1 ENS Live Breaking News

అప్పన్న ఆలయంలో గంట్ల పర్యవేక్షణ..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకోవడానికి శనివారం వేలాది మంది భక్తులు తరలి రావడంతో  సింహగిరి భక్తులు తో కోలాహలంగా మారింది. ఎటు చూసిన భక్త జన సందోహమే కనిపించింది. కొండ దిగువన తొలి పావంచ వద్ద అదే రద్దీ నెలకొంది. గ్రామీణ ప్రాంతాలు నుంచి తరలి వచ్చిన భక్తులు వందలాది కోడి దూడలు స్వామి కి సమర్పించుకొని తమ మొక్కు బడులు చెల్లించుకున్నారు. అప్పన్న ధర్మ కర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తొలి పావంచ వద్ద భక్తులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులు స్వామి ని సులభతరముగా దర్శించుకునే అవకాశం కల్పించారు. భక్తులు కి ఇబ్బంది లేకుండా అక్కడ సిబ్బంది తో కలిసి అన్ని సదుపాయాలు కల్పించారు. కోడి దూడల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాల రైతులు తో మాట్లాడి వారి మొక్కు బడులు.దర్శనం వంటి అంశాలు పై చర్చించారు. దేవస్థానం అధికారులు పని తీరు శ్రీనుబాబు ప్రసంశించారు.

Simhachalam

2021-06-26 09:17:12

పేద‌ల సొంతింటి క‌ల‌ సాకారం కావాలి..

పేద‌లంద‌రి సొంతింటి క‌ల‌ను సాకారం చేసేందుకు ప్ర‌తీఒక్క‌రూ కృషి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ పిలుపునిచ్చారు. జులై 1న జిల్లా వ్యాప్తంగా నిర్వ‌హించే మెగా గ్రౌండింగ్ మేళాకు అన్ని ర‌కాలుగా ముంద‌స్తు ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని ఆదేశించారు. వైద్యారోగ్య‌, వ్య‌వ‌సాయ శాఖ‌లు మిన‌హా మిగిలిన యంత్రాంగ‌మంతా ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములు కావాల‌ని కోరారు. న‌వ‌ర‌త్నాలు లో భాగంగా  ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మానికి సంబంధించి, జులై 1,3,4 తేదీల్లో మెగా గ్రౌండింగ్ మేళాకు జిల్లాలో  విస్తృత ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. దీనిలో భాగంగా మండ‌ల ప్ర‌త్యేకాధికారులు, ప‌ర్య‌వేక్ష‌కులు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌కు క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో, ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ద్వారా శ‌నివారం అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.  ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి మాన‌స పుత్రిక అయిన పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మ‌ని, దీనిలో ప్ర‌తీఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు. జులై 1వ తేదీనే జిల్లా అంత‌టా ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాల‌ని ఆదేశించారు. దానికి త‌గ్గ ఏర్పాట్ల‌ను ముందుగానే పూర్తి చేయాల‌న్నారు. ఆరోజు ల‌బ్దిదారులంతా శంకుస్థాప‌న చేసి, ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించేందుకు అనువుగా నిర్మాణ సామ‌గ్రిని కూడా లేఅవుట్‌ల‌లో సిద్దంగా ఉంచాల‌న్నారు. అంత‌కుముందుగానే అన్ని లేఅవుట్ల‌లో నీరు, విద్యుత్ త‌దిత‌ర మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న పూర్తి చేయాల‌ని ఆదేశించారు. దీనికోసం వివిధ స్థాయిల్లో సిబ్బందికి శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించి, యాప్‌పైని, ఇత‌ర అంశాల‌పైనా ముందుగానే అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని చెప్పారు. మెగా  మేళాలో ప్ర‌జాప్ర‌తినిధులంద‌రినీ భాగ‌స్వాముల‌ను చేస్తామ‌ని, వారి స‌హ‌కారంతో స‌కాలంలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేయాల‌ని సూచించారు.  అనివార్య కార‌ణాల‌తో 1వ తేదీన నిర్మాణాన్ని ప్రారంభించ‌లేక‌పోయిన వారిచేత 3 లేదా 4వ తేదీన ఇంటిప‌నులు మొద‌లు పెట్టించాల‌ని  సూచించారు. గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మాన్ని ప‌ర్య‌వేక్షించేందుకు జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్‌రూమును ఏర్పాటు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

               జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ అంత‌కుముందు మాట్లాడుతూ,    ల‌బ్దిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు వ‌చ్చేలా, ముందుగానే వారిని చైత‌న్య ప‌ర‌చాల‌ని కోరారు. ప్ర‌తీ ల‌బ్దిదారున్ని క‌లిసి, వారి ప‌రిస్థితిని తెలుసుకొని, దానికి అనుగుణంగా ప్ర‌ణాళిక‌ను రూపొందించుకోవాల‌ని అన్నారు. ప్ర‌త్యేకాధికారులు, త‌మ మండ‌లంలోని ప్ర‌తీ లేఅవుట్‌పైనా సంపూర్ణ అవ‌గాహ‌న ఏర్ప‌ర‌చుకోవాల‌ని, ఎక్క‌డ స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌యినా, దానిని ప‌రిష్క‌రించేందుకు సిద్దంగా ఉండాల‌ని సూచించారు.  ప్ర‌తీ వ‌లంటీర్ చేతా హౌసింగ్‌కు సంబంధించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేయించాల‌ని చెప్పారు.

