22:18

శ్రీనివాసరావు సేవలు మరువలేనివి..

విశాఖ సెట్విస్ సీఈఓ గా  బి. శ్రీనివాసరావు మరువలేని సేవలు అందించారని  సమాచార శాఖ ఉపసంచాలకులు వి. మణిరామ్ కొనియాడారు.  శ్రీనివాసరావు బదిలీ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీఈఓగా నూతనంగా నియమితులైన పీ.వీ. రమణ ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.  శ్రీనివాసరావు  తమకు అధికారిగా పని చేసిన కాలంలో  అందరితో స్నేహభావంతో పనులు చేయించుకునే వారని సిబ్బంది కొనియాడారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మేనేజరు నుండి పదోన్నతి పొంది ముఖ్య కార్యనిర్వహణాధికారి, విశాఖపట్నం గా బాధ్యతలు స్వీకరించిన   పి.వి.రమణకు కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

విశాఖ సిటీ

2021-07-01 13:43:18

హౌసింగ్ గ్రౌండింగ్ లో మనమే ఫస్ట్..

రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు జిల్లాలో నేటి నుంచి చేప‌ట్టిన మెగా ఇళ్ల నిర్మాణ గ్రౌండింగ్ మేళాలో మొద‌టి రోజైన గురువారం ఇళ్ల నిర్మాణం ప‌నులు ప్రారంభించ‌డంలో రాష్ట్రంలోనే మ‌న జిల్లా టాప్‌గా నిలిచింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ వెల్ల‌డించారు. జిల్లాకు మొద‌టి రోజున 8,918 ఇళ్ల లక్ష్యాన్ని కేటాయించగా ల‌క్ష్యానికి మించి 21,370 ఇళ్ల నిర్మాణాల‌ను ప్రారంభించి 239.63శాతం ఇళ్ల నిర్మాణాల‌తో జిల్లా మొద‌టిస్థానంలో నిలిచింద‌న్నారు.  175.53శాతం ఇళ్ల గ్రౌండింగ్ తో చిత్తూరు ద్వితీయ స్థానంలోనూ, 144.70శాతం ల‌క్ష్య సాద‌న‌తో విశాఖ‌ప‌ట్నం తృతీయ స్థానంలో నిలిచాయి. మెగా మేళా తొలిరోజు కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డంలో కృషిచేసిన ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్లను జిల్లా కలెక్ట‌ర్ అభినందించారు.  

Vizianagaram

2021-07-01 13:41:35

వైఎస్సార్ భీమా నిరుపేదలకు ధీమా..

దురదృష్టవశాత్తూ కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు పెద్ద దిక్కుగా   దేశంలో ఎక్కడ లేని విధంగా పూర్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్ బీమా పథకంను అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.  గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్ విధానంలో  2021–22 ఆర్దిక సంవత్సరంకు వైఎస్సార్ బీమా పథకంను కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ బీమా పథకం కు 2021–22 సంవత్సరానికి గాను రాష్ట్రంలో రూ.1.32 కోట్ల పేద కుటుంబాలకు దాదాపు రూ.750 కోట్ల వ్యయంతో ఉచిత బీమా రక్షణ కల్పిస్తున్నామన్నారు. బీమా పధకం నుంచి  కేంద్రం తప్పుకున్నా పేదలకు ఒక్క రూపాయి భారం పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరిస్తూ సాయం అందిస్తున్నదని తెలిపారు. పేద కుటుంబంలో 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల సంపాదించే వ్యక్తి మరణిస్తే రూ.లక్ష ఆర్ధిక సాయం అందేలా, 18 నుంచి 70 సంవత్సరాల వయస్సుగల సంపాదించే వ్యక్తి ప్రమాదంలో మరణించిన, శాశ్వత అంగవైకల్యం పొందినా  కుటుంబానికి రూ. 5 లక్షల బీమా పరిహారం అందిస్తారని తెలిపారు. 
  
