1 ENS Live Breaking News

ఆదివారం చందన లభ్యత30 కేజీలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారికి సమర్పించే  మూడో విడత చందనం అరగదీత ప్రక్రియ లో భాగంగా ఆదివారం మొత్తం 30 కిలోల చందనం లభ్యమైనట్టు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ రోజు నుంచి మరో ఒక్కరోజు మాత్రమే చందనం అరగదీత కార్యక్రమం నిర్వహించి ఈ నెల 24వ తేదీ జ్యేష్ట పూర్ణిమ సందర్బంగా స్వామివారికి మూడో విడత చందన సమర్పణ సమర్పిస్తారు. అదే రోజు స్వర్ణ పుష్పార్చన, శ్రీమణవాళ మహామునుల మాస తిరునక్షత్రం ఉంటుందన్న ఈఓ స్వామివారికి చందనం సమర్పించాలనుకునే భక్తులు అరకిలోకి రూ.10,116 ,  కిలోకి 20,116 సమర్పించుకోవచ్చునన్నారు. అరకిలో చందన సమర్పణ చేసినవారికి 200 గ్రాముల చందనం చెక్క, కేజీ సమర్పించినవారికి 300 గ్రాముల చందనం ముక్కతోపాటు శేష వస్త్రం  ప్రసాదంగా ఇస్తారని వివరించారు. చందన సమర్పణకు ఆన్ లైన్లో సొమ్ము చెల్లించాక చిరునామా, గోత్రనామాలతో పాటు వివరాలను స్క్రీన్ షాట్ తీసి  6303800736 వాట్సప్ నంబర్ కు పంపించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని అప్పన్న భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈఓ కోరారు.

Simhachalam

2021-06-20 12:13:08

అజ్ఞాత భక్తుడి విరాళం రూ.2.8లక్షలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారికి  అజ్ఞాత భక్తుడు(వ్యాపారవేత్త) ఆదివారం రూ.2,08,116( రెండు లక్షల ఎనిమిమిదివేల నూట పదహారు రూపాయలు) విరాళం సమర్పించారు. ఈ మొత్తాన్ని ఈఓ పేరుతో చెక్కును పీఆర్వో కౌంటర్ లో అందజేశారు. దాత మాట్లాడుతూ, ఎంతో దూరం నుంచి స్వామి చూసేందుకు భక్తులు వస్తారని అలాంటి వారికి స్వామివారి ప్రసాదం అందించే  శ్రీ సింహాద్రినాథుని నిత్యాన్నదానం పథకానికి ఈ మొత్తం  వెచ్చించాలని ఆ భక్తుడు కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ భక్తుడికి ఈఓ ఎంవీ సూర్యకళ స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

Simhachalam

2021-06-20 12:08:10

కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ మర్గం..

కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ శాశ్వత పరిష్కారమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అనంతపురం నగరంలోని రెండవ రోడ్డులో ఉన్న 64వ వార్డు సచివాలయంలో కోవిడ్ టీకా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)ఏ.సిరి, నగర మేయర్ మహమ్మద్ వసీం సలీంలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున కోవిడ్ టీకా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 22 లక్షలమందికిపైగా వ్యాక్సినేషన్ వేసినట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా జిల్లాలో 6 లక్షల మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ టీకా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఈరోజు 8 నుంచి 10 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 90 వేల మందికి వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోందని, ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. అందులో భాగంగా కరోనా కూడా తగ్గుముఖం పట్టిందని, సోమవారం నుంచి కర్ఫ్యూ నిబంధనలు కూడా సడలిస్తోందన్నారు. అయితే ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని మాస్కులు ధరించాలని సూచించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ టీకా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఆదివారం ఉదయం నుంచి చేపట్టినట్లు, జిల్లాలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా జరుగుతోందని తెలిపారు. జిల్లాకు కోవిడ్ టీకా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా 90 వేల మందికి వాక్సినేషన్ చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, ఇందుకు సంబంధించి జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఈరోజు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ముఖ్యంగా తల్లులకు, ఐదు సంవత్సరాల లోపు పిల్లలున్న తల్లులకు వ్యాక్సినేషన్ వేసేలా లక్ష్యం నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే 45 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ చేపట్టాలని తెలియజేయడం జరిగిందన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు, వాలంటీర్లను భాగస్వామ్యం చేసి వ్యాక్సినేషన్ పట్ల ప్రతి సచివాలయం పరిధిలో ఉన్న అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని, జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని, ఇందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నగర మేయర్ మహమ్మద్ వసీం సలీం మాట్లాడుతూ చిన్న పిల్లలు ఉన్న తల్లులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టడం గొప్ప కార్యక్రమమన్నారు. తమ పిల్లల ఆరోగ్యం కోసం తల్లులు అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందరికీ వ్యాక్సినేషన్ వేయాలన్నదే సిఎం జగనన్న సంకల్పమన్నారు. పిల్లల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇప్పటికే మూడో వేవ్ వచ్చినా తట్టుకునేందుకు ఏర్పాట్లు చేయడం జగనన్న ముందు చూపుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్  పివివిఎస్ మూర్తి, కార్పొరేటర్లు శాంతి సుధా, చంద్రమోహన్ రెడ్డి, దాదా ఖలందర్, రాధాకృష్ణ, హెల్త్ సెక్రెటరీ మహేశ్వరి, మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-20 11:03:52

RMCANA ఆక్సిజన్ పరికరాల వితరణ..

