1 ENS Live Breaking News

పర్యాటకుల భద్రతకే ప్రాధాన్యత..

రాష్ట్రంలో పర్యాటకుల భద్రతే ధ్యేయంగా 9 కమాండ్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి పర్యవేక్షణ వ్యవస్థలు బలోపేతం చేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు ముత్తం శెట్టి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన గండి పోచమ్మ ఆలయం వద్ద పాపికొండలు విహారయాత్రలు పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఆదేశాల మేరకు పర్యాటకుల భద్రత రక్షణ కొరకు గండి పోచమ్మ పోచవరం రాజమహేంద్రవరం పశ్చిమగోదావరి జిల్లాలో సింగంపల్లి పేరంటాలపల్లి విశాఖ జిల్లా రుషికొండ గుంటూరు జిల్లా నాగార్జునసాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం కృష్ణాజిల్లా బేరం పార్క్ లవద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ లో జలవనరుల శాఖ పర్యాటక శాఖ పర్యాటక శాఖ సిబ్బంది పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు అందుబాటులో ఉంటారని మీరు లాంచీల రాకపోకలు, పర్యాటకుల రక్షణకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. ప్రస్తుతం పర్యాటకశాఖ కు రెండు లాంచీలు ప్రైవేట్ సంబంధించి నాలుగు లాంచీలు లైసెన్స్ లకొరకు అనుమతులు పొందాయని ఆయన స్పష్టం చేశారు. కంట్రోల్ రూమ్ లో సీసీటీవీ సర్వే లెను అగ్నిమాపక కేంద్రాలు ప్రాథమిక చికిత్స కిట్టు లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ పి ఎ.సిస్టం కంప్యూటర్ సెటప్ సమాచారవ్యవస్థ టికెట్ కౌంటర్ ఉంటాయని పాపికొండలు బోటింగ్ ఆపరేటింగ్ కొరకు నాలుగు చోట్ల కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. లాంచీల లో కెపాసిటీకి తగిన విధంగా పర్యాటకులను ఎకించుకోవాలని సూచించారు. లాంచీల లో లైఫ్ జాకెట్లు అగ్నిమాపక యంత్రాలు ప్రాథమిక చికిత్స కిట్టు శాటిలైట్ ఫోన్ నావిగేషన్ మరియు కమ్యూనికేషన్ పరికరాలు బైనాక్యులర్స్ పిఎ సిస్టం లు అందుబాటులో ఉంటాయన్నారు. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర  ప్రభుత్వం పటిష్టమైన భద్రతా వ్యవస్థ ను అమల్లోకి తెచ్చింది అన్నారు. కరోనా మూలంగా పర్యాటక యాత్రను పునరుద్ధరించడానికి సమయం పట్టిందని 2019 సెప్టెంబర్ 15 న కచులూరు వద్ద జరిగిన ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగడంతో పర్యాటక పరంగా సమూలమైన మార్పులను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని తదనుగుణంగా భద్రతా వ్యవస్థను పటిష్టపరచడం జరిగిందన్నారు. పడవలలో పర్యాటకులు మద్యం సేవించ రాదని పాపికొండలు  ప్రకృతిని ఆస్వాదించాలని ఆయన స్పష్టం చేశారు. గోదావరి తీరం వెంబడి ఉన్న గిరిజనులకు రవాణా వ్యవస్థను పునరుద్ధరించడానికి పర్యాటక పరంగా ఉపాధి పొందుతున్న 200 మంది ఉపాధిని పెం దించడానికి గురువారం పాపికొండలు విహార యాత్ర ప్రారంభించడం జరిగిందన్నారు. పాలవరం ప్రాజెక్టు వద్ద ఇమేజ్ పార్కును రెస్టారెంట్లను అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపట్టామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రులకు జీవనాడి అని నెల రోజుల తర్వాత పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర పర్యాటకులు దృష్టి పోలవరం ఉభయగోదావరి ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలను ఆకర్షించే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ అనంత బాబు ఐ టి డిఎ వివో ప్రవీణ్ ఆదిత్య సబ్ కలెక్టర్ సింహాచలం పర్యాటక శాఖ సిబ్బంది రమణ మురళి తదితరులు పాల్గొన్నారు.

Rajahmundry

2021-07-01 13:09:51

ఉన్నత పదవితో "ఉమాకాంత్" మళ్ళీ రావాలి..

