1 ENS Live Breaking News

ఉద్యోగాల కల్పనలో ఏపీది దేశ చరిత్ర..

దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మునుపెన్నడూ లేని విధంగా రెండేళ్లలోనే రికార్డు స్థాయిలో 6,03,756 ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులను దశలవారీగా భర్తీచేసేందుకు జాబ్ క్యాలండరును విడుదల చేస్తున్నట్లు సిఎం చెప్పారు. శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం పేరిట జాబ్ క్యాలండర్ ను ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో విడుదల చేసారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా కేవలం రాత పరీక్షల మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. పరీక్షల నిర్వహణలో ప్రఖ్యాత ఐఐటి, ఐఐఎంల సహకారంతో నూతన విప్లవానికి నాంది పలకనున్నట్లు సిఎం స్పష్టం చేసారు. ప్రభుత్వం వచ్చిన నాటి నుండి నేటి వరకు వివిధ శాఖల్లో ఖాలీగా ఉన్న 1,84,264 రెగ్యులర్ పోస్టులు, కాంట్రాక్ట్ పద్దతిలో 19,701 పోస్టులు, ఔట్ సోర్సింగ్ ద్వారా 3,99,791 పోస్టులతో సహా 6,03,756 పోస్టులను ఇప్పటివరకు భర్తీచేసినట్లు సిఎం తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంలోని అవినీతిని నిర్మూలించి పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించే విధంగా పనిచేసే ప్రతీ ఉద్యోగికి మంచి జీతాలు ప్రతి నెల 1వ తేదీన నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వచ్చేట్టుగా చేసామని, మధ్య దళారీల బెడద లేకుండా అన్ని ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఉద్యోగుల నియామకం ఒకేచోట జరిగేలా ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను ఏర్పాటుచేసిన సంగతిని సిఎం గుర్తుచేసారు. ఆర్.టి.సి ఉద్యోగుల దశాబ్ధాల కలను నెరవేరుస్తూ ఏడాదికి రూ.3,600 కోట్ల అదనపు భారాన్ని చిరునవ్వుతో స్వీకరించి ఇచ్చిన మాట ప్రకారం ఆర్.టి.సిని ప్రభుత్వంలో విలీనం చేయడమే కాకుండా 51,387 మంది ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పదవీవిరమణ వయస్సును 60 ఏళ్లకు పెంపుదల చేయడం జరిగిందన్నారు.

          జూలై మాసం నుండి వచ్చే ఏడాది మార్చి వరకు విద్య,వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి ఏ.పి.పి.యస్.సి, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, డి.ఎస్సీ వంటి నియామక సంస్థల ద్వారా ప్రతీ నెల నోటిఫికేషన్లు జారీచేస్తూ పారదర్శకంగా నియామకాలు చేపట్టనున్నట్లు సిఎం వివరించారు.ఎస్.సి,ఎస్.టి,దివ్యాంగులకు చెందిన బ్యాక్ లాగ్ 1,238 ఉద్యోగాలను 2021 జూలై మాసంలో, ఏపిపిఎస్సీ గ్రూప్-1,  గ్రూప్-2కు చెందిన 36 పోస్టులను ఆగష్ట్ లోనూ, పోలీసు శాఖలో  ఖాళీగా ఉన్న 450 పోస్టులను సెప్టెంబరులో, వైద్యశాఖలో ఖాళీగా ఉన్న 451 వైద్యులు,  అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాలను అక్టోబరులో., 5,251 పారా మెడికల్, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులను నవంబరులో, 441 నర్సు పోస్టులను డిసెంబరులో, 240 డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులను 2022 జనవరిలో , 2,000 యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో, ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను మార్చి 2022లోనూ వెరశి 10,143 పోస్టులను రానున్న 9 మాసాల్లో భర్తీచేయడం జరుగుతుందని, వాటికి సంబంధించిన జాబ్ విడుదల చేసుకోవడం జరిగిందని సిఎం తెలిపారు.

