1 ENS Live Breaking News

భూమి పూజలకు సిద్దం కావాలి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఇంకనూ కట్టవలసిన ఇళ్ల భూమి పూజకు సిద్ధం కావాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన జోనల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె ప్రాజెక్ట్ డైరెక్టర్ (హౌసింగ్), అందరు జోనల్ కమిషనర్లు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, వార్డు ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూలై 3వ తేదీన జివిఎంసి పరిధిలో మిగిలిన 2900ల పేదల ఇళ్లకు భూమిపూజ పూర్తి స్థాయిలో చేయాలని, అనివార్య కారణాల వలన ఎవరైనా లబ్ధిదారులు మిగిలి ఉంటే వారికి 4వ తేదీన శంకుస్థాపనకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు పనులను నిర్లక్ష్యం చేయకుండా పనులు ప్రారంభించి పేదలకు గూడు కట్టించడంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే మనమే ప్రథమ స్థానంలో నిలవాలని  అధికారులను ఆదేశించారు.  

GVMC office

2021-07-02 14:06:20

పెండింగ్ ప్రాజెక్టులు సత్వరమే పూర్తి..

శ్రీకాకుళం జిల్లాలో పెండింగులో గల సాగునీటి ప్రోజెక్టులను వెంటనే పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో  జిల్లా సాగునీటి వనరులపై ఉప ముఖ్యమంత్రి  ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసన సభాపతి తవ్మిునేని సీతారాం లతో కలసి అధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో నిర్మాణంలో గల సాగునీటి ప్రోజెక్టుల పనుల పురోగతిపై అధికారులు  వివరించారు. వంశధార ప్రోజెక్టు కు సంబంధించి అత్యవసరంగా కావలసిన షట్టర్స్, లస్కర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించుటకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు.  87, 88 ప్యాకేజీ పనులను పూర్తి చేసి డిసెంబరు నాటికి ప్రోజెక్టు  పూర్తి చేయాలని తెలపారు. సమావేశానికి ప్రత్యేక అతిధిలుగా హాజరైన ఉప ముఖ్యమంత్రి  ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రోజెక్టులను పూర్తిచేయుటకు అవసరమైన నిధులకు నివేదికలు తయారుచేసి వెంటనే విడుదల చేయాలన్నారు.  రాష్ట్ర శాసన సభాపతి తవ్మిునేని సీతారాం మాట్లాడుతూ వంశధార కాలువలపనులు రెండువైపులా త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు.  జిల్లా కలెక్టరు శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రోజెక్టుల పూర్తిచేయుటకు కృషిచేస్తున్న మంత్రులకు కృతజ్ఞతలు తెలయజేస్తూ ప్రోజెక్టులు పనులు త్వరితగతిన పూర్తిచేయుటకు చర్యలు తీసుకుంటామన్నారు. 

                పాలకొండ శాసనసభ్యులు విశ్వాసరాయి కళావతి మాట్లాఢుతూ తమ నియోజక వర్గంలో గల పెండింగు ప్రోజెక్టులను త్వరగా పూర్తిచేయాలని కోరారు. జంపరకోట రిజర్వాయరు పూర్తిచేయాలని, సి.డబ్య్లు.ఎస్. ప్రోజెక్టు కింద మంచినీటి సరఫరా, చానల్స్ కు ఉపాధిహామీ అనుసంధానం చేయాలని, బామిని మండలానికి లిప్ట్ ఇరిగేషన్ మంజూరు చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు  దువ్వాడ శ్రీనివాసరావు,   శాసనసభ్యులు కంబాల జోగులు, రెడ్డి శాంతి, డి.సి.సి.బి. మాజీ అద్యక్షలు పాలవలస విక్రాంత్,   సాగునీటి పారుదల శాఖ  నార్త్ కోస్టల్ చీఫ్ ఇంజనీరు ఎస్. సుగుణాకరరావు, జిల్లా ఎస్.ఇ. డోల తిరుమలరావు,  డిసిసిబి మాజీ అధ్యక్షులు పాలవలస విక్రాంత్, తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-02 14:03:52

రాష్ట్రంలో కోవిడ్ వైద్యసేవలు భేష్..

రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ రోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్య చికిత్స, మందులు, బెడ్లు, పౌష్టికాహరం అందించడం అభినందనీయమని  శాసన మండలి ప్రోటెం స్పీకర్‌ విఠలపు బాల సుబ్రమణ్యం అన్నారు. శుక్రవారం స్థానిక గుఱ్ఱం జాషువా విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజారోగ్యవేదిక, యూటిఎఫ్ కార్యాలయాన్ని శాసన మండలి ప్రోటెం స్పీకర్‌ విఠలపు బాల సుబ్రమణ్యం సందర్శించారు. ఈ సందర్భంగా శాసన మండలి ప్రోటెం స్పీకర్‌ విఠలపు బాల సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ డి.వై.ఎఫ్‌.ఐ, ఇతర ప్రజాసంఘాల సహాకారంతో గుంటూరులో కరోనా ఐసోలేషన్‌ సెంటర్‌ ను సామాజిక సేవా భావంతో నడిపిన ఘనతను కొనియాడారు. యుటిఎఫ్ సంఘాల నాయకులు ఆహ్వానం మేరకు   గుంటూరు బ్రాడీపేటలోని సిపియం జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్న కరోనా ఐసోలేషన్‌ కేంద్రాన్ని సందర్శించానన్నారు. కరోనా రెండవ దశ వేగంగా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్న నేపధ్యంలో కార్యకర్తలు ప్రాణాలకు తెగించి కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వారి సేవలకు అభినందనలు తెలిపారు. మూడవ దశ కరోనా వస్తుందనే చర్చ జరుగుతున్న నేపధ్యంలో అప్రమత్తంగా వుండాలని, తగిన వైద్య సౌకర్యాలు, డాక్టర్లు, మందులు, పారామెడికల్‌ సిబ్బందిని సిద్ధం చేయాల్సిన అవసముందన్నారు. కరోనా ఐసోలేషన్‌ కేంద్రానికి సహకరించిన దాతలను అభినందించారు.  శాసన మండలి సభ్యులు కె.యస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ కరోనా సోకిన వారిని సొంత బందువులే పట్టించుకోని స్థితిలో ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రాణాలు కాపాడటం గొప్ప విషయమన్నారు. 
ఈ కార్యక్రమంలో సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, యు.టి.ఎఫ్‌ గౌరవ అధ్యక్షులు బాబురెడ్డి, నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌, ప్రజారోగ్యవేదిక జిల్లా కన్వీనర్‌ ఎల్‌.ఎస్‌.భారవి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి. లక్ష్మణరావు, యు.టి.ఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రేమ్‌కుమార్‌, కళాధర్‌, ప్రజాసంఘాల నాయకులు కిరణ్‌, కిన్నెర తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-07-02 14:01:32

తక్కువ ధరకే ఆక్సిజన్ యంత్రాలు..

శ్రీకాకుళం జిల్లాలోని  ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అవసరం వున్నవారు రెడ్ క్రాస్ కార్యాలయంలో సంప్రదించాలని జిల్లా చైర్మన్ చైర్మన్ .పి.జగన్ మోహన్ రావు తెలియజేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ ద్వారా సింగపూర్ రెడ్ క్రాస్ సొసైటీ,  ఉత్తర అమెరికా తెలుగు సంఘం,  అమెరికన్ అసోసియేషన్ అఫ్ ఫిజిషియన్ అఫ్ ఇండియన్ ఆరిజన్ సౌజన్యంతో సమకూర్చిన  ఆక్సిజన్ సరఫరా 21 ఆక్సిజన్ యంత్రాలు వివిధ బాధితులకు సమకూర్చామన్నారు. అత్యవసరం అయినవారు తమను సంప్రదిస్తే అతి తక్కువ ధరకే వాటిని అంస్తామన్నారు. మరిన్ని వివరాలకు కో ఆర్డినేటర్ బి.శ్రీధర్ 9100078581 లో సంప్రదించాలన్నారు.

Srikakulam

2021-07-02 13:58:25

ఇవిఎం గోదాములకు భద్రత కట్టుదిట్టం..