              జాయింట్ క‌లెక్ట‌ర్(అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్ మాట్లాడుతూ,  వీలైనంత వ‌ర‌కూ మొద‌టిరోజే అన్ని ఇళ్ల‌నూ గ్రౌండింగ్ చేసేలా చూడాల‌న్నారు. స‌చివాల‌యాల సిబ్బంది అంతా ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములు అవుతార‌ని చెప్పారు. లేఅవుట్ ఇన్‌ఛార్జులు, క్ల‌స్ట‌ర్ ఇన్‌ఛార్జుల‌ను మండ‌ల ప్ర‌త్యేకాధికారులు  స‌మ‌న్వ‌యం చేసుకొని, కార్య‌క్ర‌మాన్ని ముందుకు న‌డిపించాల‌ని సూచించారు. లేఅవుట్ల‌లో మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించిన త‌రువాత మాత్ర‌మే, ఇళ్ల నిర్మాణం ముందుకు సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. అందువ‌ల్ల ముందుగానే నీరు, విద్యుత్ త‌దిత‌ర సౌక‌ర్యాల‌ను పూర్తి చేయాల‌ని సూచించారు.      

               జాయింట్ క‌లెక్ట‌ర్ (హౌసింగ్‌) మ‌యూర్ అశోక్ మాట్లాడుతూ, జిల్లాలో గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మం ప్ర‌ణాళిక‌ను వివ‌రించారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వం గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మానికి అత్యంత ప్రాధాన్య‌త‌నిస్తోంద‌ని, దీనిలో భాగంగా తొలిద‌శ‌లో జిల్లాలో సుమారు 55వేల ఇళ్ల‌ను నిర్మించాల్సి ఉంద‌న్నారు. ఇప్ప‌టికే దాదాపు 9వేల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయ‌ని, మిగిలినవి 1వ తేదీన ప‌ని ప్రారంభించాల‌ని కోరారు. గృహ‌నిర్మాణంలో భాగంగా మ్యాపింగ్‌, జియో ట్యాగింగ్‌, రిజిష్ట్రేష‌న్‌, జాబ్ కార్డు(రూర‌ల్‌) అనే నాలుగు ముఖ్య‌మైన ప్ర‌క్రియ‌లు పూర్తి చేయాల్సి ఉంద‌న్నారు. ప్ర‌భుత్వం ప్ర‌తీ ల‌బ్దిదారుడికీ రూ.ల‌క్షా, 80వేల రూపాయ‌ల‌ను స‌బ్సిడీగా, మూడు ద‌శ‌ల్లో ఇస్తుంద‌ని చెప్పారు. ప‌ర్య‌వేక్ష‌ణ కోసం ప్ర‌తీ లేఅవుట్‌కు ఒక గ్రామ‌స్థాయి అధికారిని, లేఅవుట్ల‌ను క్ల‌స్ట‌ర్లుగా విభ‌జించి, ప్ర‌తీ క్ల‌ష్ట‌ర్ ఒక మండ‌ల స్థాయి అధికారిని, మండ‌లానికి ఒక ప్ర‌త్యేకాధికారిని ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు.

                ఈ అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మంలో ఐటిడిఏ పీఓ ఆర్‌.కూర్మ‌నాధ్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీ శంక‌ర్‌, హౌసింగ్ పిడి ఎస్‌వి ర‌మ‌ణ‌మూర్తి, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-26 09:03:20

హౌసింగ్ గ్రౌండింగ్ విజయవం కావాలి..

