1 ENS Live Breaking News

నాడు-నేడుతో పాఠశాలలకు మహర్ధశ..

నాడు నేడుతో పాఠశాలల  రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతోందని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగరంలోని నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అభిరుద్ది పనులు చేపట్టిన రాజేంద్ర మున్సిపల్ హైస్కూలు,కస్తూరి హైస్కూలు,వాల్మీకి మున్సిపల్ ప్రైమరీ స్కూల్ లను శనివారం అధికారులతో కలసి పరిశీలించారు. 18 పాఠశాలల్లో మనబడి నాడు నేడు కింద తొమ్మిది రకాల పనులు త్రాగునీటి  సదుపాయం,టాయిలెట్స్,మేజర్ మరియు మైనర్ రిపేర్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ ఫర్నిచర్స్ ,గ్రీన్ చాక్ బోర్డు,కాంపౌండ్ వాల్,పెయింటింగ్ వర్క్స్ ,ఇంగ్లీష్ ల్యాబ్ వంటి పనులు చేపట్టినట్లు అధికారులు మేయర్ కు వివరించారు. ఇందులో కస్తూరిబాయ్ మున్సిపల్ హై స్కూల్ లో రూ.58 లక్షలు,వాల్మీకి ప్రైమరీ స్కూల్ లో రూ.17 లక్షలు,రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్ లో రూ.57 లక్షలు ఖర్చు చేసి ఆయా పాఠశాలల్లో అభిరుద్ది పనులు చేసినట్లు మేయర్ వసీం కు వివరించారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలన్న లక్ష్యం తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ కు ధీటుగా మౌలిక సదుపాయాలు కల్పించడం గొప్ప కార్యక్రమం అన్నారు.నగరంలో ప్రజలకు ప్రభుత్వ  విద్య,వైద్యం  మెరుగైన  సేవలు అందించేందుకు అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కొన్ని పాఠశాలల్లో వాటర్ ప్లాంట్ లు దుమ్ము దూళి నిండి ఉండటంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి పనులు చేపట్టినా నిర్వహణ లేకుంటే త్వరగా పాడేయ్యే అవకాశం ఉందని ఉపాద్యాయులు వాటి నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో  కార్పొరేటర్లు దేవి,  లక్ష్మీదేవి, సాకే చంద్రలేఖ,లీలావతి, కమలభూషణ్,టీవీ చంద్రమోహన్ రెడ్డి, ఇషాక్,అనీల్ కుమార్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ షాంశుద్దిన్, డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి ఎస్ సి రమేష్ చంద్ర, ఈ ఈలు రామ్మోహన్రెడ్డి, ఆదినారాయణ, అసిస్టెంట్ ఇంజనీర్లు నాగజ్యోతి, శంకర్, వైఎస్ఆర్సిపి నాయకులు ఖాజా, కుల్లాయి స్వామి మహబూబ్ పీరా, , లక్ష్మన్న గంగాధర్, స్కూళ్లలో హెడ్ మాస్టర్స్  తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-19 16:12:29

నిరాదరణకు గురైన వారిని ఆదుకోవాలి..

నిరాదరణకు గురైన మహిళలకు ఆర్థిక చేయూత కల్పించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో  జిల్లా గ్రామీణ అభివృద్ధి సంక్షేమ శాఖ, మెప్మా ఆధ్వర్యంలో, స్కిల్ డెవలప్మెంట్ వివిధ పథకాలు ఎలా అమలు చేస్తున్నారు అనే అంశంపై  సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ   నవరత్నాల లోని ప్రతి సంక్షేమ పథకాల అమలుపై  అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు  అందించవలసిన బాధ్యత మీపైన ఉన్నదన్నారు. ప్రతి సంక్షేమ పథకం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగే విధంగా కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని ఆమె ఆదేశించారు. జిల్లాలో కదిరి పరిసర ప్రాంతాలలో మహిళలు నిరాదరణకు గురి అవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయని, మహిళల అక్రమ రవాణా అనేది రూపుమాపాలని, వారికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, పెన్షన్లు, ఇతర ప్రభుత్వ పథకాలు అన్నీ వారికి అందేలా చూడాలని,  వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత మీ అందరిపై ఉందని పేర్కొన్నారు. ఇందుకు ఎన్జీవోల సహకారం తీసుకొని వారిని అభివృద్ధి చేయవలసిన అవసరం వుందని ఆమె తెలిపారు.  జిల్లాలోని వివిధ మహిళా సంఘాలు సాధించిన ప్రగతిని డాక్యుమెంట్ రూపంలో సిద్ధం చేయాలని తెలిపారు.  మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను త్వరితగతిన బ్యాంకులకు చెల్లించి అధిక మొత్తంలో రుణాల పొందవచ్చునని, వీటిపైన విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. బ్యాంక్ లింకేజీ  పథకం అమలులో, శ్రీనిధి పథకాల అమలులో, జిల్లా ప్రథమ స్థానంలో ఉంచేలా అధికారులు కృషిచేయాలని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. వైయస్సార్ పెన్షన్ కానుక,   వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, వైయస్ఆర్ సున్నా వడ్డీ, వైయస్సార్ బీమా, జగనన్న తోడు, బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి, ఉన్నతి, మహిళా సాధికారత, మెప్మా ఆధ్వర్యంలో వివిధ పథకాలపై ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు కోవిడ్ కారణంగా ఆన్లైన్ క్లాసులు పైన దృష్టిసారించాలని తెలిపారు. ప్రైవేట్ సంస్థలలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువతకు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) గంగాధర్ గౌడ్,  డి ఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, మెప్మా పిడి రమణారెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఏపీడి నరసయ్య, ఈశ్వరయ్య, డిఆర్డి ఎ, మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-19 16:07:29

