1 ENS Live Breaking News

అప్పన్నకు మంత్రి అవంతి పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు శనివారం  దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అవంతి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్వామివారి క్రుపతో కరోనా వైరస్ సమసిపోయి ప్రజలు సాధారణ పరిస్థితి వచ్చేలా దీవించాలంటూ స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. అంతేకాకుండా పంచగ్రామాల సమస్యలను పరిష్కరించడాని ప్రభుత్వం అన్నివిధాల క్రుషి చేస్తుందని చెప్పారు.. అంతకు ముందు దేవాలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనాన్ని అందించారు.  ఈఓ మంత్రి కి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ట్రస్టుబోర్టు సభ్యులు, సూరిబాబు, దినేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Simhachalam

2021-06-19 13:40:03

అమరారెడ్డి నగర్ వాసులకు ఇళ్లు..

గుంటూరు జిల్లా తాడేపల్లి అమరారెడ్డి నగర్ ఇరిగేషన్ భూములు ఆక్రమించుకొని నివాసం ఉంటున్న పేద ప్రజలకు ప్రభుత్వమే స్థలాలు కేటాయించి ఇళ్ళు నిర్మించి ఇచ్చి స్వచ్ఛందంగా వారే ఆక్రమణలు తొలగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ జగనన్న కాలనీలో తాడేపల్లి అమరారెడ్డి నగర్ ప్రాంతంలో ఇరిగేషన్ భూములలో నివాసముంటున్న వారికి ఇంటి పట్టాలు, ఇంటి నిర్మాణ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డితో కలిసి పాల్గొన్నారు. లే అవుట్లోని ప్లాట్ల వద్దే లబ్ధిదారులకు ఇంటి పట్టాలు, ఇంటి నిర్మాణ మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అందించారు.  ఇంటి నిర్మాణాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి లబ్ధిదారులతో కలిసి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. జగనన్న లే ఆవుట్లో బోరు ఏర్పాటు పనులను ప్రారంభించారు. ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సమీపంలో ఇరిగేషన్ భూములు ఆక్రమించుకొని నివశిస్తున్న వారిని భద్రత కారణాలతో అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆత్మకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ జగనన్న కాలనీలో 283 మందికి ఇంటి స్థలాలు కేటాయించటం జరిగిందన్నారు. ఇంటి స్థలాలు కేటాయించిన వారికి పట్టాలు, ఇంటి నిర్మాణ మంజూరు పత్రాల పంపిణీ పండుగ వాతావరణంలో జరుగుతుందన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేయటంతో పాటు, ఆక్రమిత స్థలాలలో నిర్మించుకున్న ఇళ్ళకు పరిహారం రెండు రోజుల్లో అందించటం జరుగుతుందన్నారు. ఆక్రమిత స్థలాల్లో ఎళ్ళ తరబడి నివాసం ఉంటున్న వారికి నష్టం జరగకూడదని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో ఎక్కడ లేని విధంగా ఇంటి స్థలం కేటాయించటంతో పాటు ,ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందిస్తున్నారన్నారు. కానీ కొన్ని మీడియాలలో  మాత్రం  ఆసత్య వార్తలు ప్రచురిస్తున్నారన్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీలోని లబ్ధిదారులకు ఇంటి నిర్మాణంకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అవసరమైన పూర్తి సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు.
మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇళ్ళు లేని నిరుపేదలకు స్వంత ఇంటి కలను నిజం చేస్తూ ఇంటి పట్టాల పంపిణీ చేసిన ఘనతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వతా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. తాడేపల్లిలో ఇరిగేషన్ స్థలం ఆక్రమించుకొని 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న 283 మందికి ఆత్మకూరులోని వైఎస్ఆర్ జగనన్న కాలనీలో స్థలాలు కేటాయించటం జరిగిందన్నారు. ప్రతి కుటుంభానికి రెండు సెంట్లు స్థలంతో పాటు, ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల నగదు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా సరఫరా చేయటంతో పాటు, భవన నిర్మాణ సామగ్రిని రాయితీపై పంపిణీ చేస్తుందన్నారు. ఇంటి నిర్మాణాలకు అవసరమైన నీరు, విద్యుత్ సౌకర్యం పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇక్కడ వెంటనే ఇళ్ళ నిర్మాణాల పనులు ప్రారంభించేందుకు లబ్ధిదారులకు అధికారులు అవసరమైన  పూర్తి సహకారం అందిస్తారన్నారు. కాల్వ గట్టుపై నివశిస్తున్న మాకు స్వంత ఇంటి స్థలంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా పాలిటి దేవుడి అని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కోవిడ్ పరిస్థితులలో సైతం కొద్ది రోజులలోనే ఇంటి స్థలాల కోసం భూములు సేకరించి, ఇంటి పట్టాల పంపిణీ చేసేందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, రెవెన్యూ, మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ (హౌసింగ్) అనుపమ అంజలి,  హౌసింగ్ పీడీ వేణుగోపాలరావు, గుంటూరు ఆర్డీవో భాస్కరరెడ్డి, మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ నిరంజన్ రెడ్డి, మంగళగిరి తహశీల్దారు రాం ప్రసాదు, తాడేపల్లి తహశీల్దారు శ్రీనివాసరెడ్డి, నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Tadepalle