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం కింద జిల్లాలో జులై 1,3,4 తేదీల్లో మెగా ఇళ్ల నిర్మాణ గ్రౌండింగ్ మేళా జ‌ర‌గ‌నుంద‌ని, ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. జిల్లాలో పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం అమ‌లు స్థితిగ‌తులు, మెగా గ్రౌండింగ్ మేళా స‌న్న‌ద్ధ‌త ప్ర‌ణాళిక‌పై జేసీ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ‌, జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి, జేసీ (హెచ్‌) ఎ.భార్గ‌వ్ తేజ‌ల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి జిల్లా, డివిజ‌న‌ల్‌, మండ‌ల‌స్థాయి అధికారుల‌తో శ‌నివారం ఉద‌యం క‌లెక్ట‌రేట్ నుంచి టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఇటీవ‌ల జిల్లాలో మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను విజ‌య‌వంతం చేసిన‌ట్లుగానే ఇళ్ల నిర్మాణాల మెగా గ్రౌండింగ్ మేళాను కూడా విజ‌య‌వంతం చేయాల‌ని, ఇందుకు గృహ నిర్మాణ‌, పంచాయ‌తీరాజ్‌, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, మునిసిప‌ల్‌, రెవెన్యూ త‌దిత‌ర విభాగాల అధికారులు మ‌ధ్య ప‌టిష్ట స‌మ‌న్వ‌యం అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం చేయూత‌తో సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకునేందుకు ల‌బ్ధిదారులు పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు ప్రారంభించేలా రూ.1,80,000 యూనిట్ వ్య‌యంతో మంజూరు చేసిన ఇళ్ల‌కు అద‌న‌పు ఆర్థిక మ‌ద్ద‌తుగా ఎస్‌హెచ్‌జీ లింకేజీ ద్వారా రూ.50 వేల నుంచి రూ.ల‌క్ష వ‌ర‌కు అడ్వాన్సు రుణాలు అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. జులై మొద‌టి వారంలో చేప‌ట్టే మెగా మేళా సంద‌ర్భంగా రూ.200 కోట్ల ఎస్‌హెచ్‌జీ లింకేజీ అడ్వాన్సు రుణాల చెక్కుల‌ను ల‌బ్ధిదారుల‌కు పంపిణీ చేసేందుకు డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంలో విలువ ప‌రంగా ఉత్త‌మ లేఅవుట్ల‌లో ఇళ్ల‌నిర్మాణాల‌కు ఇది స‌రైన స‌మ‌య‌మ‌ని, అన్ని వ‌న‌రులను ప్ర‌భుత్వం అందుబాటులో ఉంచినందున ల‌బ్ధిదారులు ఊళ్ల నిర్మాణ ప్ర‌క్రియ‌లో భాగ‌స్వాములు కావాల‌న్నారు. ఈ మేర‌కు గ్రామ‌, వార్డు వాలంటీర్లు; స‌చివాల‌య సిబ్బంది.. ల‌బ్ధిదారుల‌ను ప్రోత్స‌హించాల‌ని, వారికి ఏవైనా సందేహాలు ఉంటే వెంట‌నే నివృత్తి చేయాల‌న్నారు. మేళా సంద‌ర్భంగా స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల భాగ‌స్వామ్యంతో ల‌క్ష్యానికి మంచి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభ‌మ‌య్యేలా చూడాల‌ని, క్షేత్ర‌స్థాయిలో స‌మావేశాలు నిర్వ‌హించి వార్డుల వారీగా ల‌క్ష్యాల‌ను నిర్దేశించి, లేఅవుట్ల‌లో నోడ‌ల్ బృందాల‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. క్షేత్ర‌స్థాయిలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి, స‌ల‌హాలు, సూచ‌న‌లు అందించేందుకు జిల్లాస్థాయి కంట్రోల్‌రూంను ఏర్పాటు చేయాల‌న్నారు. లేఅవుట్ల‌లోఇళ్ల నిర్మాణాలు సజావుగా సాగేందుకు ఇసుక‌, నీరు, విద్యుత్ త‌దిత‌ర వ‌స‌తుల‌ను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని క‌లెక్ట‌ర్ అధికారుల‌కు సూచించారు. స‌మావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, గృహ నిర్మాణ శాఖ పీడీ జి.వీరేశ్వ‌ర ప్ర‌సాద్‌, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, మెప్మా పీడీ కె.శ్రీర‌మ‌ణి, మునిసిప‌ల్ కమిష‌న‌ర్లు, ఆర్‌డీవోలు, ఎంపీడీవోలు, త‌హ‌సీల్దార్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-26 08:51:54

హౌసింగ్ మెగా డ్రైవ్ విజయవంతం కావాలి..

