1 ENS Live Breaking News

కోవిడ్ కేసులు తగ్గినా జాగ్రత్తగా ఉండాలి..

కోవిడ్ కేసులు తగ్గినా పూర్తిగా తగ్గిపోలేదని, అధికారులంతా మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లోని విసి హాల్ నుంచి కోవిడ్, ఎన్ఆర్ఈజిఎస్ పనుల కల్పన, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు, అంగన్వాడి కేంద్రాల నిర్మాణం, వైఎస్సార్ అర్బన్ క్లినిక్ లు, పేదలందరికి ఇల్లు కింద ఇళ్ల గ్రౌండింగ్, ఇంటి పట్టాల పంపిణీ, ఖరీఫ్ 2021 సన్నద్ధతపై జిల్లాలోని ఆర్డీఓలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ లు, ఎంపిడివోలు, స్పెషల్ ఆఫీసర్ లు, మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో మాస్కులు వాడకంపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నో మాస్క్ నో ఎంట్రీ అంటూ గ్రామ సచివాలయం, వార్డు పరిధిలో అవగాహన చేపట్టాలని, నో మాస్క్ నో సేల్ అంటూ దుకాణాల యజమానులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని, నో మాస్క్ నో రైడ్ అంటూ ఆర్టీసీ బస్సులు, ఆటోలు, వాహనాల్లో ప్రజలెవరూ మాస్కులు లేకుండా ప్రయాణించకుండా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 

కోవిడ్ కేసులు తగ్గినా కోవిడ్ నిబంధనలను పాటించాలని, కేసులు పెరగకుండా చూడాలని, కరోనా కారణంగా ఎవరూ మరణించకూడదని, ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా సచివాలయం పరిధిలో పాజిటివ్ రేటు 2 శాతం కన్నా తక్కువగా వచ్చేలా చూడాలని, ప్రతి ఒక్కరూ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ ను పాటించాలన్నారు. గ్రామాల్లో ఫీవర్ సర్వే ను సోమవారం నుంచి శుక్రవారం వరకు తప్పనిసరిగా నిర్వహించాలని, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, వాలంటీర్లు ఫీవర్ సర్వే ను పరిశీలించాలని, కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలన్నారు. కాంట్రాక్ట్ ట్రేసింగ్, శాంపుల్స్ సేకరణ జాగ్రత్తగా చేయాలని, కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి మెడికల్ కిట్లు అందజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి కర్ఫ్యూ సడలింపులు ఇచ్చిందని, ఉదయం 6 నుంచి సాయంకాలం 6 గంటల వరకు సాధారణ కార్యకలాపాలు జరుగుతాయని, అనంతరం రాత్రి నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ నేపథ్యంలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలన్నారు.

కోవిడ్ వ్యాక్సినేషన్ నేపథ్యంలో జిల్లాకు కేటాయించిన 90 వేల డోసుల వ్యాక్సినేషన్ లక్ష్యాలను పూర్తి చేయడం అభినందనీయమని, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, వాలంటీర్లు, మండల స్థాయి స్పెషలాఫీసర్ లు, మెడికల్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వ్యాక్సిన్ పై బాగా అవగాహన కల్పించారని, వారిని అభినందించారు. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పనులను కూలీలందరికీ కల్పించాలని, ఆయా మండలాలకు కేటాయించిన లక్ష్యాలను చేరుకోవాలని, ఉపాధి పనుల కల్పనలో వెనుకబడిన మండలాలు వెంటనే పురోగతి చూపించాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నిశాంతి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్, డిఆర్ఓ గాయత్రీదేవి, పంచాయతీరాజ్ ఎస్ఈ భాగ్యరాజ్, వివిధ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-21 14:45:14

ప్రభుత్వ నిర్మాణాల వేగం పెంచాలి..

