1 ENS Live Breaking News

అప్పన్నకు రూ.లక్ష విరాళం..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారికి విశాఖకు చెందిన బాపూజీ నగర్ దంపతులు ప్రభాకర్ రెడ్డి , విజయలక్ష్మి లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. శుక్రవారం ఆలయం వెలుపల  ఈఓ ఎంవీ సూర్యకళకు ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును అందజేశారు. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ఈ మొత్తాన్ని విరాళంగా సమర్పించినట్టు దాతలు తెలియజేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలను తీసుకోవడంతో పాటు వేద పండితుల ఆశీర్వచనాన్ని కూడా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Simhachalam

2021-06-18 14:25:10

సింహాద్రి నాధునికి స్పీకర్ పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని శాసన సభాపతి తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్పీకర్ కుటుంబం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ ను రూపుమాసిపోయి ప్రజలు సాధారణ పరిస్థితి వచ్చేలా దీవించాలంటూ స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. అంతేకాకుండా స్వామివారి ఆలయ అభివ్రుద్ధికి తనవంతు క్రుషి చేస్తానని హామీఇచ్చారు. అంతకు ముందు దేవాలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనాన్ని అందించారు.  ఈఓ స్పీకర్ కుటుంబానికి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ట్రస్టుబోర్టు సభ్యులు, సూరిబాబు, దినేష్ రాజులు పాల్గొన్నారు.

Simhachalam

2021-06-18 14:22:00

3వ విడత నాడు-నేడు పూర్తిచేయాలి..

మనబడి నాడు-నేడు కింద చేపట్టిన మొదటి దశ పనులను జూన్ మూడో వారంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్సు హాలు నందు మనబడి నాడు-నేడు పనులపై జిల్లా  విద్యా, అనుబంధ రంగాల శాఖలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్వాంగసుందరంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులు పై ఉన్నదని ఆమె తెలిపారు. పది రకాల సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణం  పాఠశాలలలో ఉండే విధంగా కార్యక్రమాలు అమలు చేయాలని అధికారులను హెచ్చరించారు. తొలిదశ పాఠశాలల్లో  వివిధ పనులు రన్నింగ్ వాటర్ తో మరుగుదొడ్లు, విద్యుత్తు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, రక్షిత మంచి నీరు, విద్యార్థులకు, సిబ్బంది, ఫర్నిచర్, రిపేర్లు, గ్రీన్ చాక్ బోర్డులు, అదనపు గదులు తదితర పలు పనులపై సంబంధిత ఎస్ఈ పి ఆర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో, సంబంధిత ఇంజనీర్లతో ఆరా తీశారు. నాణ్యతలో ఎక్కడా రాజీ లేకుండా    పది రకాల సౌకర్యాలను జిల్లాలోని మొదటి విడత  నాడు నేడు కార్యక్రమం ద్వారా చేపట్టి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యారంగాన్ని జిల్లాలో సంబంధిత అధికారులు కలిసికట్టుగా కృషి చేసి ప్రథమ స్థానంలో నిలిచే విధంగా కృషి చేయాలని తెలిపారు.

జూలై నుంచి నాడు-నేడు రెండవ విడత పనులను చేపట్టాల్సి ఉంటుందని, అందువలన మొదటి దశలో అక్కడక్కడా మిగిలిపోయిన మైనర్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానోపాధ్యాయులు క్రియాశీలకంగా పని చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతుల కల్పన చేయాలన్నారు. వాల్ పెయింటింగ్స్, డిజిటల్ తరగతులు, మంచి నీటి వసతి తదితర అంశాల్లో లోపాలు ఉండకూడదన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిరి, విద్యా శాఖపై డిఈవో శామ్యూల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ, ఇంజనీర్లు శివరాం ప్రసాద్, శివ కుమార్, ఎస్ ఈ పంచాయతీ రాజ్ శాఖ భాగ్యరాజ్, ఆర్ఐఓ నాయక్,  పాలిటెక్నిక్, ప్రభుత్వ ఐ టి ఐ, ప్రిన్సిపాల్ లు, తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-18 14:19:20

మత్తు పదార్ధాల నిర్మూలనే లక్ష్యం..

తిరుపతి నగరంలో గంజాయి లాంటి మత్తు పదార్థాల వాడకాన్ని నిర్ములించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. రుపతిలో శుక్రవారం సాయంత్రం ఆయన భవాని నగర్, సప్తగిరి నగర్, అన్నారావు సర్కిల్, కేటీ రోడ్డు, గలివీధి, చిన్నబజారు వీధి, గాంధీ రోడ్డు, బండ్ల వీధి, తాతయ్య గుంట ప్రాంతాల్లో ఆయన కాలినడకన పర్యటించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా , ఎన్ని శక్తులు అడ్డు తగిలినా ఉక్కుపాదంతో తొక్కేస్తామని హెచ్చరించారు. ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్టు, లేదా బెదిరిస్తున్నట్టు తన సెల్ ఫోన్ కి కాల్ చేస్తే తగు విధంగా స్పందించి, చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.  తి
 కొంత మంది యువకులు మత్తుకు బానిసలుగా మారుతున్నారని ఆవేదన చెందారు. ఇలాంటి ఇప్పటికైనా ఇలాంటి యువకులు, చైతన్య వంతులు కావాలన్నారు.  మత్తు పదార్థాల నిర్ములన  కోసం పోలీసు యంత్రాంగం చేపడుతున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని, పోలీసు యంత్రంగం  పనితీరును  ప్రశంసించారు. స్థానికులు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలను విక్రయించే వారిపై నిఘా ఉంచి, విక్రయాల లింక్ ను తుంచి వేస్తామన్నారు. మత్తును అంతముందించే వరకు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.  గంజాయి స్థావరాలను గుర్తించి, వారి భరతం పట్టేందుకు భూమన నిత్యం నగరంలో కాలినడన .. పర్యటిస్తూ, మత్తు రాయుళ్ల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు.