విశాఖ సాక్షి బ్యూరో చీఫ్ గా  గరికిపాటి ఉమాకాంత్ ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించారని లీడర్ పత్రిక సంపాదకులు వివి.రమణమూర్తి కొనియాడారు. విశాఖపట్నం నుండి తిరుపతికి  బదిలీ అయిన సందర్భంగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో గురువారం సాక్షి బ్యూరో చీఫ్ ఉమాకాంత్ కి ఘనంగా సత్కరించారు. వి జె ఎఫ్ పాలకవర్గం ఆయనకు శాలువా కప్పి మెమొంటో అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  రమణమూర్తి పాల్గొని మాట్లాడారు. విశాఖలో అడుగు పెట్టింది మొదలు ప్రజా సమస్యలపై,  పార్టీ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు అనేక వార్తలు వ్రాసి మన్నలను పొందారన్నారు. ప్రజలకు ఇటు పార్టీకి చక్రంలా పనిచేయడం సామాన్య విషయం కాదన్నారు. ఎంతో సున్నితమైన, కల్మషం లేని ఉమాకాంత్ మరింత ఉన్నత పదవిలో మళ్ళీ త్వరలోనే విశాఖ కు రావాలని ఆకాంక్షించారు. వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, అందరితో మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుని వి జి ఎఫ్ కుటుంబ సభ్యుడిగా కలిసి ఐదేళ్ళు గడిచాయన్నారు. అప్పన్న పాదాల చెంత నుండి తిరుపతి వెంకన్న స్వామి ఆశీస్సులతో అక్కడికి బదిలీ కావడం ఆనందంగా ఉందన్నారు. ఆయన రాసిన వార్తలు పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది అని కొనియాడారు. సాక్షి బ్యూరో చీఫ్ ఉమాకాంత్ మాట్లాడుతూ  తన 27ఏళ్ల జర్నలిజంలో ఎక్కువ కాలం పని చేసింది వైజాగ్ లోనే అన్నారు. అనేక జిల్లాల్లో పనిచేసి  ఐదేళ్ల క్రితం వైజాగ్ కు ట్రాన్స్ఫర్ అయిందన్నారు. కానీ ఇక్కడికి  ఇష్టపడి రాలేదని, వైజాగ్ బదిలీ లోనే తన తండ్రి చనిపోయారు అని గుర్తు గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు విశాఖను వదిలి వెళ్లడం చాలా బాధ కలిగిస్తుందన్నారు.  విశాఖ లో అడుగుపెట్టిన మొదటి రోజే యుగంధర్ రెడ్డి, మీడియా లెజెండ్ రమణ మూర్తి ని కలవడం జరిగిందన్నారు. అలాగే వీ జే ఎఫ్ తో కూడా మంచి తత్స సంబంధాలు ఏర్పడ్డాయి అన్నారు. తను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ఉమాకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  బీసీ కమిషన్ సభ్యుడు పక్కి దివాకర్, డాక్టర్ రామ్ కుమార్, వీ జే ఎఫ్ కార్యదర్శి చోడిశెట్టి దుర్గారావు, ఉపాధ్యక్షుడు నాగరాజు పట్నాయక్, జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, ఈరోతి ఈశ్వర్ రావు, ఎమ్మెస్సార్ ప్రసాద్, పైల దివాకర్ , మాధవ్, గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-07-01 12:50:01

అప్పన్నకు రూ. 1,00,001 విరాళం..

 సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారికి విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన గోపి. జగన్మోహన్ రావు లక్ష ఒక్క రూపాయలు (రూ. 1,00,001) విరాళం అందించారు. గురువారం దేవస్థానంలోని పీఆర్వో కార్యాలయ కౌంటర్ లో చెక్ అందించారు. తన భార్య గోపి,రాధ  ప్రధమ వర్దంతి 09-07-2021 జరుగుతోందని ఆరోజు ఆమె జ్ఞాపకార్థం ఈ నెల 9 వ తేదీన అన్నదానం చేయాలని కోరారు. అంతేకాకుండా తమ పెళ్లి రోజైన 20-04-21న కూడా అన్నదానం చేయాలని గోపి.జగన్మోహన్ రావు కోరారు. స్వామివారి దయతో తమ ఇద్దరు కొడుకులుఅమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా సెటిలయ్యారని ఆయన చెప్పారు. అంతకు ముందు స్వామివారిని దర్శించుకొని తీర్ధ ప్రశాదాలతోపాటు, వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-07-01 12:45:13

ప్రభుత్వ కార్యాలయాలు యథాతధం..