2021-06-19 13:33:35

మహా విశాఖలో కోవిడ్ వేక్సిన్ డ్రైవ్..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాల పరిధిలో ఆదివారం నిర్వహిస్తున్న కోవిడ్ వేక్సినేషన్ ప్రత్యేక “డ్రైవ్” ను విజయవంతం చేయాలని జివిఎంసి కమిషనర్  డా. జి. సృజన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర పరిధిలోని అన్ని సచివాలయాల్లో 45 సంవత్సరాలు దాటిన వారికి, 5 సంవత్సరాల లోపు పిల్లలున్న తల్లులకు, ఆదివారం ఆయా సచివాలయాల పరిధిలోనే ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ వేయుదురని కమిషనర్ తెలిపారు. ఏ సచివాలయాల పరిధిలో ఉన్నవారు, ఆయా సచివాలయంలోనే మొదటి, రెండవ డోస్ వ్యాక్సినేషన్ వేసుకోవాలని తెలిపారు. వార్డు వాలంటరీల సహాయంతో సచివాలయం పరిధిలో పైన తెలిపిన విధంగా అర్హత కలిగిన వారందరికీ వ్యాక్సినేషన్ వేయించాలని ఆదేశించారు. అందరు జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేక అధికారులు, ఆయా సచివాలయాల వ్యాక్సినేషన్ వేయు ప్రాంతంలో మౌళిక వసతులైన మంచినీరు, టెంట్స్, కుర్చీలు, విద్యుత్ శ్చక్తి మొదలైనవి ఏర్పాటుచేయాలని, వ్యాక్సినేషన్ వేయించుకొనుటకు వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కమిషనర్ ఆదేశించారు. ఆదివారం ప్రత్యేక “డ్రైవ్” ద్వారా ఒక లక్ష వ్యాక్సినేషన్లు వేయించాలని ప్రభుత్వం టార్గెట్ గా నిర్ణయించిందని,  అందుకు అందరూ సంసిద్ధులు కావాలని కమిషనర్ కోరారు. కావున, సచివాలయ పరిధిలో అర్హత కలిగిన వ్యక్తులు ఈ అవకాశం వినియోగించుకొని వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.     

విశాఖ సిటీ

2021-06-19 12:58:24

Tirumala

2021-06-19 12:51:43

90వేల కోవిడ్ వేక్సిన్ల పంపిణీ లక్ష్యం..

శ్రీకాకుళం  జిల్లాలో ఆదివారం మెగా కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. మెగా వేక్సినేషన్ కార్యక్రమంపై మండల  అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులతో కలెక్టర్ శనివారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం వరకు మెగా వేక్సినేషన్ కార్యక్రమాన్ని 300 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్నామన్నారు. అందుకు అన్ని విధలా సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. మెగా కార్యక్రమంలో 90 వేల మందికి వాక్సిన్ ఇచ్చుటకు లక్ష్యంగా నిర్ణయించామని దీనిని సాధించాలని ఆయన పేర్కొన్నారు. మెగా వాక్సినేషన్ లో కోవిషీల్డ్ , కోవాక్సిన్ టీకాలను సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. కోవిషీల్డ్ గ్రామీణ ప్రాంతాల్లోని 249 పంచాయతీలతో పాటు అర్బన్ ప్రాంతంలోని 21 వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ చెప్పారు. కోవాక్సిన్ టీకాలను అర్బన్ ప్రాంతంలోని 27 వార్డు సచివాలయాలతో పాటు గ్రామీణ ప్రాంతంలోని 3 గ్రామ సచివాలయాల్లో సిద్దం చేసినట్లు ఆయన తెలిపారు. కోవిషీల్డ్ గ్రామ సచివాలయాల పరిధిలో గల 74,700 మందికి, వార్డు సచివాలయాల పరిధిలోని 6,300 మందికి టీకాలు వేయడం జరగుతుందని, కోవేక్సిన్ వార్డు సచివాలయం పరిధిలో గల 8,100 మందికి వేయనుండగా, గ్రామ సచివాలయ పరిధిలో 900 మందికి టీకాలను వేయనున్నట్లు కలెక్టర్ వివరించారు.

          ప్రాధాన్యత క్రమంలో టీకాలను వేయాలని ఆయన పేర్కొంటూ 45 ఏళ్లు దాటిన వారు,   0-5 సంవత్సరాల వయస్సు గల పిల్లల తల్లులకు మొదటి డోసు టీకాలు వేయాలన్నారు. రెండవ డోసు పెండింగులో ఉన్న హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు ఇతర పౌరులకు టీకాలు వేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా మొదటి డోసు పెండింగులో ఉన్న హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా వేయుటకు ప్రాధాన్యతను ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.

           ఈ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎం.పి.డి.ఓ, తహశీల్ధారు, మున్సిపల్ కమీషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులు, ఆశావర్కర్లు గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత అధికారులు వేక్సినేషన్ కార్యక్రమం నిర్వహించే ప్రదేశాలలో షామియానాలు, కుర్చీలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు.

          కోవిషీల్డ్ ఆమదాలవలస, భామిని, బూర్జ, ఎచ్చెర్ల, జి.సిగడాం, గార, హిరమండలం, ఇచ్చాపురం, జలుమూరు, కంచిలి, కవిటి, కోటబొమ్మాళి, కొత్తూరు, యల్.యన్.పేట, లావేరు, మందస, మెళియాపుట్టీ, నరసన్నపేట, నందిగాం, పాలకొండ, పలాస, పాతపట్నం, పోలాకి, పొందూరు, రాజాం, రణస్థలం, రేగిడి ఆమదాలవలస, సంతబొమ్మాళి, సంతకవిటి, సారవకోట, సోంపేట, శ్రీకాకుళం, టెక్కలి, వజ్రపుకొత్తూరు, వంగర, వీరఘట్టం మండలాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో టీకాలు వేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున ఉపయోగించుకుని టీకాను తీసుకోవాలని కోరారు. టీకా తీసుకోవడం వలన కోవిడ్ భారీన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని, రక్షణ ఉంటుందని ఆయన చెప్పారు. వాక్సినేషన్ కార్యక్రమాన్ని మండలాల్లో స్వయంగా పరిశీలించుటకు పర్యటిస్తామని ఆయన తెలిపారు. గతంలో వాక్సినేషన్ కార్యక్రమంలో వెనుకబడి ఉన్న మండలాలు పూర్తి స్ధాయి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలని ఆయన ఆదేశించారు.

Srikakulam

2021-06-19 12:43:31

ఇసుక రీచ్ లు ప్రారంభం కావాలి..

