1 ENS Live Breaking News

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు..

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. రెండో ఏడాది వై.యస్.ఆర్.చేయూత కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుంచి పాల్గొన్న శాసన సభాపతి కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల పక్షపాతి అన్నారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి 45 నుండి 60 సంవత్సరాల వయస్సుగల మహిళలకు వై.యస్.ఆర్ చేయూతను అమలు చేయడం ముదావహమన్నారు. చేయూత కార్యక్రమం వలన వివిధ జీవనోపాధి కార్యక్రమాలు చేపడుతూ కుటుంబం ఆర్ధికంగా ముందంజ వేయుటకు సహాయం చేస్తున్నారని చెప్పారు. పేద అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో రూ.19వేల కోట్ల సాయం అందించే కార్యక్రమంలో భాగంగా వరుసగా రెండవ ఏడాది 23,14,342 మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,339.39 కోట్ల ఆర్ధిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు. వరుసగా నాలుగేళ్లు ప్రతీ ఏటా రూ.18,750/-లు చొప్పున మొత్తం రూ.75 వేలు ఆర్ధిక సహాయం అందిస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో మొదటి విడతలో 2,15,668 మంది లబ్ధిదారులు నమోదుచేసుకోగా, 1,91,417 మందికి వై.యస్.ఆర్.చేయూత పథకం అందించడం జరిగిందన్నారు. రెండో విడతలో 1,88,572 మంది నమోదుచేసుకోగా 1,85,475 మందికి అందిస్తున్నట్లు వివరించారు. ఇందులో యస్.సి లబ్ధిదారులు 18,482 మంది, యస్.టి లబ్ధిదారులు 10,227 మంది , బి.సి లబ్ధిదారులు 1,56,272 మంది కాగా మైనారిటీ వర్గాలకు చెందిన వారు 494 మంది వెరశి 1,85,475 మంది ఉన్నారని ఆయన తెలిపారు. లబ్దిదారులకు రూ.347.76 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని శాసన సభాపతి తెలిపారు.

Srikakulam

2021-06-22 12:19:56

త్వరలో నేరేడు బ్యారేజ్ కు శంకుస్థాపన..

నేరేడు బ్యారేజి నిర్మాణానికి అతి త్వరలో సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర  పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజు అన్నారు. వైయస్సార్ చేయూత కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుండి పాల్గొన్న డాక్టర్ అప్పలరాజు కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. వంశధార రెండవ దశ పూర్తి చేసే గొప్ప అవకాశం వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు రావడం ఎంతో సంతోషించదగిన విషయం అని ఆయన అన్నారు. ఒడిశా రాష్ట్రానికి ట్రిబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణానికి ట్రైబ్యునల్‌ అనుమతించడమే కాకుండా ఏపీ అవసరాలకోసం బ్యారేజీకి కుడివైపున హెడ్‌ స్లూయిస్‌ నిర్మాణానికి అంగీకారం తెలిపిందని ఆయన అన్నారు. 8వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి స్లూయిస్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం హర్షించదగిన పరిణామమని ఆయన తెలిపారు. ఒడిశా అవసరాల కోసం ఎడమ వైపున స్లూయిస్‌ నిర్మాణానికి ట్రైబ్యునల్‌ అంగీకారం తెలియజేస్తూ ఎంత సామర్థ్యంతో ఎడమ స్లూయిస్‌ కావాలో గెజిట్‌ విడుదల చేసిన 6 నెలల లోపు రాష్ట్రానికి ఒడిశా తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసిందని మంత్రి వివరించారు. ఎడమ స్లూయిస్‌ కోసం అయ్యే ఖర్చును ఒడిశా భరించాలని  ట్రైబ్యునల్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పారు. జూన్‌ నుంచి నవంబర్‌ వరకూ నీటిని తరలించుటకు రాష్ట్రానికి ట్రైబ్యునల్‌ అనుమతి ఇవవడం వలన శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలం కానుందని అన్నారు. నేరడి బ్యారేజీ కోసం ఒడిశాలో ముంపునకు గురవుతున్న 106 ఎకరాల భూమిని ఒడిశా సేకరించి ఇవ్వాలని, దాని కోసం అయ్యే ఖర్చును రాష్ట్రం భరించాలని తీర్పు ఇవ్వడం శుభపరిణామమని అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పెద్ద ఎత్తున కృషి చేయగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆ కలను సాకారం చేశారని మంత్రి అన్నారు. ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి తో సంప్రదించుటకు సిద్ధంగా ఉన్నామని గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి లేఖ కూడా రాసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. నేరేడు బ్యారేజి నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయని పేర్కొన్నారు.