 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్రికేష్ లాఠకర్, జాయింట్ కలెక్టర్ డా. కే.శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, జిల్లా ఉపాధి కల్పన అధికారి జి. శ్రీనివాసరావు, నైపణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ గోవింద రావు, ఉద్యోగాలు పొందిన యువత తదతరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-18 12:14:01

ప్రభుత్వ భవనాలు సత్వరం పూర్తిచేస్తాం..

 ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని కొత్తపేట శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి వెల్లడించారు. శుక్రవారం నియోజకవర్గంలోని  రావులపాలెం మండలం కేతరాజు పల్లి గ్రామంలో రూ.25 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్(ఆసరా) జి.రాజకుమారితో కలిసి శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించి, వెదిరేశ్వరం గ్రామంలో రూ.17.5 లక్షలతో నిర్మించనున్న వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనానికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ సేవలు పొందడానికి కార్యాలయాల వద్ద గంటల సమయం వేచి వుండే పరిస్థితి ఉండేదని, ఆ పరిస్థితిని మారుస్తూ గతంలో కంటే భిన్నంగా, వేగంగా నాణ్యమైన ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందించాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి  సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల వద్దకే అందించడం జరుగుతుందని అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా మరింత వేగంగా సేవలు అందించేందుకు శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా రైతులకు వ్యవసాయ పరంగా అండగా నిలబడేందుకు రైతు భరోసా కేంద్రాలు, ప్రతీ పేదవానికి సకాలంలో వైద్యం అందేలా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ లకు శాశ్వత భవనాలు నిర్మించడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలో కొన్ని  పరిస్థితుల వల్ల నిర్మాణాల్లో జాప్యం జరిగిందని, ఇకనుండి నిర్మాణాల్లో తలెత్తుతున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
              ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్(ఆసరా) జి.రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న  సచివాలయ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయని అన్నారు. జిల్లాలో సచివాలయాలు, ఆర్బికే సెంటర్లు, వెల్ నెస్ సెంటర్లు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు కలిపి మొత్తం 4500 భవనాలకు సుమారు 1000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. మంజూరు కాబడిన శాశ్వత భవనాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు జిల్లాలో ఈనెల 17 వ తేదీ నుండి జూలై 2 వ తేదీ వరకు భవన నిర్మాణ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే ఈరోజు  సచివాలయం భవనం ప్రారంభం, వెల్ నెస్ సెంటర్ కు శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలో చేపట్టిన శాశ్వత భవన నిర్మాణాలను అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో మరో రెండు మూడు నెలల్లో పూర్తి చేసుకుని ప్రారంభించడానికి చర్యలు చేపట్టినట్లు జెసి తెలిపారు.
         ఈ కార్యక్రమంలో భాగంగా కేతరాజుపల్లి గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవనానికి ప్రారంభోత్సవం,వేదిరేశ్వరం గ్రామంలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్ కు భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన కార్యక్రమం జెసితో కలిసి స్థానిక శాసనసభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు వెదిరేశ్వరం గ్రామంలోని గ్రామ సచివాయాన్ని, నూతనంగా నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రం పనులను జెసి, ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల  వివరాలు నమోదు చేస్తున్న విధానం, తదితర అంశాలను గురించిజెసి  వాలంటీర్లను ఆరా తీశారు.
            ఈ కార్యక్రమంలో జడ్పి సిఇఓ ఎన్వివి సత్యనారాయణ, డ్వామా పిడి వరలక్ష్మీ, సర్పంచ్ లు అంబటి సుబ్బలక్ష్మి, బొక్కా కారుణాకరం, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, గ్రామ ప్రజలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Ravulapalem

2021-06-18 10:44:39

భూసమస్యల పరిష్కారానికే సమగ్ర భూసర్వే..