శ్రీకాకుళం జిల్లాలో అన్ని ఇసుక రీచ్ లు త్వరితగతిన ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు. గనుల శాఖ, ఎస్.ఇ.బి, జెపి గ్రూప్ ప్రతినిధులతో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇసుక రీచ్ లపై సమీక్షించారు. ప్రస్తుతం పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఇసుక కొరత సమస్య ఉండరాదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాల పనులను పూర్తి చేయుటకు పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని వాటి నిర్మాణానికి ఇసుక కొరత ఎట్టి పరిస్ధితుల్లో ఉండరాదని అన్నారు. ప్రభుత్వ పనులతో సహా శ్రీకాకుళం జిల్లాలో ఇసుక సమస్య అనే మాట వినరాదని ఆయన స్పష్టం చేసారు. ఇసుక సంమృద్ధిగా లభ్యమయ్యే జిల్లాలో ఇసుక కొరత అనేది ఉండరాదని అందుకు తగిన విధంగా ఇసుక ఉత్పత్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఎటుంటి సమస్యలకు, ఆరోపణలకు తావులేని విధంగా ఇసుక రీచ్ లను నిర్వహించి ఆదర్శప్రాయంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇసుక సరఫరాలో సమస్యలు సృష్టిస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న 9 రీచ్ లతోపాటు వారం రోజుల్లో కనీసం 10 రీచ్ లు ప్రారంభం కావాలని ఆయన ఆదేశించారు. స్ధానిక సమస్యలు ఉంటే వాటిని తక్షణం పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వ పరంగా సహకారం కావలసి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తద్వారా పోలీసు, రెవిన్యూ యంత్రాంగం సహకారం అందిస్తామని ఆయన చెప్పారు. అన్ని రీచ్ లను త్వరగా ప్రారంభం కావడం వలన ఇసుక ఉత్పాదకత పెరుగుతుందని విక్రయాలు పెంచవచ్చని గ్రహించాలని ఆయన సూచించారు. జూన్ మాసాంతం వరకు ఇసుక ఉత్పాదకతకు మంచి సమయం అని తరువాత వర్షాలు కురవడం వలన ఇసుక వెలికి తీయడంలో జాప్యం జరగవచ్చని ఆయన అన్నారు. వర్షాలు కురవక ముందే రాంపులు నిర్మించుకోవాలి ఆయన సూచించారు. రీచ్ లను గనుల శాఖ, ఎస్.ఇ.బి అధికారులు తనిఖీలు చేయాలని ఆయన ఆదేశించారు.

          జెపి గ్రూప్ సమన్వయ అధికారులు ఎన్.గంగాధర రెడ్డి, ఎల్.విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ లింగపేట – తిమడాం, పోతయ్యవలస, మడపాం, యరగాం -3, బుచ్చిపేట, గార, నారాయణపురం, దూసి రీచ్ లు పనిచేస్తున్నాయన్నారు. పురుషోత్తమపురం 5,6 రీచ్ లు వారం రోజుల్లోను., హిరమండలం, తునివాడ సోమవారం., కరజాడ మంగళ వారం, ఆకులతంపర బుధ వారం ప్రారంభిస్తామని వివరించారు. అంధవరం, కల్లేపల్లి రీచ్ లలో నీరు పారుతుందని, కందిసలో ఇసుక లేదని చెప్పారు.  మిగిలిన రీచ్ లలో స్ధానిక అంశాలను పరిగణనలోకి తీసుకుని త్వరితగతిన ప్రారంభించుటకు చర్యలు చేపడతామని తెలిపారు.

          ఈ సమావేశంలో గనుల శాఖ సహాయ సంచాలకులు జి.భైరాగి నాయుడు, ఆర్.రాజేష్ కుమార్, జియాలజిస్ట్ కె.హరి కిరణ్ నాయుడు, ఎస్.ఇ.బి ఎసిపి తదితరులు పాల్గొన్నారు.



Srikakulam

2021-06-19 12:41:44

సుప్రీమ్ కోర్టు జడ్జిని కలిసిన కలెక్టర్..

సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి జస్టీస్ లావు నాగేశ్వరరావు ని శనివారం ఉదయం చంద్రమౌళి నగర్ లోని నివాసంలో గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుమ్మడి గోపిచంద్ లు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి  పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా పలు విషయాలను ఆయన చర్చించారు. అంతేకాకుండా గుంటూరు జిల్లా జరుగుతున్న అభివ్రుద్ధిని జడ్జికి వివరించారు.

Guntur

2021-06-19 12:38:34

అలాంటి వారికి ఆదరణ కల్పించాలి

నిరాదరణకు గురి అయిన మహిళలకు ఆర్థిక చేయూత కల్పించవలసిందిగా సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నందు  జిల్లా గ్రామీణ అభివృద్ధి సంక్షేమ శాఖ, మరియు మెప్మా ఆధ్వర్యంలో, స్కిల్ డెవలప్మెంట్  మరియు వివిధ పథకాలు ఎలా అమలు చేస్తున్నారు అనే అంశంపై  సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) గంగాధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ   నవరత్నాల లోని ప్రతి సంక్షేమ పథకాల అమలుపై  అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు  అందించవలసిన బాధ్యత మీపైన ఉన్నదన్నారు. ప్రతి సంక్షేమ పథకం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగే విధంగా కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని ఆమె ఆదేశించారు. జిల్లాలో కదిరి పరిసర ప్రాంతాలలో మహిళలు నిరాదరణకు గురి అవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయని, మహిళల అక్రమ రవాణా అనేది రూపుమాపాలని, వారికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, పెన్షన్లు, ఇతర ప్రభుత్వ పథకాలు అన్నీ వారికి అందేలా చూడాలని,  వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత మీ అందరిపై ఉందని పేర్కొన్నారు. ఇందుకు ఎన్జీవోల సహకారం తీసుకొని వారిని అభివృద్ధి చేయవలసిన అవసరం వుందని ఆమె తెలిపారు.  జిల్లాలోని వివిధ మహిళా సంఘాలు సాధించిన ప్రగతిని డాక్యుమెంట్ రూపంలో సిద్ధం చేయాలని తెలిపారు.  మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను త్వరితగతిన బ్యాంకులకు చెల్లించి అధిక మొత్తంలో రుణాల పొందవచ్చునని, వీటిపైన విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. బ్యాంక్ లింకేజీ  పథకం అమలులో, శ్రీనిధి పథకాల అమలులో, జిల్లా ప్రథమ స్థానంలో ఉంచేలా అధికారులు కృషిచేయాలని తెలిపారు.
ఈ సందర్భంగా వివిధ సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. వైయస్సార్ పెన్షన్ కానుక,   వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, వైయస్ఆర్ సున్నా వడ్డీ, వైయస్సార్ బీమా, జగనన్న తోడు, బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి, ఉన్నతి, మహిళా సాధికారత, మెప్మా ఆధ్వర్యంలో వివిధ పథకాలపై ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు కోవిడ్ కారణంగా ఆన్లైన్ క్లాసులు పైన దృష్టిసారించాలని తెలిపారు. ప్రైవేట్ సంస్థలలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువతకు తెలియజేయాలని తెలిపారు.
 ఈ కార్యక్రమంలో డి ఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, మెప్మా పిడి రమణారెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఏపీడి నరసయ్య, ఈశ్వరయ్య, డిఆర్డి ఎ, మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-19 10:06:11

70 వేల మందికి టీకా లక్ష్యం..