Srikakulam

2021-06-22 12:19:00

పథకాలపై అవగాహన కల్పించాలి..

ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో విస్తృత‌మైన అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా, అర్హులంద‌రికీ వాటిని అందేలా చూడాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జె.వెంక‌ట‌రావు కోరారు. ప్ర‌భుత్వ అత్యంత ప్రాధాన్య‌తా కార్య‌క్ర‌మాలైన‌ న‌వ‌ర‌త్నాలుపై, వ‌ర‌ల్డ్ విజ‌న్ ఏర్పాటు చేసిన రెండు ప్ర‌చార వాహ‌నాల‌ను, స్థానిక యూత్ హాస్ట‌ల్ వ‌ద్ద  జాయింట్ క‌లెక్ట‌ర్ మంగ‌ళ‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా జెసి వెంక‌ట‌రావు మాట్లాడుతూ, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ప్ర‌చారానికి ముందుకు వ‌చ్చిన వ‌ర‌ల్డ్ విజ‌న్‌ను, ఆ సంస్థ చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాల‌ను అభినందించారు. ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని కేవ‌లం ఒక‌టిరెండు మండ‌లాల‌కే ప‌రిమితం చేయ‌కుండా, జిల్లా అంత‌టా నిర్వ‌హించాల‌ని కోరారు. పేద‌ల‌ను ఆదుకొనేందుకు సంస్థ చేసిన కార్య‌క్ర‌మాల‌ను కొనియాడారు. ఈ సంద‌ర్భంగా వ‌ర‌ల్డ్ విజ‌న్ ఆధ్వ‌ర్యంలో ఒక్కో యూనిట్ ప‌దివేల రూపాయ‌ల చొప్పున‌ ముగ్గురికి తోపుడు బ‌ళ్ల‌ను, ఐదుగురికి కిరాణా యూనిట్ల‌ను, ఇద్ద‌రికి కుట్టు మిష‌న్ల‌ను, ఒక‌రికి ఎంబ్రాయిడ‌రీ మిష‌న్ ను అంద‌జేశారు. అలాగే సుమారు వంద‌మందికి శానిటైజ‌ర్లు, మాస్కులు, గ్లౌజుల‌ను పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సెట్విజ్ సిఇఓ విజ‌యకుమార్‌, వ‌ర‌ల్డ్ విజ‌న్ ప్ర‌తినిధులు అంబేద్క‌ర్‌, ల‌క్ష్మ‌ణ్‌, నాగేశ్వ‌ర్రావు, గోపాల్‌, గ్రేస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-22 12:07:58

కోవిడ్ మూడవ దశకు ప్రణాళికలు..

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ మూడవ దశను ఎదుర్కొనుటకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. స్వచ్చంధ సంస్ధ ఆర్ట్స్ గివ్ ఇండియా అండ్ ఏక్షన్ ఎయిడ్ సంస్ధ సహకారంతో 30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను జాయింట్ కలెక్టర్ కు మంగళ వారం జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద అందజేసింది. 30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లలో 10 లీటర్ల సామర్ధ్యం గలవి 15, 5 లీటర్ల సామర్ధ్యం గలవి 15 ఉన్నాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో మూడవ దశ కోవిడ్ వ్యాప్తి చెందితే ఎదుర్కొనుటకు ఇప్పటి నుండే అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అందులో భాగంగా ఆర్ట్స్ సంస్ధ సమకూర్చిన 30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కూడా ఉపయోగించుటకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వీటిని గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలు, సామాజిక ఆసుపత్రులు తదితర గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో పెడతామని ఆయన పేర్కొన్నారు. తద్వారా అవసరం ఉన్నవారికి తక్షణం వైద్య సహాయం అందుతుందని చెప్పారు. జిల్లాలో మూడవ దశ వ్యాపించకుండా ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని శ్రీనివాసుల కోరారు. మొదటి, రెండవ దశ కరోనా ప్రభావాన్ని ప్రత్యంగా చూసామని వాటి అనుభవం దృష్ట్యా ప్రజలు మాస్కులు ధరించడం మరిచిపోరాదని అన్నారు. భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రపరచడం అవసరమని ఆయన సూచించారు. 

