1 ENS Live Breaking News

సమాజంలో మీడియా పాత్ర కీలకం..

సమాజంలో  ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే మీడియా సమాజంలో కీలక పాత్రను పోషిస్తుందని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో సామాజిక కార్యకర్త  సూర శ్రీనివాసరావు నిర్వహించిన జర్నలిస్టు యోధులకు చేయూత కార్యక్రమం జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో జరిగిన మంచిని అభినందిస్తూ, చెడును విమర్శించేది మీడియా మాత్రమేనని అన్నారు. సమాజంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని, అటువంటి మీడియాకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం శుభదాయకమని అన్నారు. గతంలో  పత్రికా రంగంలో పనిచేసిన దాత సూర శ్రీనివాసరావు జర్నలిస్టుల సమస్యలను గుర్తించి వారికి సేవలు అందించడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో కోవిడ్ ఫస్ట్ వేవ్ మరియు సెకెండ్ వేవ్ పట్ల  ప్రతీ పల్లె, వీధి, పట్టణ ప్రజల్లో చైతన్యం వచ్చేందుకు ముఖ్యకారణం మీడియానే అని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. మీడియా ద్వారా ప్రజలకు ఎప్పటికపుడు సమాచారాన్ని చేరవేస్తూ, వారిని అప్రమత్తం చేసేంది కూడా మీడియానే అని స్పష్టం చేసారు.

సూర శ్రీనివాసరావు పత్రికా రంగంతో ప్రారంభించి , నేడు పారిశ్రామిక వేత్తగా ఎదిగారన్నారు. సూర శ్రీను గతంలో చేసిన రంగంలో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని మీడియాకు సేవలు అందించడం స్పూర్తిదాయకమని అన్నారు. ఆయన సేవలు చిరస్థాయిగా ఉంటాయని, ఇటువంటి కార్యక్రమాల వలన పుణ్యం, సంతృప్తి లభిస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఇస్తున్నవాళ్లు ఇస్తుండాలి.. తీసుకుంటున్న వాళ్లు తీసుకుంటుండాలి... తీసుకుంటున్న వాళ్లు ఇచ్చే స్ధాయికి ఎదగాలనే మరాఠీ సామెతను కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తుచేసారు. సూర శ్రీనివాసరావు సేవలను అభినందించిన ఆయన జిల్లా యంత్రాంగం తరపున సహాయసహకారాలు అందించేందుకు సిద్దమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి యల్.రమేష్ మాట్లాడుతూ జిల్లాలో చాలా మంది పాత్రికేయులు జీతం కోసం కాకుండా, ఆ వృత్తిపై ఉండే మక్కువతో పనిచేస్తున్నారని కలెక్టర్ కు వివరించారు. కోవిడ్ సమయంలో జీతభత్యాలకు ఆశించకుండా సామాజిక సేవాధృక్పధంతో మీడియా ప్రతినిధులు పనిచేసారని, కోవిడ్ ఫస్ట్ వేవ్ మరియు సెకెండ్ వేవ్ సమయంలో తమ ప్రాణాలకు లెక్కచేయకుండా ఫ్రంట్ లైన్ వారియర్లుగా మీడియా విధులు నిర్వహించిందని కితాబు ఇచ్చారు. తుఫాను, వడదెబ్బల సమయంలో మీడియా ముందుండి ప్రజలను చైత్యన్యపరిచిన సంగతిని ఆయన గుర్తుచేసారు. సుమారు లక్ష మంది వరకు వలస కార్మికులు జిల్లాకు చేరుకున్నారని, వారందరికి అవసరమైన భోజనం, ఇతరత్రా ఏర్పాటు విషయంలో మీడియా గణనీయమైన పాత్రను పోషించిందని అన్నారు. సూర శ్రీనివాసరావు ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి పారిశ్రామిక వేత్తగా ఎదిగినప్పటికీ ప్రజలకు మంచి చేయాలనే సదుద్దేశ్యంతో గత 45 రోజులుగా ఆసుపత్రులలోని కోవిడ్ రోగులకు, రిక్షా, ఆటో కార్మికులకు, వలస కార్మికులకు, బిచ్చగాళ్లకు భోజన వసతితో పాటు ఇతరత్రా ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. సూర శ్రీను భవిష్యత్తులో మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సూర శ్రీనివాసరావు దంపతులకు కలెక్టర్ దుశ్శాలువ, జ్ఞాపిక, పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసకుమార్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ఫిజికల్ డైరక్టర్ మోహనరావు, జర్నలిస్టుల ఐక్యవేదిక నిర్వాహకులు కొంక్యాణ వేణుగోపాలరావు, శాసపు జోగినాయుడు, ప్రతినిధులు సూర చంద్రశేఖరరావు, డోల అప్పన్న, యం.ఎ.వి.సత్యనారాయణ,  సీనియర్ పాత్రికేయులు సిహెచ్.లక్ష్మణరావు,  స్టార్ వాకర్స్ మహిళా క్లబ్ అధ్యక్షురాలు అంధవరపు జ్యోతిర్మయి, రోటరీ కైలాసభూమి నిర్వాహకులు బి.శ్రీనివాసరావు, స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్.సూర్యారావు, ఎ.వి.రమణ, మాజీ గవర్నర్లు జి.ఇందిరాప్రసాద్, కె.వి.ఆర్.మూర్తి, డాడీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-25 16:30:57

పారిశుధ్యం లోపిస్తే చర్యలు తప్పవు..