బాధితులకు మెరుగైన కౌన్సిలింగ్..

గృహ హింస కేసుల్లో బాధితులకు మెరుగైన కౌన్సెలింగ్ , న్యాయ సలహాలు అందేలా చూడాలని ఐసీడీఎస్ పీడీ సుజన ను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గృహ హింస కేసుల్లో కౌన్సెలింగ్ సమయంలోనే సమస్యకు పరిష్కారం, మహిళలకు న్యాయం దక్కేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గృహ హింస కేసులకు సంబంధించి ఏడాది వారీగా, ప్రాంతాల వారీగా సమాచారం నమోదు చేయాలన్నారు. అప్పుడే కేసులు పెరుగుదల, తరుగుదల పై అధికార యంత్రాంగం ఒక అంచనాకు వచ్చి పరిష్కారం దిశగా సరైన చర్యలు చేపట్టగలదన్నారు. ఇదే సూత్రం అన్ని అంశాలలోనూ పాటించాలన్నారు.  పిల్లలకు అందించే పౌష్టికాహారం గురించి జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. కరోనా కారణంగా అనాధలైన పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న రూ.10 లక్షల పరిహారం త్వరితగతిన దక్కేలా చూడాలన్నారు. పరిహారానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. అంగన్ వాడీల్లో నాడు-నేడు పనులకు సంబంధించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అదేశించారు. 
సమీక్షలో నోడల్ ఆఫీసర్ వనజ, ఈవో భారతి దేవి తదితరులు పాల్గొన్నారు. 

Anantapur

2021-06-19 16:03:56

అనంతలో ఇసుక కొరత రాకూడదు..

ఇసుక కొరత లేకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో శనివారం సాయంత్రం జిల్లా ఇసుక కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించగా, ఇందులో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ రెవెన్యూ, రైతు భరోసా) నిశాంత్ కుమార్, హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) సంక్షేమం గంగాధర్ గౌడ్, ఏ ఎస్పి సెజ్ రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గత సమీక్షా సమావేశంలో జరిగిన అంశాలపై కూలంకషంగా చర్చించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోమవారంలోగా హిందూపురం, బ్రహ్మసముద్రం మండలం గోవిందయ్య దొడ్డి రీచ్ లను ప్రారంభించేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా కదిరి, గుంతకల్, రాయదుర్గం, అనంతపురం డిపోలలో తగినంత ఇసుక నిల్వలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని జెపి ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. భూగర్భ శాఖ నుండి కొత్తగా పర్యావరణ అనుమతులు పొందిన 10 ఇసుక రీచ్ లకు మ్యాన్యువల్ నుంచి యంత్రాలతో తవ్వకాలు కొరకు మోడిఫికేషన్ అనుమతులు వెబ్ సైట్ లో నమోదు చేయాలని ఆదేశించారు. కొత్తగా ఇసుక రీచ్లలో సంయుక్తంగా లైన్ డిపార్ట్మెంట్లు తనిఖీలు నిర్వహించి జిల్లా కమిటీకి ఆమోదం కొరకు సమర్పించాలన్నారు. బుధవారం లోగా కొత్తగా తనిఖీ చేసిన రీచ్ ల ఆమోదం కొరకు నివేదిక సమర్పించాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ వారి పనులకు సంబంధించి వాహనాల జాబితాను సమర్పించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో డిడి మెన్స్ ఎస్ వి రమణ రావు, సాండ్ ఆఫీసర్ కొండారెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ ఈ భాగ్యరాజ్, జెపి ఏజెన్సీ మేనేజర్ దయాళన్, నోడల్ ఆఫీసర్ నాగరాజ్, తాడిపత్రి ఏడి మైన్స్ ఆదినారాయణ, విజిలెన్స్ ఏడి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-19 16:01:14

డాక్టర్లు తో చర్చలు ఫలప్రదం..

తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ హాస్పిటల్  రెసిడెంట్ డాక్టర్లు గత మూడు రోజులుగా స్టయిఫండ్  కోసం నిర్వహిస్తున్న  చర్చకు దానికి అనుకూలంగా  ఈరోజు సాయంత్రం  శ్రీ పద్మావతి  అతిధి  గృహమునందు  తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణ అధికారి  జవహర్  రెడ్డి తో   స్విమ్స్  రెసిడెంట్ డాక్టర్స్ స్టైఫండ్ పెంపుదల విషయంపై జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఈ చర్చలలో చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణ, స్విమ్స్ డైరెక్టర్, ఉప కులపతి డాక్టర్.బి.వెంగమ్మ, స్విమ్స్ డీన్, స్విమ్స్ రిజిస్ట్రార్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి  మరియు స్విమ్స్  రెసిడెంట్ డాక్టర్లు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా స్విమ్స్ రెసిడెంట్ డాక్టర్లు తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యానికి , స్విమ్స్  యాజమాన్యానికి  కృతజ్ఞతలు తెలియజేశారు.

Tirupati

2021-06-19 15:41:56

ఆన్ లైన్ సేవలపై పండితులకు శిక్షణ..

 శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి ఆర్జిత సేవలు ఆన్ లైన్ లో అందించే విషయమై వేదపండితులకు అవగాహన ఉండాలని ఈఓ ఎంవీ సూర్యకళ సూచించారు. శనివారం దేవస్థానంలోని వేదపండితులు, ఆలయ సిబ్బందికి  TMS.AP.GOV.IN వెబ్ సైట్, యూట్యూబ్ ద్వారా అందించేసే సేవలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, చాలామంది భక్తులు శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి ఆర్జిత సేవల్లో పరోక్షంగా పాల్గొంటున్నారని అన్నారు. సింహాచలం దేవస్థానం ఈఓ అకౌంట్ కు రుసుము చెల్లించి సైతం భక్తులు పరోక్ష సేవల్లో భాగస్వాములవుతున్నారు. TMS వెబ్ సైట్లో సింహాచలం దేవస్థానంకు సంబంధించి పరోక్ష సేవలు, ఈ హుండి, డొనేషన్ ఆప్షన్లున్నాయని వాటి వినియోగంపై అవగాహన పెంచుకోవడం ద్వారా  భక్తులకు తెలియజేయడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ సందర్భంగా TMS వెబ్ సైట్ ద్వారా ఏఈఓ రణమమూర్తి నిత్యకళ్యాణం, ఏఈఓ తిరుమలేశ్వరరావు నిత్యకళ్యాణంకి టికెట్లు బుక్ చేసుకున్నారు. సీసీ వరాలరావు  తన ఆరోగ్యం బావుండాలన్న ఉద్దేశతో రూ.1116 స్వామివారికి విరాళం , బంగారు రాజు గోరక్షణ పథకానికి డొనేషన్ ఇచ్చారు.  ఆన్ లైన్ సేవలు, ఈ హుండీ, డొనేషన్ల గురించి అందరికీ అర్థమయ్యేలా ఈఓ  సూర్యకళ, బంగారు రాజు వివరించారు. ఈ కార్యక్రమంలో  గోపాలకృష్ణమాచార్యులు, శ్రీనివాస ఆచార్యులు, సీతామారాచార్యులు సహా పలువురు వేద పండితులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ సుజాత,  ఏఈఓలు రాఘవ కుమార్, తిరుమలేశ్వరారవు , రమణమూర్తి, శ్రీనివాస్, ఆనంద కుమార్,ఇంజనీరింగ్ సహా అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.  

Simhachalam

2021-06-19 15:37:32

తిరుమల ఆంజ‌నేయాలయ అభివృద్ధి..

ఆంజ‌నాద్రి ప‌ర్వ‌త‌మే ఆంజ‌నేయ స్వామివారి జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని, ఆకాశ‌గంగ వ‌ద్ద ఆల‌యాన్ని అభివృద్ధి చేస్తామ‌ని టిటిడి ఛైర్మ‌న్  వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యుల‌తో క‌లిసి శ‌నివారం బాల ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యాన్ని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.   ఈ సంద‌ర్భంగా  ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ టిటిడి ఆంజ‌నేయ‌స్వామివారి జ‌న్మ‌స్థ‌లం ఆకాశ‌గంగ అని న‌మ్ముతుంద‌న్నారు. ఇదే విష‌యాన్ని శ్రీ‌వారి భ‌క్తులు కూడా విశ్వ‌సిస్తూన్నార‌ని, దీనిపై ఎవ‌రితోను ఎలాంటి చ‌ర్చ‌లు లేవ‌న్నారు. ఆకాశ‌గంగ వ‌ద్ద అంజ‌నాదేవి స‌మేత బాల ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యాన్ని అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. అనంత‌రం ఈవో మాట్లాడుతూ టిటిడి ఏర్పాటు చేసిన పండిత ప‌రిష‌త్ నివేదిక‌లో ఆంజ‌నాద్రిలోని ఆకాశ‌గంగ ఆంజ‌నేయ‌స్వామివారి జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని పురాణాల ద్వారా నిర్ణ‌యించార‌ని తెలిపారు. ఆకాశ‌గంగ వ‌ద్ద భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు, ఆల‌య అభివృద్ధిపై కార్య‌చ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు రూపొందించి అభివృద్ధి చేస్తామ‌న్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు  శేఖ‌ర్‌రెడ్డి,  గోవింద‌హ‌రి,  పార్థ‌పార‌ధిరెడ్డి, డాక్ట‌ర్ నిశ్చిత‌,  వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, రాజేష్‌శ‌ర్మ‌,  ర‌మేష్‌శెట్టి,  శివ‌శంక‌ర్‌,  డి.పి.అనంత‌, మ‌ల్లాది విష్ణు, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాధ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.  