కోవిడ్ నేపథ్యంలో కాకినాడ జీజీహెచ్‌లో రోగులకు ప్రాణవాయువును అందించేందుకు ఉపయోగపడే 20 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను రంగరాయ మెడికల్ కాలేజ్ అలుమ్ని ఆఫ్ నార్త్ అమెరికా (ఆర్ఎంసీఏఎన్ఏ) సమకూర్చింది. అదే విధంగా ఆక్సిజన్‌పై ఉన్న రోగులను ఒక వార్డు నుంచి మరో వార్డుకు చేర్చేందుకు, వివిధ పరీక్షల కోసం ఆసుపత్రిలో ల్యాబ్‌ల‌కు పంపించేందుకు ఉపయోగపడే 10 ఆక్సిజన్ సిలిండర్ హోల్డింగ్ కేజ్ ట్రాలీలను రూ.1,08,500 ఖర్చుతో డాక్టర్ ఎం.భానుప్రసాద్ మెమోరియల్ ట్రస్టు సమకూర్చింది. జీజీహెచ్‌లో రోగులకు సేవలందిస్తున్నకోవిడ్ వారియర్లు అయిన హౌస్ సర్జన్లకు అందించేందుకు వీలుగా రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు రూ.66 వేల ఖర్చుతో 200 నాణ్యమైన ఫేస్ షీల్డ్‌ల‌ను సమకూర్చారు. వీటిని ఆదివారం జీజీహెచ్‌లో ఆర్ఎంసీఏఎన్ఏ, డాక్టర్ ఎం.భానుప్రసాద్ మెమోరియల్ ట్రస్టు, రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల ప్రతినిధి డా. ఎస్వీ లక్ష్మీనారాయణ.. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తదితరుల చేతుల మీదుగా జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు అందించారు. కార్యక్రమంలో జీజీహెచ్ కోవిడ్ ప్రత్యేక నోడల్ అధికారి సూర్య ప్రవీణ్‌చంద్‌, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఆర్.మహాలక్ష్మి, ఆర్ఎంవో డా. ఇ.గిరిధర్, ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-20 10:13:41

జిల్లాలో ఆక్సిజన్ నిల్వకు లోటు లేదు..

కోవిడ్ నేపథ్యంలో జిల్లాలో ప్రజలకు ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి మార్గనిర్దేశనం మేరకు పెద్ద ఎత్తున మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ఆక్సిజన్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేశామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం  కాకినాడ జీజీహెచ్‌లో అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ లిమిటెడ్ రూ.52 లక్షలతో ఏర్పాటుచేసిన 20 కిలో లీటర్ల సామర్థ్యంగల ఆక్సిజన్ ట్యాంకును కలెక్టర్ డి.మురళీధ‌ర్‌రెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, సంస్థ యాజమాన్యంతో కలిసి మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. సామాజిక బాధ్యతగా ముందుకొచ్చి రోగులకు ప్రాణ వాయువును అందించేందుకు ఉపయోగపడే ఆక్సిజన్ ట్యాంకు ఏర్పాటుకు సహకరించిన, రూ.14 లక్షల విలువైన వెంటిలేటర్లను కూడా అందించిన అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ లిమిటెడ్ ఛైర్మన్ కరటూరి సత్యనారాయణమూర్తిని మంత్రి, కలెక్టర్, జేసీలు అభినందించి, శాలువాతో సత్కరించారు. జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా యుద్ధప్రాతిపదికన ట్యాంకు ఏర్పాటు పనులను పూర్తిచేసిన కాంట్రాక్టర్‌ను అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కలెక్టర్ పిలుపు మేరకు సరైన సమయంలో స్పందించి ఎందరో దాతలు సరైన సహకారాన్ని అందించారని, వారందరినీ అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.