మహావిశాఖ నగర పరిధిలో పారిశుద్ధ్యం లోపిస్తే సహించేది లేదని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన శానిటరి అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఆమె నాలుగవ జోన్ 33వ వార్డు పరిధిలోని వివేకానంద కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా మన విశాఖను ఒక సుందర నగరంగా చూడాలని, అందుకు అందరూ సమిష్టిగా పని చేయాలని అన్నారు. డోర్ టు డోర్ చెత్త సేకరణ ప్రక్రియ ఉన్నచోట డంపర్ బిన్స్, లిట్టర్ బిన్స్ ను తొలగించి కొన్ని రోజులు బిన్స్ తొలగించిన ప్రాంతాలను పరిశీలించాలని, ఎవరైనా చెత్త ఆ ప్రాంతంలో వేసినచో వారి వద్ద నుండి అపరాధ రుసుం వసూలు చేయాలన్నారు. తడి-పొడి చెత్త పై మహిళలకు అవగాహన పెంచి, తడి చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేసే విధానాన్ని వారికి తెలియపరచాలన్నారు. అనంతరం, అల్లిపురంలోని పలు ప్రాంతాలలో పర్యటించి బహిరంగ ప్రదేశాలలో చెత్త ఉండటం గమనించి, ఆ వార్డు శానిటరి ఇన్స్పెక్టర్, సచివాలయ శానిటరీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రిని ఆదేశించారు. 
ఆంధ్ర యూనివర్సిటీ సర్క్యూట్ హౌస్, పోర్ట్ గెస్ట్ హౌస్, కిర్లంపూడి లే అవుట్, సాగర్ నగర్ తదితర ప్రాంతాలలో కుక్కలు, పందులను వెంటనే తొలగించాలని సిటీ వెటర్నరి డాక్టర్ కిషోర్ ను ఆదేశించారు. పోర్ట్ గెస్ట్ హౌస్ కు వెళ్లే రహదారిలో పండ్లు, కాయగూరలు అమ్మే వ్యాపారులు, ఫుట్ పాత్ ను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారని వారిని అక్కడ నుండి తొలగించాలని అధికారులను ఆదేశించారు.
 ఈ పర్యటనలో ప్రధాన  వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, నాలుగవ జోనల్ కమిషనర్ బి.వి.రమణ, సిటీ వెటర్నరి డాక్టర్ కిషోర్ ,పర్యవేక్షక ఇంజినీర్లు చిరంజీవి, గణేష్ కుమార్, ఎ.ఇ. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-06-25 16:27:00

మహిళా సాధికారతే జగనన్న లక్ష్యం..

మహిళా సాధికారతే జగనన్న లక్ష్యమని మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. శుక్రవారం 4వ జోన్ 29వ వార్డు సచివాలయంలో, ఆ వార్డ్ కార్పొరేటర్ ఊరుకూటి నారాయణరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ చేయూత, జగనన్నతోడు పథకంలో భాగంగా రూ.13.10లక్షలు మహిళలకు మేయర్ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, అప్పటి సుదీర్ఘ పాదయాత్రలో స్వయంగా  చూసి వారి సమస్యలను తెలుసుకున్నారు. మహిళలు స్వయం శక్తితో ఎదగాలని, వారి అభివృద్ధి కొరకు చిరు వ్యాపారాలు   చేయుటకు,  ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఉద్దేశ్యంతో వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు లాంటి ఎన్నో పథకాలను పెట్టి, వారిని ఆదుకున్నారని అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని మేయర్ తెలిపారు.

విశాఖ సిటీ

2021-06-25 16:24:04

కోవిడ్19 పై నేటికీ జాగ్రత్తగా ఉండాలి..

కరోనా19 వ్యాప్తిని పూర్తిగా నిలువరించేందుకు జిల్లా ప్రజలు కోవిడ్ నిబంధనలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం కరోనా నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నుంచి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలందరూ ఖచ్చితంగా  కోవిడ్ నిబంధనలు పాటించవలసినదిగా విజ్ఞప్తి చేశారు. కర్ఫ్యూ సమయములో సాయంత్రం 5.45 గంటల లోపు అన్ని దుకాణములు మూసి వేయాలన్నారు. అత్యవసర సేవల కోసం మినహా ప్రజలెవరూ బయటకు తిరగరాదన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలన్నారు. జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ఎవరు అలసత్వం చూపించ రాదని, ప్రతి ఒక్కరూ కోవిడ్ జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలు కూడా సాయంత్రం 5.45 గంటల తర్వాత ఇళ్లకు పరిమితమవ్వాలని సూచించారు. పోలీసులు ఆరు గంటల తర్వాత కఠినంగా కర్ఫ్యూ నిబంధనలు అమలు పరచాలని ఆదేశించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్లో డి సి హెచ్ ఎస్ రమేష్ నాథ్,  అడిషనల్ డిఎంహెచ్ఓ  రామ సుబ్బా రావు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ నీరజ పాల్గొన్నారు.

Anantapur

2021-06-25 16:16:08

జిల్లాల్లో ఇసుక కొరత రాకుండా చూడాలి..