మూడవ దశలో పిల్లలపై ప్రభావం ఉంటుందని పలువురు తెలియజేస్తున్న వార్తలను సైతం చూస్తున్నామని పేర్కొంటూ కోవిడ్ పై అవగాహన కలిగి దాని ప్రభావం లేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని విజ్ఞప్తి చేసారు. జిల్లాలో కోవిడ్ నివారణకు జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిన సంగతి గుర్తు చేసారు. మూడవ దశను కూడా ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉన్నామని అయినప్పటికి ప్రజలు సహకరిస్తే జిల్లాలో వ్యాప్తి లేకుండా అరికట్టవచ్చని పేర్కొన్నారు. వాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున చేపడుతున్నామని ఆయన తెలియజేసారు. 45 సంవత్సరాలు పైబడినవారికి, 5 సంవత్సరాల లోపు చిన్నారుల తల్లలకు, హెల్త్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రాధాన్యతతో వాక్సినేషన్ చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.

ఆర్ట్స్ సంస్ధ అధ్యక్షులు నూక సన్యాసి రావు మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ నివారణలో భాగంగా తమ సంస్ధ సహకరిస్తుందన్నారు. రూ.24 లక్షల విలువగల 30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను గివ్ ఇండియా అండ్ ఏక్షన్ ఎయిడ్ సంస్ధ సహకారంతో అందిస్తున్నామని చెప్పారు.  ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్ధ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జగన్మోహన రావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం

2021-06-22 12:00:05

ప్రజల సహకారంతో క్లాప్ విజయవంతం..

ప్రజలందరూ కలసికట్టుగా క్లాప్ ను విజయవంతం చేద్దామని నగర మేయర్ వసీం పిలుపునిచ్చారు.  మున్సిపల్ ఆర్ డి కార్యాలయంలో క్లాప్ కార్యక్రమంపై కార్పొరేటర్లు, రిసోర్స్ పర్సన్స్, కమ్యూనిటీ ఆర్గనైజర్లుకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  నగర మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ, ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ క్లాప్ గొప్ప కార్యక్రమమన్నారు.పారిశుధ్యం ను మెరుగు పరిచేందుకు క్లాప్ కార్యక్రమం ఎంతో ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. క్లాప్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అందులో మనమంతా భాగస్వామ్యం కావాలన్నారు. క్లాప్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాష్ట్రంలో అనంతపురం నగరాన్ని అగ్రస్థానంలో నిలుపుదామని పిలుపునిచ్చారు .ఈ సందర్భంగా క్లాప్ కార్యక్రమంపై అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వాసంతి, నగర కమిషనర్ పివివిఎస్ మూర్తి డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి, మెప్మా పిడి రమణా రెడ్డి,ఎన్విరాల్మెంట్ డి ఈ రాంప్రసాద్ రెడ్డి,మెప్మా, సాహిత్య,రీజినల్ డైరెక్టర్ నాగరాజు, రోజా తదితరులు పాల్గొన్నారు.  

Anantapur

2021-06-21 15:11:43

యోగాతో అందరికీ సంపూర్ణ ఆరోగ్యం..

కరోనా సమయంలో ప్రతీ ఒక్కరూ యోగా ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంపొదించుకొని కరోనా వైరస్ ను తరిమి కొట్టాలని ఈఓ ఎంవీ సూర్యకళ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానానికి చెందిన కృష్ణాపురం గోశాలలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు యోగాపై అవగాహన, శిక్షణ శిబిరం నిర్వహించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ, యోగా ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుకోవచ్చన్నారు. దేవస్థానం తరుపున వివేకానంద యోగా కేంద్రం ఉందని.. దీన్ని మరింత వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. యోగా వలన పదిమందికీ ఉపయోగం కలగాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ప్రతీ ఒక్కరూ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడే కాదు ప్రతిరోజూ యోగా చేయాలని కోరారు. తనకు వీలుచిక్కినప్పుడల్లా దేవస్థానం యోగా సెంటర్లో యోగా ప్రాక్టీస్ చేస్తానన్నారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈఓతోపాటు ఉద్యోగులు కూడా ఉత్సాహంగా యోగసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు బోర్డు సభ్యులు నరసింహరావు నాయుడు,సూరిబాబు, DEO సుజాత, ఏఈఓ ఆనందకుమార్, ఏఈ హరి తదితరులు పాల్గొన్నారు. 