 ముఖ్యమంత్రి నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ కోవిడ్ కట్టడికి యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారని, అత్యధిక జనాభా కలిగిన జిల్లాలో మరణాల రేటును తగ్గించేందుకు, ఉభయ గోదావరి జిల్లాలకు కీలకమైన కాకినాడ జీజీహెచ్‌లో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కలెక్టర్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. మొత్తం 50 కిలో లీటర్ల సామర్ధ్యం ఆస్పత్రి కి సమకూరిందన్నారు. కోవిడ్ కట్టడికి కృషిచేస్తున్న గ్రామ వాలంటీర్ నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది 24X7 పనిచేస్తూ రోగులకు సేవలందిస్తున్నారన్నారు. జిల్లా ప్రజలు కూడా స్వీయ క్రమశిక్షణతో జాగ్రత్తలు పాటిస్తూ అధికార యంత్రాంగానికి సహకరిస్తూ కోవిడ్ కట్టడికి కృషిచేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో వ్యాక్సిన్‌కు కొరత లేదని.. 45 ఏళ్లకు పైబడిన వారు, అయిదేళ్లలోపు పిల్లలున్న తల్లులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టీకా వేయించుకోవాలని మంత్రి వేణుగోపాలకృష్ణ సూచించారు. 

జిల్లాలో డోసుల అందుబాటును బట్టి దశల వారీగా, ప్రాధాన్యత క్రమంలో  అందరికీ టీకా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం 1,50,000 డోసుల పంపిణీ లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా మెగా వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోనూ వ్యాక్సిన్ కార్యక్రమం సజావుగా సాగుతోందని, ప్రజలు అపోహలు వీడి వ్యాక్సిన్ వేయించుకునేందుకు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ జాగ్రత్తలు పాటించి కోవిడ్ కట్టడికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. 

Kakinada

2021-06-20 10:10:55

3వ దశ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధం..

రాష్ట్రంలో కోవిడ్19 కేసులు గణనీయంగా తగ్గి 24 వేల నుంచి 5 నుండి 6 వేలకు నమోదు స్థాయికి వచ్చిందని హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ. కె.సింఘాల్ చెప్పారు. ఆదివారం ఉదయం తిరుపతి నగరం లోని నెహ్రూ నగర్ , ప్రకాశంపార్కు వద్ద వున్న పట్టణ ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలలో పర్యటించి వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ , నగరపాలక కమిషనర్ గిరీషా కలసి  హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటించి వ్యాక్సినేషన్ పరిశీలించి, వైద్య అధికారులతో, వాక్సిన్ వేసుకున్న వారితో మాట్లాడారు. వాక్సిన్ వేసుకున్న పెద్దవయస్సు వున్న వారు  రవిరాజు, మొలకయ్య వాక్సిన్ ఏర్పాట్ల ప్రక్రియ అద్భుతంగా వుందని, ఎలాంటి ఇబ్బందులేదని, మాకు గాని మాకుంటుంబాలకు గాని కోవిడ సోకలేదని, కోవిడ నిబంధనలు పాటిస్తున్నామని  హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ అడిగిన దానికి సమాదానం ఇవ్వగా, ప్రిన్సిపల్ సెక్రటరీ  సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మీడియా కు వివరిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో ఐసియు , ఆక్సిజన్ బెడ్లు పెంచామని, రాబోవు రోజుల్లో ఆగస్టు నాటికి ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా  ఏర్పాట్లు చేస్తున్నమని, 100 బెడ్లు ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ల ఏర్పాటుకు రూ.350 కోట్లతో టెండర్లు కూడా పిలిచామని తెలిపారు. లిక్విడ్ ఆక్సిజన్ తో  పాటు ప్రత్యన్మయం ఆక్సిజన్ కాన్సంటెటర్లు అందుబాటులో వుంచానున్నామని  తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో  యాక్టివ్ కేసులు 65 వేలకు వచ్చాయని అన్నారు. వాక్సినేషన్ అందించడంలో ఇప్పటికే 96,69,000 లక్షల మందికి మొదటి డోసు  పూర్తిచేశామని, గతంలో ఒక్కరోజు లో 6,29,000 డోసులు వేసి సామర్థ్యం చూపామని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లారని , వారంలో 3 రోజులు కోవిడ్ పై సమీక్ష నిర్వహిస్తున్నారని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి రెండు రోజుల క్రితం 9 లక్షల డోసులు కేటాయించడంతో నేడు ఆదివారం 45 సంవత్సరాల పైబడిన వారికి , 5 సంవత్సరాల లోపు పిల్లల తల్లులకు , విదేశాలకు వెళ్లనున్న స్టూడెంట్స్ కు  డ్రైవ్ మోడ్ తో చేపట్టితే మద్యాహనానికి 5,30,000 పూర్తి అయ్యాయని, సాయంత్రం 100 శాతం పూర్తి అవుతుందని తెలిపారు. నిర్దేశించిన వయస్సు వారు 85 శాతం పూర్తి అయిందని, మిగిలినవారికి  కూడా పూర్తిచేస్తామని తెలిపారు. , మూడవ వేవ్ వల్ల అత్యంత ప్రమాదం లేదని నిపుణులు చెపుతున్నా.. రాకూడదనే కోరుకుందామని..ఒక వేళ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్దంగా వున్నామని వివరించారు.

