1 ENS Live Breaking News

3వ దశ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధం..

రాష్ట్రంలో కోవిడ్19 కేసులు గణనీయంగా తగ్గి 24 వేల నుంచి 5 నుండి 6 వేలకు నమోదు స్థాయికి వచ్చిందని హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ. కె.సింఘాల్ చెప్పారు. ఆదివారం ఉదయం తిరుపతి నగరం లోని నెహ్రూ నగర్ , ప్రకాశంపార్కు వద్ద వున్న పట్టణ ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలలో పర్యటించి వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ , నగరపాలక కమిషనర్ గిరీషా కలసి  హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటించి వ్యాక్సినేషన్ పరిశీలించి, వైద్య అధికారులతో, వాక్సిన్ వేసుకున్న వారితో మాట్లాడారు. వాక్సిన్ వేసుకున్న పెద్దవయస్సు వున్న వారు  రవిరాజు, మొలకయ్య వాక్సిన్ ఏర్పాట్ల ప్రక్రియ అద్భుతంగా వుందని, ఎలాంటి ఇబ్బందులేదని, మాకు గాని మాకుంటుంబాలకు గాని కోవిడ సోకలేదని, కోవిడ నిబంధనలు పాటిస్తున్నామని  హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ అడిగిన దానికి సమాదానం ఇవ్వగా, ప్రిన్సిపల్ సెక్రటరీ  సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మీడియా కు వివరిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో ఐసియు , ఆక్సిజన్ బెడ్లు పెంచామని, రాబోవు రోజుల్లో ఆగస్టు నాటికి ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా  ఏర్పాట్లు చేస్తున్నమని, 100 బెడ్లు ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ల ఏర్పాటుకు రూ.350 కోట్లతో టెండర్లు కూడా పిలిచామని తెలిపారు. లిక్విడ్ ఆక్సిజన్ తో  పాటు ప్రత్యన్మయం ఆక్సిజన్ కాన్సంటెటర్లు అందుబాటులో వుంచానున్నామని  తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో  యాక్టివ్ కేసులు 65 వేలకు వచ్చాయని అన్నారు. వాక్సినేషన్ అందించడంలో ఇప్పటికే 96,69,000 లక్షల మందికి మొదటి డోసు  పూర్తిచేశామని, గతంలో ఒక్కరోజు లో 6,29,000 డోసులు వేసి సామర్థ్యం చూపామని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లారని , వారంలో 3 రోజులు కోవిడ్ పై సమీక్ష నిర్వహిస్తున్నారని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి రెండు రోజుల క్రితం 9 లక్షల డోసులు కేటాయించడంతో నేడు ఆదివారం 45 సంవత్సరాల పైబడిన వారికి , 5 సంవత్సరాల లోపు పిల్లల తల్లులకు , విదేశాలకు వెళ్లనున్న స్టూడెంట్స్ కు  డ్రైవ్ మోడ్ తో చేపట్టితే మద్యాహనానికి 5,30,000 పూర్తి అయ్యాయని, సాయంత్రం 100 శాతం పూర్తి అవుతుందని తెలిపారు. నిర్దేశించిన వయస్సు వారు 85 శాతం పూర్తి అయిందని, మిగిలినవారికి  కూడా పూర్తిచేస్తామని తెలిపారు. , మూడవ వేవ్ వల్ల అత్యంత ప్రమాదం లేదని నిపుణులు చెపుతున్నా.. రాకూడదనే కోరుకుందామని..ఒక వేళ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్దంగా వున్నామని వివరించారు.

మీడియా ప్రతినిధులు అడిగిన వాటికి సమాధానంగా మూడవ వేవ్ లో పిల్లలకు ఇప్పుడు కన్నా ఎక్కువ ప్రమాదం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపిన విషయం తెలిసిందేనని, మూడవ వేవ్ రాకూడదనే కోరుకున్నా, వచ్చినా ఎదుర్కొనడానికి సిద్దంగా వున్నామని, రాష్ట్ర స్థాయి కమిటీ వేశామని, ఇందులో పిడియాట్రిక్ సీనియర్  వైద్యులు సభ్యులు వున్నారని,   అందుకు కావలసిన వైద్య మందులు, బెడ్లు, ఆక్సిజన్ వంటివి అందుబాటులో వుంచుతున్నామని, చిన్నపిల్లల చికిత్స కోసం వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కోవిడ్ చికిత్సకు రెమిడిసివర్, బ్లాక్ ఫంగస్ కు ఎంఫోటెరిసిస్-బి వంటివి అందుబాటులో వున్నాయని, వీటి ఆలస్యానికి కారణం అందులో వాడే మందులు విదేశాలనుండి రావడం, కేంద్రం సూచనల మేరకు కేటాయింపు వంటివి వుంటాయని వివరించారు. ప్రస్తుతం ఇబ్బంది లేదని 770 మందికి  బ్లాక్ ఫంగస్ చికిత్స  అందించామని తెలిపారు. 