Tirumala

2021-06-19 15:17:39

సోమవారం నుంచి ఆర్.టి.ఓ సేవలు..

విజయనగరం జిల్లాలో కోవిడ్ కారణంగా కొద్ది రోజులుగా నిలిపి వేసిన ప్రాంతీయ రవాణా కార్యాలయం ద్వారా పౌర సేవలను జూన్ 21వ తేదీ సోమవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు ఉప రవాణా కమిషనర్ సిహేచ్. శ్రీదేవి తెలిపారు. ఈ మేరకు శనివారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు  డ్రైవింగ్ లైసెన్స్ ల జారీ, ఎల్.ఎల్.ఆర్., వాహనాల ఫిట్ నెస్ కు, రవాణా శాఖ కు సంబందించిన అన్ని సేవలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందిస్తామని పేర్కొన్నారు.  ప్రజలు సోమవారం నుంచి అన్ని సేవలను పొందవచ్చని తెలిపారు.

Vizianagaram

2021-06-19 15:15:40

గ్రామాలను సుందరంగా మార్చాలి..

గ్రామాల‌ను సుంద‌రంగా తీర్చిద్దాల‌ని, పారిశుద్ధ్య చ‌ర్య‌లు ప‌టిష్టంగా చేప‌ట్టాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ ఆర్‌. మ‌హేష్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు జిల్లాలో 100 రోజుల పాటు స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్యాచ‌ర‌ణ‌లో భాగంగా రోజుకో కార్యక్రమం నిర్వ‌హించాల‌ని సూచించారు. జూలై 08వ తేదీ నుంచి చేప‌ట్ట‌బోయే స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్య‌క్ర‌మానికి ముందుగా వైద్య సిబ్బందితో గ్రామాల్లో స‌ర్వే చేయిస్తామ‌ని, అనంత‌రం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌తో ముందుకెళ్దామ‌ని పిలుపునిచ్చారు. స్వ‌చ్ఛ సంక‌ల్పం, భ‌వన నిర్మాణాల ప‌క్షోత్స‌వాల‌పై శ‌నివారం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో జ‌రిగిన స‌మీక్ష‌లో ఆయ‌న ఈ మేర‌కు మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ స‌రిగా లేని గ్రామాల్లో ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, నిర్వ‌హ‌ణ స‌రిగా లేకుంటూ స్థానిక అధికారులు, సిబ్బందిపై చ‌ర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. త‌డి, పొడి చెత్త‌, మెడిక‌ల్ వ్య‌ర్థాల సేక‌ర‌ణ‌పై క్షేత్ర‌స్థాయి సిబ్బందికి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఎంపీడీవోల‌కు సూచించారు. గ్రామాల‌న్నీ ఓడిఎఫ్ దిశ‌గా ప‌య‌నించాల‌ని, ఆ విధంగా త‌గిన చ‌ర్య‌లు చేపట్టాల‌ని చెప్పారు. జిల్లాలో ఉన్న 959 పంచాయ‌తీల్లో ముందుగా 100 గ్రామాల్లో స‌ర్వే నిర్వహిస్తామ‌ని అక్క‌డ పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌, ఇత‌ర ప‌రిస్థితుల‌పై ఆరా తీస్తామ‌ని వివ‌రించారు. గ్రామాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచ‌టం ద్వారా సీజ‌న‌ల్ వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. పంచాయ‌తీ, సచివాల‌య‌, వైద్య సిబ్బంది స‌మ‌న్వ‌యంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.