శ్రీకాకుళం జిల్లాలో జూలై 1 నుండి జిల్లావ్యాప్తంగా చేపట్టనున్న హౌసింగ్ మెగా డ్రైవ్ కార్యక్రమం విజయవంతం కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ఆకాంక్షించారు. కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమంలో అత్యధిక టీకాలను వేసి రాష్ట్రస్థాయిలో  జిల్లా ముందంజలో ఉంచారని, అధికారుల సమిష్టికృషితో  హౌసింగ్ మెగా డ్రైవ్ కూడా దిగ్విజయం చేయాలని అధికారులను కోరారు. హౌసింగ్ మెగా డ్రైవ్ కార్యక్రమంపై శనివారం మండల ప్రత్యేక అధికారులు, మునిసిపల్ కమీషనర్లు, మండల అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ వీడియో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదలందరికి ఇళ్లు కార్యక్రమం క్రింద లబ్ధిదారులకు ఇప్పటికే స్థలాలాను కేటాయించడం జరిగిందన్నారు. కేటాయించిన లేఅవుట్లలో గృహనిర్మాణాలకు సంబంధించిన గ్రౌండింగ్ వర్కు జూలై 1,3,4 తేదీల్లో జిల్లావ్యాప్తంగా ప్రారంభించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 92,716 ఇళ్లస్థలాలకు గాను 81,585 గృహాలు గ్రౌండింగ్ కావలసి ఉందన్నారు. లేఅవుట్లలో ఉన్న ప్రతీ స్థలానికి మ్యాపింగ్, జియో ట్యాగింగ్ కావాలని, లేఅవుట్లలో నీటిసరఫరా, విద్యుదీకరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సి.సి.రోడ్లు, సెంట్రల్ లైటింగ్, పార్కుతో బ్యూటిఫికేషన్ వంటి పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి అధికారి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్ధేశించిన సమయానికి గృహాలు పూర్తికావాలంటే యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సి ఉందని, ఇందుకు వివిధ కమిటీలను ఏర్పాటుచేసి వారికి విధులను కేటాయించడం జరిగిందన్నారు. గృహ నిర్మాణాల మెగా గ్రౌండింగ్ డ్రైవ్ విషయమై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మెగా గ్రౌండింగ్ మరియు గృహనిర్మాణాలు కేవలం గృహనిర్మాణ శాఖకు మాత్రమే సంబంధించినది కాదని, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్.డబ్ల్యు.యస్ తదితర శాఖల సమన్వయంతో పనిచేయాల్సి ఉందన్నారు. 

ఇందుకు జిల్లా స్థాయి అధికారులను మండల ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని, వీరంతా వారికి కేటాయించిన మండలాలను సందర్శించి ఈ నెల 27,28 తేదీల్లో మండలస్థాయి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. 29న సచివాలయ స్థాయిలో సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు శిక్షణను నిర్వహించాలన్నారు. 30న వాలంటీర్లు తమ పరిధిలోని లబ్ధిదారులను మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమంపై చైతన్యపరచి, లబ్ధిదారులు వాలంటీరు సహాయంతో గ్రౌండింగ్ మేళాకు విచ్చేసి తమ గృహ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. గ్రౌండింగ్ మేళా కార్యక్రమంపై అధికారి నుండి వాలంటీరు వరకు క్షుణ్ణంగా తెలిసిఉండాలని, అపుడే లబ్ధిదారునికి పూర్తి సమాచారాన్ని ఇవ్వగలుగుతారని ఆయన స్పష్టం చేసారు. హౌసింగ్ మెగా డ్రైవ్ ప్రారంభం అయిన వెంటనే లేఅవుట్లలో గృహాల సంఖ్యను బట్టి అవసరమైన ఇసుక, సిమెంట్, ఇతరత్రా వసతుల విషయమై హౌసింగ్ ఏ.ఇలు దృష్టి సారించాలని అన్నారు. కోవిడ్ నేపధ్యంలో భౌతిక దూరం, మాస్కులు, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుందని, దీనికోసం ప్రతి జిల్లాకు ఒక సంయుక్త కలెక్టరును నియమించిన సంగతిని కలెక్టర్ గుర్తుచేసారు. అధికారులందరూ సమిష్టిగా కృషిచేసి ఈ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

                ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, గృహనిర్మాణ శాఖ సంయుక్త సంచాలకులు హిమాంశు కౌశిక్, గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు టి.వేణుగోపాల్, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-06-26 08:48:40

Visakhapatnam

2021-06-26 06:12:30

అప్పన్నకు మంత్రి అవంతి పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని శనివారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేవస్థానానికి ఆర్ధిక ఇబ్బందులు తొలగించేందుకు త్వరలోనే చర్యలు తీసుంటామన్నారు. కరోనా వైరస్ ను రూపుమాసిపోయి ప్రజలు సాధారణ పరిస్థితి వచ్చేలా దీవించాలంటూ స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. స్వామిని దర్శించుకోవడానికి వచ్చేవారంతా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. అంతేకాకుండా స్వామివారి ఆలయ అభివ్రుద్ధికి తనవంతు క్రుషి చేస్తానని హామీఇచ్చారు. అంతకు ముందు దేవాలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు.

Simhachalam

2021-06-26 05:56:31

సింహాద్రి అప్పన్నకు రూ.లక్ష విరాళం..