Tirupati

2021-06-18 14:15:32

అలిపిరి వరకూ గరుడ వారధి..

తిరుపతిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మించాల్సి ఉందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. శనివారం జరిగే బోర్డ్ మీటింగ్ లో ఈ విషయం పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తిరుమల లో శుక్రవారం ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తిరుపతిలో  ట్రాఫిక్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గరుడ వారధిని అలిపిరి వరకు పొడిగించాలని ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి విజ్ఞప్తులు అందాయన్నారు. ఈ మేరకు తాను పరిశీలన జరిపినట్లు చైర్మన్ తెలిపారు. గరుడ వారధి ఇప్పుడు ముగిసే చోటి నుంచి  అలిపిరి వరకు నిర్మించడానికి కొత్తగా అంచనాలు తయారు చేయించేలా శనివారం బోర్డ్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి  వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించిన కళ్యాణ మస్తు సామూహిక వివాహాల కార్యక్రమాన్ని పునః ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నా, కోవిడ్ కారణంగా అమలు చేయలేకపోయామన్నారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్టీ, ఎస్సీ,బీసీ, మత్స్యకార గ్రామాల్లో 500 ఆలయాలు నిర్మించాలనే నిర్ణయం కూడా  కోవిడ్ వల్ల అమలు చేయలేక పోయామని ఆయన తెలిపారు.

 రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు అమలు చేసే అంశం మీద నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. గత ఏడాదిన్నరగా కోవిడ్ వల్ల జన జీవనం ఇబ్బందిగా తయారైనా, టీటీడీ తరపున అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రపంచ ప్రజలందరు ఆరోగ్యంగా ఉండేలా ఆశీస్సులు అందించాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ సుందరకాండ పారాయణం, విరాట పర్వం పారాయణం లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించి ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు చైర్మన్ తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాబోయే రోజుల్లో ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం చేయించే అంశం కూడా శనివారం నాటి సమావేశంలో చర్చిస్తామని ఆయన తెలిపారు.

Tirupati

2021-06-18 14:14:47

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం..

దేశ చ‌రిత్ర‌లో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో, గ‌తంలో ఏ ప్ర‌భుత్వ‌మూ చేయ‌ని విధంగా రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగాల విప్ల‌వాన్ని సృష్టించామ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి అన్నారు. కేవ‌లం రెండేళ్ల‌లోనే రికార్డు స్థాయిలో 6ల‌క్ష‌ల‌, 3వేల‌, 756 మందికి త‌మ ప్ర‌భుత్వం, ఉద్యోగాలను క‌ల్పించింద‌ని చెప్పారు. తాడేప‌ల్లిలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో, 2021-2022 సంవ‌త్స‌రానికి సంబంధించిన జాబ్ కేలండ‌ర్‌ను శుక్ర‌వారం వ‌ర్చువ‌ల్ విధానంలో ముఖ్య‌మంత్రి విడుద‌ల చేశారు. ఈ ఏడాది సుమారుగా 10,143 ప్ర‌భుత్వ‌ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  విద్య‌, వైద్యం, పోలీసుశాఖ‌ల్లో పోస్టుల భ‌ర్తీకి ప్రాధాన్య‌త‌నిస్తూ, ఎపిపిఎస్‌సి, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, డిఎస్‌సీ త‌దిత‌ర నియామ‌క సంస్థ‌ల ద్వారా ప్ర‌తీ నెలా నోటిఫికేష‌న్ల‌తో పార‌ద‌ర్శ‌కంగా నియామ‌కాలు చేప‌డ‌తామ‌ని అన్నారు. క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డ‌మే కాకుండా, ఉద్యోగుల సంక్షేమానికి ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను సిఎం వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జిల్లా నుంచి క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, జిల్లా ఉపాదిక‌ల్ప‌నాధికారి వై.ర‌వీంద్ర‌కుమార్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-18 14:08:14

ఆదివారం మెగా కోవిడ్ వేక్సిన్ డ్రైవ్..