మీడియా ప్రతినిధులు అడిగిన వాటికి సమాధానంగా మూడవ వేవ్ లో పిల్లలకు ఇప్పుడు కన్నా ఎక్కువ ప్రమాదం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపిన విషయం తెలిసిందేనని, మూడవ వేవ్ రాకూడదనే కోరుకున్నా, వచ్చినా ఎదుర్కొనడానికి సిద్దంగా వున్నామని, రాష్ట్ర స్థాయి కమిటీ వేశామని, ఇందులో పిడియాట్రిక్ సీనియర్  వైద్యులు సభ్యులు వున్నారని,   అందుకు కావలసిన వైద్య మందులు, బెడ్లు, ఆక్సిజన్ వంటివి అందుబాటులో వుంచుతున్నామని, చిన్నపిల్లల చికిత్స కోసం వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కోవిడ్ చికిత్సకు రెమిడిసివర్, బ్లాక్ ఫంగస్ కు ఎంఫోటెరిసిస్-బి వంటివి అందుబాటులో వున్నాయని, వీటి ఆలస్యానికి కారణం అందులో వాడే మందులు విదేశాలనుండి రావడం, కేంద్రం సూచనల మేరకు కేటాయింపు వంటివి వుంటాయని వివరించారు. ప్రస్తుతం ఇబ్బంది లేదని 770 మందికి  బ్లాక్ ఫంగస్ చికిత్స  అందించామని తెలిపారు. 

జిల్లా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో నేడు 1,05,000 డోసులను నిర్దేశించామని 100 శాతం పూర్తి అవుతుందని, ఇందులో నియోజక వర్గ నోడల్ అధికారులు, మెడికల్ సిబ్బంది, రెవెన్యూ , పంచాయితీ రాజ్ సిబ్బంది కాంపైన మోడ్ లో చేస్తున్నారని మద్యాహనానికి 55 శాతం మేర పూర్తి అయిందని వివరించారు. నగరపాలక కమిషనర్ వివరిస్తూ తిరుపతిలో వార్డు సచివాలయాల్లో, అర్బన్ హెల్త్ సెంటర్లలో 34 చోట్ల వాక్సినేషన్ ప్రక్రియ ఏర్పాటు చేశామని 6 వేల డోసులు లక్ష్యంగా వేస్తున్నామని, వ్యాక్సిన్ వేసే సమయంలో ఇబ్బంది కలిగితే ఆంబులెన్సులు సిద్దంగా వుంచామని, ఇంతవరకు ఇబ్బంది లేదని తెలిపారు. హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ వారి పర్యటనలో  డి.ఎం.హెచ్.ఓ, శ్రీహరి, తిరుపతి ఆర్డీవో కనక నరసా రెడ్డి, రుయా సూపర్నెంట్ భారతి  మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ సుధారాణి, హెల్త్ సెంటర్ డాక్టర్లు ప్రియాంక , ప్రవీణ తదితరులు వున్నారు.

Tirupati

2021-06-20 10:07:14

యోగాతో మాన‌సిక ప్ర‌శాంత‌త‌..

యోగా ప్ర‌క్రియతో సంపూర్ణ ఆరోగ్యం, మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తాయ‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డా. జి.సి. కిశోర్ కుమార్ అన్నారు. మాన‌వుని జీవ‌న విధానంలో యోగా ఎన్నో మార్పులు తీసుకొచ్చింద‌ని పేర్కొన్నారు. భారత‌ పుణ్య‌భూమిలో యోగాకు ఎంతో ప్రాధాన్యత ఉంద‌ని గుర్తు చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ యోగా ప్ర‌క్రియ‌ను అనుస‌రించాల‌ని.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌ని సూచించారు. జూన్ 21న‌ అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఆయ‌ష్ శాఖ ఆధ్వ‌ర్యంలో ఆదివారం ఉద‌యం కోట జంక్ష‌న్ నుంచి జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యం వ‌ర‌కు చేప‌ట్టిన 5కే ర‌న్ ను ఆయ‌న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ యోగా అనేది నేడు మాన‌వుని జీవితంలో ఒక ముఖ్య‌మైన ప్ర‌క్రియగా మారింద‌ని, జీవ‌న శైలిపై దాని ప్ర‌భావం చాలా వ‌ర‌కు ప‌డిందని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ యోగా ప్ర‌క్రియ‌ను అనుస‌రించ‌టం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌ని సూచించారు. శ‌రీర, ప్రాణాత్మ‌, దేహాల‌ను ఒక తాటిపైకి తీసుకొచ్చి మాన‌వుని యొక్క‌ శారీర‌క‌, మాన‌సిక, ఆధ్యాత్మిక ఎదుగుద‌ల‌కు దోహ‌ద‌ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ శారీర‌క‌, మాన‌సిక‌, ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండ‌టం ద్వారా దేశానికి ఉప‌యోగ‌ప‌డాల‌ని సూచించారు. ఐక్య‌రాజ్య స‌మితి కూడా యోగాను గుర్తించ‌టంతో దాని ప్రాముఖ్య‌త మ‌రింత పెరిగింద‌ని గుర్తు చేశారు. కావున ఈ ప్ర‌క్రియ‌ను అంద‌రూ అనుస‌రించి సంపూర్ణ ఆరోగ్య స‌మాజ నిర్మాణానికి స‌హ‌క‌రించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని పేర్కొన్నారు. అనంత‌రం ఆయుష్ శాఖ ఆధ్వ‌ర్యంలో ఆన్‌లైన్‌లో యోగాస‌న ప్ర‌క్రియ‌ల‌పై అవ‌గాహ‌న కార్యక్ర‌మం నిర్వ‌హించారు.