రాష్ట్ర ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాలో కర్ఫ్యూ సమయాలను రాత్రి 6 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకూ సడలించిన నేపద్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు  జూలై 1వ తేదీ నుంచి యథావిధిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే  జిల్లాలోని అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో జూలై 1వ తేదీ నుండి ఉదయం 6-30 గంటల నుండి మద్యాహ్నం 1-00 గంట వరకూ ప్రామాణిక కోవిడ్ నియంత్రణ మార్గదర్శకాలను పాటిస్తూ భక్తులు దైవదర్శనం, ప్రార్థనలు జరుపుకునేందుకు అనుమతి జారీ చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 7వ తేదీ వరకూ రాత్రి 6 గం.ల నుండి ఉదయం 6 గం.ల వరకూ జిల్లాలో కర్ఫ్యూ అమలులో ఉంటుందని, కోవిడ్ నియంత్రణ, అత్యవసర సేవల కొరకు అనుమతించిన వ్యక్తులు మినహా కర్ఫ్యూ సమయంలో ప్రజలెవరు బహిరంగ ప్రదేశాలలో సంచరించరాదని ఆయన తెలిపారు. ఫార్మశీలు, ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ లాబ్ లు, అత్యవసర సేవా సంస్థలు మినహా కర్ఫ్యూ వేళల్లో షాపులు, ఎస్టాబ్లిష్మెంట్లు, ఆఫీసులు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు రాత్రి 6 గంటలకు విధిగా మూసి వేయాలని ఆదేశించారు.  కోవిడ్ నియంత్రణ, ప్రజారోగ్య భద్రత దృష్ట్యా  కర్ఫ్యూ సడలింపు సమయాల్లో కూడా జిల్లా అంతటా 144 సెక్షన్ అమలులో ఉంటుందని, బహిరంగ ప్రదేశాలలో 5 గురు అంతకు మించి వ్యక్తులు గుమిగూడడం నిషేదమని తెలియజేశారు.  ఈ ఉత్తర్వులను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా, డివిజనల్, మండల, గ్రామ స్థాయి అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 

Kakinada

2021-07-01 12:20:49

వైద్యవిద్యార్ధుల రక్తదానం స్పూర్తిదాయకం..

కరోనా విపత్కర సమయంలో రక్తం దానం చేయడానికే జూనియర్ డాక్టర్లు ముందుకి రావడం శుభ పరిణామమని ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రన్సిపాల్ డా.సుధాకర్ పేర్కొన్నారు.  గురువారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఏఎంసీలో జరిగిన కార్యక్రమంలో జూనియర్ వైద్యులు 30 మంది రక్తదానం చేశారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, వైద్య విద్య చదువుకునే సమయంలోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టే వైద్యులకు మంచి భవిష్యత్తు వుంటుందన్నారు. ఒకరు రక్తదానం చేయడం ద్వారా 8 మంది ప్రాణాలు కాపాడవచ్చుననే నినాదంతో వైద్యవిద్యార్ధులు చేస్తున్న ఈ రక్తదాన కార్యక్రమం ఎందరికో స్పూర్తిగా వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఏ.శ్యామలాదేవి, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ రాజ్ గ్రుబక్షాని తదితరులు పాల్గొన్నారు..
 

కెజిహెచ్

2021-07-01 12:09:11

ఇరిగేషన్ శాఖ మంత్రి జిల్లాకు రాక..

రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనీల్ కుమార్ శుక్రవారం జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 08.00గం.లకు విశాఖపట్నంలో బయలుదేరి ఉదయం 11.00గం.లకు వంశధార ఫేజ్ –2 వద్దకు చేరుకుంటారు. అక్కడ ఫేజ్ –2 క్రింద జరుగుతున్న స్టేజ్ –2 పనులను తనిఖీచేస్తారని కలెక్టర్ చెప్పారు. అక్కడ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12.30గం.లకు శ్రీకాకుళంకు చేరుకుంటారు. మధ్యాహ్నం 02.00గం.లకు మాజీ మంత్రివర్యులు మరియు శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు గారిని సందర్శించనున్నారు. సాయంత్రం 04.00గం.లకు నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్న ఆయన సాయంత్రం 05.00గం.లకు ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు. 

Srikakulam

2021-07-01 11:49:49

డెల్టా ప్లస్ కాదు డెల్టా వేరియంట్ మాత్రమే..