విజయనగరం జిల్లాలో ఆదివారం మెగా వాక్సినేషన్ డ్రైవ్ జిల్లాలో చేపట్టనున్నట్టు జాయింట్ కలెక్టర్ డా.ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. 45 ఏళ్ల పైబడిన వారికి, 0-5 ఏళ్ల లోపు పిల్లలు గల తల్లులకు ఈ డ్రైవ్ లో వాక్సిన్ వేయనున్నట్లు వెల్లడించారు. ఉదయం 8 నుంచి రాత్రి వరకు జిల్లాలోని కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాలన్నింటి లో వాక్సిన్ వేస్తారని పేర్కొన్నారు. కోవిషీల్డ్ వాక్సిన్ ను వేస్తారని తెలిపారు. ఈ డ్రైవ్ లో సుమారు 50 నుంచి 60 వేల మందికి ఒకే రోజున వాక్సిన్ వేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆయా వాక్సిన్ కేంద్రాలకు వెళ్లి వాక్సిన్ వేయించుకోవాలని జె.సి. సూచించారు.

Vizianagaram

2021-06-18 14:07:21

పల్సస్ ఉద్యోగులకు ఉచితంగా కోవిడ్ టీకా..

కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలంటే కోవిడ్ టీకా తప్పక వేయించుకోవాలని పల్సస్ సిఈఓ డా. గేదెల శ్రీనుబాబు అన్నారు. శుక్రవారం విశాఖ క్యాంపప్ లో ఉద్యోగుల రక్షణార్ధం అందరికీ కోవిడ్ టీకాలు ఉచితంగా  వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ సంస్థలోని 2వేల మంది ఉద్యోగులకూ కోవిడ్ టీకా అందిస్తున్నామన్నారు. తొలివిడతగా 500 మందికి అందించామన్నారు. ఉదోగుల ఆరోగ్య భద్రతే సంస్థకు ప్రధానమని  చెన్నై, డిల్లీ , హైదరాబాద్ లోని తమ కంపెనీల్లో ఉద్యోగులందరికీ  ఉచితంగానే వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని  ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ కరోనా కష్టకాలంలో వ్యాక్సినే శ్రీరామ రక్షగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-06-18 12:40:55

నిరుద్యోగ యువత ఆకాంక్షనెరవేరాలి..

నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులను దశలవారీగా భర్తీ చేసేందుకు క్యాలెండర్ విడుదల చేస్తూ ఉద్యోగ నియమాకాల్లో నవశకానికి నాంది పలుకుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2021–22 సంవత్సరం జాబ్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రెండేళ్ళ పాలనలో రాష్ట్రంలో రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మొత్తం 6,03,756 భర్తీ చేయటం జరిగిందన్నారు. జాబ్ క్యాలెండర్ 2021–2022 ద్వారా జూలై నుంచి మార్చి 2022  వరకు వివిధ ప్రభుత్వ శాఖలలో 10,143 ఉద్యోగాలు నియమకాలు చేపట్టడం జరుగుతుందన్నారు. జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల నియామక నోటిఫికేషన్లు జారీ చేసే నెల వివరాలు తెలియజేయటం జరిగిందన్నారు. అవినీతి, వివక్షతకు తావు లేకుండా ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందని, ఇంటర్వూల విధానంకు పూర్తిగా స్వస్తి చెబుతూ అర్హులకు మాత్రమే ఉద్యోగాలు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి పి కొండయ్య, జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయ్, పాల్గొన్నారు.

Guntur

2021-06-18 12:31:00

బుద్ధపార్క్ ను తక్షణమే శుభ్రపరచండి..

దసపల్లా బుద్ధపార్క్ కళాహీనంగా ఉందని, వెంటనే పార్కును శుభ్రం చేయించాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. శుక్రవారం  నాలుగవ జోన్ 28 వ వార్డు పరిధిలోని జివిఎంసి సివిక్ ఎక్ష్నొరా దసపల్లా హిల్స్ బుద్ధ పార్క్, దసపల్లా హిల్స్ పరిసర ప్రాంతాలలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పార్క్  అనంతరం దసపల్లా హిల్స్ తదితర ప్రాంతాలలో నివాసిత ఇళ్ల నుండి డోర్ టు డోర్ చెత్త సేకరణ ప్రక్రియను స్వయంగా పరిశీలించి, పారిశుద్ధ్య సిబ్బందికి తగు సూచనలు చేశారు. చెత్త సేకరించిన వెంటనే డంపింగ్ యార్డ్ కు తరలించాలని, దసపల్లా హిల్స్ పరిసర ప్రాంతాలలో భవన నిర్మాణ వ్యర్ధాలను వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని, ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుండి వార్డు శానిటరి  కార్యదర్శి వీధులలో పర్యటించి, పారిశుద్ధ్య కార్మికులచే రోడ్లు, కాలువలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరూ యాప్రాన్ బ్లౌజులు, చేతి గ్లౌజులు, మాస్కులు ధరించి విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటరి ఇన్స్పెక్టర్ మరియు వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-06-18 12:27:17

ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వితరణ..