ఇవిఎం ల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని జిల్లా కలెక్టరు వివేక్ యాదవ్  అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య  ఎన్నికల  అధికారి  ఆదేశాల  మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా గుంటూరు ఆర్డీవో కార్యాలయం ఆవరణలోని ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను,   ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామంలో వ్యవసాయ మార్కెట్  గోడౌన్ లో భద్రపరచిన వీవీపాట్స్  లను జిల్లా కలెక్టర్   శుక్రవారం  తనిఖీ చేసారు. రాజకీయపార్టీల ప్రతినిధుల  సమక్షంలో గోడౌన్లకు వేసిన  సీళ్ళు తొలగించి తాళాలు తీశారు. గోడౌన్  లోపల ఉన్న ఇవియం, వివిపాట్స్ బాక్సులకు  వేసిన సీల్డ్ ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్  పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో  అమరావతి– అనంతపురం ఎక్స్ప్రెస్వే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఈవీఎం, వీవీప్యాట్ గోడౌన్లు నోడల్ ఆఫీసర్ వి.శైలజ, గుంటూరు ఆర్డీవో భాస్కరరెడ్డి, గుంటూరు పశ్చిమ మండల తహశీల్దారు మోహనరావు, ఫిరంగిపురం తహశీల్దారు సాంబశివరావు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ సునీల్, బహుజన సమాజ్ పార్టీ సిటి ప్రెసిడెంట్ చిరతనగండ్ల వాసు, సీపీఐ పార్టీ తరుపున కె.ఈశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ తరుపున అడవి ఆంజనేయులు,  ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షులు బాజిత్ బాషా, రేపూడి గ్రామం వ్యవసాయ మార్కెట్  గోడౌన్ లో భద్రపరచిన వివిపాట్స్ బాక్సుల పరిశీలనలో సిపియం నాయకులు సి. వెంకటేశ్వర్లు, టిడిపి నుండి ఎం. నరసింహారావు, బిజేపి నుండి చంద్ర శేఖర్ రావు, వైసిపి పార్టీ నుండి కే. చినపరెడ్డి,  రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-07-02 13:51:27

మాస్కు ధరించడంలో నిర్లక్ష్యం వద్దు..

కరోనా తగ్గుముఖము పడుతున్నప్పటికీ  మాస్క్ ధరించడంలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ రావిరాల  మహేష్ కుమార్ స్పష్టం చేసారు. శుక్రవారం తన ఛాంబర్లో  ఆయన మాట్లాడుతూ మాస్క్ ధరించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అలాగే  ఇటీవల యునిసెఫ్  రూపొందించిన నాలుగు రాకల  మాస్క్  పోస్టర్లను విడుదల చేశారు. వీటిని జిల్లా కేంద్రంలోని కొన్ని ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలకు పంపిణీ  చేసారు. ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ జిల్లాలో కరోనా  తగ్గుముఖం పడుతున్న సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.  లాక్డౌన్ సమయంలో ప్రజలు ఏ విధంగా ప్రవర్తించారో  ఆ తరువాత కూడా అదే  పద్దతులను పాటించాలన్నారు. కోవిడ్ అనుమానితులు పాటించాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే గుంపు ప్రదేశాలలో ఉండరాదని తెలిపారు. సామాజిక దూరం తప్పనిసరి అన్నారు. మాస్క్ ధరించడంలో కొందరు నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నారు. ముక్కు మీద వరకు మాస్క్ ఉండాలన్నారు. ఎన్ 95 మాస్క్ అయితే ఒకటి చాలన్నారు. సర్జికల్ మాస్క్ ధరించేవారు బయట కాటన్ మాస్క్ ధరించవచ్చని స్పష్టం చేశారు. కండరాలు, శక్తి సామర్ధ్యాలను పెంచే ఆహారాన్ని తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలన్నారు. జిల్లాలో తాజాగా 21 మండలాల్లో 95 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.  అత్యధికంగా పార్వతీపురం డివిజన్లో  డెంగబద్ర తోపాటు, విజయనగరం , గజపతినగరం,ఎస్ కోట, బాడంగి తదితర మండలాలలో కరోనా  కేసులు అధికంగా ఉన్నాయన్నారు. కరోనా నిరోధానికి సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు  తెలిపారు.

Vizianagaram

2021-07-02 13:46:46

తిరుమల అడవుల జీవవైవిధ్యాన్ని కాపాడాలి..