జిల్లా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో నేడు 1,05,000 డోసులను నిర్దేశించామని 100 శాతం పూర్తి అవుతుందని, ఇందులో నియోజక వర్గ నోడల్ అధికారులు, మెడికల్ సిబ్బంది, రెవెన్యూ , పంచాయితీ రాజ్ సిబ్బంది కాంపైన మోడ్ లో చేస్తున్నారని మద్యాహనానికి 55 శాతం మేర పూర్తి అయిందని వివరించారు. నగరపాలక కమిషనర్ వివరిస్తూ తిరుపతిలో వార్డు సచివాలయాల్లో, అర్బన్ హెల్త్ సెంటర్లలో 34 చోట్ల వాక్సినేషన్ ప్రక్రియ ఏర్పాటు చేశామని 6 వేల డోసులు లక్ష్యంగా వేస్తున్నామని, వ్యాక్సిన్ వేసే సమయంలో ఇబ్బంది కలిగితే ఆంబులెన్సులు సిద్దంగా వుంచామని, ఇంతవరకు ఇబ్బంది లేదని తెలిపారు. హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ వారి పర్యటనలో  డి.ఎం.హెచ్.ఓ, శ్రీహరి, తిరుపతి ఆర్డీవో కనక నరసా రెడ్డి, రుయా సూపర్నెంట్ భారతి  మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ సుధారాణి, హెల్త్ సెంటర్ డాక్టర్లు ప్రియాంక , ప్రవీణ తదితరులు వున్నారు.

Tirupati

2021-06-20 10:07:14

యోగాతో మాన‌సిక ప్ర‌శాంత‌త‌..

యోగా ప్ర‌క్రియతో సంపూర్ణ ఆరోగ్యం, మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తాయ‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డా. జి.సి. కిశోర్ కుమార్ అన్నారు. మాన‌వుని జీవ‌న విధానంలో యోగా ఎన్నో మార్పులు తీసుకొచ్చింద‌ని పేర్కొన్నారు. భారత‌ పుణ్య‌భూమిలో యోగాకు ఎంతో ప్రాధాన్యత ఉంద‌ని గుర్తు చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ యోగా ప్ర‌క్రియ‌ను అనుస‌రించాల‌ని.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌ని సూచించారు. జూన్ 21న‌ అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఆయ‌ష్ శాఖ ఆధ్వ‌ర్యంలో ఆదివారం ఉద‌యం కోట జంక్ష‌న్ నుంచి జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యం వ‌ర‌కు చేప‌ట్టిన 5కే ర‌న్ ను ఆయ‌న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ యోగా అనేది నేడు మాన‌వుని జీవితంలో ఒక ముఖ్య‌మైన ప్ర‌క్రియగా మారింద‌ని, జీవ‌న శైలిపై దాని ప్ర‌భావం చాలా వ‌ర‌కు ప‌డిందని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ యోగా ప్ర‌క్రియ‌ను అనుస‌రించ‌టం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌ని సూచించారు. శ‌రీర, ప్రాణాత్మ‌, దేహాల‌ను ఒక తాటిపైకి తీసుకొచ్చి మాన‌వుని యొక్క‌ శారీర‌క‌, మాన‌సిక, ఆధ్యాత్మిక ఎదుగుద‌ల‌కు దోహ‌ద‌ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ శారీర‌క‌, మాన‌సిక‌, ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండ‌టం ద్వారా దేశానికి ఉప‌యోగ‌ప‌డాల‌ని సూచించారు. ఐక్య‌రాజ్య స‌మితి కూడా యోగాను గుర్తించ‌టంతో దాని ప్రాముఖ్య‌త మ‌రింత పెరిగింద‌ని గుర్తు చేశారు. కావున ఈ ప్ర‌క్రియ‌ను అంద‌రూ అనుస‌రించి సంపూర్ణ ఆరోగ్య స‌మాజ నిర్మాణానికి స‌హ‌క‌రించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని పేర్కొన్నారు. అనంత‌రం ఆయుష్ శాఖ ఆధ్వ‌ర్యంలో ఆన్‌లైన్‌లో యోగాస‌న ప్ర‌క్రియ‌ల‌పై అవ‌గాహ‌న కార్యక్ర‌మం నిర్వ‌హించారు.

కార్య‌క్ర‌మంలో డీఆర్వో ఎం. గ‌ణ‌పతిరావు, ఆర్డీవో బీహెచ్ భ‌వానీ శంక‌ర్‌, ఆయ‌ష్ శాఖ జిల్లా ప‌ర్య‌వేక్ష‌కుడు డా. ధ‌నుంజ‌య‌రావు, జిల్లా క్రీడాధికారి వెంక‌టేశ్వ‌రరావు ఇత‌ర అధికారులు, ఆయ‌ష్ శాఖ‌, క్రీడా ప్రాధికార సంస్థ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-06-20 09:59:35

క్యాజువల్ కార్మికులను ఆదుకోవాలి..