రాష్ట్రంలో భూత‌గాదాలు, భూసంబంధ స‌మస్యలు శాశ్వతంగా ప‌రిష్క రించడం ద్వారా ప్రజ‌లు భూస‌మ‌స్యల కార‌ణంగా ఎలాంటి ఇబ్బందులకు లోనుకాకూడ‌ద‌నే ల‌క్ష్యంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వై.ఎస్‌.ఆర్‌.జ‌గ‌న‌న్న భూహ‌క్కు భూర‌క్ష పేరుతో స‌మ‌గ్ర భూస‌ర్వేకు శ్రీ‌కారం చుట్టార‌ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూశాఖ మంత్రి ధ‌ర్మాన కృష్ణదాస్ అన్నారు. బ్రిటిష్ ప్రభుత్వ హ‌యాంలో భూస‌ర్వే జ‌రిగిన త‌ర్వాత రాష్ట్రంలో ఇప్పటివ‌ర‌కు భూస‌ర్వే జ‌ర‌గ‌లేద‌ని దీనివ‌ల్ల ఎన్నో స‌మ‌స్యలు ఎదుర‌వుతున్నాయ‌ని పేర్కొన్నారు. స్పష్టమైన భూరికార్డులు ఏర్పర‌చ‌డం ద్వారా భూముల అస‌లు య‌జ‌మానుల‌కు వాటిపై పూర్తిస్థాయి హ‌క్కులు క‌ల్పించి భ‌విష్యత్తులో ఎలాంటి స‌మ‌స్యల‌కు తావులేని విధంగా వాటికి ర‌క్షణ క‌ల్పించ‌డ‌మే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమ‌ని చెప్పారు. సుమారు రూ.1000 కోట్ల వ్యయంతో చేప‌డుతున్న ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిచేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని మంత్రి వెల్లడించారు. 2023 అక్టోబ‌రు నాటికి స‌మ‌గ్ర భూస‌ర్వే పూర్తిచేయ‌డానికి గ‌డువుగా నిర్ణయించామ‌న్నారు. ప‌టిష్టమైన రీతిలో స‌ర్వే జ‌రిగేందుకే మూడేళ్ల కాల‌వ్యవ‌ధిని నిర్ణయించామ‌న్నారు. స‌ర్వే ఆఫ్ ఇండియా అందించే అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో డ్రోన్లను వినియోగించి భూముల ఛాయాచిత్రాలు తీసి అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఎంతో ఖ‌చ్చితంగా భూముల హ‌ద్దుల‌ను నిర్ణయిస్తార‌ని చెప్పారు. స‌మ‌గ్ర భూస‌ర్వేలో కేవ‌లం వ్యవ‌సాయ భూముల‌కు సంబంధించి మాత్రమే కాకుండా నివాస స్థలాలు, ప్రభుత్వ భూములు, ప‌ట్టణాల్లోని నివాస స్థలాల‌కు సంబంధించి కూడా స‌ర్వే జ‌రిపి స‌మ‌గ్రమైన రికార్డులు రూపొందిస్తామ‌ని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ స‌ర్వేపై రైతుల్లో ఉన్న అపోహ‌ల‌ను, అనుమానాలు నివృత్తి చేసేందుకు గ్రామ‌స‌భ‌లు నిర్వహిస్తార‌ని, ఆ స‌భ‌ల్లో త‌మ సందేహాల‌ను నివృత్తి చేసుకోవ‌చ్చన్నారు. గ్రామాల్లో ఈ స‌ర్వే జ‌రుగుతున్న స‌మ‌యంలో రైతులంతా స‌ర్వే గురించి తెలుసుకొని ఇందులో భాగ‌స్వాములు కావ‌డం ద్వారా స‌ర్వేకు స‌హ‌క‌రించాల‌న్నారు. జిల్లాలో ఈ స‌ర్వే జ‌రుగుతున్న తీరుప‌ట్ల రెవిన్యూ మంత్రి ధ‌ర్మాన కృష్ణదాస్ సంతృప్తి వ్యక్తంచేశారు. ఇది రైతుల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మైన కార్యక్రమ‌మ‌ని ముఖ్యమంత్రి త‌న సుదీర్ణ పాద‌యాత్రలో  రైతులు ఎదుర్కొంటున్న భూసంబంధ వివాదాల స‌మ‌స్యలు తెలుసుకున్న మీద‌ట భూ స‌మ‌గ్ర స‌ర్వేకు శ్రీ‌కారం చుట్టార‌ని వివ‌రించారు. అత్యాధునిక టెక్నాల‌జీ వినియోగిస్తున్న కార‌ణంగా పొర‌పాట్లకు ఆస్కారం లేకుండా స‌ర్వే జ‌రుగుతుంద‌న్నారు.