విశాఖ దొండపర్తికి చెందిన విశ్రాంత ఉద్యోలు గన్నవరపు వెంకటరావు, భాగ్యలక్ష్మి దంపతులు శుక్రవరం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి అన్నధాన ట్రస్టుకి లక్ష రూపాయల విరాళంగా అందించారు. ఈ మేరకు దేవస్థానం ఈఈ  శ్రీనివాసరాజుకు పీఆర్వో కార్యాలయంలో చెక్ అంద జేశారు.  ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, స్వామివారి కృపతో ఆయురారోగ్యాలతో ఏ లోటూ లేకుండా ఉన్నామని వెంకటరావు, భాగ్యలక్ష్మి దంపతులు తెలిపారు. తమ వివాహ వార్షికోత్సవం 23, ఫిబ్రవరిన భక్తులకు అన్నదానం చేయాలని కోరారు.  అనంతరం సింహాద్రి అప్పన్నను దర్శించుకొని, కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. దేవస్థాన సిబ్బంది ప్రసాదాలు అందించగా, వేద పండితులు ఆశీర్వచనం ఆశీర్వచనాలు అందజేశారు.  

Simhachalam

2021-06-25 16:53:14

రేపు రెండవ డోసు టీకా మాత్రమే వేస్తారు..

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలలో 26వ తేదీన  కోవీషీల్డ్, కోవాగ్జిన్ రెండవ డోసు టీకాలు మాత్రమే వేస్తారని   జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి తెలియజేశారు. శుక్రవారం కాకినాడలో ఏర్పాటు చేసిన కార్యంలో జెసి మాట్లాడారు. కోవీషీల్డ్ మొదటి టీకా వేసుకున్న 84 రోజుల తర్వాత,  కోవాగ్జిన్ మొదటి టీకా వేసుకున్న 28 రోజుల తర్వాత రెండవ టీకా వేస్తారన్నారు. రెండవ డోసుకోసం మాత్రమే కేంద్రానికి వెళ్లాలన్నారు. ఈమేరకు అన్ని మండాల్లోని అధికారులు ప్రజలను చైతన్య పరిచి రెండవ డోసు వేయించుకునే చేయాలన్నారు. కోవిడ్ కేసులు అధికంగా వున్నందున మొదటి డోసు టీకా వేయించుకుని రెండవ టీమా సమయం వచ్చిన వారందరికీ టీకా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-25 16:46:38

సమాజంలో మీడియా పాత్ర కీలకం..

సమాజంలో  ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే మీడియా సమాజంలో కీలక పాత్రను పోషిస్తుందని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో సామాజిక కార్యకర్త  సూర శ్రీనివాసరావు నిర్వహించిన జర్నలిస్టు యోధులకు చేయూత కార్యక్రమం జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో జరిగిన మంచిని అభినందిస్తూ, చెడును విమర్శించేది మీడియా మాత్రమేనని అన్నారు. సమాజంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని, అటువంటి మీడియాకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం శుభదాయకమని అన్నారు. గతంలో  పత్రికా రంగంలో పనిచేసిన దాత సూర శ్రీనివాసరావు జర్నలిస్టుల సమస్యలను గుర్తించి వారికి సేవలు అందించడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో కోవిడ్ ఫస్ట్ వేవ్ మరియు సెకెండ్ వేవ్ పట్ల  ప్రతీ పల్లె, వీధి, పట్టణ ప్రజల్లో చైతన్యం వచ్చేందుకు ముఖ్యకారణం మీడియానే అని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. మీడియా ద్వారా ప్రజలకు ఎప్పటికపుడు సమాచారాన్ని చేరవేస్తూ, వారిని అప్రమత్తం చేసేంది కూడా మీడియానే అని స్పష్టం చేసారు.