      ఇప్పటి వరకు 6,89, 580 కుటుంబాలలో సర్వే పూర్తి చేసారు. రానున్న రెండు రోజుల్లో మిగతా కుటుంబాలలో సర్వే పూర్తి చేసేందుకు వార్డు సచివాలయాలలోని   వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు,  వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ, వాలంటీర్లు చర్యలు తీసుకుంటున్నారు.  వైఎస్సార్ బీమా 2021–22   సంవత్సరంలో నమోదు అయిన పలువురు లబ్ధిదారులకు పాలసీ పత్రాలు, బీమా కార్డులను జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) శ్రీధర్ రెడ్డి,  శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, కల్పలత, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మెహమ్మద్ ముస్తఫా, నగరపాలక సంస్థ మేయరు కావటి శివనాగ మనోహర్ నాయుడుతో కలిసి అందించారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) శ్రీధర్ రెడ్డి,  శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, కల్పలత, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మెహమ్మద్ ముస్తఫా, నగరపాలక సంస్థ మేయరు కావటి శివనాగ మనోహర్ నాయుడు, మార్కెట్ యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, రాష్ట్ర కృష్ణబలిజ, పూసల సంక్షేమ మరియు అభివృద్ధి కార్పోరేషన్ చైర్పర్సన్ కోలా భవానీ మణికంఠ, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్ పాల్గొన్నారు.  గుంటూరు జిల్లాలో ఉన్న 14,91,412  బియ్యం కార్డు కుటుంబాలకు  వైఎస్సార్ బీమా పధకం అమలు చేయనున్నారు.  

Guntur

2021-07-01 13:37:57

సీఎస్ఆర్ నిధులు ఉపాది చూపాలి..

సిఎస్ఆర్ నిధులు సక్రమంగా వినియోగిస్తే ఎందరికో దారిచూపిస్తాయని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. గురువారం టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో ఈనెల 1వ తేదీన స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ సహకారంతో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని,  వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఆయన గ్రామ సర్పంచ్ మన్నం శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ లిమిటెడ్  కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ లో భాగంగా 9 లక్షల రూపాయల విలువ చేసే 45 కుట్టుమిషన్ లను అందించడం 45 మంది మహిళలకు ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు.స్పందన డైరెక్టర్ వి.శివరామిరెడ్డి ప్రసంగిస్తూ కారుమంచి గ్రామ అభివృద్ధి లో తమ తోడ్పాటు ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు.అనంతరం జరిగిన వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా జరిగిన సభలో వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ కరోనా నేపథ్యంలో దాదాపు 800 మంది డాక్టర్లు మరణించడం బాధాకరమన్నారు.వందలాది వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యసేవలను అందించారన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 16 మెడికల్ కాలేజీలను ప్రారంభించడం,కరోనా నేపథ్యంలో 1.3 లక్షల కోట్ల రూపాయలను నగదు రూపంలో నేరుగా లబ్ధిదారుల అకౌంట్స్ లో వేయడం  అభిలషణీయన్నారు.జులై 1 న జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రాణాలను అర్పించిన వైద్య సిబ్బందికి సంతాపం తెలుపుతూ సభ మౌనం పాటించింది.వ్యాక్సినేషన్ ల ఫలితంగా ప్రపంచంలో మశూచి, కలరా, పోలియో, ప్లేగు లాంటి వ్యాధులను నిర్మూలించగలిగామని నేడు కరోనా నివారణకు వ్యాక్సినేషన్ ను అందరూ వేయించుకోవడమే పరిష్కారమని లక్ష్మణరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మన్నం శ్రీనివాస్,ఉప సర్పంచ్ ముంతా లక్ష్మి, గ్రామ పెద్దలు బత్తుల కృష్ణ, చిట్టేల రామిరెడ్డి,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ డి.ఎన్ వెంకటేశ్వర్లు, సూపర్ వైజర్ వి.ఝాన్సీలక్ష్మి,లేజియా రాణి, హెల్త్ అసిస్టెంట్ సురేష్,వార్డు నెంబర్ లు ప్రసంగించారు.