కార్య‌క్ర‌మంలో డీఆర్వో ఎం. గ‌ణ‌పతిరావు, ఆర్డీవో బీహెచ్ భ‌వానీ శంక‌ర్‌, ఆయ‌ష్ శాఖ జిల్లా ప‌ర్య‌వేక్ష‌కుడు డా. ధ‌నుంజ‌య‌రావు, జిల్లా క్రీడాధికారి వెంక‌టేశ్వ‌రరావు ఇత‌ర అధికారులు, ఆయ‌ష్ శాఖ‌, క్రీడా ప్రాధికార సంస్థ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-06-20 09:59:35

క్యాజువల్ కార్మికులను ఆదుకోవాలి..

విశాఖపోర్టులో సరైన ఉపాది లేక తీవ్ర అవస్థలు పడుతున్న క్యాజువల్ కార్మికులను తక్షణమే ఆదుకోవాలని పోర్టు చైర్మన్ కె.రామ్మోహనరావును అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, పోర్టు ట్రస్టు మాజీ సలహాదారు, జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు కోరారు. ఈ మేరకు చైర్మన్, కార్యదర్శి టి.వేణుగోపాల్‌ను శనివారం  శ్రీనుబాబు మర్యాదపూర్వకంగా కలసి సింహాచలం చందన ప్రసాదం , స్వామి వారిశేష వస్త్రం అందజేశారు. అనంతరం క్యాజువల్ కార్మికులకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించి వారికి తక్షణమే న్యాయం చేయాలని కోరారు. 2009 లో సుమారు 300 మంది కార్మికులు డిఎల్ బి నుంచి పోర్టులోకి విలీనమయ్యారని, ఇందులో కొందరికి పర్మినెంట్ చేసినా మిగిలిన మరో 269 మందికి మాత్రం సరైన ఉపాధి అవకాశాలు లభించడం లేదని శ్రీనుబాబు వివరించారు. ప్రస్తుతం అరకొర పనుల వల్ల ప్రతినెల వీరికి సరైన వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులలో అల్లాడుతున్నారన్నారు. కరోనా సమయంలో వీరి సమస్యలు రెట్టింపుగా మారాయని వివరించారు. క్యాజువల్స్ కు సంబంధించి కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి మాండవీయ దృష్టికి విశాఖ ఎంపి ఎంవివి సత్యనారాయణ ద్వారా పలుమార్లు తీసుకు వెళ్లామన్నారు. కేంద్ర మంత్రి సైతం వీరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన విషయం గుర్తుచేశారు. అయితే తక్షణమే పర్మినెంట్ చేయకపోయినా కనీసం పోర్టులో ఖాళీగా ఉన్న విభాగాల్లో తమ సేవలు ఉపయోగించుకోవాలని కార్మికులు కూడా ఎంతోకాలంగా కోరినట్టు చెప్పారు. బయట వారికి అవకాశం ఇవ్వకుండా పోర్టులోనే సేవలందిస్తున్న క్యాజువల్ కార్మికులకు పని చూపిస్తే వారికి తగిన వేతనాలు పొందే సౌలభ్యం కలుగుతుందన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం తల్లిదండ్రులు తమ పిల్లల కోసం స్వచంద పదవీ విరమణ చేసి త్యాగం చేస్తే వీరికి దశాబ్దాల తరబడి న్యాయం జరగడం లేదని శ్రీనుబాబు పేర్కొన్నారు.

విశాఖ సిటీ

2021-06-19 16:18:37

నాడు-నేడుతో పాఠశాలలకు మహర్ధశ..