Simhachalam

2021-06-21 15:04:59

ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి లక్షమాస్కులు..

గుంటూరు జిల్లాలో కోవిడ్–19 ఫ్రంట్లైన్ వర్కర్స్ కోసం హైదరాబాదులోని మెస్సర్స్ ఎఫ్సీఎన్ ఇమ్పెక్స్ ఇండియా ఎల్ఎల్పి సంస్థ లక్ష మాస్కులు వితరణ చేసినట్టు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలియజేశారు. ఈ సందర్భగా సంస్థ  పంపిన లక్ష మాస్క్లను సోమవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో  జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజరు ఏవీ పటేల్, ఏపీఐఐసీ జోనల్ మేనేజరు వి గోపి క్రిష్ణ స్వయంగా వాటిని కలెక్టర్ కి అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా సమయంలో దాతలు ఎంతో ఉదారంగా స్పందిస్తున్నారన్నారు. మరింత మంది దాతలు ముందుకి రావడం ద్వారా కరోనా సోకిన నిరుపేద ప్రజలకు, ఫ్రంట్ లైన్ వర్కర్లుకు మరింత సాయం అందించడానికి వీలుపడుతుందని చెప్పారు. 

Guntur

2021-06-21 14:55:24

ట్రిబ్యునల్ తీర్పుపై డిప్యూటీ సీఎం హర్షం..

బి.అర్.అర్. వంశధార ప్రాజెక్టుకు ఆయువు పట్టైన నేరడి బ్యారేజి నిర్మాణానికి వంశధార ట్రిబ్యునల్ సానుకూలంగా తీర్పును వెల్లడించడం పట్ల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సోమవారం మీడియాతో మాట్లాడారు. నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణానికి గతంలోనే  ట్రైబ్యునల్‌ అనుమతి ఇచ్చినప్పటికీ గత పాలకులు నిర్లక్ష్యం కారణంగానే సమస్య జఠిలం అయ్యిందని ఆయన పేర్కొన్నారు. గత ఏప్రిల్ 16వ తేదీన ఈ విషయమై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారని, సమస్య పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడు వచ్చి మాట్లాడేందుకు సిద్ధమని పేర్కొన్నారని గుర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా సాగు నీటి అవసరాల కోసం వంశధార ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ఈ దశలో కేవలం 106 ఎకరాల తమ భూమి ముంపునకు గురవుతోందని ఒడిస్సా అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఏపీ ప్రభుత్వం సదరు భూసేకరణకు అవసరమైన మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వంశధార నదికి ఎడమవైపున   ఒడిస్సా భూభాగంలో బ్యారేజీకి స్లూయిస్ నిర్మించాలన్న ట్రిబ్యునల్ ఆదేశాలను కచ్చితంగా పాటిస్తామని స్పష్టం చేశారు. దశాబ్దాల తరబడి నలుగుతున్న నేరడి బ్యారేజి సమస్యకు ఇప్పటికైనా పరిష్కారం దొరకడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ట్రిబ్యునల్  సూచించిన విధంగా 8వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి స్లూయిస్‌ నిర్మాణాన్ని రానున్న మూడేళ్లలో పూర్తి చేసి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి కలలు కన్న వంశధార ప్రాజెక్టును పూర్తి చేసి శ్రీకాకుళం రైతాంగానికి అంకితం ఇస్తామని కృష్ణ దాస్ పేర్కొన్నారు.

Srikakulam

2021-06-21 14:51:10

1,93,231 మందికి చేయూత లబ్ధి..

