1 ENS Live Breaking News

జూలై 10న జిల్లాలో లోక్ అదాలత్..

జాతీయ లీగ‌ల్ సెల్ అథారిటీ ఆదేశాల మేర‌కు, జులై 10న‌ జిల్లా వ్యాప్తంగా జాతీయ‌ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికారసంస్థ ఛైర్మెన్ గుత్తల గోపి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ నెల 26న జ‌ర‌గాల్సిన వ‌ర్చువ‌ల్‌ లోక్ అదాల‌త్‌ను ర‌ద్దు చేయ‌డం జ‌రిగింద‌ని, దానికి బ‌దులుగా 10 న జాతీయ లోక్ అదాల‌త్‌లో క‌లిపి నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఈ అదాలత్ ద్వారా వివిధ రకాల సివిల్, క్రిమినల్ కేసులు, భూ తగాదాలు, ఎక్స్సైజ్, విద్యుత్ , ఫ్యామిలీ,  బ్యాంకులకు సంబంధించిన కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా కు సంబంధించిన కేసులను ఇరు పక్షాల అంగీకారంతో, రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చునని సూచించారు. ఈ అదాలత్ లో తమతో పాటుగా, సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి లక్ష్మీరాజ్యం కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి కోరారు.

Vizianagaram

2021-06-21 13:49:11

సమస్యలపై సత్వరమే స్పందించండి..

గుంటూరు కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి  జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. తొలి రోజు 24 మంది తమకున్న సమస్యలను ‘డయల్ యువర్ కలెక్టర్’కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ దృష్ఠికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యలను ఫోన్ ద్వారా విన్న జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని వారికి  భరోసా కల్పించారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమం 11గంటల వరకు కొనసాగింది. ఎక్కువగా గుంటూరు జిల్లా గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీలలోని వారి నుంచి అందిన ఫిర్యాదులు ఉన్నాయి.  తాడేపల్లి మున్సిపాలిటీ కి చెందిన ఆయేషా తనకు ఇంటి స్థలం, వంటరి మహిళ పెన్షన్ ఇప్పించాలని కోరారు.  సంబంధిత అధికారులకు  మీ  సమస్యను పంపి  పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. నరసరావుపేటకు చెందిన రహమతుల్లా, కర్లపాలెంకు చెందిన ఏసమ్మ లు తమకు ఇంటి స్థలం ఇప్పించాలని కోరగా, దరఖాస్తులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవమని అధికారులకు ఆదేశిస్తామని   జిల్లా కలెక్టర్  తెలిపారు. 

గుంటూరు నగరంలోని ఎన్.టి.ఆర్ స్టేడియం ప్రాంతానికి చెందిన రాటల మల్లేశ్వరి, క్రోసూరు మండలం, గుడిపాడు గ్రామానికి చెందిన మహబూబ్ వలి, నూజండ్ల మండలం,ములకలూరు గ్రామానికి చెందిన మందా వెంకటేశ్వర్లు, యడ్లపాడుకు చెందిన చందు తమ కుటుంబాలకు వై.యస్.ఆర్ చేయూత పధకం అమలు అయ్యేలా అవకాశం కల్పించాలని కోరారు. సంబంధిత మండల అధికారులకు తగు సూచనలు జారీ చేసి వైఎస్సార్ వైఎస్సార్  చేయూత లబ్ది చేకూరేలా చర్యలు  తీసుకుంటామని జిల్లా కలెక్టర్  తెలిపారు. పెదకాకాని రోడ్డు నివాసితుడు సి.హెచ్. విజయబాబు తనకు వాహన మిత్ర పధకం కింద డబ్బులు జమకాలేదని  తెలుపగా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ వారి దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.  

వినుకొండకు చెందిన పఠాన్ ఆసియా బేగం, చిలకలూరిపేటకు చెందిన నూతలపాటి యామలమ్మలు  తమకు వితంతు పెన్షన్ ఇప్పించాలని కోరాగా, సమస్య పరిష్కరించేందుకు  సంబంధిత అధికారులకు  ఆదేశాలు జారీ చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.  సమస్యలను సావధానంగా విన్న జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ వెంటనే ఫిర్యాదులను పరిష్కరించి వివరాలను తెలియజేయాలని, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో పాల్గొన్న సంబంధిత జిల్లా  అధికారులను ఆదేశించారు.  ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవెన్యూ) దినేష్ కుమార్, జిల్లా సంయుక్త కలెక్టర్ ( ఆసరా, సంక్షేమం) శ్రీధర్ రెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టర్ ( సచివాలయాలు, అభివృద్ధి )  ప్రశాంతి, జిల్లా సంయుక్త కలెక్టర్ (గృహనిర్మాణం) అనుపమ అంజలి, డి.ఆర్.వొ. కొండయ్య, జడ్పీ సీఈవొ చైతన్య, డి.ఆర్. డి.ఏ పి.డి ఆనంద నాయక్, డ్వామా పి.డి శ్రీనివాసరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. 