వర్షా కాలంలో ఇసుక కొరత లేకుండా ఎక్కువ ఇసుక నిల్వలను సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్ లతో ఇసుక సరఫరా, నిల్వలపై రాష్ట్ర పంచాయతీరాజ్, ఇండస్ట్రీస్ మరియు కామర్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ వర్షా కాలం వచ్చే ముందే ఎక్కువ ఇసుకను జగనన్న ఇండ్ల స్థలాల లేఔట్ లకు సరఫరా చేయాలన్నారు. అనంతపురం జిల్లాలో ఇసుక సరఫరా కి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. ఇసుక రీచ్ నుండి వెంటనే వినియోగదారునికి ఇసుక సరఫరా కావాలన్నారు. ఇసుక రీచ్ లలో రోజు వారి ఇసుక ప్రొడక్షన్ మరియు డిపో ల దగ్గర ఉంచిన ఇసుక వివరములను జిల్లా యంత్రాంగంకు ఏజెన్సీ వారు అందజేయాలన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, అనంతపురం, కదిరి, రాయదుర్గం మరియు గుంతకల్ యందు కొత్త ఇసుక నిల్వ డిపో లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో కొత్తగా రొద్దం, పరిగి, రాయదుర్గం, యల్లనూర్ మరియు తాడిపత్రి మండలాలలో 10 ఇసుక రీచ్ లకు పర్యావరణ శాఖ నుండి  మాన్యువల్ త్రవ్వకాల నిమిత్తం ఈసి ఆర్డర్స్ వచ్చాయని, యంత్రంతో పని చేసేందుకు పర్యావరణ శాఖ వారికి ఈసి ఆర్డర్స్ మార్పు కోసం అనుమతి నిమిత్తం దరఖాస్తు చేశామని, పర్యావరణ శాఖ నుండి అనుమతులు రాగానే ఆ ప్రాంతంలలో ఏజెన్సీ వారికి ఇసుక త్రవ్వకాలకు అప్పజెప్పడం చేస్తామన్నారు. ఏజెన్సీ వారిని ఆన్లైన్ వ్యవస్థ ద్వారా పర్మిట్ లను వినియోగదారునికి జారీ చేయాలన్నారు. తృతీయ శ్రేణి వాగుల ద్వారా గవర్నమెంట్ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేసే పనులకు ఇసుక అనుమతి ఇవ్వవాల్సిందగా కోరారు. ఈ విషయమై ప్రిన్సిపల్  సెక్రెటరీ తృతీయ శ్రేణి వాగులలో ఇసుక అనుమతికి సంబందించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రజల అవసరాల నిమిత్తం అనంతపురం, కదిరి, రాయదుర్గం మరియు గుంతకల్ ప్రాంతాలలో ఇసుక నిల్వ డిపో లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో  అనంతపురం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నిశాంతి, మైన్స్ డిడి రమణారావు పలువురు పలువురు మైన్స్ అధికారులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-25 16:13:27

545సేవలపై అవగాహన కల్పించండి..

గ్రామ వార్డు సచివాలయాలలో కొన్ని రకాల సేవలు మాత్రమే ప్రజలు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారని, మొత్తం సచివాలయాలు అందించే 545 రకాల సేవల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు ఎప్పటికప్పుడు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కేవలం ఉద్యోగంలో చేరే ముందు ఒక్కసారి శిక్షణ ఇస్తే జీవిత కాలం అదే శిక్షణ సరిపోతుంది అనే భావన వీడాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా సచివాలయ ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలన్నారు. సచివాలయాలలో సేవలన్నీ ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు అధికారులు రోజువారీ పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఉన్నతాధికారులు ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంతంలోని సచివాలయాన్ని తనిఖీ చేసి రావడం ఒక అలవాటుగా చేసుకోవాలన్నారు. అధికారుల నిరంతర పర్యవేక్షణతోనే ప్రజలకు మెరుగైన సేవలు, నిర్ణీత సమయంలో దక్కుతాయన్నారు. 

జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోని సచివాలయాలలోనూ త్వరితగతిన ఆధార్ సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కేవైసీ కోసం ఉపయోగించే పరికరాల కొరత తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన వాలంటీర్ల నియామకాలు పునః ప్రారంభించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా. సిరి, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, మునిసిపల్ ఆర్డీ నాగరాజు, అనంత మునిసిపల్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, జెడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి , డిప్యూటీ సీఈవో శ్రీనివాసులు, డీపీవో పార్వతమ్మ, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Anantapur

2021-06-25 16:10:02

పారిశ్రామిక వేత్తలు ముందుకి రావాలి..

శ్రీకాకుళం జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకురావాలని, ప్రభుత్వం తరపున వారికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉందని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం శుక్రవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 290 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు దరఖాస్తులు చేసుకున్నారని, వాటిలో 264 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని, 14 దరఖాస్తులను త్రిప్పిపంపడం జరిగిందని,  12 దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగులో ఉన్నాయన్నారు. వచ్చిన దరఖాస్తులపై ఎప్పటికపుడు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పరిశ్రమలు నెలకొల్పేందుకు జిల్లా అన్నివిధాల అనుకూలంగా ఉంటుందని కలెక్టర్ చెప్పారు. నాగావళి నది నీటిని పరిశ్రమలకు వినియోగించుకునేందుకు సాధ్యసాధ్యాలపై సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ బి.గోపాలకృష్ణను కోరారు. అనంతరం పెండింగులో ఉన్న విషయాలపై చర్చించి జిల్లా కలెక్టర్ ఆమోదించడం జరిగింది.

జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ బి.గోపాలకృష్ణ మాట్లాడుతూ  జిల్లాలో 290 దరఖాస్తులు తమకు వచ్చాయని, వచ్చిన వాటిని సింగిల్ విండో విధానంలో ఆమోదించడం జరిగిందని చెప్పారు. వచ్చిన దరఖాస్తులపై వారం నుండి 21 రోజుల్లోగా అనుమతిని ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కు వివరించారు.  

ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు, జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ బి.గోపాలకృష్ణ, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జి.వి.బి.డి.హరిప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, జిల్లా అగ్నిమాపకదళ అధికారి సిహెచ్. కృపావరం, పి.వి.యస్.రామ్మోహన్, ఇతర అధికారులు, పారిశ్రామిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు.  