వై.ఎస్.ఆర్ చేయూత పధకం కింద రెండవ సంవత్సరం 1,93,231 మంది లబ్దిదారులకు రూ.4234.05కోట్లు పంపిణి చేయనున్నట్లు  జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 45–60 సంవత్సరాల మధ్య గల ఎస్.సి, ఎస్.టి, బి.సి, మరియు మైనారిటీ సామాజిక వర్గాలలో ఉన్న మహిళలకు ఆర్ధికంగా అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం వై.ఎస్.ఆర్ చేయూత పధకంను ప్రారంబించడం జరిగిందన్నారు. ఈ పధకం కింద అర్హులైన లబ్దిదారురాలుకు సంవత్సరానికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75,000 ఆర్ధిక సాయాన్ని అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రెండవ సంవత్సరం అందించే ఆర్ధిక సాయాన్ని ఈ నెల 22 న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ విధానం ద్వారా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి  జమచేస్తారన్నారు.  వై.ఎస్.ఆర్ చేయూత పధకం కింద రెండవ సంవత్సరం 1,93,231మంది లబ్దిదారులకు రూ.4234.05 కోట్లు లబ్ది ..  గిరిజన కార్పొరేషన్ ద్వారా 8,485 మంచి లబ్ధిదారులు, బీసీ కార్పొరేషన్ ద్వారా 1,24,782 మంది లబ్ధిదారులు.  క్రిస్టియన్  మరియు మైనార్టీ కార్పొరేషన్ 179 మంది లబ్ధిదారులు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా  23,462  లబ్ధిదారులు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 36,323  మంది లబ్ధిదారులు  ఎంపిక చేయడం జరిగిందని  పైప్రకటనలో తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు  స్థానిక కలెక్టరేట్లోని  వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు  రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి  శంకర్ నారాయణ,  ప్రభుత్వ విప్, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

Anantapur

2021-06-21 14:46:34

కోవిడ్ కేసులు తగ్గినా జాగ్రత్తగా ఉండాలి..

కోవిడ్ కేసులు తగ్గినా పూర్తిగా తగ్గిపోలేదని, అధికారులంతా మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లోని విసి హాల్ నుంచి కోవిడ్, ఎన్ఆర్ఈజిఎస్ పనుల కల్పన, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు, అంగన్వాడి కేంద్రాల నిర్మాణం, వైఎస్సార్ అర్బన్ క్లినిక్ లు, పేదలందరికి ఇల్లు కింద ఇళ్ల గ్రౌండింగ్, ఇంటి పట్టాల పంపిణీ, ఖరీఫ్ 2021 సన్నద్ధతపై జిల్లాలోని ఆర్డీఓలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ లు, ఎంపిడివోలు, స్పెషల్ ఆఫీసర్ లు, మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో మాస్కులు వాడకంపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నో మాస్క్ నో ఎంట్రీ అంటూ గ్రామ సచివాలయం, వార్డు పరిధిలో అవగాహన చేపట్టాలని, నో మాస్క్ నో సేల్ అంటూ దుకాణాల యజమానులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని, నో మాస్క్ నో రైడ్ అంటూ ఆర్టీసీ బస్సులు, ఆటోలు, వాహనాల్లో ప్రజలెవరూ మాస్కులు లేకుండా ప్రయాణించకుండా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 

కోవిడ్ కేసులు తగ్గినా కోవిడ్ నిబంధనలను పాటించాలని, కేసులు పెరగకుండా చూడాలని, కరోనా కారణంగా ఎవరూ మరణించకూడదని, ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా సచివాలయం పరిధిలో పాజిటివ్ రేటు 2 శాతం కన్నా తక్కువగా వచ్చేలా చూడాలని, ప్రతి ఒక్కరూ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ ను పాటించాలన్నారు. గ్రామాల్లో ఫీవర్ సర్వే ను సోమవారం నుంచి శుక్రవారం వరకు తప్పనిసరిగా నిర్వహించాలని, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, వాలంటీర్లు ఫీవర్ సర్వే ను పరిశీలించాలని, కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలన్నారు. కాంట్రాక్ట్ ట్రేసింగ్, శాంపుల్స్ సేకరణ జాగ్రత్తగా చేయాలని, కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి మెడికల్ కిట్లు అందజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి కర్ఫ్యూ సడలింపులు ఇచ్చిందని, ఉదయం 6 నుంచి సాయంకాలం 6 గంటల వరకు సాధారణ కార్యకలాపాలు జరుగుతాయని, అనంతరం రాత్రి నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ నేపథ్యంలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలన్నారు.

కోవిడ్ వ్యాక్సినేషన్ నేపథ్యంలో జిల్లాకు కేటాయించిన 90 వేల డోసుల వ్యాక్సినేషన్ లక్ష్యాలను పూర్తి చేయడం అభినందనీయమని, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, వాలంటీర్లు, మండల స్థాయి స్పెషలాఫీసర్ లు, మెడికల్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వ్యాక్సిన్ పై బాగా అవగాహన కల్పించారని, వారిని అభినందించారు. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పనులను కూలీలందరికీ కల్పించాలని, ఆయా మండలాలకు కేటాయించిన లక్ష్యాలను చేరుకోవాలని, ఉపాధి పనుల కల్పనలో వెనుకబడిన మండలాలు వెంటనే పురోగతి చూపించాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నిశాంతి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్, డిఆర్ఓ గాయత్రీదేవి, పంచాయతీరాజ్ ఎస్ఈ భాగ్యరాజ్, వివిధ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-21 14:45:14

ప్రభుత్వ నిర్మాణాల వేగం పెంచాలి..