Collector Office

2021-06-21 13:45:10

సొసైటీ భూములు పరిశీలించిన కలెక్టర్..

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కోలోనైజేషన సోసైటీ భూములను సోమవారం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్ తో కలిసి పరిశీలించారు. భూముల విస్తీర్ణం మ్యాపులను, అడంగల్, ఆర్ఎస్ఆర్లో ఉన్న భూముల స్వభావం వివరాలను,  అనుభవదారుల వివరాలకు సంబందించి రెవెన్యూ రికార్డులను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్  పరిశీలించి, రెవెన్యూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట  ఇన్చార్జి ఆర్డీవో పార్ధసారధి, చిలకలూరిపేట ఇన్చార్జి తహశీల్దారు మల్లిఖార్జునరావు, జిల్లా సహకార అధికారి రాజశేఖర్, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదనరావు, మైనింగ్ ఏడీ విష్ణువర్థన రావు, రెవెన్యూ అధికారులు  పాల్గొన్నారు.

Chilakaluripet

2021-06-21 13:40:31

ఆసరా ఫౌండేషన్ సాయం మరువలేనిది..

కరోనా వైరస్ సమయంలో ప్రజలకు వైద్యసేవలందించేందుకు ఆసరా ఫౌండేషన్ ముందుకొచ్చి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించడం నిజంగా అభినందనీయమని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన పేర్కొన్నారు. సోమవారం జివిఎంసికి 50 ఆక్షిజన్ కాన్సంట్రేటర్లు ఆసరా ఫౌండేషన్  ఉచితంగా అందించింది. కోవిడ్ బారిన పడిన రోగులకు ఆక్షిజన్ అందించాలనే సంకల్పంతో రూ.56 లక్షల విలువైన 50 ఆక్షిజన్ కాన్సంట్రేటర్లను ఆసరా ఫౌండేషన్ ప్రతినిధులు  జివిఎంసి కమిషనర్ ను  ఆమె ఛాంబార్లో కలసి అందించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ,ముడసర్లోవ కోవిడ్ సెంటర్లో కోవిడ్ రోగులకు చేసిన సేవలకు ముగ్దులై వీటిని అందింస్తున్నామన్నారు. వీటిలో 40 ఆక్షిజన్ కాన్సంట్రేటర్లను ముడసర్లోవ కోవిడ్ సెంటర్ నకు, 10 ఆక్షిజన్ కాన్సంట్రేటర్లను జివిఎంసి పరిధిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించామని కమిషనర్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సంస్థలు ముందుకు వచ్చి కోవిడ్ నియంత్రణకు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసరా ఫౌండేషన్ ప్రతినిధులు ప్రెసిడెంట్ రామారావు, జాయింట్ సెక్రటరి వినయ్ మొదలైన వారు పాల్గొనగా జివిఎంసి నుండి అదనపు కమిషనర్ డా. వి.సన్యాసి రావు, ముడసర్లోవ కోవిడ్ కేర్ సెంటర్ నోడల్ అధికారి డా. కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

GVMC office

2021-06-21 13:30:18

వైఎస్సార్ కాలనీల్లో మౌళిక సదుపాయాలు..

నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు సంబంధించి సిద్ధం చేసిన లేఔవుట్లలో  మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి,  జిల్లాలో గృహ నిర్మాణాలు వేగవంతం చెయ్యాలని  జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)ఎ.భార్గవ్ తేజ్ అధికారులను ఆదేశించారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ జాయింట్ కలెక్టర్ గా ఎ.భార్గవ్ తేజ్ బాధ్యతలు స్వీకరించినక తొలిసారిగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో  జిల్లాలో నవరత్నాలు -పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించి లేఔవుట్ల ప్రస్తుత పరిస్థితి,  గృహనిర్మాణలు, ఇతర అంశాలపై గృహ నిర్మాణ శాఖ, గ్రౌండ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, పంచాయితీరాజ్ , జిల్లా గ్రామీణ అభివృద్ధి, డ్వామ,ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ పై అధికారులకు దిశానిర్దేశం చేశారు . ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ్ మాట్లాడుతూ వైయస్సార్ జగనన్న హౌసింగ్ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో తొలి దశలో 825 లేఔవుట్లలో 1లక్ష 48వేల 526 గృహా నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. లేఔవుట్ల వారిగా నోడల్ అధికారిని కేటాయించి  గ్రౌండింగ్ వివరాలు ఎప్పటికప్పుడు అందించాలన్నారు. ప్రతి లేఔవుట్లలో త్రాగునీరు, ఎలక్ట్రిఫీకేషన్, ఇతర మౌలిక సదుపాయాల కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.లేఔవుట్లులో పెండింగ్ లో ఉన్న మట్టిని నింపడం, లెవలింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాస్థాయి అధికారులు డివిజన్, మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని సమిష్టి బాధ్యతతో గృహ నిర్మాణ పనుల్లో పురోగతి చూపించాలని జేసి అధికారులకు సూచించారు.