Tangutur

2021-07-01 13:34:19

పేదల కుటుంబాల్లో సొంతింటి వెలుగులు..

రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగేంత వరకు పేద ప్రజలకు ఎలాంటి భయము, సంక్షేమ పథకాలకు ఆటంకం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్  చెప్పారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  ఆదిమూలపు సురేష్ గురువారం భూమి పూజ చేశారు.  అనంతరం ఆ గ్రామంలోని లేఅవుట్ లో కొత్తగా ఏర్పాటు చేసిన బోరును ఆయన ప్రారంభించారు. పేద కుటుంబాలన్నింటికి జగన్ మోహన్ రెడ్డి పెద్ద కొడుకుగా నిలిచి సంక్షేమ పథకాలను సమర్ధంగా అమలు చేస్తున్నారని మంత్రి సురేష్ తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రెండేళ్లలో 90% హామీలను అమలు చేశారని ఆయన వివరించారు. జవాబుదారీ తనంతో ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. సెంటు భూమి, ఉండటానికి గూడు లేదనే దిగులు ఉండరాదని రాష్ట్ర ప్రభుత్వం  నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహిస్తుందన్నారు.  రాజకీయ పార్టీలు, కుల మతాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని 37 లేఅవుట్లలో 2,800 గృహాలు నిర్మిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గొబ్బూరు గ్రామంలోని జగనన్న కాలనీని రూ.1.50 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. గృహాలు నిర్మించుకోడానికి ప్రతి కుటుంబానికి రూ.1.80 లక్షల నగదును ప్రభుత్వం ఇస్తుందన్నారు. నేటికి స్థలం లేని వారు ఆందోళన చెందరాదని, సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోనే ఇంటి స్థలం కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నంతవరకు గృహ నిర్మాణాలకు ఎలాంటి ఆటంకం లేదని ఆయన భరోసా ఇచ్చారు.

              మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు చేర వేసే పేద ప్రజల పక్షపాతి ప్రభుత్వమని  మంత్రి  సురేష్ అభివర్ణించారు. గ్రామ సచివాలయాలతో ప్రభుత్వ పరిపాలన గ్రామాలలోని ప్రజలకు చేరువయ్యిందన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో పేదల బాధలు, ఇబ్బందులు తెలుసుకున్న జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే నవరత్నాలు పేరుతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. పారదర్శకంగా పరిపాలన సాగిస్తూ దేశ చరిత్రలోనే ఏపీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టారని ఆయన కితాబిచ్చారు. చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మేనమామ బాధ్యత తీసుకున్నారని చెప్పారు. పండుగుల మాదిరిగా సంక్షేమ క్యాలెండర్, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నిబద్ధతగల సీఎంగా చరిత్రకెక్కరని ఆయన వివరించారు. దేవరాజు గట్టు పునరావాస కాలనీలో త్వరలోనే గృహ నిర్మాణాలను ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు.  గొబ్బూరు గ్రామంలో పేదలైన లబ్ధిదారులకు ప్రభుత్వమే గృహాలను నిర్మించి చేస్తుందని ఆయన తెలిపారు.

        నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా 612 లే అవుట్ లో విజయవంతంగా గృహ నిర్మాణాలు ప్రారంభించామని జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ కె.వి.ఎస్.సాయినాథ్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 22 వేల ఇళ్ల నిర్మాణం మొదలయ్యాయన్నారు. మిగిలిన 46 వేల గృహాల నిర్మాణ పనులు ప్రారంభం కోసం ఈ నెల ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో నిర్మించనున్న గృహాలకు రూ.1512 కోట్ల నిధుల విడుదల అయ్యాయన్నారు. జగనన్న కాలనీలలో నీరు, విద్యుత్, రహదారులు, కాల్వలు  మౌలిక సదుపాయాల కల్పనకు రూ.30 వేల కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే సిమెంటు, ఇనుము లబ్ధిదారులకు అందజేస్తున్నామని ఆయన వివరించారు.  కార్యక్రమంలో మార్కాపురం ఆర్డిఓ ఎం వి శేషి రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ రాజేంద్ర, డిఈ శ్రీనివాసరావు, స్థానిక తహసిల్దార్, ఎంపీడీవో, గ్రామ సర్పంచ్ అంగిరేకుల ఆదినారాయణ,  తదితరులు పాల్గొన్నారు.

గొబ్బూరు

2021-07-01 13:29:17

మౌళిక సదుపాయాల కల్పనకు క్రుషి..

మహా విశాఖ నగర పరిధిలో నివాసిత ప్రాంత ప్రజలకు మౌళిక వసతులు కల్పించాలని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె ఐదవ జోన్ 57వ వార్డు పరిధిలోని ఆశవాని పాలెం, శ్యాం నగర్, మర్రిపాలెం తదితర ప్రాంతాలలో జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, డిప్యుటీ మేయర్ జియ్యాని శ్రీధర్, పశ్చిమ నియోజక వర్గ సమన్వయ కర్త డా. మల్లా విజయ ప్రసాద్, వార్డు కార్పొరేటర్ ముర్రు వాణి తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ కాలనీలోని ప్రజలకు త్రాగునీరు, విద్యుత్, పారిశుధ్యం లాంటి మౌళిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆశవాని పాలెం లోని గెడ్డలో పూడిక అధికంగా ఉన్నదని అది నేవల్ అధికారుల ఆధీనంలో ఉన్నందున వారితో సంప్రదించి కాలువలో పూడిక తీయించి, మురుగు సాఫీగా పోయే విధంగా చర్యలు చేపట్టాలని, మర్రిపాలెం లోని కాలువలను శుభ్రం చేయాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. ఆశావాని పాలెం లోని గెడ్డను ఆనుకొని ఉన్న స్థలం ప్రైవేటు వ్యక్తులదా   లేదా జివిఎంసికి సంబంధించినదా, స్థానిక ఎం.ఆర్.ఒ. ఆఫీసు సర్వేయర్ మరియు జివిఎంసి సర్వేయర్తో సంయుక్తంగా సర్వే చేయించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. కోర్టులో పెండింగు లో ఉన్న ఖాళీ స్థలాల కేసుల వివరాలను తెలపాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ ప్రదేశాలలో పొదలు, చెత్త అధికంగా ఉన్నందున స్థలం యొక్క యజమానులతో సంప్రదించి వాటిని తొలగించాలని తెలియజేసి లేని యెడల మన సిబ్బందితో తొలగించి, స్థల యజమానికి జరిమానా విధించాలన్నారు. పశ్చిమ నియోజక వర్గ సమన్వయ కర్త డా. మల్లా విజయ ప్రసాద్, స్థానిక కార్పొరేటర్ ముర్రు వాణి ఆశవాని పాలెం కాలనీలోని సెప్టిక్ ట్యాంకును క్లీనింగ్ చేయించాలని, కాలువలు, రోడ్డులు పాడైనవని తెలియపరచగా, సెప్టిక్ ట్యాంకు ను వెంటనే శుభ్రపరచాలని, కోలనీలో రోడ్లను, కాలువల నిర్మాణానికి, ఎర్రగెడ్డ ప్రాంతంలో  రైటైనింగ్ వాల్ నిర్మాణానికి, శ్యాం నగర్ లో కాలువలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.  ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఐదవ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కార్య నిర్వాహక ఇంజినీర్లు రత్నాల రాజు, శ్రీనివాస్ (వాటర్ సప్ప్లై), చిరంజీవి (మెకానికల్), ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ ఏడుకొండలు, ఎఎంఒహెచ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-07-01 13:23:32

గోదారమ్మకు మంత్రి అవంతి పూజలు..