అనంత‌రం భ‌వ‌న నిర్మాణాల‌కు సంబంధించిన అంశాల‌పై మాట్లాడుతూ పెండింగ్ ప‌నులు ఉంటే త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని చెప్పారు. బిల్లులు, ఇత‌ర ప్ర‌క్రియ‌ల‌కు సంబంధించిన అంశాల‌పై మార్గ‌నిర్దేశ‌కాలు చేశారు. పంచాయ‌తీల్లో గ్రీన్ అంబాసిడ‌ర్స్‌, సిల్టు లేబ‌ర్స్ స‌మ‌స్య‌లు త‌దిత‌ర విష‌యాలపై క్షేత్ర‌స్థాయిలో ఉన్న ప‌రిస్థితిని ఎంపీడీవోల‌ను అడిగి తెలుసుకున్నారు. బ‌యోమెట్రిక్ మెషిన్లు స‌రిప‌డా లేవ‌ని ఉన్న‌వి మ‌ర‌మ్మ‌తుల‌కు గుర‌య్యాయ‌ని ఈ సంద‌ర్భంగా ఎంపీడీవోలు జేసీ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే స‌చివాల‌యాల్లో స్టేష‌న‌రీకి సంబంధించి విధివిధానాలు స‌రిగా లేవ‌ని ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని ఎంపీడీవోలు ప్ర‌స్తావించారు. దీనిపై జేసీ స్పందిస్తూ సంబంధింత అంశాల‌తో కూడిన నివేదిక‌ల‌ను పంపిస్తే ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు.

కార్య‌క్ర‌మంలో జిల్లా ప‌రిష‌త్ సీఈవో వెంక‌టేశ్వ‌ర‌రావు, డీపీవో సుభాషిణి, జిల్లా కో-ఆర్డినేట‌ర్ స‌త్య‌నారాయ‌ణ‌, ఎంపీడీవోలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-19 14:43:54

శనివారం చందన లభ్యత31 కేజీలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారికి సమర్పించే  మూడో విడత చందనం అరగదీత ప్రక్రియ లో భాగంగా శనివారం మొత్తం 31 కిలోల చందనం లభ్యమైనట్టు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ రోజు నుంచి మరో రెండు రోజుల పాటు చందనం అరగదీత కార్యక్రమం నిర్వహించిన తరువాత  ఈ నెల 24వ తేదీ జ్యేష్ట పూర్ణిమ సందర్బంగా స్వామివారికి మూడో విడత చందన సమర్పణ సమర్పిస్తారు. అదే రోజు స్వర్ణ పుష్పార్చన, శ్రీమణవాళ మహామునుల మాస తిరునక్షత్రం ఉంటుందన్న ఈఓ స్వామివారికి చందనం సమర్పించాలనుకునే భక్తులు అరకిలోకి రూ.10,116 ,  కిలోకి 20,116 సమర్పించుకోవచ్చునన్నారు. అరకిలో చందన సమర్పణ చేసినవారికి 200 గ్రాముల చందనం చెక్క, కేజీ సమర్పించినవారికి 300 గ్రాముల చందనం ముక్కతోపాటు శేష వస్త్రం  ప్రసాదంగా ఇస్తారని వివరించారు. చందన సమర్పణకు ఆన్ లైన్లో సొమ్ము చెల్లించాక చిరునామా, గోత్రనామాలతో పాటు వివరాలను స్క్రీన్ షాట్ తీసి  6303800736 వాట్సప్ నంబర్ కు పంపించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని అప్పన్న భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈఓ కోరారు.

Simhachalam

2021-06-19 14:26:05

శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలం కావాలి..

నేరేడు బ్రిడ్జి నిర్మాణం వలన శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలం కాగలదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, శాసన సభాతి తమ్మినేని సీతారాం లుపేర్కొన్నారు. ఖరీఫ్ కు జూలై 8న సాధ్యమైనంత మేరకు వంశధార, మద్దువలస నుండి నీటిని విడుదల చేయడానికి నిర్ణయించామని పేర్కొన్నారు. శనివారం జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ అదును పదును ఉన్నప్పుడే సాగునీటి పనులు చేయాలన్నారు. నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులకు సాగునీటిపై వివరాలు అందించడంలో ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. దీనిపై చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. జిల్లా సస్యశ్యామలం కావాలన్నారు. జలవనరుల శాఖ ఇంజనీర్లు ప్రత్యేక శ్రద్ద వహించి పంటలకు సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. శ్రీకాకుళం వ్యవసాయక జిల్లా అని అన్నారు. ప్రతి ఎకరాకు నీరు అందాలని ఆయన సూచించారు. ఒడిషా ముఖ్య మంత్రి కి ఏప్రిల్ 16న ముఖ్య మంత్రి లేఖ రాశారని ఆయన చెప్పారు. సమస్య ఉంటే తెలియజేయాలని ఆయన అన్నారు. ముఖ్య మంత్రి శ్రీకాకుళం జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సమన్వయంతో పనిచేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. రైతులకు మంచి సేవలు అందించుటకు ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. మంచి మనసున్న ముఖ్య మంత్రి రాష్ట్రంలో ఉన్నారని ఆయన అన్నారు.

రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ పంటలకు ముందుగానే కాలువల నిర్వహణ పనులు పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో మంచి ప్రజాప్రతినిధుల బృందం ఉందని, ప్రజాప్రతినిధుల సేవలు ఉపయోగించు కోవాలని ఆయన సూచించారు. పాలకొండ శాసన సభ్యులు తెలిపిన అంశాలపై సంబంధిత కాంట్రాక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి పరిష్కరించాలని ఆయన సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో కరకట్టలు నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన చెప్పారు. వంశధార, బాహుదా అనుసందానం చేయుటకు రౌతు సత్యనారాయణను సలహాదారుగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా జిల్లాలో 70 వేల ఎకరాలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కోన్నారు. ఒక్క చుక్క నీటిని కూడా వృథాకాకుండ ప్రాజెక్టు లను ముఖ్య మంత్రి మంజూరు చేసారని చెప్పారు. వెనుకబడిన  జిల్లాగా ఉండకూడదని ముఖ్య మంత్రి ఆలోచన అన్నారు.

        రాష్ట్ర పశుసంర్థక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ శివారు ప్రాంతాలకు ఒక చుక్క నీరు కూడా రాలేదన్నారు. తద్వారా రైతులు నాట్లు వేసిన పరిస్థితి కూదా లేదన్నారు. శివారు నుండి హెడ్ వద్ద ఉన్న భూములకు నీరు అందించే ప్రణాళిక ఉండాలని ఆయన సూచించారు. నీటి విడుదలకు ఒక విధానం  అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి ప్రాజెక్టు నుండి నీటిని అందించుటకు ముఖ్య మంత్రి నేతృత్వలోని ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. నేరేడు బ్రిడ్జిపై ఒడిషా ముఖ్య మంత్రి తో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడి పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో అనేక జలవనరుల ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్నారు. వచ్చే నెల వివిధ ప్రాజెక్టుల నుండి పంటలకు నీరు విడుదల చేయడం జరుగతుందన్నారు. ప్రస్తుతం లభ్యంగా ఉన్న నిధులతో కాలువల నిర్వహణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇతర నిధులకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించాలని ఆయన అన్నారు. సాధ్యమైనంత మేర పనులు త్వరగా పూర్తి చేసి సాగునీరు సక్రమంగా అందేటట్లు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. అన్ని పనులు మిషన్ మోడ్ లో చేపట్టాలని ఆయన ఆదేశించారు. వర్షాకాలానికి ముందుగానే అన్ని పనులు పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు.

శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ జూన్ లోనే ఖరీఫ్ కు నీటిని విడుదల చేయాలని సూచించారు. కాలువలు పూర్తిగా పూడికలతో నిండి పోయాయని తెలిపారు. శాసన సభ్యులు కంబాల జోగులు మాట్లాడుతూ సాగునీటి సమస్య తలెత్తకుండా ఇంజనీర్లు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. శాసన సభ్యులు విస్వసరాయి కళావతి మాట్లాడుతూ కాట్రగడ్డ వద్ద అండర్ పాసేజ్ నిర్మించాలన్నారు. బాధ్యతాయుతంగా ఉండని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టుటకు చర్యలు చేపట్టాలని సూచించారు. 87, 88 ప్యాకేజీలు క్రింద పలు పనులు చేపట్టాలని తద్వారా ప్రజలకు నష్టం సంభవించదని ఆమె పేర్కన్నారు. జంపరకోట రిజర్వాయర్ పనులు 34 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉందన్నారు. శాసన సభ్యులు రెడ్డి శాంతి మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టును అతి త్వరగా పూర్తి చేసి నిర్వాసితుల త్యాగాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని కోరారు.

వంశధార పర్యవేక్షక ఇంజినీర్ డోలా తిరుమల రావు మాట్లాడుతూ ఈ ఏడాది వంశధార పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. వంశధార, నాగావళి నదుల అనుసంధానం కూడా ఈ ఏడాది పూర్తి చేయాలని ఆదేశించారని పేర్కోన్నారు. వంశధార రిజర్వాయర్ పనులు 90 శాతం, 87 ప్యాకేజీ పనులు 85 శాతం, ప్యాకేజీ 88  పనులు 96 శాతం,  హెచ్.ఎల్.సి పనులు 75 శాతం పూర్తి అయ్యాయని ఆయన వివరించారు. నేరేడు బ్రిడ్జి  పూర్తి కావడానికి కృషి చేయాలని తద్వారా 19 శాతం నీటిని రిజర్వాయర్ లో నిల్వ చేయవచ్చని తెలిపారు. ఎడమ కాలువ మరమ్మతులు చేపట్టాల్సి ఉందని ఎస్ఇ చెప్పారు. ఎల్.ఎం.సి పై నీటి తీరువాతో 51  పనులు మంజూరు చేసామని తెలిపారు. హెచ్.ఎల్.సి 10 శాతం పనులు పూర్తి చేయడం వలన నీటిని విడుదల చేయవచ్చని ఆయన చెప్పారు. కరోనా వలన అన్ని పనులు కొంత జాప్యం జరిగిందని ఆయన వివరించారు.