కరోనాతో పోరాడే రోగుల ఆరోగ్య పరిరక్షణకు ‘గమన’ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ఉచింతగా అందజేయడం అభినందనీయమని జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు.శుక్రవారం కలెక్టరేట్ లోని జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్ దినేష్ కుమార్ ఛాంబర్ లో తుళ్ళూరు మండలం, అనంతవరం గ్రామానికి చెందిన ‘గమన’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సుమారు రూ. 5 లక్షల విలువ చేసే 9 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అప్పారావు, పుష్పరాజు, మధుబాబు, రమేష్ లను జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్ దినేష్ కుమార్ వారి దాతృత్వాన్ని అభినందించారు. అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో కరోనాకు గురై  ఇబ్బందులు పడుతున్న బాధితుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దాతల సహకారంతో వస్తున్న వైద్యపరికరాలను ఉపయోగించి రోగులకు అత్యవసర చికిత్సను అందించడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ‘గమన’ సంస్ధ ప్రతినిధులు ఇచ్చిన 9 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ను రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో కోవిడ్ బారినపడి వైద్య చికిత్సకు ఇబ్బంది పడుతున్న రోగులకు వినియోగించాలని కోరారు.  ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ను 29 గ్రామాల పరిధిలోని పిహెచ్ సి లకు అందించాలని వైద్యాదికారులకు ఆదేశిస్తామన్నారు.  ‘గమన’ సంస్థ అధ్యక్షులు అప్పారావు మాట్లాడుతూ కోవిడ్ నిర్మూలనకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్ దినేష్ కుమార్ కు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటి డైరెక్టర్ మధుసూదనరావు, ‘గమన’ స్వచ్ఛంద సంస్థ  అధ్యక్షులు అప్పారావు, ఉపాధ్యక్షులు పుష్పరాజు, సెక్రటరీ మధుబాబు, కో- ఆర్డినేటర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-06-18 12:22:51

జిజిహెచ్ కి ఎస్బీఐ పిపిఈ కిట్ల వితరణ..

కోవిడ్ నివారణకు  భారతీయ స్టేట్ బ్యాంక్ ఫౌండేషన్ అందిస్తున్న సహకారం మరువ లేనిదని జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా,రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ అన్నారు. శుక్రవారం గుంటూరు నగరం పాలెం భారతీయ స్టేట్ బ్యాంక్ జిల్లా రీజనల్ బ్యాంక్  ఆవరణలో కరోనా నియంత్రణ కోసం గుంటూరు సమగ్ర వైద్యశాలకు రూ.7 లక్షల విలువైన 1500 పిపిఈ కిట్లను  జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా,రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ చేతులు మీదుగా అందించారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా,రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ కరోనా మహ్మమారిని ఎదుర్కొనేందుకు దాతల సహరం అవసరమని అన్నారు. ఇందుకోసం గుంటూరు జిల్లాలో ఇప్పటికే ఎన్.జి.వొ, అధికారులు, స్వచ్చంద సంస్థలను కలిపి నోడల్ ఏజన్సీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సామాజిక సేవలలో  భాగంగా గుంటూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి కి నోడల్ ఏజన్సీ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి సాంఘీక సంక్షేశాఖ డిప్యూటి డైరెక్టర్ మధుసూదనరావు నేతృత్వంలో దాతలు అందించిన సాయాన్ని ప్రణాళికా బద్ధంగా అవసరమైన వారికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతనెల 20 న ఎస్.బి.ఐ ఫౌండేషన్ ద్వారా గతంలో రెడ్ క్రాస్ సొసైటి కి రూ.8 లక్షల వైద్య పరికరాలను అందించినట్లు  భారతీయ స్టేట్ బ్యాంక్ గుంటూరు రీజనల్ మేనేజర్ తారకేశ్వరరావు వెల్లడించారు. ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారులంతా బ్యాంక్ లావాదేవిలను ఎస్.బి.ఐ  యోనో డిజిటల్  అప్లికేషన్ ద్వారా సేవలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటి డైరెక్టర్ మధుసూదనరావు, గుంటూరు సమగ్ర ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రభావతి, గుంటూరు ఎస్.బి.ఐ అమరావతి సర్కిల్ పరిపాలన కార్యాలయ ఛీప్ మేనేజర్ సత్యనారాయణ, ఎస్.బి.ఐ ప్రధాన శాఖ మేనేజర్ సుబ్రహ్మణ్యం, యూనియన్ సంఘ నాయకులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస చారి, ఫణి తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-06-18 12:19:10

ఉద్యోగాల కల్పనలో ఏపీది దేశ చరిత్ర..

దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మునుపెన్నడూ లేని విధంగా రెండేళ్లలోనే రికార్డు స్థాయిలో 6,03,756 ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులను దశలవారీగా భర్తీచేసేందుకు జాబ్ క్యాలండరును విడుదల చేస్తున్నట్లు సిఎం చెప్పారు. శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం పేరిట జాబ్ క్యాలండర్ ను ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో విడుదల చేసారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా కేవలం రాత పరీక్షల మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. పరీక్షల నిర్వహణలో ప్రఖ్యాత ఐఐటి, ఐఐఎంల సహకారంతో నూతన విప్లవానికి నాంది పలకనున్నట్లు సిఎం స్పష్టం చేసారు. ప్రభుత్వం వచ్చిన నాటి నుండి నేటి వరకు వివిధ శాఖల్లో ఖాలీగా ఉన్న 1,84,264 రెగ్యులర్ పోస్టులు, కాంట్రాక్ట్ పద్దతిలో 19,701 పోస్టులు, ఔట్ సోర్సింగ్ ద్వారా 3,99,791 పోస్టులతో సహా 6,03,756 పోస్టులను ఇప్పటివరకు భర్తీచేసినట్లు సిఎం తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంలోని అవినీతిని నిర్మూలించి పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించే విధంగా పనిచేసే ప్రతీ ఉద్యోగికి మంచి జీతాలు ప్రతి నెల 1వ తేదీన నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వచ్చేట్టుగా చేసామని, మధ్య దళారీల బెడద లేకుండా అన్ని ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఉద్యోగుల నియామకం ఒకేచోట జరిగేలా ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను ఏర్పాటుచేసిన సంగతిని సిఎం గుర్తుచేసారు. ఆర్.టి.సి ఉద్యోగుల దశాబ్ధాల కలను నెరవేరుస్తూ ఏడాదికి రూ.3,600 కోట్ల అదనపు భారాన్ని చిరునవ్వుతో స్వీకరించి ఇచ్చిన మాట ప్రకారం ఆర్.టి.సిని ప్రభుత్వంలో విలీనం చేయడమే కాకుండా 51,387 మంది ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పదవీవిరమణ వయస్సును 60 ఏళ్లకు పెంపుదల చేయడం జరిగిందన్నారు.

          జూలై మాసం నుండి వచ్చే ఏడాది మార్చి వరకు విద్య,వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి ఏ.పి.పి.యస్.సి, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, డి.ఎస్సీ వంటి నియామక సంస్థల ద్వారా ప్రతీ నెల నోటిఫికేషన్లు జారీచేస్తూ పారదర్శకంగా నియామకాలు చేపట్టనున్నట్లు సిఎం వివరించారు.ఎస్.సి,ఎస్.టి,దివ్యాంగులకు చెందిన బ్యాక్ లాగ్ 1,238 ఉద్యోగాలను 2021 జూలై మాసంలో, ఏపిపిఎస్సీ గ్రూప్-1,  గ్రూప్-2కు చెందిన 36 పోస్టులను ఆగష్ట్ లోనూ, పోలీసు శాఖలో  ఖాళీగా ఉన్న 450 పోస్టులను సెప్టెంబరులో, వైద్యశాఖలో ఖాళీగా ఉన్న 451 వైద్యులు,  అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాలను అక్టోబరులో., 5,251 పారా మెడికల్, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులను నవంబరులో, 441 నర్సు పోస్టులను డిసెంబరులో, 240 డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులను 2022 జనవరిలో , 2,000 యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో, ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను మార్చి 2022లోనూ వెరశి 10,143 పోస్టులను రానున్న 9 మాసాల్లో భర్తీచేయడం జరుగుతుందని, వాటికి సంబంధించిన జాబ్ విడుదల చేసుకోవడం జరిగిందని సిఎం తెలిపారు.

 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్రికేష్ లాఠకర్, జాయింట్ కలెక్టర్ డా. కే.శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, జిల్లా ఉపాధి కల్పన అధికారి జి. శ్రీనివాసరావు, నైపణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ గోవింద రావు, ఉద్యోగాలు పొందిన యువత తదతరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-18 12:14:01

ప్రభుత్వ భవనాలు సత్వరం పూర్తిచేస్తాం..

 ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని కొత్తపేట శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి వెల్లడించారు. శుక్రవారం నియోజకవర్గంలోని  రావులపాలెం మండలం కేతరాజు పల్లి గ్రామంలో రూ.25 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్(ఆసరా) జి.రాజకుమారితో కలిసి శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించి, వెదిరేశ్వరం గ్రామంలో రూ.17.5 లక్షలతో నిర్మించనున్న వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనానికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ సేవలు పొందడానికి కార్యాలయాల వద్ద గంటల సమయం వేచి వుండే పరిస్థితి ఉండేదని, ఆ పరిస్థితిని మారుస్తూ గతంలో కంటే భిన్నంగా, వేగంగా నాణ్యమైన ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందించాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి  సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల వద్దకే అందించడం జరుగుతుందని అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా మరింత వేగంగా సేవలు అందించేందుకు శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా రైతులకు వ్యవసాయ పరంగా అండగా నిలబడేందుకు రైతు భరోసా కేంద్రాలు, ప్రతీ పేదవానికి సకాలంలో వైద్యం అందేలా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ లకు శాశ్వత భవనాలు నిర్మించడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలో కొన్ని  పరిస్థితుల వల్ల నిర్మాణాల్లో జాప్యం జరిగిందని, ఇకనుండి నిర్మాణాల్లో తలెత్తుతున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
              ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్(ఆసరా) జి.రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న  సచివాలయ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయని అన్నారు. జిల్లాలో సచివాలయాలు, ఆర్బికే సెంటర్లు, వెల్ నెస్ సెంటర్లు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు కలిపి మొత్తం 4500 భవనాలకు సుమారు 1000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. మంజూరు కాబడిన శాశ్వత భవనాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు జిల్లాలో ఈనెల 17 వ తేదీ నుండి జూలై 2 వ తేదీ వరకు భవన నిర్మాణ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే ఈరోజు  సచివాలయం భవనం ప్రారంభం, వెల్ నెస్ సెంటర్ కు శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలో చేపట్టిన శాశ్వత భవన నిర్మాణాలను అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో మరో రెండు మూడు నెలల్లో పూర్తి చేసుకుని ప్రారంభించడానికి చర్యలు చేపట్టినట్లు జెసి తెలిపారు.
         ఈ కార్యక్రమంలో భాగంగా కేతరాజుపల్లి గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవనానికి ప్రారంభోత్సవం,వేదిరేశ్వరం గ్రామంలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్ కు భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన కార్యక్రమం జెసితో కలిసి స్థానిక శాసనసభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు వెదిరేశ్వరం గ్రామంలోని గ్రామ సచివాయాన్ని, నూతనంగా నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రం పనులను జెసి, ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల  వివరాలు నమోదు చేస్తున్న విధానం, తదితర అంశాలను గురించిజెసి  వాలంటీర్లను ఆరా తీశారు.
            ఈ కార్యక్రమంలో జడ్పి సిఇఓ ఎన్వివి సత్యనారాయణ, డ్వామా పిడి వరలక్ష్మీ, సర్పంచ్ లు అంబటి సుబ్బలక్ష్మి, బొక్కా కారుణాకరం, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, గ్రామ ప్రజలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Ravulapalem