గండి పోచమ్మ అమ్మవారి దయతో పర్యాటక ప్రాంతాలు, గోదావరి నదీ ఆలయాలు అభివ్రుద్ధి చెందాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం మంత్రి గండి పోచమ్మ వారిని దర్శించుకుని అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ గోదావరి జల హారతి పూజా కార్యక్రమాలు నిర్వహించి పాపికొండలు విహార యాత్ర పున ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న దేవాలయాలను కూడా అభివృద్ధి పరచి భవిష్యత్ తరాలకు అందిస్తామన్నారు. గోదావరి తీరం వెంబడి పర్యాటకుల తాకిడి కి అనుగుణంగా బోటింగ్ పాయింట్లు పెంచామన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఎక్కడ నిర్లక్ష్యానికితావులేకుండా  పలురకాల శిక్షణలో ఇప్పించి ఆయా శిక్షణ పొందిన వారిని ఈ లాంచీల లో నియమించినట్టు చెప్పారు. స్థానిక శాసన సభ్యురాలు ధనలక్ష్మి మాట్లాడుతూ. ప్రతి అంశంలోనూ నిర్లక్ష్యానికి తావులేకుండా విహారయాత్ర కొనసాగేలా పర్యవేక్షణ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిందన్నారు . రాజానగరం ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా మాట్లాడుతూ పర్యాటకం అనగానే తూర్పుగోదావరి జిల్లా అందరి దృష్టిని ఆకర్షిస్తోందని పురుషోత్తపట్నం రామవరపు ఆవ ప్రాంతాన్ని ఏనుగు కొండ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని పర్యాటక మంత్రి ని కోరారు. రాష్ట్ర పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరు చోట్ల పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి పరిచి 6 స్టార్ హోటల్స్ నిర్మించాలని యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. అదేవిధంగా ప్రముఖ దేవాలయాలు కలిగిన ఏడు ప్రాంతాలకు అభివృద్ధి పరచి పర్యాటకంగా ఆదాయాన్ని ఆర్జించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్ రామ్ మాట్లాడుతూ జిపిఎస్ అనుసంధానంతో పర్యాటక రక్షణ వ్యవస్థ బలోపేతం చేయడం జరిగిందని కాకినాడ మచిలీపట్నం పోర్టు ల ద్వారా లైసెన్సులు ఇవ్వడం జరుగుతుందని ఆయ కోర్టుల మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ అనంత బాబు ఐ టి డిఎ వివో ప్రవీణ్ ఆదిత్య సబ్ కలెక్టర్ సింహాచలం పర్యాటక శాఖ సిబ్బంది రమణ మురళి తదితరులు పాల్గొన్నారు.

Rajahmundry

2021-07-01 13:11:44

పర్యాటకుల భద్రతకే ప్రాధాన్యత..