విజ‌య‌న‌గ‌రం జిల్లా రామ‌భ‌ద్రపురం మండ‌లం మ‌ర్రివ‌ల‌స‌లో వై.ఎస్‌.ఆర్‌.జ‌గ‌న‌న్న శాశ్వత భూహ‌క్కు భూర‌క్ష కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రులు ధ‌ర్మాన కృష్ణదాస్‌, పాముల పుష్పశ్రీవాణి శుక్రవారం భూమిపూజ చేసి లాంఛ‌నంగా ప్రారంభించారు. డ్రోన్ టెక్నాల‌జీతో గ్రామానికి సంబంధించి తీసిన ఛాయాచిత్రాల‌ను వారు ఎంపి బెల్లాన చంద్రశేఖ‌ర్‌, ఎమ్మెల్యేలు శంబంగి వెంక‌ట చిన‌ప్పల‌నాయుడు, బొత్స అప్పల‌న‌ర‌స‌య్యల‌తో క‌లసి తిల‌కించారు. భూముల స‌ర్వేలో భాగంగా వినియోగించే కోర్స్ రోవ‌ర్స్‌, డిఫ‌రెన్షియ‌ల్ గ్లోబ‌ల్ పొజిష‌నింగ్ సిస్టం, ఇ.టి.ఎస్‌. ప‌రికరాల‌ను మంత్రులు తిల‌కించారు. అవి ఈ స‌ర్వేలో ఏవిధంగా ఉప‌యోగ‌ప‌డ‌నున్నాయో జాయింట్ క‌లెక్టర్‌(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్ వారికి వివ‌రించారు.

 

ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ‌శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ‌వాణి మాట్లాడుతూ రైతులు, భూ య‌జ‌మానులు త‌మ జీవిత కాలంలో క‌ష్టప‌డి సంపాదించిన భూముల‌ను వేరొక‌రు త‌ప్పుడు రికార్డులు సృష్టించి వాటిపై వివాదాలు సృష్టిస్తున్న ప‌రిస్థితుల్లో వారు ఈ వివాదాల ప‌రిష్కారం కోసం కోర్టుల చుట్టూ తిర‌గ‌లేని ప‌రిస్థితి వుంద‌ని, ఇటువంటి  స‌మ‌స్యల ప‌రిష్కార‌మే ల‌క్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ జ‌గ‌న్ ఈ స‌మ‌గ్ర భూస‌ర్వే కు శ్రీ‌కారం చుట్టార‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అస‌లైన భూయ‌జ‌మానుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని పేర్కొంటూ ఈ ప్రాజెక్టును అమ‌లు చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రజ‌లంద‌రి త‌ర‌పున ధ‌న్యవాదాలు తెలియ‌జేస్తున్నట్టు చెప్పారు. ఖాళీ భూముల‌పై కొంద‌రు ద‌ళారులు త‌ప్పుడు రికార్డులు సృష్టించి వాటిని స్వాధీనం చేసుకొనే ప్రయ‌త్నం చేస్తున్నార‌ని, అలాంటి వాటికి ఈ సర్వే చెక్ పెడుతుంద‌న్నారు. త‌ల్లికి బిడ్డపై ఎంత‌టి మ‌మ‌కారం ఉంటుందో రైతుకు కూడా త‌న భూమిపై అంత‌టి మ‌మ‌కారం ఉంటుంద‌ని, అటువంటి భూమి ఇత‌రుల పాలైతే ఎంతో మ‌నోవ్యధ చెందుతార‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 16వేల మంది స‌ర్వేయ‌ర్లకు శిక్షణ ఇచ్చి, ఎంతో అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్నివినియోగించి ఈ స‌ర్వే చేప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేద‌లంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తూ, 30 ల‌క్షల మంది ఆడ‌ప‌డుచుల‌కు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న పాల‌నలో పార్టీల‌కు, రాజ‌కీయాల‌కు అతీతంగా కార్యక్రమాలు అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రజలంద‌రి త‌ర‌పున ధ‌న్యవాదాలు చేస్తున్నట్టు డిప్యూటీ సి.ఎం. చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేద‌లంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తూ, 30 ల‌క్షల మంది ఆడ‌ప‌డుచుల‌కు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న పాల‌నలో పార్టీల‌కు, రాజ‌కీయాల‌కు అతీతంగా కార్యక్రమాలు అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రజలంద‌రి త‌ర‌పున ధ‌న్యవాదాలు చేస్తున్నట్టు డిప్యూటీ సి.ఎం. చెప్పారు.