తిరుమల అడవుల జీవవైవిధ్యాన్ని కాపాడాలని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల‌లోని వివిధ ప్రాంతాల‌ను ఈవో శుక్ర‌వారం త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ పురాణాల‌లో పేర్కొన్న విధంగా శ్రీ‌వారి సేవ‌కు వినియోగించే ‌మొక్క‌లతో శిలాతోర‌ణం వ‌ద్ద ప‌విత్ర ఉద్యాన‌వ‌నాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భ‌క్తుల‌ వ‌స‌తికి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా  ఇంజినీరింగ్  విభాగం ఆధ్వ‌ర్యంలో చేస్తున్న కాటేజిల ఆధునీక‌ర‌ణ ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేయాల‌న్నారు. ఫుట్‌పాత్‌లు, కాటేజిల మ‌ధ్య ఉన్న కాళీ స్థ‌లంలో ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించేందుకు టిటిడి ఆరోగ్య‌, గార్డెన్‌, అట‌వీ విభాగం అధికారుల‌తో క‌మిటీ ఏర్పాటు చేశామ‌న్నారు. తిరుమ‌ల‌లో కాటేజిల ఆధునీక‌ర‌ణ వ‌ల‌న ఏర్ప‌డిన కాంక్రీట్ వ్యర్థాలు, విరిగిన చెట్టు కొమ్మ‌ల‌ను తొలగించి షేడ్ గ్రాస్ ఏర్పాటు చేయనున్నాట్లు చెప్పారు.  భ‌క్తులు మ‌రింత సుల‌భంగా వ‌స‌తి గ‌దులు పొందేందుకు వీలుగా జూన్ 12వ తేదీ నుండి ఆరు ప్రాంతాల్లో పేర్లు రిజిస్ట్రేష‌న్ కొర‌కు కౌంట‌ర్లు ఏర్పాటు చేశామ‌న్నారు. వ‌స‌తి కొర‌కు అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ చేసుకున్న భ‌క్తులు త‌మ‌కు కేటాయించిన ప్రాంతాల్లోని ఉప విచార‌ణ కార్యాల‌యాల్లో గ‌దులు పొంద‌వ‌చ్చని చెప్పారు. శ్రీ‌వారి కైంక‌ర్యాల‌కు అవ‌స‌ర‌మైన పుష్పాల‌ కోసం  తిరుమల బాట గంగమ్మ ఆల‌యం స‌మీపంలో శ్రీ‌వారి పుష్ప ఉద్యాన‌వ‌నాన్ని ఐదు ఎక‌రాల‌లో టిటిడి ఏర్పాటు చేస్తుందన్నారు. అంతకుముందు ఈవో అధికారుల‌తో క‌లిసి జిఎన్‌సి వ‌ద్ద ప‌చ్చ‌ద‌నం, డ్రైనేజి, రాంభ‌గిచ‌ వ‌ద్ద గదుల ఆధునీక‌ర‌ణ ప‌నులు, సిఆర్‌వో వ‌ద్ద గ‌దుల కొర‌కు పేర్లు న‌మోదు కౌంట‌ర్ల‌ను ప‌రిశీలించారు.  త‌రువాత‌ బాట గంగమ్మ ఆల‌యం స‌మీపంలో శ్రీ‌వారి పుష్ప ఉద్యాన‌వ‌నాన్ని, మార్కెటింగ్ గోడౌన్ వ‌ద్ద బాంబ్ డిస్పోజ‌ల్ టీం యూనిట్‌ను ప‌రిశీలించారు.  అనంత‌రం శిలాతోర‌ణం వ‌ద్ద ప‌విత్ర ఉద్యానవ‌నాల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు. త‌నిఖీల్లో సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, సిఇ  నాగేశ్వ‌ర‌రావు, డిఎఫ్‌వో చంద్ర‌శేఖ‌ర్‌, ఆరోగ్య విభాగం అధికారి డా.ఆర్‌.ఆర్‌.రెడ్డి, గార్డెన్ సూప‌రింటెండెంట్  శ్రీ‌నివాసులు, డెప్యూటీ ఈవోలు విజ‌య‌సార‌ధి,  భాస్క‌ర్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.  

Tirumala

2021-07-02 13:35:28

తోటపల్లి పనులు రాత్రికే పూర్తిచేస్తాం..