రాష్ట్రంలో పర్యాటకుల భద్రతే ధ్యేయంగా 9 కమాండ్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి పర్యవేక్షణ వ్యవస్థలు బలోపేతం చేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు ముత్తం శెట్టి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన గండి పోచమ్మ ఆలయం వద్ద పాపికొండలు విహారయాత్రలు పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఆదేశాల మేరకు పర్యాటకుల భద్రత రక్షణ కొరకు గండి పోచమ్మ పోచవరం రాజమహేంద్రవరం పశ్చిమగోదావరి జిల్లాలో సింగంపల్లి పేరంటాలపల్లి విశాఖ జిల్లా రుషికొండ గుంటూరు జిల్లా నాగార్జునసాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం కృష్ణాజిల్లా బేరం పార్క్ లవద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ లో జలవనరుల శాఖ పర్యాటక శాఖ పర్యాటక శాఖ సిబ్బంది పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు అందుబాటులో ఉంటారని మీరు లాంచీల రాకపోకలు, పర్యాటకుల రక్షణకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. ప్రస్తుతం పర్యాటకశాఖ కు రెండు లాంచీలు ప్రైవేట్ సంబంధించి నాలుగు లాంచీలు లైసెన్స్ లకొరకు అనుమతులు పొందాయని ఆయన స్పష్టం చేశారు. కంట్రోల్ రూమ్ లో సీసీటీవీ సర్వే లెను అగ్నిమాపక కేంద్రాలు ప్రాథమిక చికిత్స కిట్టు లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ పి ఎ.సిస్టం కంప్యూటర్ సెటప్ సమాచారవ్యవస్థ టికెట్ కౌంటర్ ఉంటాయని పాపికొండలు బోటింగ్ ఆపరేటింగ్ కొరకు నాలుగు చోట్ల కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. లాంచీల లో కెపాసిటీకి తగిన విధంగా పర్యాటకులను ఎకించుకోవాలని సూచించారు. లాంచీల లో లైఫ్ జాకెట్లు అగ్నిమాపక యంత్రాలు ప్రాథమిక చికిత్స కిట్టు శాటిలైట్ ఫోన్ నావిగేషన్ మరియు కమ్యూనికేషన్ పరికరాలు బైనాక్యులర్స్ పిఎ సిస్టం లు అందుబాటులో ఉంటాయన్నారు. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర  ప్రభుత్వం పటిష్టమైన భద్రతా వ్యవస్థ ను అమల్లోకి తెచ్చింది అన్నారు. కరోనా మూలంగా పర్యాటక యాత్రను పునరుద్ధరించడానికి సమయం పట్టిందని 2019 సెప్టెంబర్ 15 న కచులూరు వద్ద జరిగిన ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగడంతో పర్యాటక పరంగా సమూలమైన మార్పులను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని తదనుగుణంగా భద్రతా వ్యవస్థను పటిష్టపరచడం జరిగిందన్నారు. పడవలలో పర్యాటకులు మద్యం సేవించ రాదని పాపికొండలు  ప్రకృతిని ఆస్వాదించాలని ఆయన స్పష్టం చేశారు. గోదావరి తీరం వెంబడి ఉన్న గిరిజనులకు రవాణా వ్యవస్థను పునరుద్ధరించడానికి పర్యాటక పరంగా ఉపాధి పొందుతున్న 200 మంది ఉపాధిని పెం దించడానికి గురువారం పాపికొండలు విహార యాత్ర ప్రారంభించడం జరిగిందన్నారు. పాలవరం ప్రాజెక్టు వద్ద ఇమేజ్ పార్కును రెస్టారెంట్లను అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపట్టామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రులకు జీవనాడి అని నెల రోజుల తర్వాత పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర పర్యాటకులు దృష్టి పోలవరం ఉభయగోదావరి ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలను ఆకర్షించే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ అనంత బాబు ఐ టి డిఎ వివో ప్రవీణ్ ఆదిత్య సబ్ కలెక్టర్ సింహాచలం పర్యాటక శాఖ సిబ్బంది రమణ మురళి తదితరులు పాల్గొన్నారు.

Rajahmundry

2021-07-01 13:09:51

ఉన్నత పదవితో "ఉమాకాంత్" మళ్ళీ రావాలి..