ఎన్ఆర్ఈజిఎస్ కింద చేపట్టిన గ్రామ సచివాలయ భవనాల నిర్మాణంలో భాగంగా జూలై ఒకటో తేదీ కల్లా 75 శాతం భవన నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్  అధికారులను ఆదేశించారు. సోమవారం ఈ మేరకు కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులంతా సచివాలయ భవనాల నిర్మాణంలో సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు. అలాగే రైతు భరోసా కేంద్రాల భవనాల నిర్మాణంలో కూడా జూలై 8వ తేదీ కల్లా 300 భవనాలు పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండేలా చూడాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. పూర్తి అయ్యే దశలో ఉన్న రైతు భరోసా కేంద్రం భవనాలు వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైయస్సార్ హెల్త్ క్లినిక్ లు కూడా జూలై 31వ తేదీ కల్లా 50 శాతం పూర్తి చేయాలన్నారు. గ్రామ సచివాలయ భవనాల నిర్మాణంలో, రైతు భరోసా కేంద్రాల భవనాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించి పనులు చేపట్టాలన్నారు. ఆగస్టు 2వ తేదీ కల్లా అన్ని సచివాలయ భవనాల నిర్మాణాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణాలు 100 శాతం పూర్తయ్యేలా అధికారులు త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే వైయస్సార్ అర్బన్ క్లినిక్ నిర్మాణంలో భాగంగా రెండు రోజుల్లోగా భవన నిర్మాణాలు గ్రౌండింగ్ చేయాలని, గ్రామం, సచివాలయం వారీగా ప్రణాళిక రూపొందించుకొని పనులు పూర్తి చేయాలన్నారు. ఖరీఫ్ సన్నద్ధతలో భాగంగా అధికారులు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలన్నారు. నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు లో భాగంగా ఇంటి నిర్మాణాలను వెంటనే ఆషాడ మాసం మొదలు అయ్యే లోగా 100 గ్రౌండింగ్ చేపట్టాలన్నారు. ఇంటి నిర్మాణాలు మొదలు పెట్టేందుకు అనుగుణంగా లేఔట్లలో అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. ఈ నెలాఖరులోపు లేఔట్లలో అన్ని రకాల సదుపాయాల కల్పన పూర్తి కావాలన్నారు. అలాగే ఇంటి పట్టా కావాలని దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దేశించిన గడువులోగా ఇంటి పట్టా ఇవ్వాలన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు నిర్మాణంలో భాగంగా ఏడిఏలు, ఏఓ లు  భవన నిర్మాణాలను పరిశీలించాలన్నారు. జూలై 8వ తేదీ నాటికి 300 ఆర్బికేలు ప్రారంభించేలా జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని, ఏవో లు, పంచాయతీరాజ్ ఏఈలు సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు వాడాలని అవగాహన కల్పించాలని, మాస్కులు వాడకపోతే 100 రూపాయల చొప్పున ఫైన్ వేయాలన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. ప్రజలకు 104 కాల్ సెంటర్ పై కూడా అవగాహన కల్పించాలన్నారు. సచివాలయాలకు వచ్చే సర్వీసులు మరింత పెరగాలన్నారు. గడువు తీరిన సమస్యలు పెండింగ్ ఉండడానికి వీలు లేదని, వెంటనే ఇక్కడ వచ్చిన సమస్యలను పరిష్కరించాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నిశాంతి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్, డిఆర్ఓ గాయత్రీదేవి, పంచాయతీరాజ్ ఎస్ఈ భాగ్యరాజ్, వివిధ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-21 14:42:34

యోగ అందరి ఆరోగ్య ప్రదాయని..

యోగ ఆరోగ్యప్రదాయని అని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంను జిల్లా క్రీడాప్రాధికార సంస్ధ ఆధ్వర్యంలో శాంతినగర్ ఇండోర్ స్టేడియంలో  సోమ వారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. పతంజలి యోగ నిపుణులు డి.చిన్నబాబు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగ నిపుణులు సుధారాణి యోగ ఆసనాలకు మార్గదర్శకత్వం వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ యోగ ఆసనాలను సునాయాసంగా వేసారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యోగ అంటే ఆరోగ్యం అన్నారు. వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఆరోగ్యం పట్ల అశ్రద్ద వహించడం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య ప్రాధాన్యతను గుర్తంచి రోజుకు కనీసం గంట సమయం కేటాయించాలని సూచించారు. జీవన శైలి, ఆహారపు అలవాట్లు మారాయని, వాతావరణంలో మార్పులు గమనిస్తున్నామని తదనుగుణంగా ఆరోగ్య పరిరక్షణ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. యోగ ఆరోగ్య కల్పనకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మోబైల్ ఫోన్లు, టెలివిజన్ లకు అతుక్కుంటున్నారని కనీస వ్యాయామం చేయడంలో అశ్రద్ద వహిస్తున్నారని అన్నారు. దీని వలన మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులకు సునాయాసంగా గురి అవుతున్నారని కలెక్టర్ చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు కొంత సమయం కేటాయించి సాధారణ ఆసనాలు వేసినప్పటికి ఆరోగ్యంగా ఉండగలమని గ్రహించాలని ఆయన పేర్కొన్నారు.

        ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.కిషోర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి మరియు సెట్ శ్రీ సిఇఓ జి.శ్రీనివాస రావు, క్రీడా ప్రాధికార సంస్ధ చీఫ్ కోచ్ బి.శ్రీనివాస కుమార్, పర్యాటక అధికారి ఎన్.నారాయణ రావు, నెహ్రూ యువ కేంద్ర ఇన్ ఛార్జ్ జిల్లా సమన్వయ అధికారి శ్రీనివాస రావు, క్రీడా ప్రాధికార సంస్ధ కోచ్ లు సూరిబాబు, శ్రీధర్, మాధురి, ఉమామహేశ్వర రావు, ఆయుష్ వైద్యులు డా.మాధవ రావు చౌదరి, డా. సి.హెచ్.మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ ను క్రీడాప్రాధికార కోచ్ లు మర్యాదపూర్వకంగా కలిసి పష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం షటిల్ కోర్టు వివరాలు తెలుసుకున్న కలెక్టర్ కొద్ది సేపు షటిల్ బాడ్మింటన్ ఆడి కోర్టుల పరిస్ధితిని పరిశీలించారు. క్రీడలకు సౌకర్యాలు బాగా మెరుగుపరచాలని ఆయన సూచించారు. అందుకు అవసరమగు నివేదికను తయారు చేయాలని అన్నారు.
 

Srikakulam

2021-06-21 14:29:24

జిల్లా కలెక్టర్ ను కలిసిన సబ్ కలెక్టర్..

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా నియమించిన  రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఇలక్కియా సోమవారం కలెక్టరేట్ లో కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఇలక్కియా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ)డా జి. లక్ష్మీ శ, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)కీర్తి చేకూరిని  కలిసి పుష్పగుచ్ఛం అందించారు. తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన రాజమహేంద్రవరం డివిజన్ సబ్ కలెక్టర్ గా సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అన్ని డివిజన్ వాసులందరికీ సక్రమంగా అందే విధంగా తన వంతు కృషి చేస్తానని  ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

Kakinada

2021-06-21 13:57:50

కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు..

కోవిడ్ కేసులు ఇంకా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రస్తుతం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు అమలులో ఉన్న క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు జూన్ 21 నుంచి 30వ తేదీ వ‌ర‌కు య‌థాత‌థంగా కొన‌సాగుతాయ‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి  ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కర్ఫ్యూ సమయంలో అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల‌కు మాత్ర‌మే మిన‌హాయింపు ఉంటుంద‌ని, ఎవ‌రైనా నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే విప‌త్తు నిర్వ‌హ‌ణ చ‌ట్టంలోని సెక్ష‌న్ 51-60; ఐపీసీ సెక్షన్188, ఇత‌ర వ‌ర్తింపు చ‌ట్టాల మేర‌కు చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. అదే విధంగా  కోవిడ్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 8.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. ఈ నిబంధ‌న‌ల క‌చ్చిత అమ‌లుకు కాకినాడ‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎస్‌పీలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, జిల్లా, డివిజ‌న‌ల్‌, మండ‌ల స్థాయి అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

Kakinada

2021-06-21 13:56:13

జూలై 10న జిల్లాలో లోక్ అదాలత్..