    ఈ సమీక్షా సమావేశంలో జిల్లా గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట అధికారి జి.వీరేశ్వర ప్రసాద్, జడ్పీ సీఈఓ ఎన్ వివి.సత్యనారాయణ, డిపివో ఎస్ వి.నాగేశ్వర నాయక్, డిఆర్డిఏ పిడి వై.హరిహరనాథ్,మెప్మా పిడి  కె.శ్రీరమణి, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ సూపరింటెడెంట్ ఇంజనీర్లు టీ.గాయత్రీ దేవి,బిఎస్. రవీంద్ర, డ్వామా పిడి ఎ.వెంకటలక్ష్మి, ఏపీఈపిడిసిఎల్ ఎస్ఇ నరసింహారావు, ఇతర అధికారులు హాజరైయారు.  

Kakinada

2021-06-21 13:22:07

యడ్లవల్లి ల్యాండ్ పై చర్యలు తీసుకోవాలి..

చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో ఉన్న యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కోలోనైజేషన్ సోసైటీ పునరుద్ధరణకు సంబంధించి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డి తో కలసి యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కోలోనైజేషన్ సోసైటీ పునరుద్ధరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కోలోనైజేషన్ సోసైటీ పునరుద్ధరించాలని ఆదేశించిన నేపథ్యంలో సోసైటీ సభ్యులను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సోసైటీ సభ్యుల గుర్తింపు కోసం  జూన్ 23వ తేదీ గ్రామ సభ నిర్వహించాలని, 25 తేదీ న సొసైటి సభ్యుల డ్రాఫ్ట్ లిస్ట్ ప్రచురించాలని, జూన్ 25 నుంచి 28వ తేదీ వరకు ప్రచురించిన సభ్యుల డ్రాఫ్ట్ లిస్ట్పై అభ్యంతరాలు స్వీకరించాలని, జూన్ 29వ తేదీ అభ్యంతరాలు పరిష్కరించి సాయంత్రం 5 గంటలకు యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కోలోనైజేషన్ సోసైటీ సభ్యుల పైనల్ లిస్ట్ను ప్రచురించాలన్నారు. యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కోలోనైజేషన్ సోసైటీ సభ్యుల గుర్తింపు ప్రక్రియను  సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ), సంయుక్త కలెక్టర్ (అసరా, సంక్షేమం) తో పాటు డీఆర్డీఏ పీడీ, జిల్లా సహకారా అధికారి, సోషల్ వేల్ఫేర్ డీడీ, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ లు సభ్యులుగా ఉన్న ప్రత్యేక బృందం పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి రాజశేఖర్, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదనరావు, మైనింగ్ ఏడీ విష్ణువర్థన్ రావు  పాల్గొన్నారు.

Guntur

2021-06-21 13:19:36

వేక్సిన్ వ్యర్ధాలను తరలించండి..

వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లో వేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ యొక్క వ్యర్ధాలు(ప్రమాదకరమైన చెత్త)ను డంపింగు యార్డుకు తరలించాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు శానిటరి ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. సోమవారం  ఐదవ జోన్, 59వ వార్డు లోని శ్రీహరిపురం, ఎఫ్.ఆర్.యు. సెంటర్ ను సందర్శించి ఆదివారం స్పెషల్ డ్రైవ్ లో వేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ యొక్క వ్యర్ధాలను ఎం.ఎస్.ఎఫ్.ల ద్వారా సేకరించి కాపులుప్పడ డంపింగు యార్డుకు తరలించాలన్నారు. అనంతరం కొత్త గాజువాక, పాత గాజువాక జంక్షన్, మింది తదితర ప్రాంతాలలో పర్యటించి డంపర్ బిన్స్ లో ఉన్న చెత్తను తరలించాలని, పలు చోట్ల కాలువలలో చెత్తను శుభ్రం చేయక పోవడంపై ఆయా శానిటరి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ మరియు ప్రైవేట్ సంస్థల ఖాళీ స్థలాలలో చెత్త పేరుకు పోయిందని, వాటిని వారి చేతనే తొలగించేందుకు తగు చర్యలు చేపట్టాలని, వారు చెత్తను తొలగించని యెడల మన కార్మీకులచే చెత్తను తొలగించి, వారి వద్ద నుండి అపరాధ రుసుంను  వసూలు చేయాలని శానిటరి అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో 59వ వార్డు శానిటరి ఇన్స్పెక్టర్, శ్రీహరిపురం ఎఫ్.ఆర్.యు. సెంటర్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-06-21 13:15:25

సేంద్రియ ఎరువుపై అవగాహన పెంచాలి..