సూర శ్రీనివాసరావు పత్రికా రంగంతో ప్రారంభించి , నేడు పారిశ్రామిక వేత్తగా ఎదిగారన్నారు. సూర శ్రీను గతంలో చేసిన రంగంలో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని మీడియాకు సేవలు అందించడం స్పూర్తిదాయకమని అన్నారు. ఆయన సేవలు చిరస్థాయిగా ఉంటాయని, ఇటువంటి కార్యక్రమాల వలన పుణ్యం, సంతృప్తి లభిస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఇస్తున్నవాళ్లు ఇస్తుండాలి.. తీసుకుంటున్న వాళ్లు తీసుకుంటుండాలి... తీసుకుంటున్న వాళ్లు ఇచ్చే స్ధాయికి ఎదగాలనే మరాఠీ సామెతను కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తుచేసారు. సూర శ్రీనివాసరావు సేవలను అభినందించిన ఆయన జిల్లా యంత్రాంగం తరపున సహాయసహకారాలు అందించేందుకు సిద్దమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి యల్.రమేష్ మాట్లాడుతూ జిల్లాలో చాలా మంది పాత్రికేయులు జీతం కోసం కాకుండా, ఆ వృత్తిపై ఉండే మక్కువతో పనిచేస్తున్నారని కలెక్టర్ కు వివరించారు. కోవిడ్ సమయంలో జీతభత్యాలకు ఆశించకుండా సామాజిక సేవాధృక్పధంతో మీడియా ప్రతినిధులు పనిచేసారని, కోవిడ్ ఫస్ట్ వేవ్ మరియు సెకెండ్ వేవ్ సమయంలో తమ ప్రాణాలకు లెక్కచేయకుండా ఫ్రంట్ లైన్ వారియర్లుగా మీడియా విధులు నిర్వహించిందని కితాబు ఇచ్చారు. తుఫాను, వడదెబ్బల సమయంలో మీడియా ముందుండి ప్రజలను చైత్యన్యపరిచిన సంగతిని ఆయన గుర్తుచేసారు. సుమారు లక్ష మంది వరకు వలస కార్మికులు జిల్లాకు చేరుకున్నారని, వారందరికి అవసరమైన భోజనం, ఇతరత్రా ఏర్పాటు విషయంలో మీడియా గణనీయమైన పాత్రను పోషించిందని అన్నారు. సూర శ్రీనివాసరావు ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి పారిశ్రామిక వేత్తగా ఎదిగినప్పటికీ ప్రజలకు మంచి చేయాలనే సదుద్దేశ్యంతో గత 45 రోజులుగా ఆసుపత్రులలోని కోవిడ్ రోగులకు, రిక్షా, ఆటో కార్మికులకు, వలస కార్మికులకు, బిచ్చగాళ్లకు భోజన వసతితో పాటు ఇతరత్రా ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. సూర శ్రీను భవిష్యత్తులో మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సూర శ్రీనివాసరావు దంపతులకు కలెక్టర్ దుశ్శాలువ, జ్ఞాపిక, పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసకుమార్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ఫిజికల్ డైరక్టర్ మోహనరావు, జర్నలిస్టుల ఐక్యవేదిక నిర్వాహకులు కొంక్యాణ వేణుగోపాలరావు, శాసపు జోగినాయుడు, ప్రతినిధులు సూర చంద్రశేఖరరావు, డోల అప్పన్న, యం.ఎ.వి.సత్యనారాయణ,  సీనియర్ పాత్రికేయులు సిహెచ్.లక్ష్మణరావు,  స్టార్ వాకర్స్ మహిళా క్లబ్ అధ్యక్షురాలు అంధవరపు జ్యోతిర్మయి, రోటరీ కైలాసభూమి నిర్వాహకులు బి.శ్రీనివాసరావు, స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్.సూర్యారావు, ఎ.వి.రమణ, మాజీ గవర్నర్లు జి.ఇందిరాప్రసాద్, కె.వి.ఆర్.మూర్తి, డాడీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-25 16:30:57

పారిశుధ్యం లోపిస్తే చర్యలు తప్పవు..

మహావిశాఖ నగర పరిధిలో పారిశుద్ధ్యం లోపిస్తే సహించేది లేదని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన శానిటరి అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఆమె నాలుగవ జోన్ 33వ వార్డు పరిధిలోని వివేకానంద కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా మన విశాఖను ఒక సుందర నగరంగా చూడాలని, అందుకు అందరూ సమిష్టిగా పని చేయాలని అన్నారు. డోర్ టు డోర్ చెత్త సేకరణ ప్రక్రియ ఉన్నచోట డంపర్ బిన్స్, లిట్టర్ బిన్స్ ను తొలగించి కొన్ని రోజులు బిన్స్ తొలగించిన ప్రాంతాలను పరిశీలించాలని, ఎవరైనా చెత్త ఆ ప్రాంతంలో వేసినచో వారి వద్ద నుండి అపరాధ రుసుం వసూలు చేయాలన్నారు. తడి-పొడి చెత్త పై మహిళలకు అవగాహన పెంచి, తడి చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేసే విధానాన్ని వారికి తెలియపరచాలన్నారు. అనంతరం, అల్లిపురంలోని పలు ప్రాంతాలలో పర్యటించి బహిరంగ ప్రదేశాలలో చెత్త ఉండటం గమనించి, ఆ వార్డు శానిటరి ఇన్స్పెక్టర్, సచివాలయ శానిటరీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రిని ఆదేశించారు. 
ఆంధ్ర యూనివర్సిటీ సర్క్యూట్ హౌస్, పోర్ట్ గెస్ట్ హౌస్, కిర్లంపూడి లే అవుట్, సాగర్ నగర్ తదితర ప్రాంతాలలో కుక్కలు, పందులను వెంటనే తొలగించాలని సిటీ వెటర్నరి డాక్టర్ కిషోర్ ను ఆదేశించారు. పోర్ట్ గెస్ట్ హౌస్ కు వెళ్లే రహదారిలో పండ్లు, కాయగూరలు అమ్మే వ్యాపారులు, ఫుట్ పాత్ ను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారని వారిని అక్కడ నుండి తొలగించాలని అధికారులను ఆదేశించారు.
 ఈ పర్యటనలో ప్రధాన  వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, నాలుగవ జోనల్ కమిషనర్ బి.వి.రమణ, సిటీ వెటర్నరి డాక్టర్ కిషోర్ ,పర్యవేక్షక ఇంజినీర్లు చిరంజీవి, గణేష్ కుమార్, ఎ.ఇ. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-06-25 16:27:00

మహిళా సాధికారతే జగనన్న లక్ష్యం..