Srikakulam

2021-06-25 16:06:34

1 నుంచి మెగా హౌసింగ్‌ గ్రౌండింగ్‌ మేళా..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పేదలందరికి ఇళ్ల నిర్మాణంలో భాగంగా జులై 1వ తేదీ నుండి మెగా హౌసింగ్‌ గ్రౌండింగ్‌ మేళాను జిల్లాలో నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. గృహ నిర్మాణాలకు ఆయా గ్రామాల వారీగా లబ్ధిదారులను సమాయత్తం చేయడంతో పాటు, ఇందుకు అవసరమైన ఇసుక కూపన్లు, సిమెంటు సరఫరా తదితరాలపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో  మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళాపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 90వేల గృహ నిర్మాణాలకు గాను 80వేల గృహాలకు గ్రౌండింగ్ జరగాల్సి ఉందన్నారు. ఇవన్నీ జూలై 1వ తేదీ నుండి గ్రౌండింగ్ ప్రారంభం కావాలన్నారు. జులై 1,2,3,4 తేదీల్లో జిల్లాలోని అన్ని గృహాలు గ్రౌండింగ్ కావాలని, ప్రతీ రోజు సుమారు 16వేలకు పైచిలుకు గ్రౌండింగ్ కావాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రౌండింగ్ అయిన వెంటనే గృహ నిర్మాణాలకు సంబందించిన ఇసుక, సిమెంట్, ఇతర సామాగ్రిని  ఆయా హౌసింగ్ ఏ.ఈలు సిద్ధం చేసుకోవాలని, గ్రౌండింగ్ ఆయిన తక్షణమే గృహ నిర్మాణ పనులు ప్రారంభం కావాలని  కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని గృహాలు మహిళల పేరునే ఉన్నందున స్వయం సహాయక బృందాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా గ్రౌండింగ్ అయ్యేందుకు అవసరమైన నిధులను సమకూర్చాలని డి.ఆర్.డి.ఏ పథక సంచాలకులు బి.శాంతిశ్రీని కలెక్టర్ ఆదేశించారు. దూర ప్రాంతాల్లో ఉండే లే అవుట్లకు లబ్ధిదారులు చేరుకునేందుకు వీలుగా మండల అధికారులు, మునిసిపల్ కమీషనర్లు రవాణా సదుపాయాలతో పాటు లేఅవుట్ల వద్ద టెంటు మరియు ఇతరత్రా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. గృహాలు గ్రౌండింగ్ విషయమై లబ్దిదారులకు ముందుగానే తెలియపరచాలని, ఇందుకు రానున్న 4 రోజుల్లో జిల్లా, మండల, గ్రామ స్థాయి సమావేశాలను ఏర్పాటుచేసి లబ్దిదారులకు వివరించాలని చెప్పారు. ఈ నెల 30 నాటికి జిల్లాలోని అన్ని గృహాలు గ్రౌండింగ్ నకు సిద్ధం కావాలని,  లేఅవుట్లలో విద్యుత్, తాగునీరు అత్యంత ఆవశ్యకమని వాటిని సంబంధిత శాఖాధికారుల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ వివరించారు. గృహ నిర్మాణాలకు సంబంధించి కమిటీలు వేసి వాటిని సకాలంలో పూర్తిచేయాలని అన్నారు.           

ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములు నాయుడు, గృహనిర్మాణ శాఖ సంయుక్త సంచాలకులు హిమాంశు కౌశిక్, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, జిల్లా నీటియాజమాన్య సంస్థ  పథక సంచాలకులు హెచ్.కూర్మనాథ్, గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు టి.వేణుగోపాల్, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మోహనరావు, ఆర్.డబ్ల్యూ.ఎస్., ఏ.పి.ఈ.పి.డి.సి.ఎల్ ఎస్.ఈలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-25 16:03:26

బ్లాక్ ఫంగ‌స్‌పై ఆందోళ‌న వ‌ద్దు..

బ్లాక్ ఫంగస్ పై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు.  ప్ర‌స్తుతం జిల్లాలో ఆరు ప్ర‌భుత్వ‌, 35 ప్రైవేటు మొత్తం 41 ఆసుప‌త్రులు కోవిడ్ వైద్య సేవ‌లందిస్తున్నాయ‌ని, వీటిలో 3,299 ప‌డ‌క‌లు ఉండ‌గా, 78 శాతం ఖాళీగా ఉన్న‌ట్లు క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. బొమ్మూరు, బోడ‌స‌కుర్రు కోవిడ్ కేర్ కేంద్రాల్లో 5000 వ‌ర‌కు ప‌డ‌క‌లు ఉన్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాలో 280 బ్లాక్ ఫంగ‌స్ కేసులు న‌మోదుకాగా.. ప్ర‌స్తుతం 122 మంది చికిత్స పొందుతున్నార‌ని, రాష్ట్రంలోనే కాకినాడ జీజీహెచ్ బ్లాక్ ఫంగ‌స్‌కు అత్యుత్త‌మ చికిత్స అందిస్తున్న‌ట్లు తెలిపారు. కోవిడ్‌తో త‌ల్లిదండ్రుల‌ను పోగొట్టుకొని అనాథలైన చిన్నారుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.10 ల‌క్ష‌లు డిపాజిట్ చేస్తున్న‌ట్లు తెలిపారు. 

Kakinada

2021-06-25 15:00:22

థర్డ్ వేవ్‌కు ముంద‌స్తు కార్యాచ‌ర‌ణ‌..