విజ‌య‌న‌గ‌రం జిల్లా తోట‌ప‌ల్లి ప్రాజెక్టు కుడి ప్ర‌ధాన కాలువ‌కు 52.77వ కిలోమీట‌రు వ‌ద్ద‌ ప‌డిన గండి పూడ్చివేసే ప‌నులు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయ‌ని ప్రాజెక్టు ప‌ర్య‌వేక్ష‌క ఇంజ‌నీర్ ఎస్‌.సుగుణాక‌ర్ రావు, ఇ.ఇ. రామ‌చంద్ర‌రావు తెలిపారు. శుక్ర‌వారం ఉద‌యం నుంచే పూడ్చివేత‌ పనులు ప్రారంభించామ‌ని, అర్ధ‌రాత్రి క‌ల్లా ప‌నులు పూర్తిచేసి శ‌నివారం నుంచి కుడిప్ర‌ధాన కాలువ‌కు నీటిని విడుద‌ల చేస్తామ‌న్నారు. తోట‌ప‌ల్లి కుడికాలువ గండి పూడ్చివేత ప‌నుల‌పై జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ ప్రాజెక్టు అధికారుల‌తో ఆరా తీశారు.  దీనిపై ఇ.ఇ. రామచంద్రరావు వివ‌ర‌ణ ఇస్తూ కుడిప్ర‌ధాన కాలువ‌కు 52.77 కిలోమీటర్ల వ‌ద్ద తెర్లాంకు స‌మీపంలో జూన్ 30న గండి ప‌డింద‌ని వారు తెలిపారు. ఏదైనా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో కాలువ‌లోని నీటిని బ‌య‌ట‌కు పంపించి ఖాళీ చేసేందుకు అవ‌స‌ర‌మైన స‌ర్ ప్ల‌స్ ఎస్కేప్ క‌ట్ట‌డం తోట‌ప‌ల్లి కుడిప్ర‌ధాన కాలువ‌కు ప్ర‌స్తుతం అందుబాటులో లేనందున కాలువ‌లోని అద‌న‌పు నీటిని బ‌య‌ట‌కు పంపించి ఖాళీ చేయించేందుకు రెండు రోజుల స‌మ‌యం ప‌ట్టింద‌ని వారు పేర్కొన్నారు. కాల్వ‌లోని నీటిని బ‌య‌ట‌కు పంపిన అనంత‌ర ప‌నులు ప్రారంభించామ‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయ ప‌నులు ఏమీ జ‌ర‌గ‌న‌ప్ప‌టికీ ప్రాజెక్టులోని నీరు వృథాగా బ‌య‌ట‌కు వ‌దిలిపెట్ట‌కుండా చెరువులు నింపే ఉద్దేశ్యంతో కుడి ప్ర‌ధాన కాలువ ద్వారా నీటిని విడిచిపెడుతున్న‌ట్టు వారు చెప్పారు. గండిని త్వ‌ర‌గా పూడ్చివేసి కాల్వ‌లో నీటిస‌ర‌ఫ‌రాను వెంట‌నే పున‌రుద్ద‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

Thotapalli

2021-07-02 13:32:23

పూర్వీకుల జ్ఞాపకార్థం మొక్కలు నాటండి..