విశాఖపోర్టులో సరైన ఉపాది లేక తీవ్ర అవస్థలు పడుతున్న క్యాజువల్ కార్మికులను తక్షణమే ఆదుకోవాలని పోర్టు చైర్మన్ కె.రామ్మోహనరావును అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, పోర్టు ట్రస్టు మాజీ సలహాదారు, జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు కోరారు. ఈ మేరకు చైర్మన్, కార్యదర్శి టి.వేణుగోపాల్‌ను శనివారం  శ్రీనుబాబు మర్యాదపూర్వకంగా కలసి సింహాచలం చందన ప్రసాదం , స్వామి వారిశేష వస్త్రం అందజేశారు. అనంతరం క్యాజువల్ కార్మికులకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించి వారికి తక్షణమే న్యాయం చేయాలని కోరారు. 2009 లో సుమారు 300 మంది కార్మికులు డిఎల్ బి నుంచి పోర్టులోకి విలీనమయ్యారని, ఇందులో కొందరికి పర్మినెంట్ చేసినా మిగిలిన మరో 269 మందికి మాత్రం సరైన ఉపాధి అవకాశాలు లభించడం లేదని శ్రీనుబాబు వివరించారు. ప్రస్తుతం అరకొర పనుల వల్ల ప్రతినెల వీరికి సరైన వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులలో అల్లాడుతున్నారన్నారు. కరోనా సమయంలో వీరి సమస్యలు రెట్టింపుగా మారాయని వివరించారు. క్యాజువల్స్ కు సంబంధించి కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి మాండవీయ దృష్టికి విశాఖ ఎంపి ఎంవివి సత్యనారాయణ ద్వారా పలుమార్లు తీసుకు వెళ్లామన్నారు. కేంద్ర మంత్రి సైతం వీరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన విషయం గుర్తుచేశారు. అయితే తక్షణమే పర్మినెంట్ చేయకపోయినా కనీసం పోర్టులో ఖాళీగా ఉన్న విభాగాల్లో తమ సేవలు ఉపయోగించుకోవాలని కార్మికులు కూడా ఎంతోకాలంగా కోరినట్టు చెప్పారు. బయట వారికి అవకాశం ఇవ్వకుండా పోర్టులోనే సేవలందిస్తున్న క్యాజువల్ కార్మికులకు పని చూపిస్తే వారికి తగిన వేతనాలు పొందే సౌలభ్యం కలుగుతుందన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం తల్లిదండ్రులు తమ పిల్లల కోసం స్వచంద పదవీ విరమణ చేసి త్యాగం చేస్తే వీరికి దశాబ్దాల తరబడి న్యాయం జరగడం లేదని శ్రీనుబాబు పేర్కొన్నారు.

విశాఖ సిటీ

2021-06-19 16:18:37

నాడు-నేడుతో పాఠశాలలకు మహర్ధశ..

నాడు నేడుతో పాఠశాలల  రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతోందని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగరంలోని నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అభిరుద్ది పనులు చేపట్టిన రాజేంద్ర మున్సిపల్ హైస్కూలు,కస్తూరి హైస్కూలు,వాల్మీకి మున్సిపల్ ప్రైమరీ స్కూల్ లను శనివారం అధికారులతో కలసి పరిశీలించారు. 18 పాఠశాలల్లో మనబడి నాడు నేడు కింద తొమ్మిది రకాల పనులు త్రాగునీటి  సదుపాయం,టాయిలెట్స్,మేజర్ మరియు మైనర్ రిపేర్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ ఫర్నిచర్స్ ,గ్రీన్ చాక్ బోర్డు,కాంపౌండ్ వాల్,పెయింటింగ్ వర్క్స్ ,ఇంగ్లీష్ ల్యాబ్ వంటి పనులు చేపట్టినట్లు అధికారులు మేయర్ కు వివరించారు. ఇందులో కస్తూరిబాయ్ మున్సిపల్ హై స్కూల్ లో రూ.58 లక్షలు,వాల్మీకి ప్రైమరీ స్కూల్ లో రూ.17 లక్షలు,రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్ లో రూ.57 లక్షలు ఖర్చు చేసి ఆయా పాఠశాలల్లో అభిరుద్ది పనులు చేసినట్లు మేయర్ వసీం కు వివరించారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలన్న లక్ష్యం తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ కు ధీటుగా మౌలిక సదుపాయాలు కల్పించడం గొప్ప కార్యక్రమం అన్నారు.నగరంలో ప్రజలకు ప్రభుత్వ  విద్య,వైద్యం  మెరుగైన  సేవలు అందించేందుకు అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కొన్ని పాఠశాలల్లో వాటర్ ప్లాంట్ లు దుమ్ము దూళి నిండి ఉండటంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి పనులు చేపట్టినా నిర్వహణ లేకుంటే త్వరగా పాడేయ్యే అవకాశం ఉందని ఉపాద్యాయులు వాటి నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో  కార్పొరేటర్లు దేవి,  లక్ష్మీదేవి, సాకే చంద్రలేఖ,లీలావతి, కమలభూషణ్,టీవీ చంద్రమోహన్ రెడ్డి, ఇషాక్,అనీల్ కుమార్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ షాంశుద్దిన్, డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి ఎస్ సి రమేష్ చంద్ర, ఈ ఈలు రామ్మోహన్రెడ్డి, ఆదినారాయణ, అసిస్టెంట్ ఇంజనీర్లు నాగజ్యోతి, శంకర్, వైఎస్ఆర్సిపి నాయకులు ఖాజా, కుల్లాయి స్వామి మహబూబ్ పీరా, , లక్ష్మన్న గంగాధర్, స్కూళ్లలో హెడ్ మాస్టర్స్  తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-19 16:12:29

నిరాదరణకు గురైన వారిని ఆదుకోవాలి..