విశాఖలోని  జీవీఎంసీ జోన్ 1 మధురవాడ వాంబేకాలనీలో మొదటి డెల్టా ప్లస్ కేసు నమోదయ్యిందనే విషయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది. డెల్టా ప్లస్ అంటూ జరిగే ప్రచారంపై జిల్లా వాసులెవరూ కంగారు పడొద్దని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.సూర్యనారాయణ భరోసా ఇచ్చారు. ఆ కేసు  డెల్టా వెరియంట్ మాత్రమేనని వివరించారు. ఈ మేరకు బుధవారం రాత్రి మీడియాకి ప్రకటన విడుదల చేశారు. సెకెండ్ వేవ్ లో చాల మందికి ఈ విధంగా ఫలితం వచ్చిందని..ఈ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రస్తుతం డెల్టా ప్లస్ కలవరం పెడుతున్న నేఫథ్యంలో పాజిటివ్ వచ్చిన సాంపిల్స్ హైద్రాబాద్ పంపి ఫలితాలు వచ్చాక నిర్థారణ చేస్తున్నామని ఆయన వివరించారు. ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన  ఆమె పరిస్థితి బాగానేఉందన్న డిఎంహెచ్ఓ ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.

Visakhapatnam

2021-06-30 16:33:42

మధురవాడ డెల్టా ప్లస్ మొదటి కేసు..

విశాఖలోని  జీవీఎంసీ జోన్ 1 మధురవాడ వాంబేకాలనీలో మొదటి డెల్టా ప్లస్ కేసు నమోదయ్యింది. 51సంవత్సరాల మహిళకు మధురవాడ పి హెచ్ సి లో సిబ్బంది కరోనా టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. లక్షణాలను గుర్తించి సిబ్బంది మరో సారి శాంపిల్స్ తీసి హైదరాబాద్ ల్యాబ్ పంపారు. అక్కడ పరీక్షచేసిన ల్యాబ్ సిబ్బంది అది డెల్టా ప్లస్ గా రిపోర్టు ఇచ్చారు.  హైదరాబాద్ ల్యాబ్  ల్యాబ్ రిపోర్ట్ డెల్టా ప్లస్ గా రావడంతో... వైద్యసిబ్బంది అప్రమత్తం అయ్యారు. వార్డు వాలంటీర్ల సహాయంతో కేసు నమోదు అయిన ప్రాంతంతోపాటు చుట్టు పక్కల ప్రదేశాలను శానిటేషన్ చేసి బారికేడ్లతో పరిసర ప్రాంతాలను మూసివేసారు. మరింత సమాచారం తెలియాల్సి వుంది..

Madhurawada

2021-06-30 16:19:25

ఎస్వీ గోశాల‌ పనులు వేగం పెంచండి..

తిరుప‌తి శ్రీ వేంక‌టేశ్వ‌ర గోసంర‌క్ష‌ణ‌శాల‌లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను బుధ‌వారం టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి త‌నిఖీ చేశారు.ఈ సంద‌ర్భంగా స్వామివారికి వాడిన పుష్పాలు, అదేవిధంగా పంచ‌గ‌వ్యాల‌తో కూడిన మిశ్ర‌మంతో అగ‌ర‌బ‌త్తిల త‌యారీకి ఏర్పాటు చేస్తున్న షెడ్డు, ప‌శువుల దాణా గోడౌన్‌, దాణా మిక్సింగ్ ప్లాంటుల‌ను ఈవో అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. అనంత‌రం గోశాల‌లోనికి ప్ర‌వేశించేందుకు నూత‌నంగా ఏర్పాటు చేసిన రోడ్డు, ఆర్చిల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు. మొత్తం గోశాలలో ప‌శువుల సంఖ్య‌, వాటికి అందిస్తున్న‌ దాణా వివ‌రాలు గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రినాథ‌రెడ్డి, ఈవోకు వివ‌రించారు. త‌రువాత‌ ఇంజినీరింగ్ అధికారులు గోశాలలో చేప‌ట్టిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ఈవోకు వివ‌రించారు.   ఈవో వెంట సిఇ  నాగేశ్వ‌ర‌రావు, ఎస్ ఇ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఎస్ ఇ ఎల‌క్ట్రిక‌ల్  వెంక‌టేశ్వ‌ర్లు, డిఇ  ర‌వికుమార్‌రెడ్డి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-06-30 16:13:03

స్మార్ట్ సిటీ పనులు చాలావరకూ పూర్తి..