నాడు నేడుతో పాఠశాలల  రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతోందని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగరంలోని నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అభిరుద్ది పనులు చేపట్టిన రాజేంద్ర మున్సిపల్ హైస్కూలు,కస్తూరి హైస్కూలు,వాల్మీకి మున్సిపల్ ప్రైమరీ స్కూల్ లను శనివారం అధికారులతో కలసి పరిశీలించారు. 18 పాఠశాలల్లో మనబడి నాడు నేడు కింద తొమ్మిది రకాల పనులు త్రాగునీటి  సదుపాయం,టాయిలెట్స్,మేజర్ మరియు మైనర్ రిపేర్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ ఫర్నిచర్స్ ,గ్రీన్ చాక్ బోర్డు,కాంపౌండ్ వాల్,పెయింటింగ్ వర్క్స్ ,ఇంగ్లీష్ ల్యాబ్ వంటి పనులు చేపట్టినట్లు అధికారులు మేయర్ కు వివరించారు. ఇందులో కస్తూరిబాయ్ మున్సిపల్ హై స్కూల్ లో రూ.58 లక్షలు,వాల్మీకి ప్రైమరీ స్కూల్ లో రూ.17 లక్షలు,రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్ లో రూ.57 లక్షలు ఖర్చు చేసి ఆయా పాఠశాలల్లో అభిరుద్ది పనులు చేసినట్లు మేయర్ వసీం కు వివరించారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలన్న లక్ష్యం తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ కు ధీటుగా మౌలిక సదుపాయాలు కల్పించడం గొప్ప కార్యక్రమం అన్నారు.నగరంలో ప్రజలకు ప్రభుత్వ  విద్య,వైద్యం  మెరుగైన  సేవలు అందించేందుకు అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కొన్ని పాఠశాలల్లో వాటర్ ప్లాంట్ లు దుమ్ము దూళి నిండి ఉండటంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి పనులు చేపట్టినా నిర్వహణ లేకుంటే త్వరగా పాడేయ్యే అవకాశం ఉందని ఉపాద్యాయులు వాటి నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో  కార్పొరేటర్లు దేవి,  లక్ష్మీదేవి, సాకే చంద్రలేఖ,లీలావతి, కమలభూషణ్,టీవీ చంద్రమోహన్ రెడ్డి, ఇషాక్,అనీల్ కుమార్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ షాంశుద్దిన్, డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి ఎస్ సి రమేష్ చంద్ర, ఈ ఈలు రామ్మోహన్రెడ్డి, ఆదినారాయణ, అసిస్టెంట్ ఇంజనీర్లు నాగజ్యోతి, శంకర్, వైఎస్ఆర్సిపి నాయకులు ఖాజా, కుల్లాయి స్వామి మహబూబ్ పీరా, , లక్ష్మన్న గంగాధర్, స్కూళ్లలో హెడ్ మాస్టర్స్  తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-19 16:12:29

నిరాదరణకు గురైన వారిని ఆదుకోవాలి..

నిరాదరణకు గురైన మహిళలకు ఆర్థిక చేయూత కల్పించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో  జిల్లా గ్రామీణ అభివృద్ధి సంక్షేమ శాఖ, మెప్మా ఆధ్వర్యంలో, స్కిల్ డెవలప్మెంట్ వివిధ పథకాలు ఎలా అమలు చేస్తున్నారు అనే అంశంపై  సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ   నవరత్నాల లోని ప్రతి సంక్షేమ పథకాల అమలుపై  అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు  అందించవలసిన బాధ్యత మీపైన ఉన్నదన్నారు. ప్రతి సంక్షేమ పథకం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగే విధంగా కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని ఆమె ఆదేశించారు. జిల్లాలో కదిరి పరిసర ప్రాంతాలలో మహిళలు నిరాదరణకు గురి అవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయని, మహిళల అక్రమ రవాణా అనేది రూపుమాపాలని, వారికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, పెన్షన్లు, ఇతర ప్రభుత్వ పథకాలు అన్నీ వారికి అందేలా చూడాలని,  వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత మీ అందరిపై ఉందని పేర్కొన్నారు. ఇందుకు ఎన్జీవోల సహకారం తీసుకొని వారిని అభివృద్ధి చేయవలసిన అవసరం వుందని ఆమె తెలిపారు.  జిల్లాలోని వివిధ మహిళా సంఘాలు సాధించిన ప్రగతిని డాక్యుమెంట్ రూపంలో సిద్ధం చేయాలని తెలిపారు.  మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను త్వరితగతిన బ్యాంకులకు చెల్లించి అధిక మొత్తంలో రుణాల పొందవచ్చునని, వీటిపైన విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. బ్యాంక్ లింకేజీ  పథకం అమలులో, శ్రీనిధి పథకాల అమలులో, జిల్లా ప్రథమ స్థానంలో ఉంచేలా అధికారులు కృషిచేయాలని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. వైయస్సార్ పెన్షన్ కానుక,   వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, వైయస్ఆర్ సున్నా వడ్డీ, వైయస్సార్ బీమా, జగనన్న తోడు, బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి, ఉన్నతి, మహిళా సాధికారత, మెప్మా ఆధ్వర్యంలో వివిధ పథకాలపై ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు కోవిడ్ కారణంగా ఆన్లైన్ క్లాసులు పైన దృష్టిసారించాలని తెలిపారు. ప్రైవేట్ సంస్థలలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువతకు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) గంగాధర్ గౌడ్,  డి ఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, మెప్మా పిడి రమణారెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఏపీడి నరసయ్య, ఈశ్వరయ్య, డిఆర్డి ఎ, మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-19 16:07:29

బాధితులకు మెరుగైన కౌన్సిలింగ్..