సేంద్రీయ ఎరువు తయారీపై మహిళలకు అవగాహన పెంపొందించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం  రెండవ జోన్ 10వ వార్డు పరిధిలో ఇందిరా నగర్ కాలనీ పరిసర ప్రాంతాలలో కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గృహ అవసరాలకు తెచ్చుకున్న కూరగాయలు తొక్కలను బయట పడవేయకుండా ఇంటిలోనే ఎరువు తయారు చేసుకొనే విధంగా మహిళలకు అవగాహన పెంచాలన్నారు. అనంతరం, ఇందిరానగర్ కాలనీలోని రోడ్లను, కాలువలను పరిశీలించారు. సేకరించిన చెత్తను వెంట వెంటనే డంపింగు యార్డుకు తరలించాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా చూడాలని ఆ వార్డు శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. ప్రతి ఇంటి నుండి తడి-పొడి చెత్తను సేకరించే ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఇళ్ళ పరిసర ప్రాంతాలలో నీటి నిల్వలు లేకుండా చూడాలని ఆదేశించారు. తద్వారా దోమలు వృద్ధి చెందకుండా అరికట్టవచ్చునన్నారు. వార్డు పారిశుధ్య కార్మీకుల యొక్క పూర్తి వివరాలు వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శులు వద్ద ఉండాలని, దాని ఆధారంగా వారి విధులు సక్రమంగా నిర్వర్తించేలా చూడాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, రెండవ జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, వెటర్నరి డాక్టరు కిషోర్, ఇ.ఇ.(వాటర్ సప్ప్లై) పి. శ్రీనివాసరావు, డి.ఇ.ఇ. వంశీ, అసిస్టెంట్ సిటీ ప్లానర్, తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-06-21 13:13:20

డయల్ యువర్ కలెక్టర్ కు 18 వినతులు..

డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 18 వినతులు అందాయని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని స్పందన విభాగంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డి.ఆర్.ఓ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం మునిసిపాలిటీ పరిధిలో గల ఉరిటి భాస్కరరావు ఫోన్ చేసి మాట్లాడుతూ  వికలాంగుడైన తనకు  పేట్ రోడ్ వేస్,ముంబాయి వారు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేస్తూ, బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తూరు మండలం  నివగాం నుండి ఎస్.షణ్ముఖరావు ఫోన్ చేస్తూ  తన కూతురుకు వై.యర్.ఆర్ జగనన్న విద్యా దీవెన అందలేదని, కావున దానిని మంజూరుచేయాలని కోరారు. కంచిలి మండలం పోలేరు నుండి కె.వెంకటరావు ఫోన్ లో మాట్లాడుతూ  సచివాలయంలో కేటగిరి -1 లోని పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీచేయలేదని ఫిర్యాదు చేస్తూ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తూరు మండలం కౌసల్యపురం నుండి  కె.రాజేశ్వరి ఫోన్ చేసి మాట్లాడుతూ  తన భర్త మరణించినందున  తనకు వృద్దాప్య పింఛనును మంజూరు చేయాలని కోరారు. ఇచ్చాపురం మండలం పైతారి గ్రామం నుండి వి.మన్మధరావు ఫోన్ చేస్తూ   తనకు 44 శాతం వికలాంగత్వం ఉందని, కావున తనకు వికలాంగుల పింఛనును మంజూరుచేయాలని కోరారు. 

ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస గ్రామం నుండి బి.రవికుమార్ ఫోన్ చేస్తూ  తన భార్య అయిన చంద్రకళ  కొల్లివలస సచివాలయంలో  వాలంటీరుగా పని చేస్తుందని, తనని అకారణంగా విధుల నుండి తొలగించినందున మరలా పునరుద్ధరించాలని కోరుతూ, బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇచ్చాపురం మండలం  లొద్దపుట్టి నుండి బి.జోగారావు మాట్లాడుతూ లొద్దపుట్టి మేజర్ పంచాయితీ అయినప్పటికి  పంచాయితీ  సెక్రటరీ గాని సచివాలయం సెక్రటరీ గాని లేరని, కావున వారిని నియమించాలని కోరారు. ఎల్.యన్.పేట మండలం కోవిలాం నుండి జి.బాలరాజు ఫోన్ లో మాట్లాడుతూ 60 సంవత్సరాలు పూర్తయిన తనకు వృద్దాప్య పింఛనును మంజూరు చేయాలని కోరారు.  వీరఘట్టం మండలం పి.వి.ఆర్ పురం నుండి కె.పి.నాయుడు ఫోన్ లో మాట్లాడుతూ జగనన్న చేయూత పథకం మంజూరు చేయాలని కోరారు. ఆమదాలవలస మండలం రామచంద్రపురం నుండి జె.వెంకటరమణ ఫోన్ చేస్తూ  తన పూర్వీకుల నుండి ఉన్న  సర్వే నెంబరు 76.2లోని 44 సెంట్లు  భూమిని తన పేరు మీద  నమోదు చేసి అడంగళ్ ను మంజూరుచేయాలని కోరారు. రేగిడి ఆమదాలవలస మండలం తునివాడ నుండి ఆర్ అండ్ బి రహదారి విస్తరణలో తన ఇళ్లు కూలిపోయిందని, కావున తనకు తగిన నష్టపరిహారాన్ని మంజూరుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-21 13:09:45

విషయక గ్రాంట్ -2020-21కి ఆహ్వానం..