భారత ప్రభుత్వ, గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా స్మార్ట్ సిటీ పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా విశాఖపట్నం నుంచి గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సి.ఇ.ఒ./జివిఎంసి  కమిషనర్ డా. జి.సృజన పాల్గొన్నారు. బుధవారం ఆయన ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాలలోని 100 నగరాలలో అమలవుతున్న స్మార్ట్ సిటీ పనులపై ఆరా తీశారు. స్మార్ట్ సిటీ పనులు యొక్క భౌతిక, ఆర్థిక పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ డా. జి.సృజన జివిఎంసిలో స్మార్ట్ సిటీ పనులు దాదాపు పూర్తయ్యాయని, కొన్ని పనులు కోవిడ్-19 కారణంగా కొద్దిగా ఆలస్యం అయ్యాయని వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ విశాఖపట్నంలో స్మార్ట్ సిటీ పనులపై సంతృప్తి  వ్యక్తపరుస్తూ, మిగిలిన పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఆదేశించి నిధులను ఏమైనా రావలసి ఉంటే వెంటనే విడుదల చేస్తామని తెలియజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ను జాయింట్ డైరెక్టర్ అండ్ మిషన్ డైరెక్టర్, ఎం.ఒ.హెచ్.యు.ఎ., గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరుపున కునాల్ కుమార్ మోడరేట్ చేయగా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరుపున ఎం.ఎ. & యు.డి. ప్రత్యేక కార్యదర్శి రామ్  మనోహర్ పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-06-30 16:10:03

పారిశుధ్య సిబ్బందిని సర్దుబాటు చేయాలి..

పిన్ పాయింట్ వారిగా పారిశుధ్య కార్మికులను సర్దుబాటు చేయాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. బుధవారం ఆయన ఆరవ జోన్ 75వ వార్డు పరిధిలోని పెద్ద గంట్యాడ, నెల్లిముక్కు, పిట్టవాని వీధి తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో సరిపడిన పారిశుధ్య కార్మీకులు ఉన్నారని పిన్ పాయింట్ వారిగా కార్మీకులను సర్దుబాటు చేసి, ఎవ్వరికి నిర్దేశించిన పనిని వారిచే చేయించాలని ఆదేశించారు. కాలువలు, గెడ్డలను పరిశీలించి, గెడ్డలలోని చెత్తను తొలగించి డంపింగు యార్డుకు తరలించాలని ఆదేశించారు. ప్రతి దుకాణం వద్ద 3 రంగుల డస్ట్ బిన్లు ఉండేలా చూడాలన్నారు. దుకాణాదారులు వద్ద ఉన్న ప్లాస్టిక్ బ్యాగులను పరిశీలించి, నిషేదిత ప్లాస్టిక్ ను వాడరాదని, దుకాణాదరుడు నిషేదిత ప్లాస్టిక్ ను వాడినయడల వారి వద్ద నుండి అపరాదరుసుం వసూలు చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ని ని ఆదేశించారు. అనంతరం పెద్ద గంట్యాడ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించి వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం జరుచున్న విధానాన్ని పరిశీలించి అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ వేయించాలని సిబ్బందికి సూచించారు. వ్యాక్సినేషన్ వేయించుకొనుటకు వచ్చినవారు కోవిడ్ నిబంధనలు పాటించి వ్యాక్సినేషన్ వేయించుకోవలసినదిగా   కోరారు. ఈ పర్యటనలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వార్డు సచివాలయ శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.    

విశాఖ సిటీ

2021-06-30 15:31:30

గెడ్డలను ఆక్రమిస్తే కఠిన చర్యలు..