ఈ సమావేశంలో ఎం.ఎల్.సిలు పాకలపాటి రఘు వర్మ,  తూర్పుకాపు, కళింగకోమటి కార్పొరేషన్ల అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, అందవరపు సూరి బాబు, డిసిసిబి మాజీ అధ్యక్షులు పాలవలస విక్రాంత్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ హెచ్.కూర్మారావు, వ్యవసాయ శాఖ జేడి కే. శ్రీధర్, ఎస్డిసిలు సీతారామ మూర్తి, పి. అప్పారావు, కార్యనిర్వహక ఇంజినీర్లు డి. శ్రీనివాస్, డి.పి. ప్రదీప్, సుధాకర రావు, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-19 14:16:12

కోవిడ్ వేక్సినేషన్ లక్ష్యం చేరుకోవాలి..

విశాఖ జిల్లాలో ఆదివారం నిర్వహించే కోవిడ్ వేక్సినేషన్ విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శనివారం ఈ మేరకు కలెక్టరేట్ లో  జాయింట్‌ కలక్టరు-2,  జివిఎంసీ కమిషనరు, ఎ.ఎం.సి. ప్రిన్సిపాల్,  జిల్లా ఇమ్యూనైజెషన్  అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ,  ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఆదివారం జి.వి.ఎం సి పరిధిలో ప్రత్యేక టీకా ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు.  జివిఎంసి పరిధిలోని (33 పి హెచ్ సి ల పరిధిలో గల ) 578 వార్డు సచివాలయాల పరిధిలో వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు చేసినట్టు కమిషనర్ వివరించారు.  45 సంవత్సరముల దాటిన వారికి 1 మరియు 2వ  డోస్, అదేవిధంగా 0-5 వయస్సు పిల్లలుగల (45 సంవత్సరముల లోపు ) తల్లులకు ఒకటవ డోస్  వేయాలన్నారు. అర్హులైనవారందకీ వేక్సిన్ వేయించేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డా .సావిత్రి,  ఎడిషనల్ డైరక్టర్, వైద్య ఆరోగ్య శాఖ, డా. జీవన్‌ రాణి, జిల్లా ఇమ్యూనైజెషన్ అధికారిణి,  ఆంధ్రా మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్  డా.పివి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 

Collector Office

2021-06-19 14:06:14

అప్పన్నకు మంత్రి అవంతి పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు శనివారం  దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అవంతి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్వామివారి క్రుపతో కరోనా వైరస్ సమసిపోయి ప్రజలు సాధారణ పరిస్థితి వచ్చేలా దీవించాలంటూ స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. అంతేకాకుండా పంచగ్రామాల సమస్యలను పరిష్కరించడాని ప్రభుత్వం అన్నివిధాల క్రుషి చేస్తుందని చెప్పారు.. అంతకు ముందు దేవాలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనాన్ని అందించారు.  ఈఓ మంత్రి కి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ట్రస్టుబోర్టు సభ్యులు, సూరిబాబు, దినేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Simhachalam

2021-06-19 13:40:03

అమరారెడ్డి నగర్ వాసులకు ఇళ్లు..