రక్షమంత్రి మాజీ సైనికుల సంక్షేమ నిధి కేంద్రీయ సైనిక బోర్డు న్యూఢిల్లీ  మాజీ సైనికుల పిల్లలకు విధ్యా విషయక గ్రాంట్ - 2020-21 కి ఆన్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిన్నట్టు జిల్లా సైనిక సంక్షేమ అధికారి బి. సత్యారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  హవల్దార్ ర్యాంకు వరకు ఉన్నవారు మాత్రమే అర్హులని తెలిపారు.  WWW.KSB.GOV.IN అను వెబ్ సైట్ (WELFARE-SCHEMES-RMEWF-EDUCATION GRANT-APPLICATION-FORM)లో రిజిష్టర్ చేసుకొని దరఖాస్తు పూర్తిగా ఆన్ లైన్ లో సమర్పించాల్సిందిగా ఆ ప్రకటనలో కోరారు. ఆన్ లైన్ లో సమర్పించిన దరఖాస్తును ప్రింట్ చేసి సంబంధిత దృవ పత్రములు, ఫీజు రశీదులను జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం, శ్రీకాకుళంలో అందజేయాల్సిందిగా ఆయన ఆ ప్రకటనలో కోరారు. 1వ తరగతి నుండి 9వ తరగతి, 11వ తరగతులకు దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తే 30.09.2021 దీ, 10వ తరగతి, 12వ తరగతులకు తే 31.10.2021 దీ, డిగ్రీ కోర్సు విద్యార్థులకు తే 30.11.2021 దీ లలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రకటనలో తెలిపారు.  దరఖాస్తు చేసిన తరువాత దరఖాస్తు దారుని వ్యక్తిగత పర్యవేక్షణలో ఉన్నందున ఈ కార్యక్రమ ప్రక్రియలో దరఖాస్తు దారులు బాధ్యత చూపుకోవలసిందిగా ఆయన ఆ ప్రకటనలో కోరారు.

Srikakulam

2021-06-21 13:04:50

రక్తదానం నిరంతర ప్రకియ కావాలి..

శ్రీకాకుళం జిల్లాలో రక్తదానం చేయడం నిరంతర ప్రక్రియ కావాలనికలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్  వైద్యులు, ఆర్గనైజర్లు, వాలంటీర్లను కోరారు. ప్రపంచ రక్తదాన వారోత్సవాల ముగింపు సందర్భంగా లయన్స్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమానికి   జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత రక్తదానం చేసేందుకు కృషిచేసిన వైద్యులు, వివిధ సంస్థలను, ఆర్గనైజర్లను, వాలంటీర్లకు జ్ఞాపికను అందజేస్తూ దుశ్శాలువ, పుష్పగుచ్చంతో కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం మహాదానమని, అన్నిదానాల్లో కంటే రక్తదానం గొప్పదని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్న వారందరూ రక్తదానం చేసేందుకు ముందుకురావాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మానవత్వంతో రక్తదాతలు ముందుకురావాలని,  ఒకరు రక్తదానం చేయడం వలన ఇద్దరి ప్రాణాలను కాపాడినవారవుతారని అన్నారు. ముఖ్యంగా తలసేమియా, శస్త్రచికిత్సల సమయంలో, ప్రమాదాలకు గురికాబడిన వ్యక్తులకు ఈ రక్తం ఎంతో ఆవశ్యకమని, అటువంటి వారికి మీరిచ్చే రక్తం వలన వారితో రక్త సంబంధాలు ఏర్పడినట్లు అవుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రక్తదానం చేసి వేరే ప్రాణాలను నిలిపినందుకు మీకు సంతృప్తి లభిస్తుందని, ఆ సంతృప్తి కోసమే మీరు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

రక్తదానం చేసిన యువతకు, రక్తదానం చేయడానికి ప్రోత్సహించిన వారందరికీ జిల్లా యంత్రాంగం తరపున అభినందనలు తెలిపిన కలెక్టర్ జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం రక్తదానం చేసేందుకు యువతను ప్రోత్సహించిన డా. భాస్కర్, డా.అవినాష్, డా.విశ్వనాథ్, ఆర్.సంతోష్ కుమార్, యస్.రాంబాబు, వై.శ్రీనివాసకుమార్, యస్.సత్యనారాయణ, పి.శ్రీనివాసరావు, ప్రసాద్, ఎ.గురుప్రసాద్, కె.విజయశంకర్, పి.కేదారేశ్వరీ, రాజశేఖర్, ఓ.సత్యనారాయణ, జె.లక్ష్ణణసాయి, ఎ.దుర్గారావు, జి.గోవింద్, వి.రాజు, ఎం.అసిరినాయుడు, ఎ.రాజేశ్, పి.లీలాకృష్ణ, బి.గోపిలకు కలెక్టర్ జ్ఞాపిక, దుశ్శాలువ, పుష్పగుచ్ఛంతో సత్కరించారు.