జాతీయ లీగ‌ల్ సెల్ అథారిటీ ఆదేశాల మేర‌కు, జులై 10న‌ జిల్లా వ్యాప్తంగా జాతీయ‌ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికారసంస్థ ఛైర్మెన్ గుత్తల గోపి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ నెల 26న జ‌ర‌గాల్సిన వ‌ర్చువ‌ల్‌ లోక్ అదాల‌త్‌ను ర‌ద్దు చేయ‌డం జ‌రిగింద‌ని, దానికి బ‌దులుగా 10 న జాతీయ లోక్ అదాల‌త్‌లో క‌లిపి నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఈ అదాలత్ ద్వారా వివిధ రకాల సివిల్, క్రిమినల్ కేసులు, భూ తగాదాలు, ఎక్స్సైజ్, విద్యుత్ , ఫ్యామిలీ,  బ్యాంకులకు సంబంధించిన కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా కు సంబంధించిన కేసులను ఇరు పక్షాల అంగీకారంతో, రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చునని సూచించారు. ఈ అదాలత్ లో తమతో పాటుగా, సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి లక్ష్మీరాజ్యం కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి కోరారు.

Vizianagaram

2021-06-21 13:49:11

సమస్యలపై సత్వరమే స్పందించండి..

గుంటూరు కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి  జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. తొలి రోజు 24 మంది తమకున్న సమస్యలను ‘డయల్ యువర్ కలెక్టర్’కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ దృష్ఠికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యలను ఫోన్ ద్వారా విన్న జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని వారికి  భరోసా కల్పించారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమం 11గంటల వరకు కొనసాగింది. ఎక్కువగా గుంటూరు జిల్లా గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీలలోని వారి నుంచి అందిన ఫిర్యాదులు ఉన్నాయి.  తాడేపల్లి మున్సిపాలిటీ కి చెందిన ఆయేషా తనకు ఇంటి స్థలం, వంటరి మహిళ పెన్షన్ ఇప్పించాలని కోరారు.  సంబంధిత అధికారులకు  మీ  సమస్యను పంపి  పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. నరసరావుపేటకు చెందిన రహమతుల్లా, కర్లపాలెంకు చెందిన ఏసమ్మ లు తమకు ఇంటి స్థలం ఇప్పించాలని కోరగా, దరఖాస్తులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవమని అధికారులకు ఆదేశిస్తామని   జిల్లా కలెక్టర్  తెలిపారు. 

గుంటూరు నగరంలోని ఎన్.టి.ఆర్ స్టేడియం ప్రాంతానికి చెందిన రాటల మల్లేశ్వరి, క్రోసూరు మండలం, గుడిపాడు గ్రామానికి చెందిన మహబూబ్ వలి, నూజండ్ల మండలం,ములకలూరు గ్రామానికి చెందిన మందా వెంకటేశ్వర్లు, యడ్లపాడుకు చెందిన చందు తమ కుటుంబాలకు వై.యస్.ఆర్ చేయూత పధకం అమలు అయ్యేలా అవకాశం కల్పించాలని కోరారు. సంబంధిత మండల అధికారులకు తగు సూచనలు జారీ చేసి వైఎస్సార్ వైఎస్సార్  చేయూత లబ్ది చేకూరేలా చర్యలు  తీసుకుంటామని జిల్లా కలెక్టర్  తెలిపారు. పెదకాకాని రోడ్డు నివాసితుడు సి.హెచ్. విజయబాబు తనకు వాహన మిత్ర పధకం కింద డబ్బులు జమకాలేదని  తెలుపగా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ వారి దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.  

వినుకొండకు చెందిన పఠాన్ ఆసియా బేగం, చిలకలూరిపేటకు చెందిన నూతలపాటి యామలమ్మలు  తమకు వితంతు పెన్షన్ ఇప్పించాలని కోరాగా, సమస్య పరిష్కరించేందుకు  సంబంధిత అధికారులకు  ఆదేశాలు జారీ చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.  సమస్యలను సావధానంగా విన్న జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ వెంటనే ఫిర్యాదులను పరిష్కరించి వివరాలను తెలియజేయాలని, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో పాల్గొన్న సంబంధిత జిల్లా  అధికారులను ఆదేశించారు.  ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవెన్యూ) దినేష్ కుమార్, జిల్లా సంయుక్త కలెక్టర్ ( ఆసరా, సంక్షేమం) శ్రీధర్ రెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టర్ ( సచివాలయాలు, అభివృద్ధి )  ప్రశాంతి, జిల్లా సంయుక్త కలెక్టర్ (గృహనిర్మాణం) అనుపమ అంజలి, డి.ఆర్.వొ. కొండయ్య, జడ్పీ సీఈవొ చైతన్య, డి.ఆర్. డి.ఏ పి.డి ఆనంద నాయక్, డ్వామా పి.డి శ్రీనివాసరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. 