ఆంధ్రప్రదేశ్ లో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి  జనరంజక పాలన సాగిస్తున్నారని విజయనగరం ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరం లోని 4వ డివిజన్ పూల్ బాగ్ కాలనీ మంగళ వీధి ప్రాంతంలో పాదాల అమ్మ చదును ప్రాంతంలో జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్,  ప్రజా ప్రతినిధులు,ఆ ప్రాంత ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. నగరాన్ని హరిత వనం గా తీర్చిదిద్దేందుకు పటిష్టవంతంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో వారి పూర్వీకుల జ్ఞాపకార్థం మొక్కలు పెంచే విధంగా  ప్రజలకు కూడా బాధ్యతను అప్ప చెప్తున్నా మన్నారు. మొక్కలు నాటడం ఒక ఎత్తయితే, దానిని సంరక్షించి కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో నెల రోజుల పాటు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం ద్వారా,  హరిత నగరం గా తీర్చిదిద్దేందుకు ప్లాంటేషన్ మంత్ గా నిర్వహించనున్నామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా ప్రజల ముందుకు తీసుకు వెళుతున్నాం అని అన్నారు. మెగా వ్యాక్సిన్ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రధాన కారణం వాలంటరీ, సచివాలయ వ్యవస్థ తో పాటు అధికారులకు భాగస్వామ్యం కూడా ఎంతైనా ఉందన్నారు. గృహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం కూడా విజయవంతం కావడానికి కారణం అందరి సమిష్టి కృషి  తోనే సాధ్యమైంది అన్నారు. ముఖ్యమంత్రి చేపడుతున్న ప్రజారంజక పాలన  చూసి,ఇతర రాష్ట్రాలలో కూడా అమలు చేస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ మాట్లాడుతూ జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం ద్వారా 108 శాతానికిపైగా మొక్కలు నాటి రాష్ట్రంలోని జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. గృహ నిర్మాణ శంకుస్థాపన విషయంలో కూడా 24 వేలకు పైగా శంకుస్థాపనలు చేసి రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు విషయంలో కూడా 94 శాతానికిపైగా టీకాలు వేసి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాల అమలు లో ప్రథమ స్థానం లో ఉండేవిధంగా అందరి భాగస్వామ్యం తో కలసి పని చేస్తున్నామన్నారు. పరిశుభ్రత, పచ్చదనం, ఆరోగ్యమే లక్ష్యాలుగా పనిచేస్తూ ప్రజలను చైతన్యవంతులన చేస్తూ, అందరి భాగస్వామ్యంతో విజయనగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు కు కృషి చేస్తున్నామన్నారు. నగర మేయర్ శ్రీమతి వెంపడాపు విజయలక్ష్మి, 4వ డివిజన్ కార్పొరేటర్ మారోజు శ్రీనివాసరావు లు మాట్లాడుతూ నగర అభివృద్ధికి రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వీరి సూచనలతో నగర పాలక వర్గం అంతా నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం ఆ ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే కోలగట్ల, జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ చేతుల మీదుగా మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్చార్జిలు యస్.వి.వి. రాజేష్, ముద్దాడ మధు, ముచ్చు శీను, జిల్లా సామాజిక అటవీ విభాగ అధికారి జానకిరామ్, నగర కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, ఎం. ఈ  దిలీప్, డి ఇ అప్పారావు, నాల్గవ డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-02 13:27:37

ఫించన్ల పంపిణీలో రెండో స్థానం

విజయనగరం జిల్లాలో వై ఎస్ ఆర్ ఫించన్ కానుక పథకంలో వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, కళాకారులు తదితర వర్గాల వారికి ఫించను మొత్తాల పంపిణీ 92.38 శాతం పూర్తి అయినట్లు జిల్లా కలెక్టర్ డా ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. జిల్లాలో 3,31,216 మందికి ఫించన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 3,05,964 మందికి వాలంటీర్లు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఒక వైపు మెగా హౌసింగ్ మేళా లో సేవలందిస్తునే మరో వైపు ఫించన్లు పంపిణీ చేయడం ద్వారా వాలంటీర్లు తమ సామర్థ్యాన్ని నిరూపించారని కలెక్టర్ వారిని అభినందించారు. ఫించన్ మొత్తాల పంపిణీ లో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.

Vizianagaram

2021-07-01 16:23:36

సొంతింటి కల వైఎస్సార్సీపీతో సాధ్యం..

నిరుపేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి నెరవేరుస్తున్నారని మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. గురువారం నగరంలోని 5వ జోన్ 54వ వార్డు పరిధిలోని  ఆశవాని పాలెంలో నగర మేయర్ జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనతో కలిసి పేదల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం వైఎస్.జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల్లో భాగంగా జివిఎంసి పరిధిలో ఇంకా 3844 ఇళ్లు కట్టించాల్సి వుందన్నారు. వాటి నిమిత్తం నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉండి, ఇల్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొదటి రోజు జివిఎంసి అన్ని జోన్ లలో  కలిపి 1388 ఇళ్లకు భూమిపూజ చేయడం జరిగిందని, మిగిలినవి ఈ నెల 3, 4 తేదీలలో శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. ఇల్లు నిర్మించుకొనుటకు కావలసిన సామగ్రిని ప్రభుత్వమే సమకూరుస్తుందని, నిర్మాణ సామాగ్రి ఏ ప్రాంతంలో లభిస్తుందో పూర్తి వివరాలు లబ్ది దారులకు తెలిజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యుటీ మేయర్ జియ్యాని శ్రీధర్, పశ్చిమ నియోజక వర్గ సమన్వయ కర్త   డా. మల్లా విజయ ప్రసాద్, వార్డు కార్పొరేటర్ ముర్రు వాణి, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఐదవ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కార్య నిర్వాహక ఇంజినీర్లు రత్నాల రాజు, శ్రీనివాస్ (వాటర్ సప్ప్లై), చిరంజీవి (మెకానికల్), ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ ఏడుకొండలు, ఎఎంఒహెచ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-07-01 15:22:06