 కోవిడ్ థర్డ్ వేవ్ ను దృష్టి లో పెట్టుకొని ప్రజల వద్దకే వెళ్లి  టీకా వేసే కార్యక్రమాన్ని చేపడుతు న్నట్లు సంయుక్త కలెక్టర్ డా. ఆర్.మహేష్ కుమార్ తెలిపారు.  అందుకోసం  ఈ ఆదివారం కోవిడ్ టీకా ప్రత్యెక డ్రైవ్ ను నిర్వహించనున్నామని, ఇప్పటికే  ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ప్రతి సచివాలయం లోను, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లోను ఈ టీకా వేయనున్నట్లు తెలిపారు.  శనివారం కలక్టరేట్  ఆడిటోరియం లో  ఎం.పి.డి.ఓ లు,  మున్సిపల్ కమీషనర్లతో ఏర్పాట్ల పై సమావేశం నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో   45 యేళ్ళు నిండిన వారికీ, 5 సంత్సరాల లోపు పిల్లలు ఉన్న తల్లులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, వికలాంగులకు, స్వచ్చంద సంస్థల ప్రతినిదులకు టీకా వేయడం జరుగుతుందన్నారు.  ప్రతి గ్రామం లోను ముందు రోజే టామ్ టామ్ ద్వారా  అందరికీ తెలిసేలా  చూడాలన్నారు.  ఆశ, ఎ.ఎన్ఎం లను, సచివాలయ సిబ్బందిని విధులకు కేటాయించాలని సూచించారు.  సంబంధిత ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఇప్పటికీ అర్హులైన వారి జాబితాలు సిద్ధంగా ఉన్నాయని,   కనీసం 70 వేల మందికి  ఈ డ్రైవ్ లో టీకా వేసేలా చూడాలని తెలిపారు.  మండల స్థాయి, గ్రామా స్థాయి అధికారులు సమిష్టి గా సమన్వయం తో పని చేయాలన్నారు.  వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని,  నిరంతర పర్యేక్షణ లో టీకా కార్యక్రమం జరగాలని ఆదేశించారు. 
ఈ సమావేశం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి  డా. ఎస్.వి.రమణ కుమారి,  వాక్సినేషన్ ఇంచార్జ్ డా. గోపాల కృష్ణ, ప్రత్యేకాది కారి డా. రమేష్,  జిల్లా పరిషత్ సి.ఈ.ఓ వెంకటేశ్వర రావు, మున్సిపల్ కమీషనర్లు,  ఎం.పి.డి.ఓ లు, పాల్గొన్నారు. 

Vizianagaram

2021-06-19 09:11:25

యుద్ధప్రాతిపదికన నాడు-నేడు పనులు..

నాడు- నేడు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్ డా. ఆర్.మహేష్ కుమార్  ఆదేశించారు. ఇక పై ప్రతి రోజు టార్గెట్ లను ఇచ్చి,  సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తానని , పురోగతి కనపడక పోతే చర్యలు తప్పవని  హెచ్చరించారు.  శనివారం కలక్టరేట్ ఆడిటోరియం లో  మున్సిపల్ కమీషనర్లు, ఎం.పి.డి.ఓ లు,  ఎస్.ఈలు, ఈ ఈ లు ఎం.ఈ.ఓ ల తో జే.సి  సమీక్షించారు.  జిల్లాలో 1040  పాఠశాలలను  నాడు-నేడు క్రింద ఎంపిక చేయగా  854 పాఠశాలల పనులు పురోగతి లో ఉన్నాయని,  323 పాఠశాలకు చెందిన  అన్ని పనులు  పూర్తి  అయ్యాయని అన్నారు.  415 పాఠశాలల వాల్ పెయింటింగ్స్, 362 సివిల్ వర్క్స్  పూర్తి అయ్యాయని తెలిపారు.  మండల విద్య శాఖ అధికారులు , ఆర్.డబ్లు.ఎస్ , ట్రైబల్ వెల్ఫేర్, పంచాయతి రాజ్ ఎ.పి.ఈ.డబ్లు.ఐ.డి.సి, సమగ్ర శిక్ష   శాఖల  ఇంజినీర్లు  ప్రతి రోజు  కనీసం 3 గంటల పాటు ఈ పనుల పై   ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు.  పనులు చేయడమే కాకుండా ఖర్చు  చేసిన బిల్లులను అప్ లోడ్ చెయ్యాలని, ఎం.బుక్  ను కూడా పక్కాగా నిర్వహించాలని సూచించారు. సిమెంట్, ఇతర సామాగ్రి,   సాంకేతిక సమస్యలేమైనా తలెత్తితే వెంటనే జిల్లా విద్య శాఖ ను సంప్రదించాలని అన్నారు. 
ఈ సమావేశం లో జిల్లా విద్య శాఖ అధికారి జి. నాగమణి, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ వెంకటేశ్వర రావు, సర్వ శిక్ష అభియాన్ ఎ.పి.సి విజయలక్ష్మి, మున్సిపల్ కమీషనర్లు,  పంచాయతి రాజ్, ఆర్.డబ్లు.ఎస్. ఎస్.ఈ లు, ఈ ఈ లు, డి.ఈ లు,  ఎం.పి.డి.ఓ లు, పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-19 09:08:32

తర్డ్ వేవ్ పొంచిఉంది తప్పక టీకా వేయించుకోవాలి..