గృహ హింస కేసుల్లో బాధితులకు మెరుగైన కౌన్సెలింగ్ , న్యాయ సలహాలు అందేలా చూడాలని ఐసీడీఎస్ పీడీ సుజన ను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గృహ హింస కేసుల్లో కౌన్సెలింగ్ సమయంలోనే సమస్యకు పరిష్కారం, మహిళలకు న్యాయం దక్కేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గృహ హింస కేసులకు సంబంధించి ఏడాది వారీగా, ప్రాంతాల వారీగా సమాచారం నమోదు చేయాలన్నారు. అప్పుడే కేసులు పెరుగుదల, తరుగుదల పై అధికార యంత్రాంగం ఒక అంచనాకు వచ్చి పరిష్కారం దిశగా సరైన చర్యలు చేపట్టగలదన్నారు. ఇదే సూత్రం అన్ని అంశాలలోనూ పాటించాలన్నారు.  పిల్లలకు అందించే పౌష్టికాహారం గురించి జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. కరోనా కారణంగా అనాధలైన పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న రూ.10 లక్షల పరిహారం త్వరితగతిన దక్కేలా చూడాలన్నారు. పరిహారానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. అంగన్ వాడీల్లో నాడు-నేడు పనులకు సంబంధించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అదేశించారు. 
సమీక్షలో నోడల్ ఆఫీసర్ వనజ, ఈవో భారతి దేవి తదితరులు పాల్గొన్నారు. 

Anantapur

2021-06-19 16:03:56

అనంతలో ఇసుక కొరత రాకూడదు..

ఇసుక కొరత లేకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో శనివారం సాయంత్రం జిల్లా ఇసుక కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించగా, ఇందులో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ రెవెన్యూ, రైతు భరోసా) నిశాంత్ కుమార్, హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) సంక్షేమం గంగాధర్ గౌడ్, ఏ ఎస్పి సెజ్ రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గత సమీక్షా సమావేశంలో జరిగిన అంశాలపై కూలంకషంగా చర్చించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోమవారంలోగా హిందూపురం, బ్రహ్మసముద్రం మండలం గోవిందయ్య దొడ్డి రీచ్ లను ప్రారంభించేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా కదిరి, గుంతకల్, రాయదుర్గం, అనంతపురం డిపోలలో తగినంత ఇసుక నిల్వలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని జెపి ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. భూగర్భ శాఖ నుండి కొత్తగా పర్యావరణ అనుమతులు పొందిన 10 ఇసుక రీచ్ లకు మ్యాన్యువల్ నుంచి యంత్రాలతో తవ్వకాలు కొరకు మోడిఫికేషన్ అనుమతులు వెబ్ సైట్ లో నమోదు చేయాలని ఆదేశించారు. కొత్తగా ఇసుక రీచ్లలో సంయుక్తంగా లైన్ డిపార్ట్మెంట్లు తనిఖీలు నిర్వహించి జిల్లా కమిటీకి ఆమోదం కొరకు సమర్పించాలన్నారు. బుధవారం లోగా కొత్తగా తనిఖీ చేసిన రీచ్ ల ఆమోదం కొరకు నివేదిక సమర్పించాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ వారి పనులకు సంబంధించి వాహనాల జాబితాను సమర్పించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో డిడి మెన్స్ ఎస్ వి రమణ రావు, సాండ్ ఆఫీసర్ కొండారెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ ఈ భాగ్యరాజ్, జెపి ఏజెన్సీ మేనేజర్ దయాళన్, నోడల్ ఆఫీసర్ నాగరాజ్, తాడిపత్రి ఏడి మైన్స్ ఆదినారాయణ, విజిలెన్స్ ఏడి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-19 16:01:14

డాక్టర్లు తో చర్చలు ఫలప్రదం..

తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ హాస్పిటల్  రెసిడెంట్ డాక్టర్లు గత మూడు రోజులుగా స్టయిఫండ్  కోసం నిర్వహిస్తున్న  చర్చకు దానికి అనుకూలంగా  ఈరోజు సాయంత్రం  శ్రీ పద్మావతి  అతిధి  గృహమునందు  తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణ అధికారి  జవహర్  రెడ్డి తో   స్విమ్స్  రెసిడెంట్ డాక్టర్స్ స్టైఫండ్ పెంపుదల విషయంపై జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఈ చర్చలలో చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణ, స్విమ్స్ డైరెక్టర్, ఉప కులపతి డాక్టర్.బి.వెంగమ్మ, స్విమ్స్ డీన్, స్విమ్స్ రిజిస్ట్రార్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి  మరియు స్విమ్స్  రెసిడెంట్ డాక్టర్లు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా స్విమ్స్ రెసిడెంట్ డాక్టర్లు తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యానికి , స్విమ్స్  యాజమాన్యానికి  కృతజ్ఞతలు తెలియజేశారు.