కోవిడ్ మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న నేప‌థ్యంలో ఆసుప‌త్రుల్లో మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి కార్యాచ‌ర‌ణ రూపొంచాలని డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో నెం.57 ప్ర‌కారం ప్రైవేటు ఆసుప‌త్రులు త‌ప్ప‌నిస‌రిగా ప్రాథ‌మిక మౌలిక వ‌స‌తుల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. కోవిడ్‌తో సంబంధం లేకుండా 100కు పైబ‌డి ప‌డ‌క‌లు ఉన్న ఆసుప‌త్రులు 100 ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, ఆక్సిజ‌న్ ప‌డ‌క‌ల‌కు స‌మాన సంఖ్య‌లో ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను, ఆక్సిజ‌న్ మాస్కులు, రెగ్యులేట‌ర్ల‌ను స‌మ‌కూర్చుకోవాల‌న్నారు. అదే విధంగా వెయ్యి ఎల్‌పీఎం సామ‌ర్థ్య‌మున్న ఆక్సిజ‌న్ పీఎస్ఏ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. ఆక్సిజ‌న్ యూనిట్‌కు ఆగ‌స్టు 1వ తేదీ డెడ్‌లైన్ కాగా.. మిగిలిన వాటి ఏర్పాటుకు జులై 7వ తేదీని గ‌డువుగా నిర్దేశించిన‌ట్లు తెలిపారు. 50 నుంచి 100 పడ‌క‌లున్న ఆసుప‌త్రులు 100 ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, ఆక్సిజ‌న్ ప‌డ‌క‌ల‌కు స‌మాన సంఖ్య‌లో కాన్సంట్రేట‌ర్లు, మాస్కులు, రెగ్యులేట‌ర్లు ఏర్పాటు చేసుకోవాల‌ని, వీటికి అద‌నంగా 500 ఎల్‌పీఎం సామ‌ర్థ్య‌మున్న ఆక్సిజన్ పీఎస్ఏ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంద‌న్నారు. 50లోపు ప‌డ‌క‌లుంటే 40 ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, ఆక్సిజ‌న్ ప‌డ‌క‌ల‌కు స‌మాన సంఖ్య‌లో కాన్సంట్రేట‌ర్లు, మాస్కులు, రెగ్యులేట‌ర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. మూడో వేవ్‌లో చిన్నారుల‌పై అధిక ప్ర‌భావం ఉంటుంద‌న్న సూచ‌న‌ల నేప‌థ్యంలో స‌న్న‌ద్ధ‌త‌తో పీడియాట్రిక్ సాధార‌ణ‌, ఐసీయూ ప‌డ‌క‌ల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పీడియాట్రిక్ వైద్యులు, ఇత‌ర సిబ్బంది నియామ‌కం, ఆక్సిజ‌న్ పైపులైన్ల ఏర్పాటు, ఔష‌ధాలు త‌దిత‌రాల‌పై దృష్టిసారిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. కాకినాడ జీజీహెచ్‌లో ప్ర‌త్యేకంగా 200 పీడియాట్రిక్ ప‌డ‌క‌లతో విభాగాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ట్ర‌యాజింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామ‌న్నారు. సీహెచ్‌సీలు, ఏరియా ఆసుప‌త్రుల్లోనూ మూడో వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని అవ‌స‌ర‌మైన అన్ని స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు.

సమావేశంలో జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి మాట్లాడుతూ కోవిడ్ పోరాట యోధులుగా సేవలు అందిస్తూ మరణించి హెల్త్ కేర్ వర్కర్ల కుటుంబాలకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఇన్య్సూరెన్స్ పధకం అందించే 50 లక్షలు పరిహారం కొరకు జిల్లాలో ఇప్పటి వరకూ 17 ధరఖాస్తులు అందగా, 8 ధరఖాస్తులకు క్లెయిమ్ మొత్తాలను చెల్లించడం జరిగిందని, మరో 9 ధరఖాస్తులకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు.  ఈ పధకంతో పాటు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ చికిత్సలు అందిస్తూ మరణించిన డాక్టర్లకు 25 లక్షలు, స్టాఫ్ నర్సులకు 20 లక్షలు, ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలకు 15 లక్షలు, ఇతర ఆరోగ్య సిబ్బందికి 10 లక్షలు చొప్పున ఎక్సగ్రేషియా ప్రకటించిందన్నారు.  కోవిడ్ సేవలు అందిస్తూ మరణించిన డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కుటుంబాలు ఈ పరిహారాల కొరకు ధరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.  చిన్న పిల్లలను పొంచి ఉన్న  కోవిడ్ ధర్డ్ వేవ్ ముప్పునుండి రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపడుతున్నామన్నారు.  కాకినాడ జిజిహెచ్లో 200 పడకలతో పిడియాట్రిక్ విభాగాన్ని సిద్దం చేస్తున్నామని, అలాగే 50 ఆపై పడకలున్న సిహెచ్సి లలో 700 ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు పనులు నాలుగు రోజులలో పూర్తి కానున్నాయన్నారు.   3నెలల కాలానికి నియమించిన కోవిడ్ సిబ్బంది సేవలను 6 నెలలకు పొడిగించడం జరిగిందన్నారు.  ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ యోజన క్రింద ప్రతి నెల 9వ తేదీన గర్బిణులకు పి హెచ్ సిలలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షల సందర్భంగా గర్బవతులలో కోవిడ్ పాజిటీవ్ సోకిన వారిని గుర్తించి వైద్య పర్యవేక్షణలో ఉంచుతున్నామన్నారు.  పాఠశాల విద్య,  ఐసిడిఎస్  సిబ్బందికి కోవిడ్ లక్షణాలుష కలిగిన పిల్లలను గుర్తించండంలో ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. చాలా మంది స్వంత వైద్యంతో కోవిడ్ ట్రీట్మెంట్ జాప్యం చేసుకుని ఆఖరి నిమిషంలో చికిత్సకు రావడం వల్ల ప్రాణాలు కాపాడటం కష్టమౌతోందని, కోవిడ్ లక్షణాలు ఉన్నవారు తప్పని సరిగా కోవిడ్ కేర్ సెంటర్లు, కోవిడ్ ఆసుపత్రుల సేవలను పొందాలని కోరారు. 