 

జాయింట్ క‌లెక్టర్‌(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 12.43 ల‌క్ష‌ల ఎక‌రాల భూమిని  రీస‌ర్వే చేస్తున్నామ‌ని, ఈ భూమి 2 ల‌క్షల స‌ర్వే నెంబ‌ర్ల ప‌రిధిలో వుంద‌ని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 23.91 ల‌క్షల స‌బ్ డివిజ‌న్‌లు స‌ర్వే చేయాల్సి  ఉంద‌న్నారు. గ‌తంలోనూ భూముల స‌ర్వేలు జ‌రిగిన‌ప్పటికీ అత్యాధునిక ప‌రిజ్ఞానంతో స‌ర్వే నిర్వహించ‌డం, భూహ‌క్కుల‌కు ర‌క్షణ క‌ల్పించ‌డం ఈ స‌ర్వే ప్రత్యేక‌త అని పేర్కొన్నారు. భూహ‌ద్దుల‌ను ఈ స‌ర్వే ద్వారా ఖ‌చ్చితంగా గుర్తించ‌డం సాధ్యమ‌వుతుంద‌న్నారు. జిల్లాలో ఆరు నెల‌ల‌పాటు భూరికార్డుల‌ను ప్రక్షాళ‌న చేసిన త‌ర్వాతే ఈ స‌ర్వేకు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. జిల్లాలో తొలిద‌శ‌లో 499 గ్రామాల్లో డ్రోన్లతో చిత్రాలు  తీస్తున్నట్టు చెప్పారు. వ్యవ‌సాయ భూముల‌తో పాటు గ్రామ కంఠాలు, నివాస స్థలాలు కూడా స‌ర్వే చేస్తామ‌ని, ప‌ట్టణాల్లో కూడా నివాస స్థలాల‌పై స‌ర్వే చేస్తామ‌న్నారు. జిల్లాలో వంద‌శాతం ఖ‌చ్చిత‌త్వంతో స‌ర్వే పూర్తిచేస్తామ‌ని పేర్కొన్నారు.

బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గంలో ఇనాం భూముల‌కు సంబంధించి భూ స‌మ‌స్యలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వాటిపై దృష్టిసారించాల్సి వుంద‌ని స్థానిక శాస‌న‌స‌భ్యులు శంబంగి వెంక‌ట చిన‌ప్పల‌నాయుడు అన్నారు. ఈ స‌ర్వే ద్వారా ఆ స‌మ‌స్యల‌న్నీ ప‌రిష్కారం అవుతాయ‌ని భావిస్తున్నట్టు చెప్పారు.

సాగు చేస్తున్న రైతుల‌కు భూమిపై హ‌క్కు లేకుండా ఇత‌రులు న‌కిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూముల‌పై ఆధిపత్యం చెలాయించ‌కుండా ఈ స‌ర్వే దోహ‌ద‌ప‌డుతుంద‌ని గ‌జ‌ప‌తిన‌గ‌రం ఎమ్మెల్యే బొత్స అప్పల‌న‌ర‌స‌య్య అన్నారు.