2021-06-18 10:44:39

భూసమస్యల పరిష్కారానికే సమగ్ర భూసర్వే..

రాష్ట్రంలో భూత‌గాదాలు, భూసంబంధ స‌మస్యలు శాశ్వతంగా ప‌రిష్క రించడం ద్వారా ప్రజ‌లు భూస‌మ‌స్యల కార‌ణంగా ఎలాంటి ఇబ్బందులకు లోనుకాకూడ‌ద‌నే ల‌క్ష్యంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వై.ఎస్‌.ఆర్‌.జ‌గ‌న‌న్న భూహ‌క్కు భూర‌క్ష పేరుతో స‌మ‌గ్ర భూస‌ర్వేకు శ్రీ‌కారం చుట్టార‌ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూశాఖ మంత్రి ధ‌ర్మాన కృష్ణదాస్ అన్నారు. బ్రిటిష్ ప్రభుత్వ హ‌యాంలో భూస‌ర్వే జ‌రిగిన త‌ర్వాత రాష్ట్రంలో ఇప్పటివ‌ర‌కు భూస‌ర్వే జ‌ర‌గ‌లేద‌ని దీనివ‌ల్ల ఎన్నో స‌మ‌స్యలు ఎదుర‌వుతున్నాయ‌ని పేర్కొన్నారు. స్పష్టమైన భూరికార్డులు ఏర్పర‌చ‌డం ద్వారా భూముల అస‌లు య‌జ‌మానుల‌కు వాటిపై పూర్తిస్థాయి హ‌క్కులు క‌ల్పించి భ‌విష్యత్తులో ఎలాంటి స‌మ‌స్యల‌కు తావులేని విధంగా వాటికి ర‌క్షణ క‌ల్పించ‌డ‌మే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమ‌ని చెప్పారు. సుమారు రూ.1000 కోట్ల వ్యయంతో చేప‌డుతున్న ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిచేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని మంత్రి వెల్లడించారు. 2023 అక్టోబ‌రు నాటికి స‌మ‌గ్ర భూస‌ర్వే పూర్తిచేయ‌డానికి గ‌డువుగా నిర్ణయించామ‌న్నారు. ప‌టిష్టమైన రీతిలో స‌ర్వే జ‌రిగేందుకే మూడేళ్ల కాల‌వ్యవ‌ధిని నిర్ణయించామ‌న్నారు. స‌ర్వే ఆఫ్ ఇండియా అందించే అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో డ్రోన్లను వినియోగించి భూముల ఛాయాచిత్రాలు తీసి అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఎంతో ఖ‌చ్చితంగా భూముల హ‌ద్దుల‌ను నిర్ణయిస్తార‌ని చెప్పారు. స‌మ‌గ్ర భూస‌ర్వేలో కేవ‌లం వ్యవ‌సాయ భూముల‌కు సంబంధించి మాత్రమే కాకుండా నివాస స్థలాలు, ప్రభుత్వ భూములు, ప‌ట్టణాల్లోని నివాస స్థలాల‌కు సంబంధించి కూడా స‌ర్వే జ‌రిపి స‌మ‌గ్రమైన రికార్డులు రూపొందిస్తామ‌ని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ స‌ర్వేపై రైతుల్లో ఉన్న అపోహ‌ల‌ను, అనుమానాలు నివృత్తి చేసేందుకు గ్రామ‌స‌భ‌లు నిర్వహిస్తార‌ని, ఆ స‌భ‌ల్లో త‌మ సందేహాల‌ను నివృత్తి చేసుకోవ‌చ్చన్నారు. గ్రామాల్లో ఈ స‌ర్వే జ‌రుగుతున్న స‌మ‌యంలో రైతులంతా స‌ర్వే గురించి తెలుసుకొని ఇందులో భాగ‌స్వాములు కావ‌డం ద్వారా స‌ర్వేకు స‌హ‌క‌రించాల‌న్నారు. జిల్లాలో ఈ స‌ర్వే జ‌రుగుతున్న తీరుప‌ట్ల రెవిన్యూ మంత్రి ధ‌ర్మాన కృష్ణదాస్ సంతృప్తి వ్యక్తంచేశారు. ఇది రైతుల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మైన కార్యక్రమ‌మ‌ని ముఖ్యమంత్రి త‌న సుదీర్ణ పాద‌యాత్రలో  రైతులు ఎదుర్కొంటున్న భూసంబంధ వివాదాల స‌మ‌స్యలు తెలుసుకున్న మీద‌ట భూ స‌మ‌గ్ర స‌ర్వేకు శ్రీ‌కారం చుట్టార‌ని వివ‌రించారు. అత్యాధునిక టెక్నాల‌జీ వినియోగిస్తున్న కార‌ణంగా పొర‌పాట్లకు ఆస్కారం లేకుండా స‌ర్వే జ‌రుగుతుంద‌న్నారు.