          ఈ కార్యక్రమంలో లయన్ డా.కృష్ణమోహన్, ప్రముఖ వ్యాపారవేత్త, సంఘసేవకులు సర్వేశ్వరరావు, డా.దేవభూషణరావు, ట్రెజరర్ లయన్ పి.రవికుమార్, వైద్యులు, వివిధ సంస్థల ఆర్గనైజర్లు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-21 13:00:32

కలెక్టర్ కార్తికేయ మిశ్రా కీర్తిపతాక..

కార్తికేయ మిశ్రా ఈ పేరు వినగానే గుర్తొచ్చేది అందరికీ అయితే ఒక ఐఏఎస్ అధికారి అనే..కానీ ఈయన కార్యదీక్ష, విధినిర్వహణ, లక్ష్యాలు చేరుకునే సంఖ్య మాత్రం ఎప్పుడూ మొదటి స్థానమనే విషయం కేవలం ప్రభుత్వ అధికారులకు మాత్రమే తెలుసు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ వేక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రకటించగానే పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలోనే టీకా పంపిణీలో ముందుండాలని ఆదేశించడంతో పాటు అమలుచేసిన చూపిన డైనమిక్ కలెక్టర్ గా రాష్ట్రప్రభుత్వం సాధించిన ప్రగతిలో అగ్రభాగంలో నిలిచారు.. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో కోవిడ్ వేక్సినేషన్ ఉదయం 8గంటలకు ప్రారంభిస్తే రాత్రి తొమ్మిది గంటలకు తొలిస్థానంలో నిలిచి లక్షా 60 వేల 822 మందికి కోవిడ్ వేక్సిన్ అందించి టాప్ వన్  స్థానంలో నిలిచారు. దీనితో మరోసారి పశ్చిమగోదావరిజిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా మరోసారి వార్తొల్లోకి ఎక్కారు. కాగా తూర్పుగోదావరి 154754 తో రెండో స్థానంలో ఉండగా, క్రిష్ణాజిల్లా 3వ స్థానంలో 139980, విశాఖపట్నం 111726 నాల్గవ స్థానం, 5వ స్థానంలో గుంటూరు 106435,  6వ స్థానంలో చిత్తూరు 101291లో ఉండగా, 7వ స్థానంలో ప్రకాశం 99898, 8వ స్థానంలో శ్రీకాకుళం 85816, 9వ స్థానంలో అనంతపురం 86008, 10వ స్థానంలో నెల్లూరు 79016, 11వ స్థానంలో కర్నూలు 78655, 12వ స్థానంలో డా.వైఎస్సార్ కడప 76743,13వ స్థానం మరియు ఆఖరి స్థానంలో విజయనగరం 61160లో నిలిచింది.

West Godavari

2021-06-20 16:42:48

కోవిడ్ వేక్సినేషన్ డ్రైవ్ విజయవంతం..

రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ఆదివారం చేపట్టిన కోవిడ్ మెగా వాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ ఆశించిన దానికంటే మించి విజయవంతం అయ్యింది. రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాకు నిర్దేశించిన లక్ష్యానికి మించి వాక్సినేషన్ జరగడంతో జిల్లా అధికారుల నుంచి మండల, క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు అంతా సంతోషం వ్యక్తమవుతోంది. శుక్రవారం సాయంత్రం విడియో కాన్ఫరెన్స్ లో మెగా వాక్సినేషన్ డ్రైవ్ కోసం ఆదేశాలు వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్, జాయింట్ కలెక్టర్ డా. మహేష్ కుమార్ లు కార్యాచరణకు దిగారు. అదే రోజున పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయడం, మండల పరిధిలోని ఎం.పి.డి.ఓ.లు, మునిసిపల్ కమిషనర్ లతో జాయింట్ కలెక్టర్ డా. మహేష్ కుమార్ సమావేశాలు నిర్వహించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసేలా పర్యవేక్షణ చేశారు. మరో వైపు ఏ.ఎన్.ఎం.లు, ఆశ వర్కర్లు, వాలంటీర్లు తదితర  క్షేత్ర స్థాయి సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ నిర్వహణలో ఇప్పటికే తగిన అనుభవం కలిగి వుండటం వల్ల ప్రత్యేక డ్రైవ్ ను సులువుగా పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకే సిబ్బంది వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం వల్ల కూడా ఎక్కువ మంది వాక్సిన్ వేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. రోజంతా ప్రతి గంట కు నివేదికలు రప్పించుకొని తక్కువగా వాక్సినేషన్ జరిగిన మండలాల అధికారులను టెలి కాన్ఫరెన్స్ ద్వారా అప్రమత్తం చేస్తూ జాయింట్ కలెక్టర్ డా. మహేష్ కుమార్ జిల్లా కేంద్రం నుండే పర్యవేక్షణ చేశారు. జిల్లా పరిషత్ సి ఇ ఓ టి. వేంకటేశ్వర రావు తన పరిధిలోని ఎం.పి.డి.ఓ.లతో రోజంతా మాట్లాడుతు వారిని ఉత్సాహ పరిచారు. వీరందరి కృషి ఫలించి రాత్రి 7 గంటల సమయానికి జిల్లాలో 58,005 మందికి వాక్సిన్ వేయగలిగారు. రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.