Collector Office

2021-06-21 13:45:10

సొసైటీ భూములు పరిశీలించిన కలెక్టర్..

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కోలోనైజేషన సోసైటీ భూములను సోమవారం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్ తో కలిసి పరిశీలించారు. భూముల విస్తీర్ణం మ్యాపులను, అడంగల్, ఆర్ఎస్ఆర్లో ఉన్న భూముల స్వభావం వివరాలను,  అనుభవదారుల వివరాలకు సంబందించి రెవెన్యూ రికార్డులను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్  పరిశీలించి, రెవెన్యూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట  ఇన్చార్జి ఆర్డీవో పార్ధసారధి, చిలకలూరిపేట ఇన్చార్జి తహశీల్దారు మల్లిఖార్జునరావు, జిల్లా సహకార అధికారి రాజశేఖర్, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదనరావు, మైనింగ్ ఏడీ విష్ణువర్థన రావు, రెవెన్యూ అధికారులు  పాల్గొన్నారు.

Chilakaluripet

2021-06-21 13:40:31

ఆసరా ఫౌండేషన్ సాయం మరువలేనిది..

కరోనా వైరస్ సమయంలో ప్రజలకు వైద్యసేవలందించేందుకు ఆసరా ఫౌండేషన్ ముందుకొచ్చి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించడం నిజంగా అభినందనీయమని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన పేర్కొన్నారు. సోమవారం జివిఎంసికి 50 ఆక్షిజన్ కాన్సంట్రేటర్లు ఆసరా ఫౌండేషన్  ఉచితంగా అందించింది. కోవిడ్ బారిన పడిన రోగులకు ఆక్షిజన్ అందించాలనే సంకల్పంతో రూ.56 లక్షల విలువైన 50 ఆక్షిజన్ కాన్సంట్రేటర్లను ఆసరా ఫౌండేషన్ ప్రతినిధులు  జివిఎంసి కమిషనర్ ను  ఆమె ఛాంబార్లో కలసి అందించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ,ముడసర్లోవ కోవిడ్ సెంటర్లో కోవిడ్ రోగులకు చేసిన సేవలకు ముగ్దులై వీటిని అందింస్తున్నామన్నారు. వీటిలో 40 ఆక్షిజన్ కాన్సంట్రేటర్లను ముడసర్లోవ కోవిడ్ సెంటర్ నకు, 10 ఆక్షిజన్ కాన్సంట్రేటర్లను జివిఎంసి పరిధిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించామని కమిషనర్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సంస్థలు ముందుకు వచ్చి కోవిడ్ నియంత్రణకు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసరా ఫౌండేషన్ ప్రతినిధులు ప్రెసిడెంట్ రామారావు, జాయింట్ సెక్రటరి వినయ్ మొదలైన వారు పాల్గొనగా జివిఎంసి నుండి అదనపు కమిషనర్ డా. వి.సన్యాసి రావు, ముడసర్లోవ కోవిడ్ కేర్ సెంటర్ నోడల్ అధికారి డా. కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

GVMC office

2021-06-21 13:30:18

వైఎస్సార్ కాలనీల్లో మౌళిక సదుపాయాలు..

నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు సంబంధించి సిద్ధం చేసిన లేఔవుట్లలో  మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి,  జిల్లాలో గృహ నిర్మాణాలు వేగవంతం చెయ్యాలని  జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)ఎ.భార్గవ్ తేజ్ అధికారులను ఆదేశించారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ జాయింట్ కలెక్టర్ గా ఎ.భార్గవ్ తేజ్ బాధ్యతలు స్వీకరించినక తొలిసారిగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో  జిల్లాలో నవరత్నాలు -పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించి లేఔవుట్ల ప్రస్తుత పరిస్థితి,  గృహనిర్మాణలు, ఇతర అంశాలపై గృహ నిర్మాణ శాఖ, గ్రౌండ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, పంచాయితీరాజ్ , జిల్లా గ్రామీణ అభివృద్ధి, డ్వామ,ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ పై అధికారులకు దిశానిర్దేశం చేశారు . ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ్ మాట్లాడుతూ వైయస్సార్ జగనన్న హౌసింగ్ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో తొలి దశలో 825 లేఔవుట్లలో 1లక్ష 48వేల 526 గృహా నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. లేఔవుట్ల వారిగా నోడల్ అధికారిని కేటాయించి  గ్రౌండింగ్ వివరాలు ఎప్పటికప్పుడు అందించాలన్నారు. ప్రతి లేఔవుట్లలో త్రాగునీరు, ఎలక్ట్రిఫీకేషన్, ఇతర మౌలిక సదుపాయాల కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.లేఔవుట్లులో పెండింగ్ లో ఉన్న మట్టిని నింపడం, లెవలింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాస్థాయి అధికారులు డివిజన్, మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని సమిష్టి బాధ్యతతో గృహ నిర్మాణ పనుల్లో పురోగతి చూపించాలని జేసి అధికారులకు సూచించారు.