మహిళా సాధికారతే జగనన్న లక్ష్యమని మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. శుక్రవారం 4వ జోన్ 29వ వార్డు సచివాలయంలో, ఆ వార్డ్ కార్పొరేటర్ ఊరుకూటి నారాయణరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ చేయూత, జగనన్నతోడు పథకంలో భాగంగా రూ.13.10లక్షలు మహిళలకు మేయర్ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, అప్పటి సుదీర్ఘ పాదయాత్రలో స్వయంగా  చూసి వారి సమస్యలను తెలుసుకున్నారు. మహిళలు స్వయం శక్తితో ఎదగాలని, వారి అభివృద్ధి కొరకు చిరు వ్యాపారాలు   చేయుటకు,  ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఉద్దేశ్యంతో వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు లాంటి ఎన్నో పథకాలను పెట్టి, వారిని ఆదుకున్నారని అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని మేయర్ తెలిపారు.

విశాఖ సిటీ

2021-06-25 16:24:04

కోవిడ్19 పై నేటికీ జాగ్రత్తగా ఉండాలి..

కరోనా19 వ్యాప్తిని పూర్తిగా నిలువరించేందుకు జిల్లా ప్రజలు కోవిడ్ నిబంధనలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం కరోనా నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నుంచి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలందరూ ఖచ్చితంగా  కోవిడ్ నిబంధనలు పాటించవలసినదిగా విజ్ఞప్తి చేశారు. కర్ఫ్యూ సమయములో సాయంత్రం 5.45 గంటల లోపు అన్ని దుకాణములు మూసి వేయాలన్నారు. అత్యవసర సేవల కోసం మినహా ప్రజలెవరూ బయటకు తిరగరాదన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలన్నారు. జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ఎవరు అలసత్వం చూపించ రాదని, ప్రతి ఒక్కరూ కోవిడ్ జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలు కూడా సాయంత్రం 5.45 గంటల తర్వాత ఇళ్లకు పరిమితమవ్వాలని సూచించారు. పోలీసులు ఆరు గంటల తర్వాత కఠినంగా కర్ఫ్యూ నిబంధనలు అమలు పరచాలని ఆదేశించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్లో డి సి హెచ్ ఎస్ రమేష్ నాథ్,  అడిషనల్ డిఎంహెచ్ఓ  రామ సుబ్బా రావు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ నీరజ పాల్గొన్నారు.

Anantapur

2021-06-25 16:16:08

జిల్లాల్లో ఇసుక కొరత రాకుండా చూడాలి..

వర్షా కాలంలో ఇసుక కొరత లేకుండా ఎక్కువ ఇసుక నిల్వలను సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్ లతో ఇసుక సరఫరా, నిల్వలపై రాష్ట్ర పంచాయతీరాజ్, ఇండస్ట్రీస్ మరియు కామర్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ వర్షా కాలం వచ్చే ముందే ఎక్కువ ఇసుకను జగనన్న ఇండ్ల స్థలాల లేఔట్ లకు సరఫరా చేయాలన్నారు. అనంతపురం జిల్లాలో ఇసుక సరఫరా కి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. ఇసుక రీచ్ నుండి వెంటనే వినియోగదారునికి ఇసుక సరఫరా కావాలన్నారు. ఇసుక రీచ్ లలో రోజు వారి ఇసుక ప్రొడక్షన్ మరియు డిపో ల దగ్గర ఉంచిన ఇసుక వివరములను జిల్లా యంత్రాంగంకు ఏజెన్సీ వారు అందజేయాలన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, అనంతపురం, కదిరి, రాయదుర్గం మరియు గుంతకల్ యందు కొత్త ఇసుక నిల్వ డిపో లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో కొత్తగా రొద్దం, పరిగి, రాయదుర్గం, యల్లనూర్ మరియు తాడిపత్రి మండలాలలో 10 ఇసుక రీచ్ లకు పర్యావరణ శాఖ నుండి  మాన్యువల్ త్రవ్వకాల నిమిత్తం ఈసి ఆర్డర్స్ వచ్చాయని, యంత్రంతో పని చేసేందుకు పర్యావరణ శాఖ వారికి ఈసి ఆర్డర్స్ మార్పు కోసం అనుమతి నిమిత్తం దరఖాస్తు చేశామని, పర్యావరణ శాఖ నుండి అనుమతులు రాగానే ఆ ప్రాంతంలలో ఏజెన్సీ వారికి ఇసుక త్రవ్వకాలకు అప్పజెప్పడం చేస్తామన్నారు. ఏజెన్సీ వారిని ఆన్లైన్ వ్యవస్థ ద్వారా పర్మిట్ లను వినియోగదారునికి జారీ చేయాలన్నారు. తృతీయ శ్రేణి వాగుల ద్వారా గవర్నమెంట్ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేసే పనులకు ఇసుక అనుమతి ఇవ్వవాల్సిందగా కోరారు. ఈ విషయమై ప్రిన్సిపల్  సెక్రెటరీ తృతీయ శ్రేణి వాగులలో ఇసుక అనుమతికి సంబందించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రజల అవసరాల నిమిత్తం అనంతపురం, కదిరి, రాయదుర్గం మరియు గుంతకల్ ప్రాంతాలలో ఇసుక నిల్వ డిపో లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో  అనంతపురం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నిశాంతి, మైన్స్ డిడి రమణారావు పలువురు పలువురు మైన్స్ అధికారులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-25 16:13:27