విజ‌య‌న‌గ‌రం జిల్లా రామ‌భ‌ద్రపురం మండ‌లం మ‌ర్రివ‌ల‌స‌లో వై.ఎస్‌.ఆర్‌.జ‌గ‌న‌న్న శాశ్వత భూహ‌క్కు భూర‌క్ష కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రులు ధ‌ర్మాన కృష్ణదాస్‌, పాముల పుష్పశ్రీవాణి శుక్రవారం భూమిపూజ చేసి లాంఛ‌నంగా ప్రారంభించారు. డ్రోన్ టెక్నాల‌జీతో గ్రామానికి సంబంధించి తీసిన ఛాయాచిత్రాల‌ను వారు ఎంపి బెల్లాన చంద్రశేఖ‌ర్‌, ఎమ్మెల్యేలు శంబంగి వెంక‌ట చిన‌ప్పల‌నాయుడు, బొత్స అప్పల‌న‌ర‌స‌య్యల‌తో క‌లసి తిల‌కించారు. భూముల స‌ర్వేలో భాగంగా వినియోగించే కోర్స్ రోవ‌ర్స్‌, డిఫ‌రెన్షియ‌ల్ గ్లోబ‌ల్ పొజిష‌నింగ్ సిస్టం, ఇ.టి.ఎస్‌. ప‌రికరాల‌ను మంత్రులు తిల‌కించారు. అవి ఈ స‌ర్వేలో ఏవిధంగా ఉప‌యోగ‌ప‌డ‌నున్నాయో జాయింట్ క‌లెక్టర్‌(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్ వారికి వివ‌రించారు.

 

ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ‌శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ‌వాణి మాట్లాడుతూ రైతులు, భూ య‌జ‌మానులు త‌మ జీవిత కాలంలో క‌ష్టప‌డి సంపాదించిన భూముల‌ను వేరొక‌రు త‌ప్పుడు రికార్డులు సృష్టించి వాటిపై వివాదాలు సృష్టిస్తున్న ప‌రిస్థితుల్లో వారు ఈ వివాదాల ప‌రిష్కారం కోసం కోర్టుల చుట్టూ తిర‌గ‌లేని ప‌రిస్థితి వుంద‌ని, ఇటువంటి  స‌మ‌స్యల ప‌రిష్కార‌మే ల‌క్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ జ‌గ‌న్ ఈ స‌మ‌గ్ర భూస‌ర్వే కు శ్రీ‌కారం చుట్టార‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అస‌లైన భూయ‌జ‌మానుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని పేర్కొంటూ ఈ ప్రాజెక్టును అమ‌లు చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రజ‌లంద‌రి త‌ర‌పున ధ‌న్యవాదాలు తెలియ‌జేస్తున్నట్టు చెప్పారు. ఖాళీ భూముల‌పై కొంద‌రు ద‌ళారులు త‌ప్పుడు రికార్డులు సృష్టించి వాటిని స్వాధీనం చేసుకొనే ప్రయ‌త్నం చేస్తున్నార‌ని, అలాంటి వాటికి ఈ సర్వే చెక్ పెడుతుంద‌న్నారు. త‌ల్లికి బిడ్డపై ఎంత‌టి మ‌మ‌కారం ఉంటుందో రైతుకు కూడా త‌న భూమిపై అంత‌టి మ‌మ‌కారం ఉంటుంద‌ని, అటువంటి భూమి ఇత‌రుల పాలైతే ఎంతో మ‌నోవ్యధ చెందుతార‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 16వేల మంది స‌ర్వేయ‌ర్లకు శిక్షణ ఇచ్చి, ఎంతో అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్నివినియోగించి ఈ స‌ర్వే చేప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేద‌లంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తూ, 30 ల‌క్షల మంది ఆడ‌ప‌డుచుల‌కు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న పాల‌నలో పార్టీల‌కు, రాజ‌కీయాల‌కు అతీతంగా కార్యక్రమాలు అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రజలంద‌రి త‌ర‌పున ధ‌న్యవాదాలు చేస్తున్నట్టు డిప్యూటీ సి.ఎం. చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేద‌లంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తూ, 30 ల‌క్షల మంది ఆడ‌ప‌డుచుల‌కు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న పాల‌నలో పార్టీల‌కు, రాజ‌కీయాల‌కు అతీతంగా కార్యక్రమాలు అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రజలంద‌రి త‌ర‌పున ధ‌న్యవాదాలు చేస్తున్నట్టు డిప్యూటీ సి.ఎం. చెప్పారు.