 క‌రోనా మూడో వేవ్ అక్టోబ‌రులో వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ప‌లు సంస్థలు, నిపుణులు చెబుతున్నందున ఈలోపే ప్రతి ఒక్కరూ టీకా వేయించుకొని క‌రోనా నుంచి ర‌క్షణ పొందాల‌ని జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ పిలుపునిచ్చారు. టీకా మాత్రమే క‌రోనా నుంచి ర‌క్షణ క‌ల్పిస్తుంద‌ని అందువ‌ల్ల నిర్లక్ష్యం వ‌హించ‌కుండా కోవిడ్ టీకా కేంద్రాల‌కు వెళ్లి టీకా వేయించుకోని వారంతా త‌క్షణ‌మే వేయించు కోవాల‌ని జిల్లా క‌లెక్టర్ సూచించారు. జిల్లాలో కోవిడ్ టీకా డోసులు అవ‌స‌ర‌మైన మేర‌కు సిద్ధంగా ఉన్నాయ‌ని ఆయా కోవిడ్ టీకా కేంద్రాల‌కు ఆదివారం వెళ్లి టీకా త‌ప్పనిస‌రిగా వేసుకోవాల‌న్నారు. ఉద‌యం 8 గంట‌ల నుంచే సిబ్బంది ఆయా కేంద్రాల్లో అందుబాటులో వుంటార‌ని పేర్కొన్నారు. జిల్లాలో 45 ఏళ్ల వ‌య‌సు దాటిన వారు, ఐదేళ్లలోపు వ‌య‌స్సుగ‌ల పిల్లల త‌ల్లులు ఎంత మంది వ‌చ్చినా టీకాలు వేసేందుకు సిద్ధంగా వున్నట్టు పేర్కొన్నారు. టీకా వేసుకోవ‌డం వ‌ల్ల మిమ్మల్ని మీరు ర‌క్షించుకోవ‌డంతోపాటు కుటుంబ స‌భ్యల‌కూ కోవిడ్ నుంచి ర‌క్షణ క‌ల్పించిన‌ట్లవుతుంద‌న్నారు. జిల్లాలో ఆదివారం నిర్వహించిన వాక్సినేష‌న్ స్పెష‌ల్ డ్రైవ్ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసిన‌ట్లు క‌లెక్టర్ పేర్కొన్నారు.

Vizianagaram

2021-06-19 06:25:02

మహా విశాఖలో తుక్కు కాలుష్యం..

మహావిశాఖను క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా ఉంచాలని, గెడ్డలు కాలువల్లో చెత్తవేయకూడదని ప్రతినిత్యం ప్రకటనలు ఊదరగొట్టే జివిఎంసి కమిషనర్ డా.స్రిజన సంస్థకే చెందిన కార్యాలయాలయాల్లోనే వాహనాల తుక్కు భారీగా పేరుకుపోతున్నా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు.  సంస్థకే చెందిన వెహికల్ గ్యారేజీ లోని చెత్తాచెదారాన్ని కాలువల్లోనే గ్యారేజీ సిబ్బంది వేస్తున్నా.. అత్యంత భారీ స్థాయిలో కాలుష్యానికి కారణమవుతున్నా పట్టించుకోకుండా పూర్తిగా పక్కన పెట్టాశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదేదో కావాలని అంటున్న మాట కాదు. నగరాభివ్రుద్ధికోసం అహర్నిసలు కష్టపడి పనిచేసే కమిషనర్ ను సంస్థలోని అధికారులు, సిబ్బందే తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పడానికి ఆధారాలతో అందిస్తున్న కధనమిది. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి చెందిన అధికార మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా ఫోటో ఆధారాలతో సహా అందిస్తున్న కధనంలో నిజమెంతుందో లాసెన్స్ బే కాలనీలోవ ఉన్న ఈ జివిఎంసీ వాహనాల గ్యారేజీని సందర్శిస్తే ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది. ఇక్కడ సంస్థకు చెందిన చాలా వాహనాలు తప్పుపట్టి పోయి ఉన్నాయి. వాటిని నిర్వీర్యం చేయడం గానీ, లేదంటే తుక్కు కింద అమ్మేయడం గానీ చేయకపోవడంతో ఈ గ్యారేజీలోని తుక్కపెద్ద ఎత్తున పేరుతకుపోతుంది. చాలా తప్పుపట్టిన చెత్తను పక్కనే వున్న పెద్ద డ్రైనేజీలో పడేస్తున్నారు ఇక్కడి సిబ్బంది. జివిఎంసీలో చెత్తను తరలించడానికి, కట్టడాల వ్యర్ధాలను తరలించడాని వినియోగించే వాహనాల కోసం ఇక్కడ గ్యారేజీని ఏర్పాటు చేశారు. అక్కడే వాహనాల రిపేరు, పట్టుబడిన వాహనాలను ఇక్కడ డంప్ చేస్తుంటారు ఈ తరుణంలో చాలా వాహనాలు తుప్పుపట్టి పోయాయి. అలా తుప్పపట్టిన వాహనాల్లో చాలా వాటికి పార్టులు కూడా మాయమయ్యాయని సమాచారం. వాటిని తప్పు లెక్కలో చూపించి కొత్తపార్టులు కొన్నట్టుగా జివిఎంసీ ఆధాయానికి కన్నం వేస్తున్నట్టుగా కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. జివిఎంసీలోవున్న చాలా విభాగాల్లో అత్యధికంగా ఖర్చుచేసే వాటిల్లో ఈ గ్యారేజి ఒకటి. మీడియా కూడా దీనిపై పెద్దగా ఫోకస్ పెట్టదు..అలా పెట్టిన మీడియాని జివిఎంసి అధికారులు, అక్కడి గ్యారేజీ సిబ్బంది ప్రశన్నం చేసుకొని వారి స్థాయిలో వారు ముడుపులు చెల్లించుకుంటారని కూడా తెలుస్తుంది. మామూళ్లు, ఖర్చులు, దొంగలెక్కలు పక్కనపెడితే ఈ గ్యారేజికి ఆనుకొని వున్న డ్రైనేజీ నేరుగా సముద్రంలోకి వెళుతుంది. ఇక్కడ వేసిన ఇనుప ముక్కలు, తప్పు తుక్కు నీటిలో కరగకుండా సముద్ర జాలాల్లోకి వెళ్లి ఆ ప్రాంతంలోని నీరు కూడా కలుషతం అవుతోంది. అసలు ఈ వెహికల్ గ్యారేజీ తుక్కును జివిఎంసి ఎందుకు పట్టించుకోవడం లేదు..ఎందుకు ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, దొంగలెక్కలు చూడటం లేదనే విషయాన్ని కాస్త లోతుగా పరిశీలిస్తే..తేడా వ్యవహారాల్లోని పర్శంటేజీలు అన్నీ ప్రధానకార్యాలయానికి వెళ్లకుండా ఉంటాయా అని చెబుతున్నారు..నగరాన్ని స్వచ్ఛంగా ఉంచాలని స్వచ్ఛభారత్ నిధులతో శుభ్రత పరిశుభ్రత చేస్తున్నట్టు నటిస్తున్న అధికారులు ఇలాంటి తుక్కు గ్యారేజీపైనా ద్రుష్టిసారిస్తే సంస్థ తరపున పెరుగుతున్న కాలుష్యం ఎంతో లెక్కతేలుతుంది. ఏ స్థాయిలో డ్రైనేజీలు కలుషితం అవుతున్నాయో గుర్తించవచ్చు. ఆ దిశగా చర్యలు తీసుకుంటారో లేదో వేచిచూడాలి..!