ఎం.పి. బెల్లాన చంద్రశేఖ‌ర్ మాట్లాడుతూ భూయ‌జ‌మాని తాను ఎక్కడ నివసిస్తున్నా త‌న భూమి ఏ ప‌రిస్థితిలో వుందో ఎలా వుందో తెలుసుకుని నిశ్చింత‌గా వుండే ప‌రిస్థితి ఈ భూస‌ర్వే ద్వారా క‌లుగుతుంద‌ని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా  స‌మ‌గ్ర భూస‌ర్వే చేప‌ట్టక పోవ‌డం వ‌ల్ల ఎన్నో ఏళ్లుగా భూవివాదాలు ప‌రిష్కారం కాక రైతులు, భూ య‌జ‌మానులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, వాట‌న్నింటికీ ఈ స‌ర్వే పరిష్కారం చూపుతుంద‌న్నారు.

స‌ర్వే విభాగం ఏ.డి. కె.రాజాకుమార్ మాట్లాడుతూ జిల్లాలో వ‌చ్చే జూలై ఒక‌టి నుంచి ఒక్కో మండ‌లంలో ఒక్కో గ్రామంలో భూస‌మ‌గ్ర స‌ర్వే ప్రారంభిస్తామ‌న్నారు. జిల్లాలో మొత్తం 1551 గ్రామాల్లో స‌మ‌గ్ర భూస‌ర్వే చేప‌ట్టనున్న‌ట్టు తెలిపారు.

కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేష‌న్ ఛైర్మన్ మామిడి శ్రీ‌కాంత్‌, బొబ్బిలి మునిసిప‌ల్ చైర్మన్ సావు వెంక‌ట ముర‌ళీకృష్ణ‌, ఇన్ చార్జి ఆర్‌.డి.ఓ ఎస్‌.వెంక‌టేశ్వర్లు, రామ‌భ‌ద్రపురం త‌హ‌శీల్దార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-18 10:40:42

కుల ధృవీకరణ పత్రాల జారీ వేగవంతం చేయాలి..

ఎస్.సి. ఎస్.టి ల పై నమోదైన కేసుల సత్వర పరిష్కారానికి కుల ధృవీకరణ పత్రాలను వేగంగా జారీ చేయాలని సంయుక్త కలెక్టర్ (ఆసరా) జె. వెంకట రావు తెలిపారు.  ఆ మేరకు మండల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. శుక్రవారం  జూమ్  కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన  జిల్లా  విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ  సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.   ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ గత సమావేశం లో సభ్యులు కుల ధ్దృవీకరణ పత్రాల జారీ ఆలస్యం కావడం వల్లనే కేసుల పరిష్కారం ఆలస్యం అవుతోందని కమిటీ దృష్టి కి తెచ్చిన దృష్ట్యా ఆర్.డిఓ , సబ్ కలెక్టర్ ,ఎం.ఆర్.ఓ లకు సూచనలు జారీ చేయడమైందన్నారు.   సమావేశం లో సభ్యులు వివరించిన సమస్యలను సత్వరమే పరిష్కారం జరిగేలా  అధికారులు చూడాలని,  తీసుకున్న చర్యలను తిరిగి సభ్యులకు తెలియజేయాలని అన్నారు. 
ఎస్.సి., ఎస్.టి కేసులకు  60 రోజుల్లో పరిష్కారం:    జిల్లా ఎస్.పి రాజ కుమారి ఎస్.సి. ఎస్.టి ల పై నమోదైన కేసులకు అత్యంత ప్రాధాన్యత నిచ్చి పరిష్కరించడం జరుగుతోందని, 60 రోజుల్లోనే పరిష్కరించేలా చర్యలు  తీసుకోవడం జరుగుతోందని ఎస్.పి రాజకుమారి తెలిపారు.  ఐతే ఎక్కువగా తప్పుడు కేస్ లు నమోదవుతున్నాయని,  సంఘాల సభ్యులు ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని కోరారు. వాస్తవ బాధితులకు త్వరగా   న్యాయం జరగాలంటే బోగస్ కేస్ లు తగ్గాలని అన్నారు. 
ఈ సమావేశం లో  సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు  సునీల్ రాజ్ కుమార్,  అదనపు ఎస్.పి సత్యరాయణ రావు,  , డి.ఎస్.పి లు మోహన రావు, శ్రీనివాస రావు,  జిల్లా అధికారులు , ఎస్.సి, ఎస్.టి ప్రతినిధులు పాల్గొన్నారు.   తొలుత కోవిడ్ తో మరణించిన సభ్యులు పుష్పనాధం మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