    ఈ సమీక్షా సమావేశంలో జిల్లా గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట అధికారి జి.వీరేశ్వర ప్రసాద్, జడ్పీ సీఈఓ ఎన్ వివి.సత్యనారాయణ, డిపివో ఎస్ వి.నాగేశ్వర నాయక్, డిఆర్డిఏ పిడి వై.హరిహరనాథ్,మెప్మా పిడి  కె.శ్రీరమణి, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ సూపరింటెడెంట్ ఇంజనీర్లు టీ.గాయత్రీ దేవి,బిఎస్. రవీంద్ర, డ్వామా పిడి ఎ.వెంకటలక్ష్మి, ఏపీఈపిడిసిఎల్ ఎస్ఇ నరసింహారావు, ఇతర అధికారులు హాజరైయారు.  

Kakinada

2021-06-21 13:22:07

యడ్లవల్లి ల్యాండ్ పై చర్యలు తీసుకోవాలి..

చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో ఉన్న యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కోలోనైజేషన్ సోసైటీ పునరుద్ధరణకు సంబంధించి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డి తో కలసి యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కోలోనైజేషన్ సోసైటీ పునరుద్ధరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కోలోనైజేషన్ సోసైటీ పునరుద్ధరించాలని ఆదేశించిన నేపథ్యంలో సోసైటీ సభ్యులను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సోసైటీ సభ్యుల గుర్తింపు కోసం  జూన్ 23వ తేదీ గ్రామ సభ నిర్వహించాలని, 25 తేదీ న సొసైటి సభ్యుల డ్రాఫ్ట్ లిస్ట్ ప్రచురించాలని, జూన్ 25 నుంచి 28వ తేదీ వరకు ప్రచురించిన సభ్యుల డ్రాఫ్ట్ లిస్ట్పై అభ్యంతరాలు స్వీకరించాలని, జూన్ 29వ తేదీ అభ్యంతరాలు పరిష్కరించి సాయంత్రం 5 గంటలకు యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కోలోనైజేషన్ సోసైటీ సభ్యుల పైనల్ లిస్ట్ను ప్రచురించాలన్నారు. యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కోలోనైజేషన్ సోసైటీ సభ్యుల గుర్తింపు ప్రక్రియను  సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ), సంయుక్త కలెక్టర్ (అసరా, సంక్షేమం) తో పాటు డీఆర్డీఏ పీడీ, జిల్లా సహకారా అధికారి, సోషల్ వేల్ఫేర్ డీడీ, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ లు సభ్యులుగా ఉన్న ప్రత్యేక బృందం పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి రాజశేఖర్, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదనరావు, మైనింగ్ ఏడీ విష్ణువర్థన్ రావు  పాల్గొన్నారు.

Guntur

2021-06-21 13:19:36

వేక్సిన్ వ్యర్ధాలను తరలించండి..

వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లో వేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ యొక్క వ్యర్ధాలు(ప్రమాదకరమైన చెత్త)ను డంపింగు యార్డుకు తరలించాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు శానిటరి ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. సోమవారం  ఐదవ జోన్, 59వ వార్డు లోని శ్రీహరిపురం, ఎఫ్.ఆర్.యు. సెంటర్ ను సందర్శించి ఆదివారం స్పెషల్ డ్రైవ్ లో వేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ యొక్క వ్యర్ధాలను ఎం.ఎస్.ఎఫ్.ల ద్వారా సేకరించి కాపులుప్పడ డంపింగు యార్డుకు తరలించాలన్నారు. అనంతరం కొత్త గాజువాక, పాత గాజువాక జంక్షన్, మింది తదితర ప్రాంతాలలో పర్యటించి డంపర్ బిన్స్ లో ఉన్న చెత్తను తరలించాలని, పలు చోట్ల కాలువలలో చెత్తను శుభ్రం చేయక పోవడంపై ఆయా శానిటరి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ మరియు ప్రైవేట్ సంస్థల ఖాళీ స్థలాలలో చెత్త పేరుకు పోయిందని, వాటిని వారి చేతనే తొలగించేందుకు తగు చర్యలు చేపట్టాలని, వారు చెత్తను తొలగించని యెడల మన కార్మీకులచే చెత్తను తొలగించి, వారి వద్ద నుండి అపరాధ రుసుంను  వసూలు చేయాలని శానిటరి అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో 59వ వార్డు శానిటరి ఇన్స్పెక్టర్, శ్రీహరిపురం ఎఫ్.ఆర్.యు. సెంటర్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-06-21 13:15:25

సేంద్రియ ఎరువుపై అవగాహన పెంచాలి..

సేంద్రీయ ఎరువు తయారీపై మహిళలకు అవగాహన పెంపొందించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం  రెండవ జోన్ 10వ వార్డు పరిధిలో ఇందిరా నగర్ కాలనీ పరిసర ప్రాంతాలలో కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గృహ అవసరాలకు తెచ్చుకున్న కూరగాయలు తొక్కలను బయట పడవేయకుండా ఇంటిలోనే ఎరువు తయారు చేసుకొనే విధంగా మహిళలకు అవగాహన పెంచాలన్నారు. అనంతరం, ఇందిరానగర్ కాలనీలోని రోడ్లను, కాలువలను పరిశీలించారు. సేకరించిన చెత్తను వెంట వెంటనే డంపింగు యార్డుకు తరలించాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా చూడాలని ఆ వార్డు శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. ప్రతి ఇంటి నుండి తడి-పొడి చెత్తను సేకరించే ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఇళ్ళ పరిసర ప్రాంతాలలో నీటి నిల్వలు లేకుండా చూడాలని ఆదేశించారు. తద్వారా దోమలు వృద్ధి చెందకుండా అరికట్టవచ్చునన్నారు. వార్డు పారిశుధ్య కార్మీకుల యొక్క పూర్తి వివరాలు వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శులు వద్ద ఉండాలని, దాని ఆధారంగా వారి విధులు సక్రమంగా నిర్వర్తించేలా చూడాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, రెండవ జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, వెటర్నరి డాక్టరు కిషోర్, ఇ.ఇ.(వాటర్ సప్ప్లై) పి. శ్రీనివాసరావు, డి.ఇ.ఇ. వంశీ, అసిస్టెంట్ సిటీ ప్లానర్, తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-06-21 13:13:20

డయల్ యువర్ కలెక్టర్ కు 18 వినతులు..

డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 18 వినతులు అందాయని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని స్పందన విభాగంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డి.ఆర్.ఓ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం మునిసిపాలిటీ పరిధిలో గల ఉరిటి భాస్కరరావు ఫోన్ చేసి మాట్లాడుతూ  వికలాంగుడైన తనకు  పేట్ రోడ్ వేస్,ముంబాయి వారు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేస్తూ, బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తూరు మండలం  నివగాం నుండి ఎస్.షణ్ముఖరావు ఫోన్ చేస్తూ  తన కూతురుకు వై.యర్.ఆర్ జగనన్న విద్యా దీవెన అందలేదని, కావున దానిని మంజూరుచేయాలని కోరారు. కంచిలి మండలం పోలేరు నుండి కె.వెంకటరావు ఫోన్ లో మాట్లాడుతూ  సచివాలయంలో కేటగిరి -1 లోని పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీచేయలేదని ఫిర్యాదు చేస్తూ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తూరు మండలం కౌసల్యపురం నుండి  కె.రాజేశ్వరి ఫోన్ చేసి మాట్లాడుతూ  తన భర్త మరణించినందున  తనకు వృద్దాప్య పింఛనును మంజూరు చేయాలని కోరారు. ఇచ్చాపురం మండలం పైతారి గ్రామం నుండి వి.మన్మధరావు ఫోన్ చేస్తూ   తనకు 44 శాతం వికలాంగత్వం ఉందని, కావున తనకు వికలాంగుల పింఛనును మంజూరుచేయాలని కోరారు. 

ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస గ్రామం నుండి బి.రవికుమార్ ఫోన్ చేస్తూ  తన భార్య అయిన చంద్రకళ  కొల్లివలస సచివాలయంలో  వాలంటీరుగా పని చేస్తుందని, తనని అకారణంగా విధుల నుండి తొలగించినందున మరలా పునరుద్ధరించాలని కోరుతూ, బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇచ్చాపురం మండలం  లొద్దపుట్టి నుండి బి.జోగారావు మాట్లాడుతూ లొద్దపుట్టి మేజర్ పంచాయితీ అయినప్పటికి  పంచాయితీ  సెక్రటరీ గాని సచివాలయం సెక్రటరీ గాని లేరని, కావున వారిని నియమించాలని కోరారు. ఎల్.యన్.పేట మండలం కోవిలాం నుండి జి.బాలరాజు ఫోన్ లో మాట్లాడుతూ 60 సంవత్సరాలు పూర్తయిన తనకు వృద్దాప్య పింఛనును మంజూరు చేయాలని కోరారు.  వీరఘట్టం మండలం పి.వి.ఆర్ పురం నుండి కె.పి.నాయుడు ఫోన్ లో మాట్లాడుతూ జగనన్న చేయూత పథకం మంజూరు చేయాలని కోరారు. ఆమదాలవలస మండలం రామచంద్రపురం నుండి జె.వెంకటరమణ ఫోన్ చేస్తూ  తన పూర్వీకుల నుండి ఉన్న  సర్వే నెంబరు 76.2లోని 44 సెంట్లు  భూమిని తన పేరు మీద  నమోదు చేసి అడంగళ్ ను మంజూరుచేయాలని కోరారు. రేగిడి ఆమదాలవలస మండలం తునివాడ నుండి ఆర్ అండ్ బి రహదారి విస్తరణలో తన ఇళ్లు కూలిపోయిందని, కావున తనకు తగిన నష్టపరిహారాన్ని మంజూరుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-21 13:09:45

విషయక గ్రాంట్ -2020-21కి ఆహ్వానం..

రక్షమంత్రి మాజీ సైనికుల సంక్షేమ నిధి కేంద్రీయ సైనిక బోర్డు న్యూఢిల్లీ  మాజీ సైనికుల పిల్లలకు విధ్యా విషయక గ్రాంట్ - 2020-21 కి ఆన్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిన్నట్టు జిల్లా సైనిక సంక్షేమ అధికారి బి. సత్యారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  హవల్దార్ ర్యాంకు వరకు ఉన్నవారు మాత్రమే అర్హులని తెలిపారు.  WWW.KSB.GOV.IN అను వెబ్ సైట్ (WELFARE-SCHEMES-RMEWF-EDUCATION GRANT-APPLICATION-FORM)లో రిజిష్టర్ చేసుకొని దరఖాస్తు పూర్తిగా ఆన్ లైన్ లో సమర్పించాల్సిందిగా ఆ ప్రకటనలో కోరారు. ఆన్ లైన్ లో సమర్పించిన దరఖాస్తును ప్రింట్ చేసి సంబంధిత దృవ పత్రములు, ఫీజు రశీదులను జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం, శ్రీకాకుళంలో అందజేయాల్సిందిగా ఆయన ఆ ప్రకటనలో కోరారు. 1వ తరగతి నుండి 9వ తరగతి, 11వ తరగతులకు దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తే 30.09.2021 దీ, 10వ తరగతి, 12వ తరగతులకు తే 31.10.2021 దీ, డిగ్రీ కోర్సు విద్యార్థులకు తే 30.11.2021 దీ లలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రకటనలో తెలిపారు.  దరఖాస్తు చేసిన తరువాత దరఖాస్తు దారుని వ్యక్తిగత పర్యవేక్షణలో ఉన్నందున ఈ కార్యక్రమ ప్రక్రియలో దరఖాస్తు దారులు బాధ్యత చూపుకోవలసిందిగా ఆయన ఆ ప్రకటనలో కోరారు.

Srikakulam

2021-06-21 13:04:50