ఆర్ఎంసి ప్రిన్సిపాల్ డా.బాబ్జీ మాట్లాడుతూ కోవిడ్ ఫస్ట్, సెంకండ్ వేవ్ లను జిల్లా యంత్రాంగం సహకారంతో ఆర్ఎంసి, జిజిహెచ్ లు సమర్ధవంతంగా ఎదుర్కోవడ జరిగిందన్నారు.  కోవిడ్ ధర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు అత్యుత్తమమైన నియోనేటల్ సేవలు  కాకినాడ జిజిహెచ్ పిడియాట్రిక్ విభాగంలో అందుబాటులో ఉన్నాయన్నారు.  జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.ఆర్.మహాలక్ష్మి మాట్లాడుతూ ఆసుపత్రిలో 280 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా మల్టీ డిసిప్లినరీ టీములతో 100 మందికి సర్జరీలు చేసామని, 15 నెలల బాబుకు అరుదైన సర్జరీ విజయవంతంగా నిర్వహించమాన్నారు. కోవిడ్ ఒకసారి వచ్చిన వారికి మరో మారు రాదనే అపోహలను ప్రజలు వీడి ప్రతి ఒక్కరూ కోవిడ్ జాగ్రత్తలను తప్పని సరిగా పాటించాలని ఆమె కోరారు.  ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డా. గౌరీశ్వరరావు, వైద్యాధికారులు పాల్గొన్నారు.      

Kakinada

2021-06-25 14:44:56

ఫీవర్ సర్వేతోపాటు కరోనా టెస్టులు పెంచాలి..

ప్ర‌తి గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల స్థాయిలో అత్యంత స‌మ‌ర్థ‌వంతంగా ఫీవ‌ర్ స‌ర్వే, పీవ‌ర్ క్లినిక్‌ల నిర్వ‌హ‌ణ కొన‌సాగించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి.. వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారుల‌ను ఆదేశించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లోని వివేకానంద హాల్‌లో కోవిడ్ ప్ర‌స్తుత ప‌రిస్థితి, క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌తో పాటు మూడో ద‌శ స‌న్న‌ద్ధ‌త కార్యాచ‌ర‌ణ‌పై జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరితో కలిసి జిల్లా, డివిజ‌న‌ల్ స్థాయి వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంకా కోవిడ్ కేసులు న‌మోద‌వుతున్నందున , రోజుకు కరోనా పరీక్షలు 12 నుంచి 15 వేల వరకు పెంచాలని ఆదేశించారు. అంతేకాకుండా నిర్ల‌క్ష్యానికి తావులేకుండా కోవిడ్ నివార‌ణ, నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌ను కొన‌సాగించాల‌న్నారు. ప‌రీక్ష‌లు, చికిత్స‌, కంటైన్‌మెంట్‌, వ్యాక్సినేష‌న్ త‌దిత‌ర అంశాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్ర‌జ‌లు కూడా పూర్తి అవ‌గాహ‌న‌తో జాగ్ర‌త్త‌లు పాటించేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ఆసుప‌త్రిలో క‌నీస మౌలిక వ‌స‌తులు అందుబాటులో ఉండేలా; ప‌డ‌క‌ల‌ను బ‌ట్టి సిలిండ‌ర్లు, ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా స‌మ‌కూర్చుకునేలా చూడాల‌న్నారు. పీఎస్ఏ యూనిట్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా ఏర్పాటుచేసుకొని, ద‌శ‌ల వారీగా 1000 ఎల్‌పీఎం సామ‌ర్థ్యాన్నికి పెంచుకోవాల‌న్నారు. మౌలిక వ‌స‌తుల అభివృద్ధి, వైద్య ఉప‌క‌ర‌ణాల అందుబాటుకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించేలా ప్రైవేటు ఆసుప‌త్రుల‌పై నిరంత‌ర స‌మీక్ష నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు. పీడియాట్రిక్ సాధార‌ణ‌, ఐసీయూ ప‌డ‌క‌ల ఏర్పాటు; ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌, కోవిడ్ ప్రొఫైల్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, ఔష‌ధాలు, ఫిర్యాదుల ప‌రిష్కారం, మాన‌వ వ‌న‌రుల నియామ‌కం, శిక్ష‌ణ త‌దిత‌రాల‌కు సంబంధించి ప‌టిష్ట వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటుచేయాల‌ని సూచించారు. నోడ‌ల్ అధికారుల వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని, కొత్త నోడ‌ల్ అధికారుల‌కు స‌రైన విధంగా శిక్ష‌ణ ఇవ్వాల‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. సీహెచ్‌సీలు, ఏరియా ఆసుప‌త్రులు, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జిల్లా ఆసుప‌త్రి, కాకినాడ జీజీహెచ్ ఆసుప‌త్రుల వారీగా మౌలిక వ‌స‌తుల అభివృద్ధి ప్ర‌ణాళిక‌పైనా క‌లెక్ట‌ర్ చ‌ర్చించారు. స‌మావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు, డీసీహెచ్ఎస్ డా. ర‌మేశ్ కిషోర్‌, రంగ‌రాయ మెడిక‌ల్ క‌ళాశాల ప్రిన్సిప‌ల్ డా. కె.బాబ్జీ, జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డా. ఆర్‌.మ‌హాల‌క్ష్మి, ఆర్ఎంవో డా. ఇ.గిరిధ‌ర్‌, ఆరోగ్య‌శ్రీ జిల్లా స‌మ‌న్వ‌య‌క‌ర్త పి.రాధాకృష్ణ‌, ఏపీ ఎంఎస్ఐడీసీ ఈఈ కె.సీతారామరాజు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Kakinada