Vizianagaram

2021-06-18 10:34:26

పదకోశం-మీకోసం చాలా ఉపయుక్తం..

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం  రూపొందించిన  పదకోశం - మీకోసం పుస్తకం  చాలా ఉపయుక్తంగా ఉన్నదని  రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక  శాఖ మంత్రి  ముత్తం శెట్టి శ్రీనివాసరావు  తెలిపారు.   శుక్రవారం నాడు  ఆంధ్ర విశ్వవిద్యాలయం  హిందీ భవన్  సెమినార్ హాల్ లో  ఈ పుస్తకాన్ని  ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా  ఆయన  మాట్లాడుతూ  అధికార భాషా సంఘం  కార్యాలయాన్ని  విశాఖలో  పెడతామని అన్నారు. రాజ్యసభ సభ్యులు  వి. విజయసాయి రెడ్డి  మాట్లాడుతూ  ఒక భాషలోని పదానికి మరొక భాషలో  సరియైన  అర్దాన్ని ఇచ్చేలా పదాలను  తర్జుమా చేయడం  కష్టమైన పని అని,  ఈ పదకోశం రూపకల్పన  అభినందనీయమని  అన్నారు.  ఆంధ్రవిశ్వవిద్యాలయం కులపతి ఆచార్య పి వి జి డి  ప్రసాదరెడ్డి మాట్లాడుతూ  అధికారికంగా  ఉపయోగించే  పదాలతో  పదకోశం రూపొందిం చారని   అన్నారు. అధికార భాషా సంఘం  చైర్మన్  ఆచార్య యార్ల గడ్డ లక్ష్మీ ప్రసాద్  మాట్లాడుతూ  తెలుగును పాలనా భాషగా అమలు చేసేందుకు  చేస్తున్న కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో  అధికార భాషా సంఘం సభ్యులు ఆచార్య చందు సుబ్బారావు,  ఆచార్య  షేక్ మస్తాన్, ఆంధ్రవిశ్వవిద్యాలయం రిజిష్ట్రార్, ఉపాధ్యాయులు , ఇతర అధికారులు  పాల్గొన్నారు.

Visakhapatnam

2021-06-18 10:26:50

వీడియో కాన్ఫరెన్సులు జాస్తి.. సమస్యల పరిష్కారం నాస్తి..