మహావిశాఖ నగర పరిధిలో ఎవరు గెడ్డలను ఆక్రమించినా ఉపేక్షించేది లేదని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి హెచ్చరించారు. బుధవారం జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనతో కలసి ఐదవ జోన్ 54వ వార్డు రెడ్డి కంచరపాలెం, సూర్య నగర్-1&2, 104 ఏరియాలోని ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెడ్డల ఆక్రమణను తొలగించాలని, గెడ్డల ఆక్రమణకు గురికాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తాటి చెట్లపాలెం నుండి ఎన్.ఎ.డి. జంక్షన్ వరకు  గ్రీన్ బెల్ట్ ఏరియాలో చెత్త ఎక్కువగా ఉందని, చెత్త వేసే వారిపై నిఘా ఉంచి వారి నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని శానిటరీ అధికారులను అదేశించారు. సన్ రైజ్ క్లబ్ ఎదురుగా గ్రీన్ బెల్ట్ లో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు మేయర్, కమిషనర్ ను కోరగా పరిశీలిస్తామని బదులిచ్చారు. చాలా చోట్ల బహిరంగ ప్రదేశాలలో చెత్త పోగులుగా కన్పించడంతో వాటిని వెంటనే తొలగించి డంపింగు యార్డుకు తరలించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలని వార్డు శానిటరీ కార్యదర్శులను ఆదేశించారు. 104 ఏరియాలో యుజిడి కనక్షన్ మరియు పైపు లైన్ కొరకు రోడ్లను తవ్వి సరిగా పూడ్చక పోవడంతో రోడ్లు అద్వానంగా ఉన్నాయని, వాటిని సరిచేయాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. నలంద నగర్ లోని గెడ్డ, సూర్య నగర్-2 వద్ద ఉన్న పెద్ద కాలువ, 104 ఏరియాలోని గెడ్డలను పరిశీలించి, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గెడ్డలు, కాలువలలోని వ్యర్ధాలను తొలగించాలని, భూగర్భ డ్రైనేజి మ్యాన్ హోల్ నుండి మురుగునీరు పొంగకుండా చూడాలని శానిటరీ అధికారులను ఆదేశించారు.  ఈ పర్యటనలో స్థానిక కార్పొరేటర్ చల్ల రజని, ఉత్తర నియోజకవర్గ సమన్వయ కర్త కె.కె.రాజు,  ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఐదవ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, పర్యవేక్షక ఇంజినీరు వేణుగోపాలరావు, డిసిపి శిల్ప, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, శ్రీనివాస రావు, ఎఎంఓహెచ్ రాజేష్,  శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.                  

Visakhapatnam

2021-06-30 15:21:24

గెడ్డలను ఆక్రమిస్తే కఠిన చర్యలు..

గెడ్డలను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి హెచ్చరించారు. బుధవారం జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనతో కలసి ఐదవ జోన్ 54వ వార్డు రెడ్డి కంచరపాలెం, సూర్య నగర్-1&2, 104 ఏరియా తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ గెడ్డల ఆక్రమణను తొలగించాలని, గెడ్డల ఆక్రమణకు గురికాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తాటి చెట్లపాలెం నుండి ఎన్.ఎ.డి. జంక్షన్ వరకు  గ్రీన్ బెల్ట్ ఏరియాలో చెత్త ఎక్కువగా ఉందని, చెత్త వేసే వారిపై నిఘా ఉంచి వారి నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని శానిటరీ అధికారులను అదేశించారు. సన్ రైజ్ క్లబ్ ఎదురుగా గ్రీన్ బెల్ట్ లో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు మేయర్, కమిషనర్ ను కోరగా పరిశీలిస్తామని బదులిచ్చారు. చాలా చోట్ల బహిరంగ ప్రదేశాలలో చెత్త పోగులుగా కన్పించడంతో వాటిని వెంటనే తొలగించి డంపింగు యార్డుకు తరలించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలని వార్డు శానిటరీ కార్యదర్శులను ఆదేశించారు. 104 ఏరియాలో యుజిడి కనక్షన్ మరియు పైపు లైన్ కొరకు రోడ్లను తవ్వి సరిగా పూడ్చక పోవడంతో రోడ్లు అద్వానంగా ఉన్నాయని, వాటిని సరిచేయాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. నలంద నగర్ లోని గెడ్డ, సూర్య నగర్-2 వద్ద ఉన్న పెద్ద కాలువ, 104 ఏరియాలోని గెడ్డలను పరిశీలించి, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గెడ్డలు, కాలువలలోని వ్యర్ధాలను తొలగించాలని, భూగర్భ డ్రైనేజి మ్యాన్ హోల్ నుండి మురుగునీరు పొంగకుండా చూడాలని శానిటరీ అధికారులను ఆదేశించారు.  ఈ పర్యటనలో స్థానిక కార్పొరేటర్ చల్ల రజని, ఉత్తర నియోజకవర్గ సమన్వయ కర్త కె.కె.రాజు,  ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఐదవ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, పర్యవేక్షక ఇంజినీరు వేణుగోపాలరావు, డిసిపి శిల్ప, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, శ్రీనివాస రావు, ఎఎంఓహెచ్ రాజేష్,  శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.                       

విశాఖ సిటీ

2021-06-30 15:12:58

జనం మెచ్చన జిల్లా కలెక్టర్ ఆయన..