గుంటూరు జిల్లా తాడేపల్లి అమరారెడ్డి నగర్ ఇరిగేషన్ భూములు ఆక్రమించుకొని నివాసం ఉంటున్న పేద ప్రజలకు ప్రభుత్వమే స్థలాలు కేటాయించి ఇళ్ళు నిర్మించి ఇచ్చి స్వచ్ఛందంగా వారే ఆక్రమణలు తొలగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ జగనన్న కాలనీలో తాడేపల్లి అమరారెడ్డి నగర్ ప్రాంతంలో ఇరిగేషన్ భూములలో నివాసముంటున్న వారికి ఇంటి పట్టాలు, ఇంటి నిర్మాణ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డితో కలిసి పాల్గొన్నారు. లే అవుట్లోని ప్లాట్ల వద్దే లబ్ధిదారులకు ఇంటి పట్టాలు, ఇంటి నిర్మాణ మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అందించారు.  ఇంటి నిర్మాణాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి లబ్ధిదారులతో కలిసి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. జగనన్న లే ఆవుట్లో బోరు ఏర్పాటు పనులను ప్రారంభించారు. ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సమీపంలో ఇరిగేషన్ భూములు ఆక్రమించుకొని నివశిస్తున్న వారిని భద్రత కారణాలతో అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆత్మకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ జగనన్న కాలనీలో 283 మందికి ఇంటి స్థలాలు కేటాయించటం జరిగిందన్నారు. ఇంటి స్థలాలు కేటాయించిన వారికి పట్టాలు, ఇంటి నిర్మాణ మంజూరు పత్రాల పంపిణీ పండుగ వాతావరణంలో జరుగుతుందన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేయటంతో పాటు, ఆక్రమిత స్థలాలలో నిర్మించుకున్న ఇళ్ళకు పరిహారం రెండు రోజుల్లో అందించటం జరుగుతుందన్నారు. ఆక్రమిత స్థలాల్లో ఎళ్ళ తరబడి నివాసం ఉంటున్న వారికి నష్టం జరగకూడదని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో ఎక్కడ లేని విధంగా ఇంటి స్థలం కేటాయించటంతో పాటు ,ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందిస్తున్నారన్నారు. కానీ కొన్ని మీడియాలలో  మాత్రం  ఆసత్య వార్తలు ప్రచురిస్తున్నారన్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీలోని లబ్ధిదారులకు ఇంటి నిర్మాణంకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అవసరమైన పూర్తి సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు.
మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇళ్ళు లేని నిరుపేదలకు స్వంత ఇంటి కలను నిజం చేస్తూ ఇంటి పట్టాల పంపిణీ చేసిన ఘనతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వతా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. తాడేపల్లిలో ఇరిగేషన్ స్థలం ఆక్రమించుకొని 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న 283 మందికి ఆత్మకూరులోని వైఎస్ఆర్ జగనన్న కాలనీలో స్థలాలు కేటాయించటం జరిగిందన్నారు. ప్రతి కుటుంభానికి రెండు సెంట్లు స్థలంతో పాటు, ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల నగదు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా సరఫరా చేయటంతో పాటు, భవన నిర్మాణ సామగ్రిని రాయితీపై పంపిణీ చేస్తుందన్నారు. ఇంటి నిర్మాణాలకు అవసరమైన నీరు, విద్యుత్ సౌకర్యం పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇక్కడ వెంటనే ఇళ్ళ నిర్మాణాల పనులు ప్రారంభించేందుకు లబ్ధిదారులకు అధికారులు అవసరమైన  పూర్తి సహకారం అందిస్తారన్నారు. కాల్వ గట్టుపై నివశిస్తున్న మాకు స్వంత ఇంటి స్థలంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా పాలిటి దేవుడి అని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కోవిడ్ పరిస్థితులలో సైతం కొద్ది రోజులలోనే ఇంటి స్థలాల కోసం భూములు సేకరించి, ఇంటి పట్టాల పంపిణీ చేసేందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, రెవెన్యూ, మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ (హౌసింగ్) అనుపమ అంజలి,  హౌసింగ్ పీడీ వేణుగోపాలరావు, గుంటూరు ఆర్డీవో భాస్కరరెడ్డి, మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ నిరంజన్ రెడ్డి, మంగళగిరి తహశీల్దారు రాం ప్రసాదు, తాడేపల్లి తహశీల్దారు శ్రీనివాసరెడ్డి, నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Tadepalle

2021-06-19 13:33:35

మహా విశాఖలో కోవిడ్ వేక్సిన్ డ్రైవ్..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాల పరిధిలో ఆదివారం నిర్వహిస్తున్న కోవిడ్ వేక్సినేషన్ ప్రత్యేక “డ్రైవ్” ను విజయవంతం చేయాలని జివిఎంసి కమిషనర్  డా. జి. సృజన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర పరిధిలోని అన్ని సచివాలయాల్లో 45 సంవత్సరాలు దాటిన వారికి, 5 సంవత్సరాల లోపు పిల్లలున్న తల్లులకు, ఆదివారం ఆయా సచివాలయాల పరిధిలోనే ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ వేయుదురని కమిషనర్ తెలిపారు. ఏ సచివాలయాల పరిధిలో ఉన్నవారు, ఆయా సచివాలయంలోనే మొదటి, రెండవ డోస్ వ్యాక్సినేషన్ వేసుకోవాలని తెలిపారు. వార్డు వాలంటరీల సహాయంతో సచివాలయం పరిధిలో పైన తెలిపిన విధంగా అర్హత కలిగిన వారందరికీ వ్యాక్సినేషన్ వేయించాలని ఆదేశించారు. అందరు జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేక అధికారులు, ఆయా సచివాలయాల వ్యాక్సినేషన్ వేయు ప్రాంతంలో మౌళిక వసతులైన మంచినీరు, టెంట్స్, కుర్చీలు, విద్యుత్ శ్చక్తి మొదలైనవి ఏర్పాటుచేయాలని, వ్యాక్సినేషన్ వేయించుకొనుటకు వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కమిషనర్ ఆదేశించారు. ఆదివారం ప్రత్యేక “డ్రైవ్” ద్వారా ఒక లక్ష వ్యాక్సినేషన్లు వేయించాలని ప్రభుత్వం టార్గెట్ గా నిర్ణయించిందని,  అందుకు అందరూ సంసిద్ధులు కావాలని కమిషనర్ కోరారు. కావున, సచివాలయ పరిధిలో అర్హత కలిగిన వ్యక్తులు ఈ అవకాశం వినియోగించుకొని వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.     

విశాఖ సిటీ

2021-06-19 12:58:24