విశాఖ సాక్షి బ్యూరో చీఫ్ గా  గరికిపాటి ఉమాకాంత్ ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించారని లీడర్ పత్రిక సంపాదకులు వివి.రమణమూర్తి కొనియాడారు. విశాఖపట్నం నుండి తిరుపతికి  బదిలీ అయిన సందర్భంగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో గురువారం సాక్షి బ్యూరో చీఫ్ ఉమాకాంత్ కి ఘనంగా సత్కరించారు. వి జె ఎఫ్ పాలకవర్గం ఆయనకు శాలువా కప్పి మెమొంటో అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  రమణమూర్తి పాల్గొని మాట్లాడారు. విశాఖలో అడుగు పెట్టింది మొదలు ప్రజా సమస్యలపై,  పార్టీ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు అనేక వార్తలు వ్రాసి మన్నలను పొందారన్నారు. ప్రజలకు ఇటు పార్టీకి చక్రంలా పనిచేయడం సామాన్య విషయం కాదన్నారు. ఎంతో సున్నితమైన, కల్మషం లేని ఉమాకాంత్ మరింత ఉన్నత పదవిలో మళ్ళీ త్వరలోనే విశాఖ కు రావాలని ఆకాంక్షించారు. వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, అందరితో మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుని వి జి ఎఫ్ కుటుంబ సభ్యుడిగా కలిసి ఐదేళ్ళు గడిచాయన్నారు. అప్పన్న పాదాల చెంత నుండి తిరుపతి వెంకన్న స్వామి ఆశీస్సులతో అక్కడికి బదిలీ కావడం ఆనందంగా ఉందన్నారు. ఆయన రాసిన వార్తలు పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది అని కొనియాడారు. సాక్షి బ్యూరో చీఫ్ ఉమాకాంత్ మాట్లాడుతూ  తన 27ఏళ్ల జర్నలిజంలో ఎక్కువ కాలం పని చేసింది వైజాగ్ లోనే అన్నారు. అనేక జిల్లాల్లో పనిచేసి  ఐదేళ్ల క్రితం వైజాగ్ కు ట్రాన్స్ఫర్ అయిందన్నారు. కానీ ఇక్కడికి  ఇష్టపడి రాలేదని, వైజాగ్ బదిలీ లోనే తన తండ్రి చనిపోయారు అని గుర్తు గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు విశాఖను వదిలి వెళ్లడం చాలా బాధ కలిగిస్తుందన్నారు.  విశాఖ లో అడుగుపెట్టిన మొదటి రోజే యుగంధర్ రెడ్డి, మీడియా లెజెండ్ రమణ మూర్తి ని కలవడం జరిగిందన్నారు. అలాగే వీ జే ఎఫ్ తో కూడా మంచి తత్స సంబంధాలు ఏర్పడ్డాయి అన్నారు. తను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ఉమాకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  బీసీ కమిషన్ సభ్యుడు పక్కి దివాకర్, డాక్టర్ రామ్ కుమార్, వీ జే ఎఫ్ కార్యదర్శి చోడిశెట్టి దుర్గారావు, ఉపాధ్యక్షుడు నాగరాజు పట్నాయక్, జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, ఈరోతి ఈశ్వర్ రావు, ఎమ్మెస్సార్ ప్రసాద్, పైల దివాకర్ , మాధవ్, గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-07-01 12:50:01

అప్పన్నకు రూ. 1,00,001 విరాళం..

 సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారికి విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన గోపి. జగన్మోహన్ రావు లక్ష ఒక్క రూపాయలు (రూ. 1,00,001) విరాళం అందించారు. గురువారం దేవస్థానంలోని పీఆర్వో కార్యాలయ కౌంటర్ లో చెక్ అందించారు. తన భార్య గోపి,రాధ  ప్రధమ వర్దంతి 09-07-2021 జరుగుతోందని ఆరోజు ఆమె జ్ఞాపకార్థం ఈ నెల 9 వ తేదీన అన్నదానం చేయాలని కోరారు. అంతేకాకుండా తమ పెళ్లి రోజైన 20-04-21న కూడా అన్నదానం చేయాలని గోపి.జగన్మోహన్ రావు కోరారు. స్వామివారి దయతో తమ ఇద్దరు కొడుకులుఅమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా సెటిలయ్యారని ఆయన చెప్పారు. అంతకు ముందు స్వామివారిని దర్శించుకొని తీర్ధ ప్రశాదాలతోపాటు, వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-07-01 12:45:13