 

జాయింట్ క‌లెక్టర్‌(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 12.43 ల‌క్ష‌ల ఎక‌రాల భూమిని  రీస‌ర్వే చేస్తున్నామ‌ని, ఈ భూమి 2 ల‌క్షల స‌ర్వే నెంబ‌ర్ల ప‌రిధిలో వుంద‌ని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 23.91 ల‌క్షల స‌బ్ డివిజ‌న్‌లు స‌ర్వే చేయాల్సి  ఉంద‌న్నారు. గ‌తంలోనూ భూముల స‌ర్వేలు జ‌రిగిన‌ప్పటికీ అత్యాధునిక ప‌రిజ్ఞానంతో స‌ర్వే నిర్వహించ‌డం, భూహ‌క్కుల‌కు ర‌క్షణ క‌ల్పించ‌డం ఈ స‌ర్వే ప్రత్యేక‌త అని పేర్కొన్నారు. భూహ‌ద్దుల‌ను ఈ స‌ర్వే ద్వారా ఖ‌చ్చితంగా గుర్తించ‌డం సాధ్యమ‌వుతుంద‌న్నారు. జిల్లాలో ఆరు నెల‌ల‌పాటు భూరికార్డుల‌ను ప్రక్షాళ‌న చేసిన త‌ర్వాతే ఈ స‌ర్వేకు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. జిల్లాలో తొలిద‌శ‌లో 499 గ్రామాల్లో డ్రోన్లతో చిత్రాలు  తీస్తున్నట్టు చెప్పారు. వ్యవ‌సాయ భూముల‌తో పాటు గ్రామ కంఠాలు, నివాస స్థలాలు కూడా స‌ర్వే చేస్తామ‌ని, ప‌ట్టణాల్లో కూడా నివాస స్థలాల‌పై స‌ర్వే చేస్తామ‌న్నారు. జిల్లాలో వంద‌శాతం ఖ‌చ్చిత‌త్వంతో స‌ర్వే పూర్తిచేస్తామ‌ని పేర్కొన్నారు.

బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గంలో ఇనాం భూముల‌కు సంబంధించి భూ స‌మ‌స్యలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వాటిపై దృష్టిసారించాల్సి వుంద‌ని స్థానిక శాస‌న‌స‌భ్యులు శంబంగి వెంక‌ట చిన‌ప్పల‌నాయుడు అన్నారు. ఈ స‌ర్వే ద్వారా ఆ స‌మ‌స్యల‌న్నీ ప‌రిష్కారం అవుతాయ‌ని భావిస్తున్నట్టు చెప్పారు.

సాగు చేస్తున్న రైతుల‌కు భూమిపై హ‌క్కు లేకుండా ఇత‌రులు న‌కిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూముల‌పై ఆధిపత్యం చెలాయించ‌కుండా ఈ స‌ర్వే దోహ‌ద‌ప‌డుతుంద‌ని గ‌జ‌ప‌తిన‌గ‌రం ఎమ్మెల్యే బొత్స అప్పల‌న‌ర‌స‌య్య అన్నారు.

ఎం.పి. బెల్లాన చంద్రశేఖ‌ర్ మాట్లాడుతూ భూయ‌జ‌మాని తాను ఎక్కడ నివసిస్తున్నా త‌న భూమి ఏ ప‌రిస్థితిలో వుందో ఎలా వుందో తెలుసుకుని నిశ్చింత‌గా వుండే ప‌రిస్థితి ఈ భూస‌ర్వే ద్వారా క‌లుగుతుంద‌ని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా  స‌మ‌గ్ర భూస‌ర్వే చేప‌ట్టక పోవ‌డం వ‌ల్ల ఎన్నో ఏళ్లుగా భూవివాదాలు ప‌రిష్కారం కాక రైతులు, భూ య‌జ‌మానులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, వాట‌న్నింటికీ ఈ స‌ర్వే పరిష్కారం చూపుతుంద‌న్నారు.

స‌ర్వే విభాగం ఏ.డి. కె.రాజాకుమార్ మాట్లాడుతూ జిల్లాలో వ‌చ్చే జూలై ఒక‌టి నుంచి ఒక్కో మండ‌లంలో ఒక్కో గ్రామంలో భూస‌మ‌గ్ర స‌ర్వే ప్రారంభిస్తామ‌న్నారు. జిల్లాలో మొత్తం 1551 గ్రామాల్లో స‌మ‌గ్ర భూస‌ర్వే చేప‌ట్టనున్న‌ట్టు తెలిపారు.

కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేష‌న్ ఛైర్మన్ మామిడి శ్రీ‌కాంత్‌, బొబ్బిలి మునిసిప‌ల్ చైర్మన్ సావు వెంక‌ట ముర‌ళీకృష్ణ‌, ఇన్ చార్జి ఆర్‌.డి.ఓ ఎస్‌.వెంక‌టేశ్వర్లు, రామ‌భ‌ద్రపురం త‌హ‌శీల్దార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-18 10:40:42