545సేవలపై అవగాహన కల్పించండి..

గ్రామ వార్డు సచివాలయాలలో కొన్ని రకాల సేవలు మాత్రమే ప్రజలు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారని, మొత్తం సచివాలయాలు అందించే 545 రకాల సేవల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు ఎప్పటికప్పుడు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కేవలం ఉద్యోగంలో చేరే ముందు ఒక్కసారి శిక్షణ ఇస్తే జీవిత కాలం అదే శిక్షణ సరిపోతుంది అనే భావన వీడాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా సచివాలయ ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలన్నారు. సచివాలయాలలో సేవలన్నీ ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు అధికారులు రోజువారీ పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఉన్నతాధికారులు ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంతంలోని సచివాలయాన్ని తనిఖీ చేసి రావడం ఒక అలవాటుగా చేసుకోవాలన్నారు. అధికారుల నిరంతర పర్యవేక్షణతోనే ప్రజలకు మెరుగైన సేవలు, నిర్ణీత సమయంలో దక్కుతాయన్నారు. 

జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోని సచివాలయాలలోనూ త్వరితగతిన ఆధార్ సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కేవైసీ కోసం ఉపయోగించే పరికరాల కొరత తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన వాలంటీర్ల నియామకాలు పునః ప్రారంభించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా. సిరి, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, మునిసిపల్ ఆర్డీ నాగరాజు, అనంత మునిసిపల్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, జెడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి , డిప్యూటీ సీఈవో శ్రీనివాసులు, డీపీవో పార్వతమ్మ, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Anantapur

2021-06-25 16:10:02

పారిశ్రామిక వేత్తలు ముందుకి రావాలి..

శ్రీకాకుళం జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకురావాలని, ప్రభుత్వం తరపున వారికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉందని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం శుక్రవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 290 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు దరఖాస్తులు చేసుకున్నారని, వాటిలో 264 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని, 14 దరఖాస్తులను త్రిప్పిపంపడం జరిగిందని,  12 దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగులో ఉన్నాయన్నారు. వచ్చిన దరఖాస్తులపై ఎప్పటికపుడు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పరిశ్రమలు నెలకొల్పేందుకు జిల్లా అన్నివిధాల అనుకూలంగా ఉంటుందని కలెక్టర్ చెప్పారు. నాగావళి నది నీటిని పరిశ్రమలకు వినియోగించుకునేందుకు సాధ్యసాధ్యాలపై సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ బి.గోపాలకృష్ణను కోరారు. అనంతరం పెండింగులో ఉన్న విషయాలపై చర్చించి జిల్లా కలెక్టర్ ఆమోదించడం జరిగింది.

జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ బి.గోపాలకృష్ణ మాట్లాడుతూ  జిల్లాలో 290 దరఖాస్తులు తమకు వచ్చాయని, వచ్చిన వాటిని సింగిల్ విండో విధానంలో ఆమోదించడం జరిగిందని చెప్పారు. వచ్చిన దరఖాస్తులపై వారం నుండి 21 రోజుల్లోగా అనుమతిని ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కు వివరించారు.  

ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు, జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ బి.గోపాలకృష్ణ, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జి.వి.బి.డి.హరిప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, జిల్లా అగ్నిమాపకదళ అధికారి సిహెచ్. కృపావరం, పి.వి.యస్.రామ్మోహన్, ఇతర అధికారులు, పారిశ్రామిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు.  

Srikakulam

2021-06-25 16:06:34