Vizianagaram

2021-06-20 14:36:09

ఆర్బీకేలు రైతన్నకు దిక్సూచి కావాలి..

రైతుకు సంబంధించి ప్రతి అవసరం స్థానిక రైతు భరోసా కేంద్రంలోనే లభించాలని, ఏ ఒక్క రైతు ఊరి పొలిమేర దాటకుండానే వ్యవసాయానికి సంబంధించిన ఏ విషయమైనా పరిష్కారం కావాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దృఢ సంకల్పమని రాష్ట్ర  రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల  మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) స్పష్టం చేశారు.  ఆదివారం జిల్లా పరిషత్  కన్వెన్షన్ సెంటర్ లో  ఖరీఫ్ సాగు సమాయత్తంపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర  రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ), రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు  (నాని)లు హాజరయ్యారు.  ఈ  సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ  రైతుల కోసం ఇప్పటికే  ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తోందని, అందులో భాగంగా రైతు భరోసా క్రింద ఏడాదికి రూ.13,500 ఇస్తున్నామని,ఐదేళ్లలో రూ.67,500 ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు.  అంతేకాక పంటలకు సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చే వ్యవసాయ అధికారులు రైతు భరోసా కేంద్రం వద్దే నియమితులై  ఉంటారన్నారు. జిప్సం , జింకు తదితర పోషకాలు మొదలుకొని విత్తనాలు ,ఎరువులు పురుగు మందులే కాకుండా వరి ధాన్యం విక్రయించుకోవాలన్నా రైతుభరోసా కేంద్రమే  రైతన్నకు దిక్సూచి కావాలన్నారు. 

కృష్ణాజిల్లాలో రైతు భరోసా కేంద్రాల నుంచి నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వ అధీకృత పంపిణీ  విధానం ద్వారా రైతులకు అందచేస్తుందని మంత్రి పేర్ని నాని  చెబుతూ, ఒకవేళ ప్రభుత్వం పంపిణీ చేసిన ఒకవేళ సరిగా విత్తనం మొలకెత్తకపోయినా  ఆ నష్టాన్ని ప్రభుత్వమే బాధ్యత తీసుకోని నాసి రకం విత్తనం కొనుగోలు చేసిన  ఏ ఒక్క రైతుని నష్టపర్చనీయదని తెలిపారు. ఒక నమ్మకమైన వ్యవస్థ ద్వారా రైతులు మేలైన విత్తనాలు పొందడం ఒక మంచి పద్దతని ఇదే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆకాంక్ష అని చెప్పారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్ లో  రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు 11 వేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే పొందారని,  ఆ విషయాన్ని దృస్టలో ఉంచుకొని రైతులను చైతన్యపర్చి ఈ ఏడాది కనీసం 30 వేల క్వింటాళ్ల నుంచి 50 వేల క్వింటాళ్ల వరకు విత్తనాలను రైతులకు అందించాలనే లక్ష్యంతో  వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో నేటి సమీక్షా సమావేశం ప్రధాన ఉద్దేశ్యమని మంత్రి వివరించారు. ప్రభుత్వం కొనుగోలు చేయని, ఖరీఫ్ లో సాగుచేయవద్దని సూచించే 10 రకాల వారి వంగడాలపై విస్తృతమైన ప్రచారం చేయాలనీ మంత్రి కృష్ణాజిల్లా సహకార బ్యాంకు అధికారులకు సూచించారు. ఈమేరకు గ్రామాలలో వివిధ కూడళ్లలో పెద్ద ఫ్లెక్సీ లను ఏర్పాటుచేయాలని కోరారు అలాగే ,  కరపత్రాలను ముద్రించి ప్రభుత్వం కొనుగోలు చేయని వర రకాల గురించి రైతులలో అవగాహన పెంపొందించాలన్నారు. 
    
          ఉచితంగా పంటల భీమా అమలు చేస్తున్న రాష్ట్రం మనదని, అలాగే రైతులకు వై.యస్.ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందించడమే కాకుండా  9 గంటల నాణ్యమైన విద్యుత్ ను  అందిస్తున్నామని అన్నారు.  రైతు భరోసా కేంద్రాల ద్వారా 99 శాతం రైతు  సమస్యలు అక్కడే తీరిపోతాయని చెప్పారు. కృష్ణాజిల్లాలో గత ఏడాది వారి పంటను  2 లక్షల 30  వేల 475 ఎకరాలు ఖరీఫ్ సాగు జరిగిందని హెక్టారుకు 5, 265 కిలోల ధాన్యం  దిగుబడి లభించిందన్నారు. ఈ ఏడాది వరిపంట తర్వాత పప్పు ధాన్యాలు, అపరాలు, నూనె గింజల సాగుకు పెద్ద పీట వేయనున్నట్లు పప్పు ధాన్యాలు, అపరాలు, నూనె గింజల సాగు పెంచడంపై కూడా అధికారులు ప్రత్యేక  దృష్టి పెట్టాలని ఈ మేరకు రైతుల్లో అవగాహన పెంచాలని మంత్రి సూచించారు. ప్రతి నెల పంటలకు వేసే ఎరువులను బట్టి ఆ నెల అవసరాలతో అధికారులు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.  యూరియా డీఏపీ, ఎంఓపీ వంటి పలురకాల రసాయనిక ఎరువులు రైతులకు అవసరమవుతాయి. ప్రస్తుతం రైతుల అవసరం మేరకు ఎరువులు అందుబాటులో ఉంచాలని మంత్రి పేర్ని నాని కోరారు. 