ఎన్ఆర్ఈజిఎస్ కింద చేపట్టిన గ్రామ సచివాలయ భవనాల నిర్మాణంలో భాగంగా జూలై ఒకటో తేదీ కల్లా 75 శాతం భవన నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్  అధికారులను ఆదేశించారు. సోమవారం ఈ మేరకు కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులంతా సచివాలయ భవనాల నిర్మాణంలో సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు. అలాగే రైతు భరోసా కేంద్రాల భవనాల నిర్మాణంలో కూడా జూలై 8వ తేదీ కల్లా 300 భవనాలు పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండేలా చూడాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. పూర్తి అయ్యే దశలో ఉన్న రైతు భరోసా కేంద్రం భవనాలు వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైయస్సార్ హెల్త్ క్లినిక్ లు కూడా జూలై 31వ తేదీ కల్లా 50 శాతం పూర్తి చేయాలన్నారు. గ్రామ సచివాలయ భవనాల నిర్మాణంలో, రైతు భరోసా కేంద్రాల భవనాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించి పనులు చేపట్టాలన్నారు. ఆగస్టు 2వ తేదీ కల్లా అన్ని సచివాలయ భవనాల నిర్మాణాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణాలు 100 శాతం పూర్తయ్యేలా అధికారులు త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే వైయస్సార్ అర్బన్ క్లినిక్ నిర్మాణంలో భాగంగా రెండు రోజుల్లోగా భవన నిర్మాణాలు గ్రౌండింగ్ చేయాలని, గ్రామం, సచివాలయం వారీగా ప్రణాళిక రూపొందించుకొని పనులు పూర్తి చేయాలన్నారు. ఖరీఫ్ సన్నద్ధతలో భాగంగా అధికారులు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలన్నారు. నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు లో భాగంగా ఇంటి నిర్మాణాలను వెంటనే ఆషాడ మాసం మొదలు అయ్యే లోగా 100 గ్రౌండింగ్ చేపట్టాలన్నారు. ఇంటి నిర్మాణాలు మొదలు పెట్టేందుకు అనుగుణంగా లేఔట్లలో అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. ఈ నెలాఖరులోపు లేఔట్లలో అన్ని రకాల సదుపాయాల కల్పన పూర్తి కావాలన్నారు. అలాగే ఇంటి పట్టా కావాలని దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దేశించిన గడువులోగా ఇంటి పట్టా ఇవ్వాలన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు నిర్మాణంలో భాగంగా ఏడిఏలు, ఏఓ లు  భవన నిర్మాణాలను పరిశీలించాలన్నారు. జూలై 8వ తేదీ నాటికి 300 ఆర్బికేలు ప్రారంభించేలా జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని, ఏవో లు, పంచాయతీరాజ్ ఏఈలు సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు వాడాలని అవగాహన కల్పించాలని, మాస్కులు వాడకపోతే 100 రూపాయల చొప్పున ఫైన్ వేయాలన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. ప్రజలకు 104 కాల్ సెంటర్ పై కూడా అవగాహన కల్పించాలన్నారు. సచివాలయాలకు వచ్చే సర్వీసులు మరింత పెరగాలన్నారు. గడువు తీరిన సమస్యలు పెండింగ్ ఉండడానికి వీలు లేదని, వెంటనే ఇక్కడ వచ్చిన సమస్యలను పరిష్కరించాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నిశాంతి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్, డిఆర్ఓ గాయత్రీదేవి, పంచాయతీరాజ్ ఎస్ఈ భాగ్యరాజ్, వివిధ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-21 14:42:34

యోగ అందరి ఆరోగ్య ప్రదాయని..