Tirupati

2021-06-19 15:41:56

ఆన్ లైన్ సేవలపై పండితులకు శిక్షణ..

 శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి ఆర్జిత సేవలు ఆన్ లైన్ లో అందించే విషయమై వేదపండితులకు అవగాహన ఉండాలని ఈఓ ఎంవీ సూర్యకళ సూచించారు. శనివారం దేవస్థానంలోని వేదపండితులు, ఆలయ సిబ్బందికి  TMS.AP.GOV.IN వెబ్ సైట్, యూట్యూబ్ ద్వారా అందించేసే సేవలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, చాలామంది భక్తులు శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి ఆర్జిత సేవల్లో పరోక్షంగా పాల్గొంటున్నారని అన్నారు. సింహాచలం దేవస్థానం ఈఓ అకౌంట్ కు రుసుము చెల్లించి సైతం భక్తులు పరోక్ష సేవల్లో భాగస్వాములవుతున్నారు. TMS వెబ్ సైట్లో సింహాచలం దేవస్థానంకు సంబంధించి పరోక్ష సేవలు, ఈ హుండి, డొనేషన్ ఆప్షన్లున్నాయని వాటి వినియోగంపై అవగాహన పెంచుకోవడం ద్వారా  భక్తులకు తెలియజేయడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ సందర్భంగా TMS వెబ్ సైట్ ద్వారా ఏఈఓ రణమమూర్తి నిత్యకళ్యాణం, ఏఈఓ తిరుమలేశ్వరరావు నిత్యకళ్యాణంకి టికెట్లు బుక్ చేసుకున్నారు. సీసీ వరాలరావు  తన ఆరోగ్యం బావుండాలన్న ఉద్దేశతో రూ.1116 స్వామివారికి విరాళం , బంగారు రాజు గోరక్షణ పథకానికి డొనేషన్ ఇచ్చారు.  ఆన్ లైన్ సేవలు, ఈ హుండీ, డొనేషన్ల గురించి అందరికీ అర్థమయ్యేలా ఈఓ  సూర్యకళ, బంగారు రాజు వివరించారు. ఈ కార్యక్రమంలో  గోపాలకృష్ణమాచార్యులు, శ్రీనివాస ఆచార్యులు, సీతామారాచార్యులు సహా పలువురు వేద పండితులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ సుజాత,  ఏఈఓలు రాఘవ కుమార్, తిరుమలేశ్వరారవు , రమణమూర్తి, శ్రీనివాస్, ఆనంద కుమార్,ఇంజనీరింగ్ సహా అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.  

Simhachalam

2021-06-19 15:37:32

తిరుమల ఆంజ‌నేయాలయ అభివృద్ధి..

ఆంజ‌నాద్రి ప‌ర్వ‌త‌మే ఆంజ‌నేయ స్వామివారి జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని, ఆకాశ‌గంగ వ‌ద్ద ఆల‌యాన్ని అభివృద్ధి చేస్తామ‌ని టిటిడి ఛైర్మ‌న్  వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యుల‌తో క‌లిసి శ‌నివారం బాల ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యాన్ని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.   ఈ సంద‌ర్భంగా  ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ టిటిడి ఆంజ‌నేయ‌స్వామివారి జ‌న్మ‌స్థ‌లం ఆకాశ‌గంగ అని న‌మ్ముతుంద‌న్నారు. ఇదే విష‌యాన్ని శ్రీ‌వారి భ‌క్తులు కూడా విశ్వ‌సిస్తూన్నార‌ని, దీనిపై ఎవ‌రితోను ఎలాంటి చ‌ర్చ‌లు లేవ‌న్నారు. ఆకాశ‌గంగ వ‌ద్ద అంజ‌నాదేవి స‌మేత బాల ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యాన్ని అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. అనంత‌రం ఈవో మాట్లాడుతూ టిటిడి ఏర్పాటు చేసిన పండిత ప‌రిష‌త్ నివేదిక‌లో ఆంజ‌నాద్రిలోని ఆకాశ‌గంగ ఆంజ‌నేయ‌స్వామివారి జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని పురాణాల ద్వారా నిర్ణ‌యించార‌ని తెలిపారు. ఆకాశ‌గంగ వ‌ద్ద భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు, ఆల‌య అభివృద్ధిపై కార్య‌చ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు రూపొందించి అభివృద్ధి చేస్తామ‌న్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు  శేఖ‌ర్‌రెడ్డి,  గోవింద‌హ‌రి,  పార్థ‌పార‌ధిరెడ్డి, డాక్ట‌ర్ నిశ్చిత‌,  వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, రాజేష్‌శ‌ర్మ‌,  ర‌మేష్‌శెట్టి,  శివ‌శంక‌ర్‌,  డి.పి.అనంత‌, మ‌ల్లాది విష్ణు, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాధ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.  

Tirumala

2021-06-19 15:17:39