ఆయ‌న జిల్లాకు ప్ర‌థ‌మ పౌరుడు. జిల్లా యంత్రాంగానికి అధినేత‌. కానీ అత‌ను ఏనాడూ త‌న హోదాను చూపించ‌లేదు. అధికార ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శించ‌లేదు. చెర‌గ‌ని చిరున‌వ్వుతో,  అతి సామాన్యుడిలా ప్ర‌జ‌ల‌తో క‌లిసిపోవ‌డం, అంద‌రినీ అప్యాయంగా ప‌ల‌క‌రించ‌డం ఆయ‌న నైజం. ఆయ‌నే మ‌న జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఐఏఎస్‌... జ‌నం కంటే ముందే చెరువుల్లో, కాలువ‌ల్లో దిగి చెత్తను ఎత్తి, పూడిక‌ల‌ను తొల‌గించి శుభ్రం చేసినా, ప్ర‌తిరోజూ తెల్ల‌వార‌క‌ముందే లేచి, వేలాది మొక్క‌ల‌ను స్వ‌యంగా త‌న చేతుల‌తో నాటి, ప‌ట్ట‌ణాన్ని హ‌రిత‌మ‌యం చేసినా.. అది ఆయ‌న ఒక్క‌రికే చెల్లింది. ఆవేద‌న‌తో త‌మ గోడు వినిపించుకోవ‌డానికి గ్రీవెన్స్‌కు వ‌చ్చేవారికి, క‌డుపునిండా అన్నంపెట్టి పంపించే గొప్ప మ‌న‌సు మ‌న జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ సొంతం. గొప్ప వ్య‌క్తిత్వం మూర్తీభ‌వించిన ఆయ‌న‌,  మ‌న‌సున్న మ‌నిషిగా, జిల్లాలో  ఇప్ప‌టికే పేరు తెచ్చుకున్న మ‌న క‌లెక్ట‌ర్‌...మ‌రోసారి త‌న మంచి మ‌న‌సును ప్ర‌ద‌ర్శించారు. ఎస్‌.కోట మండ‌లం బొడ్డ‌వ‌ర గ్రామంలో లేఅవుట్‌ను త‌నిఖీ చేయ‌డానికి వెళ్లిన‌ప్పుడు, అక్క‌డ దూరంగా నిల్చొని ఏదో చెప్ప‌బోతున్న ఒక గిరిజ‌న వృద్దుడిని గ‌మ‌నించారు. ఒంటిపై బ‌ట్ట‌లు కూడా లేని ఆ వృద్దున్ని ఆప్యాయంగా ద‌గ్గ‌రికి పిలిచారు. ఆయ‌న గోడు విన్నారు. త‌న పాక కాలిపోయింద‌ని, ఇళ్లు కావాల‌ని అత‌ను కోరగా, వెంట‌నే మంజూరు చేయాల‌ని తాశీల్దార్‌ను ఆదేశించారు. ఆ పెద్దాయ‌న‌కు మాస్కు లేక‌పోవ‌డాన్ని చూసి, త‌న బ్యాగులోనుంచి ఒక మాస్కును తెప్పించి, క‌లెక్ట‌ర్‌ స్వ‌యంగా త‌న చేతుల‌తోనే తానే, ఆ వృద్దుడికి మాస్కును  క‌ట్టారు. మాస్కు లేకుండా తిర‌గ‌వ‌ద్ద‌ని, ఆరోగ్యం జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని చెప్పి పంపించారు. క‌లెక్ట‌ర్ గొప్ప మ‌న‌సును స్వ‌యంగా చూసిన అక్క‌డివారంతా అబ్బుప‌డ్డారు.

Vizianagaram

2021-06-30 14:06:48

హౌసింగ్ గ్రౌండింగ్ కి పక్కా ఏర్పట్లు..