     కృష్ణాజిల్లాలో  4, 826 మంది లబ్ధిదారులకు సంబంధించిన  జగనన్న తోడు పథకం తాలూకా నగదు కేడీసీసీ బ్యాంకు ద్వారా 4 కోట్ల 82 లక్షల 60 వేలు రూపాయలను లబ్ధిదారులకు మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, జాయింట్ కలెక్టర్ మాధవీలత చేతుల మీదుగా ఆ చెక్కును లబ్ధిదారులకు అందచేశారు.  ఈ సమీక్షా సమావేశంలో కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత, మచిలీపట్నం ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి , జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ టి. మోహనరావు,  కె డి సి సి  బ్యాంకు సి ఇ  ఓ  ఎ . శ్యామ్ మనోహర్ ,  సివిల్ సప్లైస్ డి ఎం కె. రాజ్యలక్ష్మి , జెడ్పి సి ఇ  ఓ  పి ఎస్ సూర్యప్రకాశరావు, మచిలీపట్నం తహసిల్దార్ సునీల్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు.      

Machilipatnam

2021-06-20 13:56:32

స్వీయ రక్షణతోనే కరోనా కట్టడి..

కరోనా మహమ్మారి నివారణకు ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించడంతో పాటు, కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పని సరిగా వేయించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రజలను కోరారు. ఆదివారం మద్యాహ్నం మంత్రి కన్నబాబు కాకినాడ రూరల్ నియోజక వర్గం పండూరు పిహెచ్సి పరిధిలో వాకలపూడి జడ్పి హైస్కూల్లోని వాక్సినేషన్ కేంద్రంలో నిర్వహించిన టీకామహోత్సవ కార్యక్రమానికి హాజరైయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 10 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు.  ఇంతటి భారీ స్థాయిలో టీకాల పంపిణీ చేసే వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదని, రాష్ట్రంలో ఆదర్శవంతమైన రీతిలో పటిష్టంగా పనిచేస్తున్న గ్రామసచివాలయాలు, వలంటీరు  వల్లే ఇది సాధ్యమైందన్నారు.  వీటి రూప శిల్పి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి ముందు చూపుకు, పాలనా దక్షతలకు ఈ సంస్కరణలు అద్దం పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో సుమారు రెండున్నర లక్షల మంది వలంటీర్లు, గ్రామ సచివాలయాలు ప్రభుత్వపరమైన ఏ సమాచారమైన, సంక్షేమ లబ్దినైనా కొన్ని గంటలల్లోపే లక్ష్యిత ప్రజలు సమగ్రంగా అందిస్తున్నారని తెలిపారు.

  45 ఏళ్లు దాటిన ప్రజలు, 5 ఏళ్లలోపు బిడ్డలున్న తల్లులకు ఆదివారం కాకినాడ రూరల్ నియోజక వర్గం పరిధిలోని కాకినాడ రూరల్ మండలంలో 3500, కరప మండలంలో 1500, నగర డివిజన్లలో 1000  వెరసి 6000 మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోందన్నారు.  కోవిడ్ నివాణకు మాస్కులు ధరించడం, చేతుల శుభ్రత, వ్యక్తుల మద్య భౌతిక దూరం పాటించడం వంటి స్వీయ రక్షణ జాగ్రతలను ప్రతి ఒక్కరూ విధిగా పాటిస్తూ, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న టీకాలను తప్పని సరిగా వేయించుకోవాలని మంత్రి కన్నబాబు ఈ సందర్భంగా కోరారు.  అలాగే కాకినాడ రూరల్ నియోజక వర్గంలో ఆదివారం టీకా మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న యండిఓ, పిహెచ్సి వైద్యాధికారులు, సిబ్బంది, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, టీకా వేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు  అందరినీ మంత్రి ప్రత్యేకం అభినందించారు. ఈ కార్యక్రమంలో  కాకినాడ యంపిడిఓ పి.నారాయణమూర్తి, పండూరు పిహెచ్సి వైద్యాధికారి డా.నారాయణరావు, ఎఎంసి చైర్మన్ గీసాల శ్రీనివాసరావు, జమ్మలమడక నాగమణి, నులుకుర్తి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-20 13:49:26