నిరాదరణకు గురైన మహిళలకు ఆర్థిక చేయూత కల్పించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో  జిల్లా గ్రామీణ అభివృద్ధి సంక్షేమ శాఖ, మెప్మా ఆధ్వర్యంలో, స్కిల్ డెవలప్మెంట్ వివిధ పథకాలు ఎలా అమలు చేస్తున్నారు అనే అంశంపై  సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ   నవరత్నాల లోని ప్రతి సంక్షేమ పథకాల అమలుపై  అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు  అందించవలసిన బాధ్యత మీపైన ఉన్నదన్నారు. ప్రతి సంక్షేమ పథకం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగే విధంగా కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని ఆమె ఆదేశించారు. జిల్లాలో కదిరి పరిసర ప్రాంతాలలో మహిళలు నిరాదరణకు గురి అవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయని, మహిళల అక్రమ రవాణా అనేది రూపుమాపాలని, వారికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, పెన్షన్లు, ఇతర ప్రభుత్వ పథకాలు అన్నీ వారికి అందేలా చూడాలని,  వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత మీ అందరిపై ఉందని పేర్కొన్నారు. ఇందుకు ఎన్జీవోల సహకారం తీసుకొని వారిని అభివృద్ధి చేయవలసిన అవసరం వుందని ఆమె తెలిపారు.  జిల్లాలోని వివిధ మహిళా సంఘాలు సాధించిన ప్రగతిని డాక్యుమెంట్ రూపంలో సిద్ధం చేయాలని తెలిపారు.  మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను త్వరితగతిన బ్యాంకులకు చెల్లించి అధిక మొత్తంలో రుణాల పొందవచ్చునని, వీటిపైన విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. బ్యాంక్ లింకేజీ  పథకం అమలులో, శ్రీనిధి పథకాల అమలులో, జిల్లా ప్రథమ స్థానంలో ఉంచేలా అధికారులు కృషిచేయాలని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. వైయస్సార్ పెన్షన్ కానుక,   వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, వైయస్ఆర్ సున్నా వడ్డీ, వైయస్సార్ బీమా, జగనన్న తోడు, బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి, ఉన్నతి, మహిళా సాధికారత, మెప్మా ఆధ్వర్యంలో వివిధ పథకాలపై ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు కోవిడ్ కారణంగా ఆన్లైన్ క్లాసులు పైన దృష్టిసారించాలని తెలిపారు. ప్రైవేట్ సంస్థలలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువతకు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) గంగాధర్ గౌడ్,  డి ఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, మెప్మా పిడి రమణారెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఏపీడి నరసయ్య, ఈశ్వరయ్య, డిఆర్డి ఎ, మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-19 16:07:29

బాధితులకు మెరుగైన కౌన్సిలింగ్..

గృహ హింస కేసుల్లో బాధితులకు మెరుగైన కౌన్సెలింగ్ , న్యాయ సలహాలు అందేలా చూడాలని ఐసీడీఎస్ పీడీ సుజన ను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గృహ హింస కేసుల్లో కౌన్సెలింగ్ సమయంలోనే సమస్యకు పరిష్కారం, మహిళలకు న్యాయం దక్కేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గృహ హింస కేసులకు సంబంధించి ఏడాది వారీగా, ప్రాంతాల వారీగా సమాచారం నమోదు చేయాలన్నారు. అప్పుడే కేసులు పెరుగుదల, తరుగుదల పై అధికార యంత్రాంగం ఒక అంచనాకు వచ్చి పరిష్కారం దిశగా సరైన చర్యలు చేపట్టగలదన్నారు. ఇదే సూత్రం అన్ని అంశాలలోనూ పాటించాలన్నారు.  పిల్లలకు అందించే పౌష్టికాహారం గురించి జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. కరోనా కారణంగా అనాధలైన పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న రూ.10 లక్షల పరిహారం త్వరితగతిన దక్కేలా చూడాలన్నారు. పరిహారానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. అంగన్ వాడీల్లో నాడు-నేడు పనులకు సంబంధించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అదేశించారు. 
సమీక్షలో నోడల్ ఆఫీసర్ వనజ, ఈవో భారతి దేవి తదితరులు పాల్గొన్నారు. 

Anantapur

2021-06-19 16:03:56

అనంతలో ఇసుక కొరత రాకూడదు..

ఇసుక కొరత లేకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో శనివారం సాయంత్రం జిల్లా ఇసుక కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించగా, ఇందులో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ రెవెన్యూ, రైతు భరోసా) నిశాంత్ కుమార్, హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) సంక్షేమం గంగాధర్ గౌడ్, ఏ ఎస్పి సెజ్ రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గత సమీక్షా సమావేశంలో జరిగిన అంశాలపై కూలంకషంగా చర్చించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోమవారంలోగా హిందూపురం, బ్రహ్మసముద్రం మండలం గోవిందయ్య దొడ్డి రీచ్ లను ప్రారంభించేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా కదిరి, గుంతకల్, రాయదుర్గం, అనంతపురం డిపోలలో తగినంత ఇసుక నిల్వలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని జెపి ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. భూగర్భ శాఖ నుండి కొత్తగా పర్యావరణ అనుమతులు పొందిన 10 ఇసుక రీచ్ లకు మ్యాన్యువల్ నుంచి యంత్రాలతో తవ్వకాలు కొరకు మోడిఫికేషన్ అనుమతులు వెబ్ సైట్ లో నమోదు చేయాలని ఆదేశించారు. కొత్తగా ఇసుక రీచ్లలో సంయుక్తంగా లైన్ డిపార్ట్మెంట్లు తనిఖీలు నిర్వహించి జిల్లా కమిటీకి ఆమోదం కొరకు సమర్పించాలన్నారు. బుధవారం లోగా కొత్తగా తనిఖీ చేసిన రీచ్ ల ఆమోదం కొరకు నివేదిక సమర్పించాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ వారి పనులకు సంబంధించి వాహనాల జాబితాను సమర్పించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో డిడి మెన్స్ ఎస్ వి రమణ రావు, సాండ్ ఆఫీసర్ కొండారెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ ఈ భాగ్యరాజ్, జెపి ఏజెన్సీ మేనేజర్ దయాళన్, నోడల్ ఆఫీసర్ నాగరాజ్, తాడిపత్రి ఏడి మైన్స్ ఆదినారాయణ, విజిలెన్స్ ఏడి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-19 16:01:14

డాక్టర్లు తో చర్చలు ఫలప్రదం..

తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ హాస్పిటల్  రెసిడెంట్ డాక్టర్లు గత మూడు రోజులుగా స్టయిఫండ్  కోసం నిర్వహిస్తున్న  చర్చకు దానికి అనుకూలంగా  ఈరోజు సాయంత్రం  శ్రీ పద్మావతి  అతిధి  గృహమునందు  తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణ అధికారి  జవహర్  రెడ్డి తో   స్విమ్స్  రెసిడెంట్ డాక్టర్స్ స్టైఫండ్ పెంపుదల విషయంపై జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఈ చర్చలలో చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణ, స్విమ్స్ డైరెక్టర్, ఉప కులపతి డాక్టర్.బి.వెంగమ్మ, స్విమ్స్ డీన్, స్విమ్స్ రిజిస్ట్రార్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి  మరియు స్విమ్స్  రెసిడెంట్ డాక్టర్లు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా స్విమ్స్ రెసిడెంట్ డాక్టర్లు తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యానికి , స్విమ్స్  యాజమాన్యానికి  కృతజ్ఞతలు తెలియజేశారు.

Tirupati

2021-06-19 15:41:56

ఆన్ లైన్ సేవలపై పండితులకు శిక్షణ..

 శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి ఆర్జిత సేవలు ఆన్ లైన్ లో అందించే విషయమై వేదపండితులకు అవగాహన ఉండాలని ఈఓ ఎంవీ సూర్యకళ సూచించారు. శనివారం దేవస్థానంలోని వేదపండితులు, ఆలయ సిబ్బందికి  TMS.AP.GOV.IN వెబ్ సైట్, యూట్యూబ్ ద్వారా అందించేసే సేవలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, చాలామంది భక్తులు శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి ఆర్జిత సేవల్లో పరోక్షంగా పాల్గొంటున్నారని అన్నారు. సింహాచలం దేవస్థానం ఈఓ అకౌంట్ కు రుసుము చెల్లించి సైతం భక్తులు పరోక్ష సేవల్లో భాగస్వాములవుతున్నారు. TMS వెబ్ సైట్లో సింహాచలం దేవస్థానంకు సంబంధించి పరోక్ష సేవలు, ఈ హుండి, డొనేషన్ ఆప్షన్లున్నాయని వాటి వినియోగంపై అవగాహన పెంచుకోవడం ద్వారా  భక్తులకు తెలియజేయడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ సందర్భంగా TMS వెబ్ సైట్ ద్వారా ఏఈఓ రణమమూర్తి నిత్యకళ్యాణం, ఏఈఓ తిరుమలేశ్వరరావు నిత్యకళ్యాణంకి టికెట్లు బుక్ చేసుకున్నారు. సీసీ వరాలరావు  తన ఆరోగ్యం బావుండాలన్న ఉద్దేశతో రూ.1116 స్వామివారికి విరాళం , బంగారు రాజు గోరక్షణ పథకానికి డొనేషన్ ఇచ్చారు.  ఆన్ లైన్ సేవలు, ఈ హుండీ, డొనేషన్ల గురించి అందరికీ అర్థమయ్యేలా ఈఓ  సూర్యకళ, బంగారు రాజు వివరించారు. ఈ కార్యక్రమంలో  గోపాలకృష్ణమాచార్యులు, శ్రీనివాస ఆచార్యులు, సీతామారాచార్యులు సహా పలువురు వేద పండితులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ సుజాత,  ఏఈఓలు రాఘవ కుమార్, తిరుమలేశ్వరారవు , రమణమూర్తి, శ్రీనివాస్, ఆనంద కుమార్,ఇంజనీరింగ్ సహా అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.  

Simhachalam

2021-06-19 15:37:32

తిరుమల ఆంజ‌నేయాలయ అభివృద్ధి..

ఆంజ‌నాద్రి ప‌ర్వ‌త‌మే ఆంజ‌నేయ స్వామివారి జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని, ఆకాశ‌గంగ వ‌ద్ద ఆల‌యాన్ని అభివృద్ధి చేస్తామ‌ని టిటిడి ఛైర్మ‌న్  వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యుల‌తో క‌లిసి శ‌నివారం బాల ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యాన్ని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.   ఈ సంద‌ర్భంగా  ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ టిటిడి ఆంజ‌నేయ‌స్వామివారి జ‌న్మ‌స్థ‌లం ఆకాశ‌గంగ అని న‌మ్ముతుంద‌న్నారు. ఇదే విష‌యాన్ని శ్రీ‌వారి భ‌క్తులు కూడా విశ్వ‌సిస్తూన్నార‌ని, దీనిపై ఎవ‌రితోను ఎలాంటి చ‌ర్చ‌లు లేవ‌న్నారు. ఆకాశ‌గంగ వ‌ద్ద అంజ‌నాదేవి స‌మేత బాల ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యాన్ని అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. అనంత‌రం ఈవో మాట్లాడుతూ టిటిడి ఏర్పాటు చేసిన పండిత ప‌రిష‌త్ నివేదిక‌లో ఆంజ‌నాద్రిలోని ఆకాశ‌గంగ ఆంజ‌నేయ‌స్వామివారి జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని పురాణాల ద్వారా నిర్ణ‌యించార‌ని తెలిపారు. ఆకాశ‌గంగ వ‌ద్ద భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు, ఆల‌య అభివృద్ధిపై కార్య‌చ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు రూపొందించి అభివృద్ధి చేస్తామ‌న్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు  శేఖ‌ర్‌రెడ్డి,  గోవింద‌హ‌రి,  పార్థ‌పార‌ధిరెడ్డి, డాక్ట‌ర్ నిశ్చిత‌,  వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, రాజేష్‌శ‌ర్మ‌,  ర‌మేష్‌శెట్టి,  శివ‌శంక‌ర్‌,  డి.పి.అనంత‌, మ‌ల్లాది విష్ణు, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాధ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.  