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం క్రింద మంజూరు చేసిన గృహాలను ప్రారంభించడానికి క్షేత్ర స్థాయి లో ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి.  అధికారులు, ప్రజా ప్రతినిధులు  గత మూడు రోజులుగా మేళా ఏర్పాట్ల పై నిమగ్నమై ఉన్నారు.  లే అవుట్ల   తయారీ,  ప్లాట్ల  మార్కింగ్,   షామియానా, నీరు, భూమి పూజలకు అవసరమగు గోతులు,  ఇసుక, సిమెంట్, ఇతర పూజా సామాగ్రిని  లే అవుట్ల  వద్ద సిద్ధం చేసారు.   లబ్ది దారులను వారి ప్లాట్ల వద్దకు  తీసుకురావడానికి , వార్డ్, గ్రామ స్థాయి కమిటీలను వేసి వాలంటీర్ల కు బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది.    ప్రజా ప్రతినిధులు ప్రజలతో మమేకమై వారిని ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వచ్చేలా ఏర్పాట్లను గావించారు.  నియోజక వర్గం ఇంచార్జ్ లు, మండల ప్రత్యేకాధికారుల ఆధ్వర్యం లో లబ్ది దారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేరుగా వారి ప్లాట్ వద్దకే వెళ్లి పూజ చేసుకొని,  నిర్మాణాలను  చేపట్టేలా  చేసారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారి కోసం రవాణా ఏర్పాట్లను గావిస్తున్నారు.  జిల్లాలో మొదటి విడత లో  928 లే అవుట్లలో 98 వేల 286 ఇళ్ళను  మంజూరు చేయడం జరిగింది. కోర్ట్ కేసు లు, ఇతర కారణాలతో  కొన్ని స్థలాలు పెండింగ్  లో ఉన్నప్పటికీ 75 వేల మందికి ప్రస్తుతం గృహ నిర్మాణాలను ప్రారంభించాలని లక్ష్యంగా చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం జూలై 1,3,4 తేదీలను మేళా కోసం ప్రకటించినప్పటికీ మొత్తం ప్రారంభాలన్ని 1 వ తేదీనే పూర్తి అయ్యేలా కలెక్టర్  ప్రత్యెక వ్యూహ రచన చేసారు.  1 న అవకాశం లేక  మిగిలిపోయిన వారు  3,4 తేదీలలో ప్రారంభించుకునేలా ఏర్పాట్లు చేసారు.  జిల్లాలో 75 వేల గృహాలకు ఈ మూడు  రోజుల్లో ప్రారంభించాలని లక్ష్యంగా చేసారు.  గృహం మంజూరైనప్పటికి రిజిస్ట్రేషన్, జియో  టాగింగ్, మాపింగ్ జరగని వారికీ కూడా ఈ మేళా లో ప్రారంభించుకునే అవకాశాన్ని కల్పిస్తూ  మంజురైన అన్నిటిని ప్రారంభించాలని  కలెక్టర్ లక్ష్యంగా నిర్ణయించారు.  

నియోజక వర్గాల  పర్యవేక్షణకు ఐ.ఏ.ఎస్ అధికారులు..
జిల్లాకు ప్రత్యెక పర్యవేక్షణాధికారిగా సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి  సాల్మన్ ఆరోఖ్య రాజ్ ను  ప్రభుత్వం నియమించగా, జిల్లా నుండి జే.సి (రెవిన్యూ) గజపతి నగరం,  బొబ్బిలి  నియోజక వర్గాలకు, జే.సి అభివృద్ధి డా. మహేష్ కుమార్ ను నెల్లిమర్ల, చీపురుపల్లి, జే.సి ఆసరా జే. వెంకట రావు కు సాలూరు నియోజక వర్గానికి ఇంచార్జ్ లుగా నియమించారు. జే.సి హౌసింగ్ మయూర్ అశోక్ ను విజయనగరం , ఎస్.కోట  నియోజకవర్గాలకు కేటాయించగా , ఐ టి డి ఎ ప్రోజ్ర్ట్ అధికారి కుర్మనాద్ ను పార్వతి పురం, కురుపాం కు నియమించారు.  వీరితో పాటు  ప్రతి నియోజక వర్గానికి ఒక సీనియర్ జిల్లా అధికారిని, మండల ప్రత్యేకాధి కారులను   నియమించారు. 

పించన్ల పంపిణీ మధ్యాహ్నం 2 గంటల కు మార్పు..
గృహ నిర్మాణాల  మేళా కు  లబ్దిదారులు, వాలంటీర్లు హాజరవుతున్న దృష్ట్యా  ఉదయాన్నే పంపిణీ చేయవలసిన పించన్ల పంపిణీ  మధ్యాహ్నం 2 గంటల తర్వాత  పంపిణీ  చేయడం జరుగుతుందని  సంయుక్త కలెక్టర్ డా. మహేష్ కుమార్  తెలిపారు.  గృహ మేళా పూర్తి అయిన వెంటనే వాలంటీర్లంత పించన్ల పంపిణీ కి హాజరు కావాలని  ఆదేశించారు.  

Vizianagaram

2021-06-30 13:53:22