Visakhapatnam

2021-06-19 02:47:40

ఆరుతడి పంటలను ప్రోత్సహించాలి..

 రైతులు ఖరీఫ్, రబీ పంటలను సకాలంలో పూర్తి చేసి 50 శాతం విస్తీర్ణంలో 3వ పంటగా పప్పు ధాన్యాలు, పచ్చి రొట్టపైర్ల సాగును,  బోర్ల క్రింద వరికి బదులు లాభదాయకమైన ఆరుతడి పంటలను చేపట్టేలా ప్రోత్సహించాలని తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయ సలహా మండలి తీర్మానించింది.   శుక్రవారం జడ్పి సమావేశ మందిరంలో నూతనంగా ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం మండలి చైర్ పర్సన్ మోటూరు సాయి అధ్యక్షతన జరిగింది.  సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీతా ముఖ్య అతిధులుగా హాజరైయ్యారు.  జ్యోతి ప్రజ్వలన, ప్రార్థనాగీతాలతో సమావేశం ప్రారంభం కాగా నూతనంగా ఏర్పాటైన జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, సభ్యులకు అతిధులు అభినందనలు తెలియజేశారు. అనంతరం మండలి కన్వీనర్, జాయింట్ కలెక్టర్ డా.జి.లక్ష్మీశ రాష్ట్ర ప్రభుత్వం జిఓ ఎంఎస్ నెం.70 ద్వారా  ఏర్పాటు చేసిన జిల్లా, మండల, ఆర్.బి.కె. స్థాయి వ్యవసాయ సలహా మండళ్ల మౌళిక లక్ష్యాలను సభ్యులకు వివరించారు.

  వ్యవసాయ, ఉద్యాన, అనుబంద రంగాలలో మార్కెట్ డిమాండు, ఆగ్రో-క్లైమాటిక్ జోన్ల్ ల కనుగుణంగా లాభదాయకమైన పంటల వైవిద్యాలను రైతులలో ప్రోత్సహించేలా సపోర్ట్ ప్యాకేజిల అమలుకు ప్రభుత్వానికి సూచనలు చేయడం,  నికర వ్యావసాయిక ఆదాయలను పెంచే ఉత్తమ విధానాలపై వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా రైతులకు అవగాహన కల్పించడం, నీటి వనరుల సమర్థ వినియోగం, వ్యవసాయ ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలను విస్తరించడం, ప్రజల ఆహార బధ్రత, పౌష్టికత పెంచే పంటల సాగు ద్వారా రైతుల ఆర్థికంగా బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తుల డిమాండు, సప్లయి మద్య లోపాల సవరణ తదితర రైతు సంక్షేమ అంశాలపై జిల్లా వ్యవసాయ సలహా మండలి చర్చించి, రాష్ట్ర మండలి ద్వారా ప్రభుత్వానికి సూచనలు చేస్తుందని ఆయన తెలిపారు.  జిల్లా ఇన్చార్జి మంత్రి గౌరవ చైర్మన్ గాను, రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఆభ్యుదయ రైతు మోటూరు సాయి చైర్ పర్సన్ గాను, జిల్లా కలెక్టర్ వైస్ చైర్మన్ గాను అన్ని నియోజక వర్గాల నుండి ప్రోగ్రెసీవ్ ఫార్మర్లు 17 మందితో పాటు, జిల్లా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, జడ్పి, డిసిసిబి, డిసిఎంఎస్, వాటర్ యూజర్స్ అసోసియేషన్ల చైర్మన్లు, వ్యవసాయ, అనుబంధ రంగ శాఖల జిల్లా అధికారులుగా  జిల్లా సలహా మండలి ఏర్పాటైందని ఆయన వివరించారు.  సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ రైతు పక్షపాతిగా, రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి వినూత్నమైన ఆలోచనతో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ వేలాది మంది రైతులు సభ్యులుగా వ్యవసాయ సలహా మండళ్లను  ఏర్పాటు చేసారన్నారు.  రైతు భాగస్వామ్యంతోనే వ్యవవసాయ రంగంలో మంచి ఫలితాలు చేకూరతాయని,  నిర్ణయాలను పై స్థాయి నుండి రైతులపై రుద్దడం కాకుండా, తమకు అనువైన, ప్రయోజనకరమైన విధానాలను రైతులే నిర్ణయించుకునేలా వారి నుండి సూచనలు ఈ మండళ్ల ద్వారా స్వీకరించి  ప్రభుత్వం విధాన రూపకల్పన చేస్తుందన్నారు.  రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఉచిత పంటల భీమా, వడ్డీలేని రుణాలు, ఆర్ బి కెలు, ఇంటిగ్రేటెడ్ లాబ్ లు వంటి కార్యక్రమాల్లాగే వ్యవసాయ సలహా మండళ్లు కూడా చారిత్రాత్మకం నిలువనున్నాయన్నారు. ఈ క్రాప్ బుకింగ్ తప్పని సరి చేయడం ద్వారా ఏ పంట, ఎక్కడ, ఎంత ఉత్పత్తి ఉందో ఖచ్చితంగా నిర్థారించి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ ద్వారా రైతులకు అధిక ఆదాయం కల్పిస్తున్నామన్నారు. నూతనంగా ఏర్పాటైన వ్యవసాయ సలహా మండలి సభ్యులు తమ ప్రాంత రైతుల సమస్యలు, అవసరాలను ప్రభుత్వం దృష్టికి తేవాలని మంత్రి కన్నబాబు కోరారు. 

  రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ నిరాశా, నిస్పృహలతో వ్యవసాయం పట్ల రైతులల్లో పెరుతున్న అనాశక్తికి కారణాలను విశ్లేషించి, రైతులు విశ్వాసం, సంతోషాలతో సాగుచేపట్టేలా తిరిగి ఆకర్షితులను చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేపడుతున్న ఆదర్శ వ్యవసాయ సంస్కరణలలో భాగాంగా వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశారన్నారు. పంట వేయడానికి, వేసాక దాన్ని పండించేందుకు, పండిని పంటను అమ్ముకోవడానికి రైతులు పడుతున్న ఇక్కట్లకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు శాశ్వత ముగింపు పలుకుతాయన్నారు.  జిల్లాలో డ్రయిన్లు ప్రధాన సమస్యగా ఉన్నాయని, బోదెలు, పిల్లకాల్వల స్థాయి డ్రెయిన్ల నిర్వహణ ఆర్బికేల ద్వారా చేపట్టాలని ఆయన సూచించారు.    కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత మాట్లాడుతూ వ్యవసాయం దేశానికి వెన్నెముకని, రైతును రాజుగా చూడాలనే స్వర్గీయ డా.వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాన్ని తనయుడుగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సాకారం చేస్తున్నారన్నారు.  సాంకేతికంగా వచ్చిన అభివృద్ది వ్యవసాయ రంగ పురోగతికి తోడ్పడేలా లాబ్ లలో జరిగిన పరిశోధనలు క్షేత్రాలలో ప్రయోజనాలుగా వికసించాలన్నారు.  కరోనా కాలంలో మిగిలిన అన్ని రంగాలు ఆగినా రైతులు అన్నం పెట్టే పంటల సాగును వీడలేదని, ఈ కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం రైతులు అండగా నిలిచి ఆదుకున్నాయన్నారు. సమావేశంలో  విశిష్ట అతిధులుగా పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే డా.సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పంట వచ్చేందు 15 రోజుల ముందే ప్రారంభించాలని, డిమాండు, స్థానిక వినియోగం లేని బొండాలు వంటి  రకాలను రైతులు చేపట్టకుండా అవగాహన కల్పించాలని సూచించారు.  జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ జిల్లాలో నీటి వినియోగం ఎక్కవగా ఉండే వరి సాగునే రైతులు ఎక్కవగా ఎంచుకుంటున్నందున, నీటి సరఫరాలో ఒడిదుకులు రాకుండా గోదావరి, ఏలేరు వ్యవస్థలలో సమర్థమైన నీటి యాజమాన్యం ఉండాలని సూచించారు.  జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్ పర్సన్ మోటూరి సాయి మాట్లాడుతూ రైతు బావుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు.  రైతు సంక్షేమం కొరకు జగన్మోహనరెడ్డి చేపట్టినన్ని పధకాలు మరెక్కడా లేవని, రైతాంగంలో  క్రొత్త ఆశలు, ఆకాంక్షలను నింపుతున్నాయన్నారు.  
    
    జిల్లాలో గతంలోలా రైతులు 3 పంటలు పండించేలా ఖరీఫ్ పంటల సాగును జూలై మాసాంతంలోపున, రబీ పంటలను డిశంబరు 31 లోపున ఊడ్పులు పూర్తి చేసేలా పంట కాలాలను సవరించించుకుని మూడో పంటగా కనీసం 50 శాతం విస్తీర్ణంలో పప్పు ధాన్యాలు, పచ్చి రొట్ట పైర్లను వేయాలని కమిటీ సూచించింది. ఇందుకు ప్రస్తుత సీజనలు కోల్పయిన 15 రోజుల పంటకాలాన్ని  వెదజల్లే విధానం, డ్రమ్ సీడింగ్ విధానాల ద్వారా తగ్గించే రైతులను వ్యవసాయ శాఖ అధికారులు ప్రోత్సహించాలని మంత్రి కన్నబాబు ఆదేశించారు. బోర్ల క్రింద పంటల మార్పిడి క్రింద అపరాలు, చిరిధాన్యాల సాగు ప్రోత్సాహః  -  జిల్లాలోని 11 మెట్ట మండలాల్లోని సుమారు 21వేల హెక్టార్లలో బోర్ల క్రింద వరి సాగు జరుగుతోదని, ఈ విస్తీర్ణాన్ని పంట మార్పిడి క్రింద దశల వారీగా వరి నుంచి తక్కవ నీటితో ఎక్కవ ఆదాయం ఇచ్చే పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, చిరిధాన్యాలు, ఆయిల్ పామ్ వంటి పంటల సాగులోకి మార్చాలన మండలి సూచించింది.   రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వ్యవసాయ విద్యుత్ గా ఎకరాకు ఏడాదికి 49 వేలు సబ్సిడీ ఇస్తోందని, దీని లాభదాయకం కాని వరి సాగుకు వాడటం సముచితం కాదని, రైతులు తక్కవ నీటితో ఆధిక దిగుబడులు, ఆదాయం అందించే ఆరతడి పంటలను చేపట్టాలని మంత్రి కన్నబాబు కోరారు.  ఈ మండలాల్లో ఈ ఏడాది 25 శాతం, వచ్చే ఏడాది 40 శాతం, తదుపరి ఏడాదికి 100 శాతం బోర్ల క్రింది విస్తీర్ణాన్ని ఆరుతడి పంటల క్రింది తేవాలని, ఇందుకు అవసరమైన రాయితీలు అందిస్తామన్నారు.  మైక్రో ఇరిగేషన్ క్రింద డ్రిప్, స్ప్రింక్లర్ లకు రాయితీలు తిరిగ కల్పిస్తామని, అయితే అవి దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. 