Tirumala

2021-06-19 15:17:39

సోమవారం నుంచి ఆర్.టి.ఓ సేవలు..

విజయనగరం జిల్లాలో కోవిడ్ కారణంగా కొద్ది రోజులుగా నిలిపి వేసిన ప్రాంతీయ రవాణా కార్యాలయం ద్వారా పౌర సేవలను జూన్ 21వ తేదీ సోమవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు ఉప రవాణా కమిషనర్ సిహేచ్. శ్రీదేవి తెలిపారు. ఈ మేరకు శనివారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు  డ్రైవింగ్ లైసెన్స్ ల జారీ, ఎల్.ఎల్.ఆర్., వాహనాల ఫిట్ నెస్ కు, రవాణా శాఖ కు సంబందించిన అన్ని సేవలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందిస్తామని పేర్కొన్నారు.  ప్రజలు సోమవారం నుంచి అన్ని సేవలను పొందవచ్చని తెలిపారు.

Vizianagaram

2021-06-19 15:15:40

గ్రామాలను సుందరంగా మార్చాలి..

గ్రామాల‌ను సుంద‌రంగా తీర్చిద్దాల‌ని, పారిశుద్ధ్య చ‌ర్య‌లు ప‌టిష్టంగా చేప‌ట్టాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ ఆర్‌. మ‌హేష్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు జిల్లాలో 100 రోజుల పాటు స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్యాచ‌ర‌ణ‌లో భాగంగా రోజుకో కార్యక్రమం నిర్వ‌హించాల‌ని సూచించారు. జూలై 08వ తేదీ నుంచి చేప‌ట్ట‌బోయే స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్య‌క్ర‌మానికి ముందుగా వైద్య సిబ్బందితో గ్రామాల్లో స‌ర్వే చేయిస్తామ‌ని, అనంత‌రం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌తో ముందుకెళ్దామ‌ని పిలుపునిచ్చారు. స్వ‌చ్ఛ సంక‌ల్పం, భ‌వన నిర్మాణాల ప‌క్షోత్స‌వాల‌పై శ‌నివారం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో జ‌రిగిన స‌మీక్ష‌లో ఆయ‌న ఈ మేర‌కు మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ స‌రిగా లేని గ్రామాల్లో ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, నిర్వ‌హ‌ణ స‌రిగా లేకుంటూ స్థానిక అధికారులు, సిబ్బందిపై చ‌ర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. త‌డి, పొడి చెత్త‌, మెడిక‌ల్ వ్య‌ర్థాల సేక‌ర‌ణ‌పై క్షేత్ర‌స్థాయి సిబ్బందికి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఎంపీడీవోల‌కు సూచించారు. గ్రామాల‌న్నీ ఓడిఎఫ్ దిశ‌గా ప‌య‌నించాల‌ని, ఆ విధంగా త‌గిన చ‌ర్య‌లు చేపట్టాల‌ని చెప్పారు. జిల్లాలో ఉన్న 959 పంచాయ‌తీల్లో ముందుగా 100 గ్రామాల్లో స‌ర్వే నిర్వహిస్తామ‌ని అక్క‌డ పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌, ఇత‌ర ప‌రిస్థితుల‌పై ఆరా తీస్తామ‌ని వివ‌రించారు. గ్రామాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచ‌టం ద్వారా సీజ‌న‌ల్ వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. పంచాయ‌తీ, సచివాల‌య‌, వైద్య సిబ్బంది స‌మ‌న్వ‌యంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.

అనంత‌రం భ‌వ‌న నిర్మాణాల‌కు సంబంధించిన అంశాల‌పై మాట్లాడుతూ పెండింగ్ ప‌నులు ఉంటే త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని చెప్పారు. బిల్లులు, ఇత‌ర ప్ర‌క్రియ‌ల‌కు సంబంధించిన అంశాల‌పై మార్గ‌నిర్దేశ‌కాలు చేశారు. పంచాయ‌తీల్లో గ్రీన్ అంబాసిడ‌ర్స్‌, సిల్టు లేబ‌ర్స్ స‌మ‌స్య‌లు త‌దిత‌ర విష‌యాలపై క్షేత్ర‌స్థాయిలో ఉన్న ప‌రిస్థితిని ఎంపీడీవోల‌ను అడిగి తెలుసుకున్నారు. బ‌యోమెట్రిక్ మెషిన్లు స‌రిప‌డా లేవ‌ని ఉన్న‌వి మ‌ర‌మ్మ‌తుల‌కు గుర‌య్యాయ‌ని ఈ సంద‌ర్భంగా ఎంపీడీవోలు జేసీ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే స‌చివాల‌యాల్లో స్టేష‌న‌రీకి సంబంధించి విధివిధానాలు స‌రిగా లేవ‌ని ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని ఎంపీడీవోలు ప్ర‌స్తావించారు. దీనిపై జేసీ స్పందిస్తూ సంబంధింత అంశాల‌తో కూడిన నివేదిక‌ల‌ను పంపిస్తే ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు.