2021-06-25 14:41:26

ఇళ్ల నిర్మాణాలపై అధికారులకు శిక్షణ..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జూలై నెల 1, 3, 4 తేదీలలో నిర్వహించనున్న గృహ నిర్మాణాల మేళాపై మండల ప్రత్యేకాధికారులకు శనివారం ఉదయం శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్  తెలిపారు.  శుక్రవారం సాయంత్రం సంయుక్త కలెక్టర్లతో ఆయన ఛాంబరులో మేళా  ఏర్పాట్లపై  సమీక్షించారు.  మేళా విజయవంతం చేయడానికి సంయుక్త కలెక్టర్లను, సబ్ కలెక్టర్ ను, ఐటిడిఎ పి.ఓను నియోజక వర్గాల పర్యవేక్షణాధికారులుగా నియమించారు. నియోజకవర్గాల ప్రత్యేకాధికారులు, మండల ప్రత్యేకాధికారులు గృహ నిర్మాణాల మేళాకు ఇన్ ఛార్జిలుగా వ్యవహరిస్తారన్నారు. ప్రతీ మండలంలో మంజూరైన అన్ని గృహాలను 1వ తేదీన ప్రారంభమయ్యేలా చూడాలని ఆదేశించారు.  మిగిలిపోయినవి 3, 4వ తేదీలలో పూర్తి చేయాలన్నారు.   అందుకోసం మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులు, సచివాలయాల కార్యదర్శిలను, వాలంటీర్లను పూర్తి స్థాయిలో బాగస్వామ్యమయ్యేలా చూడాలన్నారు.  శిక్షణకు అవసరమగు అంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాలని గృహినిర్మాణ జె.సి. మయూర్ అశోక్ కు సూచించారు.  ఇన్ ఛార్జి అధికారులందరికి వెంటనే ఉత్తర్వులు సిద్దం చేయాలని హౌసింగ్ పిడి రమణమూర్తికి సూచించారు.  ఈ సమావేశంలో  సంయుక్త కలెక్టర్లు డా.మహేష్ కుమార్, జె.వెంకటరావు, సిపిఓ విజయలక్ష్మీ పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-25 14:13:00

కాలనీల నిర్మాణాలకి ప్రత్యేక ప్రణాళిక..

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర‌కు పేద‌లంద‌రికీ ఇళ్లు కార్యక్రమంలో జిల్లాలోని పేద‌ల‌కు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ప్రత్యేక కార్యాచ‌ర‌ణ రూపొందిం చామ‌ని జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ వెల్లడించారు. అన్ని ప్రభుత్వ శాఖ‌ల‌ను, ప్రజాప్రతినిధుల‌ను భాగ‌స్వాముల‌ను చేస్తూ వ‌చ్చే జూలై 1,3,4 తేదీల్లో జిల్లాలో ఇళ్ల నిర్మాణ ప‌నులు ప్రారంభించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేప‌ట్టనున్నట్టు తెలిపారు. జూలై 1, 3 తేదీల్లో 8,900 ఇళ్లు చొప్పున‌, 4న 8,974 ఇళ్ల నిర్మాణాన్ని చేప‌ట్టడం ద్వారా ప్రత్యేక క్యాంపెయిన్‌లో మొత్తం 26,774 ఇళ్ల నిర్మాణం ప‌నులు ప్రారంభించేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించామ‌న్నారు. జిల్లాలో 98,286 ఇళ్లు తొలి విడ‌త‌లో మంజూరు కాగా ఇందులో లే అవుట్లలో 53,403, ల‌బ్దిదారుల సొంత స్థలాల్లో 44,883 ఇళ్లు మంజూరు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇప్పటికే జిల్లాలో 8,833 ఇళ్ల నిర్మాణం ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని పేర్కొన్నారు. జూలై 1,3,4 తేదీల్లో చేప‌ట్టే ప్రత్యేక ఇళ్లనిర్మాణ కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేసేందుకు ఒక్కో జాయింట్ క‌లెక్టర్ రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల బాధ్యత‌లు అప్పగిస్తున్నామ‌ని, మ‌రో నియోజ‌క‌వ‌ర్గం బాధ్యత‌లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారికి అప్పగిస్తున్నట్టు తెలిపారు. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కోసం మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ప్రత్యేక అధికారుల‌ను ఇప్పటికే నియ‌మించామ‌ని వీరంద‌రినీ ఈ కార్యక్రమంలో భాగ‌స్వామ్యం చేసి ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేప‌ట్టేలా చ‌ర్యలు తీసుకుంటామ‌న్నారు.

రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాన్ని ఉద్యమ రీతిలో చేప‌ట్టేందుకు గృహ‌నిర్మాణ శాఖ ముఖ్య కార్యద‌ర్శి అజ‌య్ జైన్‌, సి.ఎం.ఓ. అధికారులు శుక్రవారం జిల్లా క‌లెక్టర్‌లు, హౌసింగ్ జాయింట్ క‌లెక్టర్‌లు, గృహ‌నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైర‌క్టర్‌ల‌తో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలి కాన్ఫరెన్సులో త‌న క్యాంపు కార్యాల‌యం నుంచి పాల్గొన్న జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ జిల్లాలో ఇళ్ల నిర్మాణ కార్యాచ‌ర‌ణ ప్రణాళిక‌ను ముఖ్య కార్యద‌ర్శికి వివ‌రించారు. మండ‌ల స్థాయి అధికారులు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లతో శ‌నివారం స‌మావేశ‌మై ఇళ్ల నిర్మాణ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చిస్తామ‌ని క‌లెక్టర్ పేర్కొన్నారు. మండ‌ల స్థాయి అధికారులు ఒక్కొక్కరికి మూడు స‌చివాల‌యాల ప‌రిధిలో ఇళ్ల నిర్మాణ బాధ్యత‌లు అప్పగిస్తామ‌న్నారు. గ్రామ స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్లు అంద‌రినీ దీనిలో భాగ‌స్వాముల‌ను చేసి వారికి కూడా ల‌క్ష్యాలు నిర్దేశిస్తామ‌ని పేర్కొన్నారు.