  జిల్లాలో రైతులు ఎక్కవగా పండిస్తున్న బొండాలు రకానికి స్థానిక వినియోగం లేకపోవడం, కేరళలో డిమాండు తగ్గిపోవడం వల్ల ఈ రకం ధాన్యానికి రైతులు సరైన ధర పొందలేకపోతున్నారని, ఇటువంటి డిముం లేని రకాల స్థానంలో జిల్లా రైతులు అధిక డిమాండు, ధర పలుకుతున్న స్వర్ణ, సాంబమసూరి, శ్రీకాకుళం సన్నాలు వంటి రకాల సాగు చేపట్టేలా ఆర్బికేలు, వ్యవసాయ క్షేత్రాధికారులు రైతులను ప్రోత్సహించాలని మంత్రి కన్నబాబు సూచించారు. పొలం గట్లపై కంది పంటల సాగు, సమీకృత వ్యవసాయానికి ప్రోత్సాహం  -  జిల్లాలో 50 వేల ఎకరాల రైతుల పొలం గట్లపై కంది పంటను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదించగా,  విస్తీర్ణాన్ని కనీసం 100 ఎకరాల పొలం గట్లకు పెంచాలని మంత్రి కన్నబాబు ఆదేశించారు.  అలాగే రైతులకు బహుళ ఆదాయాలను ఇచ్చే సమీకృత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. 

  డ్రెయిన్లలో గుర్రపు డెక్క, తూడు పూడిక సమస్య పరిష్కారానికి వాటి తొలగింపు ప్రక్రియను యాన్యూవల్ మెయింటినెన్స్ (వార్షిక నిర్వహణ) కి అప్పగించి, ఎప్పటికప్పడు తొలగించే ప్రతిపాదనను ఇరిగేషన్ శాఖతో చర్చించి తగు నిర్ణయం గైకొంటామని మంత్రి కన్నబాబు తెలిపారు.    ఆలాగే బోదెలు, చిన్న కాల్వల నిర్వహణను ఆర్బికే ల క్రిందకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ సమావేశంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, వ్యవసాయ శాఖ జేడి ఎన్.విజయకుమార్, డిడిలు వి.టి.రామారావు, ఎస్.మాధవరావు,  ఉద్యాన వన శాఖ డిడి ఎస్.రామ్మెహన్, పశుసంవర్థక శాఖ జెడి డా. సూర్యప్రకాషరావు, అనుబంధ శాఖల అధికారులు,  మండలి సభ్యులు పాల్గొన్నారు. 

కాకినాడ

2021-06-18 15:10:23

ఆస్పత్రి నిర్మాణాలు వేగం పెంచాలి..

అనుకున్న లక్ష్యం కంటే ముందుగా ఆసుపత్రి భవనాల నిర్మాణాలు పూర్తవ్వాలని బి.సి సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రి రాజోలు నియోజకవర్గములోని సఖినేటిపల్లి మండలం యిదే గ్రామంలో నిర్మిస్తున్న ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యేతో  కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామస్థాయిలో వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందించాలనే లక్ష్యంతో నూతన ఆసుపత్రి భవనాలను ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. వాటిని అధికారులు దగ్గరుండి త్వరగా  నిర్మాణపనులు జరిగేలా చూడాలని ఆదేశించారు. అదే దారిలో తిరిగి వస్తుండగా కాలువలో పేరుకుని పోయిన గుఱ్ఱపుడెక్క ని ఉపాధిహామీ పధకంలో పనులు  ఎగ్జిక్యూట్ చేసి వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమములో వైద్యసిబ్బంది స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. రాజోలు సర్కిల్ యిదే స్పెక్టర్ దుర్గా శేఖర్ రెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు.

సఖినేటిపల్లి

2021-06-18 15:07:36

4,582 సచివాలయాల్లో జీరో కేసులు..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో 4,582 వార్డుల్లో శుక్రవారం నాడు ఒక కరోనా కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2,887 సచివాలయాల్లో ఒక కేసు, 2,042 సచివాలయాల్లో 2 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 9,500 సచివాలయాల్లో 2 కంటే తక్కువ కేసులు ఉన్నాయన్నారు. 900 సచివాలయాల్లో 10 కంటే ఎక్కువ కేసులు ఉన్నాయన్నారు. ఈ వార్డుల్లో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. విశాఖలో సిటీలో 1,168 కేసులు, రాజమండ్రిలో 594 కేసులు ఉన్నాయన్నారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల జాబితాలను ఆయా జిల్లా కలెక్టర్లకు అందజేశామని, ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించామన్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 67,629 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. 104 కాల్ సెంటర్ కు గడిచిన 24 గంటల్లో 1,648 ఫోన్ కాల్స్ వచ్చాయని, వాటిలో 176 కాల్స్ ఆసుపత్రుల్లో అడ్మిషన్లకు, 896 కాల్స్ వివిధ సమాచారాలకు, 248 కాల్స్ టెస్టులకు వచ్చాయని తెలిపారు. యాక్టివ్ కేసులు సంఖ్య తగ్గుతున్నా హోం ఐసోలేషన్లో ఉన్న 21,598 మందికి ఫోన్లు చేసి వారి ఆరోగ్య పరిస్థితులను ఆరా తీస్తూ మందుల వినియోగం, ఇతర విషయాలపైనా 5,196 వైద్యులు సలహాలు సూచనలు అందజేశారన్నారు. 


124 మంది తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల గుర్తింపు
కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలను రాష్ట వ్యాప్తంగా 124 మంది పిల్లలను గుర్తించామన్నారు. వారిలో 86 మంది పేరున వివిధ బ్యాంకుల్లో రూ.10 లక్షల చొప్పున నగదు డిపాజిట్ చేశామన్నారు. మిగిలిన వారి పేరున సోమవారంలోగా బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేస్తామన్నారు. రాష్ట్రంలో 2,678 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని, 185 మంది మృతి చెందారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,419 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నాయని, 966 మంది డిశ్చార్జయ్యారని తెలిపారు. 783 మందికి సర్జరీ చేశామని తెలిపారు. జూన్ 17 వ తేదీ సాయంత్రం వరకూ అంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు 9,803 అందుబాటులో ఉన్నాయన్నారు. వచ్చే వారం కేంద్రం నుంచి అంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు రానున్నాయన్నారు. 39,812 పొసకొనజోల్ ఇంజక్షన్లు, 74,035 పొసకొనజోల్ మాత్రలు అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. 

Tadepalle

2021-06-18 15:00:46