యోగ ఆరోగ్యప్రదాయని అని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంను జిల్లా క్రీడాప్రాధికార సంస్ధ ఆధ్వర్యంలో శాంతినగర్ ఇండోర్ స్టేడియంలో  సోమ వారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. పతంజలి యోగ నిపుణులు డి.చిన్నబాబు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగ నిపుణులు సుధారాణి యోగ ఆసనాలకు మార్గదర్శకత్వం వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ యోగ ఆసనాలను సునాయాసంగా వేసారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యోగ అంటే ఆరోగ్యం అన్నారు. వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఆరోగ్యం పట్ల అశ్రద్ద వహించడం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య ప్రాధాన్యతను గుర్తంచి రోజుకు కనీసం గంట సమయం కేటాయించాలని సూచించారు. జీవన శైలి, ఆహారపు అలవాట్లు మారాయని, వాతావరణంలో మార్పులు గమనిస్తున్నామని తదనుగుణంగా ఆరోగ్య పరిరక్షణ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. యోగ ఆరోగ్య కల్పనకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మోబైల్ ఫోన్లు, టెలివిజన్ లకు అతుక్కుంటున్నారని కనీస వ్యాయామం చేయడంలో అశ్రద్ద వహిస్తున్నారని అన్నారు. దీని వలన మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులకు సునాయాసంగా గురి అవుతున్నారని కలెక్టర్ చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు కొంత సమయం కేటాయించి సాధారణ ఆసనాలు వేసినప్పటికి ఆరోగ్యంగా ఉండగలమని గ్రహించాలని ఆయన పేర్కొన్నారు.

        ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.కిషోర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి మరియు సెట్ శ్రీ సిఇఓ జి.శ్రీనివాస రావు, క్రీడా ప్రాధికార సంస్ధ చీఫ్ కోచ్ బి.శ్రీనివాస కుమార్, పర్యాటక అధికారి ఎన్.నారాయణ రావు, నెహ్రూ యువ కేంద్ర ఇన్ ఛార్జ్ జిల్లా సమన్వయ అధికారి శ్రీనివాస రావు, క్రీడా ప్రాధికార సంస్ధ కోచ్ లు సూరిబాబు, శ్రీధర్, మాధురి, ఉమామహేశ్వర రావు, ఆయుష్ వైద్యులు డా.మాధవ రావు చౌదరి, డా. సి.హెచ్.మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ ను క్రీడాప్రాధికార కోచ్ లు మర్యాదపూర్వకంగా కలిసి పష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం షటిల్ కోర్టు వివరాలు తెలుసుకున్న కలెక్టర్ కొద్ది సేపు షటిల్ బాడ్మింటన్ ఆడి కోర్టుల పరిస్ధితిని పరిశీలించారు. క్రీడలకు సౌకర్యాలు బాగా మెరుగుపరచాలని ఆయన సూచించారు. అందుకు అవసరమగు నివేదికను తయారు చేయాలని అన్నారు.
 

Srikakulam

2021-06-21 14:29:24

జిల్లా కలెక్టర్ ను కలిసిన సబ్ కలెక్టర్..

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా నియమించిన  రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఇలక్కియా సోమవారం కలెక్టరేట్ లో కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఇలక్కియా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ)డా జి. లక్ష్మీ శ, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)కీర్తి చేకూరిని  కలిసి పుష్పగుచ్ఛం అందించారు. తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన రాజమహేంద్రవరం డివిజన్ సబ్ కలెక్టర్ గా సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అన్ని డివిజన్ వాసులందరికీ సక్రమంగా అందే విధంగా తన వంతు కృషి చేస్తానని  ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

Kakinada

2021-06-21 13:57:50

కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు..

కోవిడ్ కేసులు ఇంకా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రస్తుతం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు అమలులో ఉన్న క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు జూన్ 21 నుంచి 30వ తేదీ వ‌ర‌కు య‌థాత‌థంగా కొన‌సాగుతాయ‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి  ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కర్ఫ్యూ సమయంలో అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల‌కు మాత్ర‌మే మిన‌హాయింపు ఉంటుంద‌ని, ఎవ‌రైనా నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే విప‌త్తు నిర్వ‌హ‌ణ చ‌ట్టంలోని సెక్ష‌న్ 51-60; ఐపీసీ సెక్షన్188, ఇత‌ర వ‌ర్తింపు చ‌ట్టాల మేర‌కు చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. అదే విధంగా  కోవిడ్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 8.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. ఈ నిబంధ‌న‌ల క‌చ్చిత అమ‌లుకు కాకినాడ‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎస్‌పీలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, జిల్లా, డివిజ‌న‌ల్‌, మండ‌ల స్థాయి అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

Kakinada

2021-06-21 13:56:13