సీఎం పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలి..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పర్యటన కోసం అన్ని రకాల ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం సాయంత్రం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉన్న డిపిఆర్సీ భవనంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాయదుర్గంలో పర్యటిస్తారని, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పర్యటన కొనసాగే అవకాశముందన్నారు. సీఎం పర్యటనలో భాగంగా ముందుగా రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ కి ముఖ్యమంత్రి చేరుకుంటారని, అనంతరం 74 ఉడేగోళం గ్రామం వద్ద రైతు భరోసా కేంద్రం భవనాన్ని, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, గ్రామ సచివాలయ భవనాలను ప్రారంభిస్తారన్నారు. తర్వాత రాయదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో ఏర్పాటుచేసిన వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ ను ప్రారంభించి తదనంతరం మలకల్మురు రోడ్డులో ఉన్న విద్యార్థి స్కూల్ వద్ద బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లను ముందస్తుగానే ఈ నెల 3వ తేదీ రాత్రి కల్లా పూర్తి చేయాలన్నారు. అధికారులంతా రాత్రి పగలు పని చేసి ఏర్పాట్లు వేగంగా చేపట్టాలని, ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించి బాధ్యతగా వారికి కేటాయించిన పనులు చేపట్టాలన్నారు.

రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ ని వెంటనే సిద్ధం చేయాలని, హెలిప్యాడ్ వద్ద బారికేడ్లు, అప్రోచ్ రోడ్లు, పార్కింగ్, వెయిటింగ్ ఏరియా తదితర అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆర్అండ్బి ఎస్ఈని ఆదేశించారు. హెలిప్యాడ్ నుంచి రైతు భరోసా కేంద్రం వరకు అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రాయదుర్గం పట్టణం అంతా పరిశుభ్రంగా ఉండాలన్నారు. అన్ని ప్రాంతాలవారీగా పరిశీలన చేసి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ ని ఆదేశించారు. సీఎం పర్యటన కాన్వాయ్ సంబంధించి వాహనాలు సిద్ధంగా ఉంచాలని డిటిసిని, ఎక్కడా విద్యుత్ సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈని ఆదేశించారు. 74 ఉడేగోళంలోని రైతు భరోసా కేంద్రాన్ని వెంటనే పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ జెడిని, అక్కడే నిర్మిస్తున్న వెల్నెస్ సెంటర్ను పూర్తిచేయాలని, ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు సిద్ధంగా ఉంచాలని, కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని డిఎంఅండ్హెచ్ఒకి సూచించారు. సభకు హాజరయ్యే ప్రజలకు భోజనాలు, తాగునీటి సౌకర్యం ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించే చోట్ల రోడ్లన్నీ సిద్ధం చేయాలని, నియమ నిబంధనల ప్రకారం అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. బహిరంగ సభ వద్ద స్టాల్స్ ఏర్పాటు చేపట్టాలని, వ్యవసాయ శాఖ, మత్స్య, ఉద్యాన శాఖ, ఆప్కాబ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఏపీ సీడ్స్, డైయిరి తదితర శాఖలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రహదారులు, పంచాయతీ, మున్సిపల్, ఆరోగ్య, విద్యుత్ శాఖ తదితర అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన అన్ని రకాల వసతుల కల్పనకు సీరియస్ గా రాత్రి పగలు పని చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా రోజుల తర్వాత జిల్లా పర్యటనకు వస్తున్నారని, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా అవసరమైన ఏర్పాట్లన్నీ వేగంగా పూర్తి చేయాలన్నారు. రాయదుర్గం మండలం లోని 74 ఉడేగోళం గ్రామం వద్ద నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రాన్ని వెంటనే పూర్తి చేసి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలన్నారు. ఆర్బికే వద్ద లెవెలింగ్ పనులు పూర్తి చేసి అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్ వర్కర్లకు గ్లౌజులు ఇవ్వాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనని విజయవంతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ గాయత్రి దేవి, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, డిఎంఅండ్హెచ్ఓ కామేశ్వర ప్రసాద్, డిఆర్డిఎ పిడి నర్సింహారెడ్డి, మెప్మా పిడి రమణా రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ వరప్రసాద్, జడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి, హార్టికల్చర్ డిడి సతీష్, డిపిఓ పార్వతి, ఆర్ డి వో లు నిశాంత్ రెడ్డి, గుణ భూషణ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మధుసూదన్, వివిధ శాఖల అధికారులు, తహశీల్దార్ లు, తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-07-01 14:59:54