ఇళ్ల నిర్మాణంలో జిల్లాలోని అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులంద‌రినీ భాగ‌స్వాముల‌ను చేసి వారి స‌హ‌కారం తీసుకుంటామ‌ని క‌లెక్టర్ వివ‌రించారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇళ్ల నిర్మాణ కార్యాచ‌ర‌ణ‌పై వారితో చ‌ర్చించి ఖ‌రారు చేస్తామ‌న్నారు. గృహ‌నిర్మాణ శాఖ‌ ముఖ్య కార్యద‌ర్శి అజ‌య్ జైన్ మాట్లాడుతూ జూలై 1,3,4 తేదీల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక కాంపెయిన్  చేప‌ట్టాల‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించార‌ని, మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ అన్ని శాఖ‌ల భాగ‌స్వామ్యంతో విజ‌య‌వంతం చేసిన‌ట్లే ఇళ్ల నిర్మాణంలోనూ అన్ని శాఖ‌ల అధికారుల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌ని ఆదేశించిన‌ట్లు టెలికాన్ఫరెన్సులో చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ జూలై 1,3,4 తేదీల‌ను స్పెష‌ల్ క్యాంపెయిన్ దినాలుగా ప‌రిగ‌ణించి ఆయా రోజుల్లో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బందిని భాగ‌స్వాముల‌ను చేసి పెద్ద ఎత్తున ఇళ్ల ప‌నులు ప్రారంభించాల‌ని సూచించారు. టెలి కాన్ఫరెన్సులో గృహ‌నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైర‌క్టర్ ఎస్‌.వి.ర‌మ‌ణ‌మూర్తి కూడా పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-25 14:05:33

ఎయిర్ పోర్టు పనులు వేగం పెంచాలి..

విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్ట్ , రాయిపూర్–విశాఖ జాతీయ రహదారి కి సంబంధించి పెండింగ్  పనులు వేగంగా జరగాలని  సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్ ఆదేశించారు.  శుక్రవారం ఆయన ఛాంబర్ లో భూ సేకరణ తదితర పనుల పై జే.సి  సమీక్షించారు.  భోగాపురం ఎయిర్ పోర్ట్ కోసం  కోర్ట్ కేసు లలో ఉన్న 89.47 ఎకరాల  భూమి  కి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ జారీచేయడం జరిగిందని, అందుకు సంబంధించి  ఎ.రావి వలస, సవరవల్లి, రావాడ, గుడెపు వలస గ్రామాలలో  అటవీ క్లియరెన్స్ , ఉద్యాన పంటల లెక్కింపు త్వరిత గతిన పూర్తి చెయ్యాలణి  ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు.  కోర్ట్  కేసు ల పరిష్కారం, గజెట్ పబ్లికేషన్ తదితర పనులను వేగంగా జరిగేలా చూడాలని రెవిన్యూ దడివిజినల్ అధికారి భవానీ శంకర్ కు సూచించారు.  ఎయిర్ పోర్ట్ అథారిటీ, జాతీయ రహదారి ప్రాజెక్ట్ అధికారి తో  ఉప కలెక్టర్లు  మాట్లాడుకొని రీ కన్సిలేషన్ పనులు కూడా సత్వరమే పూర్తయ్యేలా చూడాలన్నారు.  జాతీయ రహదారి కి సంబంధించి ఉప కలెక్టర్ లు ప్రతి రోజు క్షేత్ర స్థాయి లో పర్యటించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించి పనులను ముందుకు వెళ్ళేలా చూడాలన్నారు.  భూ సేకరణ పూర్తి చేసి  అవార్డులను పాస్ చెయ్యాలని ,  అధికారులంత సమన్వయంతో పని చెయ్యాలని అన్నారు. ఈ సమావేశం లో ఉప కలెక్టర్లు హెచ్. జయరాం, పద్మావతి,   వెంకటేశ్వర రావు,  తహసిల్దార్ ,  ఉద్యాన, అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Bhogapuram

2021-06-25 14:03:37

ఎస్ఐ ఉద్యోగానికి సార్ధకత తీసుకువాలి..

ఎన్నో పరీక్షలు  కష్టపడి నెగ్గి సాధించిన ఎస్ ఐ ఉద్యోగానికి సార్థకత తీసుకొని రావాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ ప్రొబిషనరీ ఎస్ఐలకు హిత బోద చేశారు. ఐదు నెలల శిక్షణ నిమిత్తం సిద్దిపేట కమిషనరేట్ కు వచ్చిన 26 మంది  ప్రొబిషనరీ ఎస్ఐలతో చట్ట ప్రకారం  నేర్చుకోవాల్సిన విధివిధానాలపై ఎస్ఐలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,  ప్రస్తుత శిక్షణా కాలంలోనే పోలీసు స్టేషన్లలోని విధుల పట్ల పూర్తి అవగాహన కల్పించుకోవాలన్నారు. ఎస్ఐ స్థాయి అధికారులు ప్రజలతో మమేకమై విధులు నిర్వహించి వారి సమస్యలు పరిష్కరించే అవకాశం రావడం అదృష్టంగా భావించాలన్నారు.  సిబ్బందితో కలసి  విధులు నిర్వహింహించడం ద్వారా అన్ని విషయాలపట్ల మంచి అవగాహన ఏర్పడుతుందన్నారు. ప్రజలు పోలీస్ స్టేషన్ కి వచ్చినప్పుడు వారి సమస్యను సామరస్యపూర్వకంగా విని ఏ విధంగా పరిష్కరించాలో పూర్తిగా అవగాహన పెంచుకోవాలన్నారు. సమాజం ప్రజలు పోలీసు చేసే ప్రతి పనిని పరిశీలిస్తోందని అది గమనిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. చట్టప్రకారం విధులు నిర్వహించి డిపార్ట్మెంట్ , వ్యక్తిగతంగా మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ప్రజలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, మర్యాదగా మాట్లాడాలని పేద ప్రజలు  పోలీస్ స్టేషన్కు వచ్చినపు వారికి మీ ద్వారా సహాయం అందుతుందనే భరోసా కల్పించాలన్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని ఉపయోగిస్తూ ముందుకు సాగాలన్నారు.  సమాజం, ప్రజలు మెచ్చుకునే విధంగా విధులు నిర్వహించాలన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పోలీసు వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు పోలీస్ డిపార్ట్ మెంట్ పై నమ్మకం పెరుగుతందన్నారు.

Siddipet

2021-06-25 13:55:20