కార్య‌క్ర‌మంలో జిల్లా ప‌రిష‌త్ సీఈవో వెంక‌టేశ్వ‌ర‌రావు, డీపీవో సుభాషిణి, జిల్లా కో-ఆర్డినేట‌ర్ స‌త్య‌నారాయ‌ణ‌, ఎంపీడీవోలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-19 14:43:54

శనివారం చందన లభ్యత31 కేజీలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారికి సమర్పించే  మూడో విడత చందనం అరగదీత ప్రక్రియ లో భాగంగా శనివారం మొత్తం 31 కిలోల చందనం లభ్యమైనట్టు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ రోజు నుంచి మరో రెండు రోజుల పాటు చందనం అరగదీత కార్యక్రమం నిర్వహించిన తరువాత  ఈ నెల 24వ తేదీ జ్యేష్ట పూర్ణిమ సందర్బంగా స్వామివారికి మూడో విడత చందన సమర్పణ సమర్పిస్తారు. అదే రోజు స్వర్ణ పుష్పార్చన, శ్రీమణవాళ మహామునుల మాస తిరునక్షత్రం ఉంటుందన్న ఈఓ స్వామివారికి చందనం సమర్పించాలనుకునే భక్తులు అరకిలోకి రూ.10,116 ,  కిలోకి 20,116 సమర్పించుకోవచ్చునన్నారు. అరకిలో చందన సమర్పణ చేసినవారికి 200 గ్రాముల చందనం చెక్క, కేజీ సమర్పించినవారికి 300 గ్రాముల చందనం ముక్కతోపాటు శేష వస్త్రం  ప్రసాదంగా ఇస్తారని వివరించారు. చందన సమర్పణకు ఆన్ లైన్లో సొమ్ము చెల్లించాక చిరునామా, గోత్రనామాలతో పాటు వివరాలను స్క్రీన్ షాట్ తీసి  6303800736 వాట్సప్ నంబర్ కు పంపించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని అప్పన్న భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈఓ కోరారు.

Simhachalam

2021-06-19 14:26:05

శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలం కావాలి..

నేరేడు బ్రిడ్జి నిర్మాణం వలన శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలం కాగలదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, శాసన సభాతి తమ్మినేని సీతారాం లుపేర్కొన్నారు. ఖరీఫ్ కు జూలై 8న సాధ్యమైనంత మేరకు వంశధార, మద్దువలస నుండి నీటిని విడుదల చేయడానికి నిర్ణయించామని పేర్కొన్నారు. శనివారం జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ అదును పదును ఉన్నప్పుడే సాగునీటి పనులు చేయాలన్నారు. నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులకు సాగునీటిపై వివరాలు అందించడంలో ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. దీనిపై చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. జిల్లా సస్యశ్యామలం కావాలన్నారు. జలవనరుల శాఖ ఇంజనీర్లు ప్రత్యేక శ్రద్ద వహించి పంటలకు సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. శ్రీకాకుళం వ్యవసాయక జిల్లా అని అన్నారు. ప్రతి ఎకరాకు నీరు అందాలని ఆయన సూచించారు. ఒడిషా ముఖ్య మంత్రి కి ఏప్రిల్ 16న ముఖ్య మంత్రి లేఖ రాశారని ఆయన చెప్పారు. సమస్య ఉంటే తెలియజేయాలని ఆయన అన్నారు. ముఖ్య మంత్రి శ్రీకాకుళం జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సమన్వయంతో పనిచేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. రైతులకు మంచి సేవలు అందించుటకు ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. మంచి మనసున్న ముఖ్య మంత్రి రాష్ట్రంలో ఉన్నారని ఆయన అన్నారు.

రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ పంటలకు ముందుగానే కాలువల నిర్వహణ పనులు పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో మంచి ప్రజాప్రతినిధుల బృందం ఉందని, ప్రజాప్రతినిధుల సేవలు ఉపయోగించు కోవాలని ఆయన సూచించారు. పాలకొండ శాసన సభ్యులు తెలిపిన అంశాలపై సంబంధిత కాంట్రాక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి పరిష్కరించాలని ఆయన సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో కరకట్టలు నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన చెప్పారు. వంశధార, బాహుదా అనుసందానం చేయుటకు రౌతు సత్యనారాయణను సలహాదారుగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా జిల్లాలో 70 వేల ఎకరాలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కోన్నారు. ఒక్క చుక్క నీటిని కూడా వృథాకాకుండ ప్రాజెక్టు లను ముఖ్య మంత్రి మంజూరు చేసారని చెప్పారు. వెనుకబడిన  జిల్లాగా ఉండకూడదని ముఖ్య మంత్రి ఆలోచన అన్నారు.

        రాష్ట్ర పశుసంర్థక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ శివారు ప్రాంతాలకు ఒక చుక్క నీరు కూడా రాలేదన్నారు. తద్వారా రైతులు నాట్లు వేసిన పరిస్థితి కూదా లేదన్నారు. శివారు నుండి హెడ్ వద్ద ఉన్న భూములకు నీరు అందించే ప్రణాళిక ఉండాలని ఆయన సూచించారు. నీటి విడుదలకు ఒక విధానం  అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి ప్రాజెక్టు నుండి నీటిని అందించుటకు ముఖ్య మంత్రి నేతృత్వలోని ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. నేరేడు బ్రిడ్జిపై ఒడిషా ముఖ్య మంత్రి తో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడి పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో అనేక జలవనరుల ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్నారు. వచ్చే నెల వివిధ ప్రాజెక్టుల నుండి పంటలకు నీరు విడుదల చేయడం జరుగతుందన్నారు. ప్రస్తుతం లభ్యంగా ఉన్న నిధులతో కాలువల నిర్వహణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇతర నిధులకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించాలని ఆయన అన్నారు. సాధ్యమైనంత మేర పనులు త్వరగా పూర్తి చేసి సాగునీరు సక్రమంగా అందేటట్లు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. అన్ని పనులు మిషన్ మోడ్ లో చేపట్టాలని ఆయన ఆదేశించారు. వర్షాకాలానికి ముందుగానే అన్ని పనులు పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు.

శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ జూన్ లోనే ఖరీఫ్ కు నీటిని విడుదల చేయాలని సూచించారు. కాలువలు పూర్తిగా పూడికలతో నిండి పోయాయని తెలిపారు. శాసన సభ్యులు కంబాల జోగులు మాట్లాడుతూ సాగునీటి సమస్య తలెత్తకుండా ఇంజనీర్లు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. శాసన సభ్యులు విస్వసరాయి కళావతి మాట్లాడుతూ కాట్రగడ్డ వద్ద అండర్ పాసేజ్ నిర్మించాలన్నారు. బాధ్యతాయుతంగా ఉండని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టుటకు చర్యలు చేపట్టాలని సూచించారు. 87, 88 ప్యాకేజీలు క్రింద పలు పనులు చేపట్టాలని తద్వారా ప్రజలకు నష్టం సంభవించదని ఆమె పేర్కన్నారు. జంపరకోట రిజర్వాయర్ పనులు 34 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉందన్నారు. శాసన సభ్యులు రెడ్డి శాంతి మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టును అతి త్వరగా పూర్తి చేసి నిర్వాసితుల త్యాగాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని కోరారు.

వంశధార పర్యవేక్షక ఇంజినీర్ డోలా తిరుమల రావు మాట్లాడుతూ ఈ ఏడాది వంశధార పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. వంశధార, నాగావళి నదుల అనుసంధానం కూడా ఈ ఏడాది పూర్తి చేయాలని ఆదేశించారని పేర్కోన్నారు. వంశధార రిజర్వాయర్ పనులు 90 శాతం, 87 ప్యాకేజీ పనులు 85 శాతం, ప్యాకేజీ 88  పనులు 96 శాతం,  హెచ్.ఎల్.సి పనులు 75 శాతం పూర్తి అయ్యాయని ఆయన వివరించారు. నేరేడు బ్రిడ్జి  పూర్తి కావడానికి కృషి చేయాలని తద్వారా 19 శాతం నీటిని రిజర్వాయర్ లో నిల్వ చేయవచ్చని తెలిపారు. ఎడమ కాలువ మరమ్మతులు చేపట్టాల్సి ఉందని ఎస్ఇ చెప్పారు. ఎల్.ఎం.సి పై నీటి తీరువాతో 51  పనులు మంజూరు చేసామని తెలిపారు. హెచ్.ఎల్.సి 10 శాతం పనులు పూర్తి చేయడం వలన నీటిని విడుదల చేయవచ్చని ఆయన చెప్పారు. కరోనా వలన అన్ని పనులు కొంత జాప్యం జరిగిందని ఆయన వివరించారు.

ఈ సమావేశంలో ఎం.ఎల్.సిలు పాకలపాటి రఘు వర్మ,  తూర్పుకాపు, కళింగకోమటి కార్పొరేషన్ల అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, అందవరపు సూరి బాబు, డిసిసిబి మాజీ అధ్యక్షులు పాలవలస విక్రాంత్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ హెచ్.కూర్మారావు, వ్యవసాయ శాఖ జేడి కే. శ్రీధర్, ఎస్డిసిలు సీతారామ మూర్తి, పి. అప్పారావు, కార్యనిర్వహక ఇంజినీర్లు డి. శ్రీనివాస్, డి.పి. ప్రదీప్, సుధాకర రావు, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-19 14:16:12

కోవిడ్ వేక్సినేషన్ లక్ష్యం చేరుకోవాలి..

విశాఖ జిల్లాలో ఆదివారం నిర్వహించే కోవిడ్ వేక్సినేషన్ విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శనివారం ఈ మేరకు కలెక్టరేట్ లో  జాయింట్‌ కలక్టరు-2,  జివిఎంసీ కమిషనరు, ఎ.ఎం.సి. ప్రిన్సిపాల్,  జిల్లా ఇమ్యూనైజెషన్  అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ,  ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఆదివారం జి.వి.ఎం సి పరిధిలో ప్రత్యేక టీకా ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు.  జివిఎంసి పరిధిలోని (33 పి హెచ్ సి ల పరిధిలో గల ) 578 వార్డు సచివాలయాల పరిధిలో వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు చేసినట్టు కమిషనర్ వివరించారు.  45 సంవత్సరముల దాటిన వారికి 1 మరియు 2వ  డోస్, అదేవిధంగా 0-5 వయస్సు పిల్లలుగల (45 సంవత్సరముల లోపు ) తల్లులకు ఒకటవ డోస్  వేయాలన్నారు. అర్హులైనవారందకీ వేక్సిన్ వేయించేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డా .సావిత్రి,  ఎడిషనల్ డైరక్టర్, వైద్య ఆరోగ్య శాఖ, డా. జీవన్‌ రాణి, జిల్లా ఇమ్యూనైజెషన్ అధికారిణి,  ఆంధ్రా మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్  డా.పివి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 

Collector Office

2021-06-19 14:06:14