ఖాళీ స్థలాలను పార్కులుగా మార్చండి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి పరచాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె జివిఎంసి ప్రధాన ఇంజినీరు రామకృష్ణ రాజు, ఎ.డి.హెచ్., పర్యవేక్షక ఇంజినీరులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో తేది.15.08.2021లోపు ప్రజలకు ఉపయోగ పడే విధంగా అన్ని ఖాళీ ప్రదేశాలలో వాకింగ్ ట్రాక్ లు, ట్రీ ప్లాంటేషన్ లు పూర్తీ చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకు రావాలని, అక్టోబర్ నెలలోపు నగరంలో 10 “థీం” పార్కులు అభివృద్ధి పరచాలని, వాటిలో ప్రజలకు ఆహ్లాదంతో పాటు, విజ్ఞానం అందించే విధంగా బటర్ ఫ్లై పార్కు, ట్రాఫిక్ సిగ్నల్ పార్కు, వ్యాయామ పార్కు, హెర్బల్ గార్డెన్ పార్కు, పాల్మ్స్ పార్క్, అరోమా ట్రీ పార్క్, రైన్ బో ట్రీ పార్క్ మొదలగు వివిధ రకాల పార్కులు అభివృద్ధి పరచి ప్రజలకు అందుబాటులోనికి తీసుకు రావాలని ఆదేశించారు. స్మార్ట్ సిటీ నిధులతో తయారవుతున్న నాడు-నేడు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో 42 పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను కొత్తగా నిర్మించి 4 నెలలలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, విచ్చేయు సందర్భంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రారంభోత్సవానికి అందుబాటులోనికి ఉంచాలని తెలిపారు. 

విశాఖ సిటీ

2021-07-01 14:22:18

శ్రీనివాసరావు సేవలు మరువలేనివి..

విశాఖ సెట్విస్ సీఈఓ గా  బి. శ్రీనివాసరావు మరువలేని సేవలు అందించారని  సమాచార శాఖ ఉపసంచాలకులు వి. మణిరామ్ కొనియాడారు.  శ్రీనివాసరావు బదిలీ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీఈఓగా నూతనంగా నియమితులైన పీ.వీ. రమణ ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.  శ్రీనివాసరావు  తమకు అధికారిగా పని చేసిన కాలంలో  అందరితో స్నేహభావంతో పనులు చేయించుకునే వారని సిబ్బంది కొనియాడారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మేనేజరు నుండి పదోన్నతి పొంది ముఖ్య కార్యనిర్వహణాధికారి, విశాఖపట్నం గా బాధ్యతలు స్వీకరించిన   పి.వి.రమణకు కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

విశాఖ సిటీ

2021-07-01 13:43:18

హౌసింగ్ గ్రౌండింగ్ లో మనమే ఫస్ట్..

రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు జిల్లాలో నేటి నుంచి చేప‌ట్టిన మెగా ఇళ్ల నిర్మాణ గ్రౌండింగ్ మేళాలో మొద‌టి రోజైన గురువారం ఇళ్ల నిర్మాణం ప‌నులు ప్రారంభించ‌డంలో రాష్ట్రంలోనే మ‌న జిల్లా టాప్‌గా నిలిచింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ వెల్ల‌డించారు. జిల్లాకు మొద‌టి రోజున 8,918 ఇళ్ల లక్ష్యాన్ని కేటాయించగా ల‌క్ష్యానికి మించి 21,370 ఇళ్ల నిర్మాణాల‌ను ప్రారంభించి 239.63శాతం ఇళ్ల నిర్మాణాల‌తో జిల్లా మొద‌టిస్థానంలో నిలిచింద‌న్నారు.  175.53శాతం ఇళ్ల గ్రౌండింగ్ తో చిత్తూరు ద్వితీయ స్థానంలోనూ, 144.70శాతం ల‌క్ష్య సాద‌న‌తో విశాఖ‌ప‌ట్నం తృతీయ స్థానంలో నిలిచాయి. మెగా మేళా తొలిరోజు కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డంలో కృషిచేసిన ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్లను జిల్లా కలెక్ట‌ర్ అభినందించారు.  

Vizianagaram

2021-07-01 13:41:35