మహావిశాఖ నగర పాలక సంస్థలో అధికారులు హడావిడి, భూ ఆక్రమణల గుర్తింపు, వార్డు సచివాలయ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్సులకే సమయమంతా సరిపెట్టేస్తున్నారు.. రెండు, మూడేళ్లు సర్వీసు పూర్తయినా ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకొని ఇక్కడే తిష్టవేసుకొని కూర్చొంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సొంత ప్రయోజనాలకోసం సీటు కదల కుండా కూర్చోవడానికి వెచ్చించిన సమయం ప్రజల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేసిన దాఖాలు ఎక్కడా కనిపించలేదనే విషయంలో కౌన్సిల్ ఏర్పాటైన తరువాత కార్పోరేటర్లు లేవనెత్తిన సమస్యలే సాక్ష్యాలుగా మారుతున్నాయి. అంతేకాదు రాష్ట్రప్రభుత్వం వార్డు సచివాలయ వ్యవస్థను నగరపాలక సంస్థకు అనుసంధానం చేసినా నగరంలో పన్నుల వసూళ్లు పాత పద్దతి మాత్రమే అంతంత మాత్రంగానే వసూలవుతున్నాయి. వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది ప్రధాన సమయం మొత్తం అధికారుల వీడియో కాన్ఫరెన్సు సమావేశాలకే కేటాయిస్తే ఇక వారు ప్రజలకు సేవలందించే సమయెక్కడిది అనేది ఉద్యోగుల భావన.. ఈ విషయాన్ని ఆయా వార్డుల కార్పోరేటర్ల దగ్గర చెప్పుకొని బాధపడుతున్నా సందర్భాలు కూడా అధికంగానే ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాని ఇంటి, కుళాయి పన్నులు వసూలు చేసే సమయం ఎక్కడుంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇంకా ఏదైనా సమయం వుంటే ఉదయం జివిఎంసీ కమిషనర్, అడిషనల్ కమిషనర్ పర్యటనల్లోనే ఉదయం సగం సమయం అంతా అయిపోతుందని వాపోతున్నారు.. జివిఎంసీ పరిధిలోని వార్డు సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చి నవంబరు వస్తే సరిగ్గా రెండేళ్లు పూర్తవుతుంది. ఈ సమయంలో జీవిఎంసీ నగరంలో ఏ స్థాయిలో ప్రజలకు సేవలు అందించింది.. ఎన్ని రకాల సౌకర్యాలు అందిస్తున్నారు..ఇంకా ఎన్ని సౌర్యాలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు..ఈ ఆఫీస్ ఏ స్థాయిలో పనిచేస్తుంది.. ఎంత బకాయి పన్నులు వసూలు చేసిందిందీ అనే విషయాన్ని లెక్కలు వేస్తే ఏమీకనిపించని పరిస్థితి నెలకొంది. వార్డు సచివాలయాలు ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు మళ్లీ జీవిఎంసీ ప్రధాన కార్యాలయాలనికే వచ్చి పరిస్థితి వుంది. కొన్ని చోట్ల ఇంటి పన్ను కట్టడానికి ప్రజల ముందుకి వస్తున్నా..వారికి అనుకూలంగా అనుకున్న మొత్తం కమిషన్లుగా రాలేదనే సాకుతో వారి నుంచి పన్నులు కట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.. కమిషనర్, అదనపు కమిషనర్, జోనల్ కమిషనర్ల పర్యటనలో గుర్తించిన సమస్యలు ఎన్నింటికి పరిష్కారం చూపారనే విషయంలో కూడా ఇక్కడి అధికారుల వద్ద జాబితా లేనట్టే కనిపిస్తుంది. ప్రభుత్వాలు మారితే కోరుకున్న స్థానాలు కదిలిపోకుండా పైరవీలు చేసుకొని కూర్చున్న సీటునే ఏళ్ల తరబడి అంటిపెట్టుకొని ఉండటానికి ఇచ్చే ప్రాధాన్యత ప్రజా సమస్యల పరిష్కారానికి లేదనే వాదన బలంగా వినిపిస్తుంది. అదేమంటే ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలన్నీ ఎంతో కష్టపడి చేరుస్తున్నామని కాస్త గంభీరంగానే చెబుతున్నారు. అదీ కూడదంటే  జీవిఎంసీకి వ్యతిరేకంగా వచ్చిన వార్తలకు ఖండనలు ఇస్తూ చేతులు దులిపేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. అలాగని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవడంలో తేడాలు వస్తున్నాయంటే..విధి నిర్వహణ కోసం కేటాయించే సమయం కంటే వీరి ప్రసన్నం కోసం, ఉన్నసీటు కదిలపోకుండా చూసుకోవడానికే సమయం అధికంగా వెచ్చిస్తున్నారనేది ఇటీవల జరిగిన అధికారుల బదిలీలే స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికైనా జివిఎంసీ అధికారులు ప్రజా సమస్యలపై ద్రుష్టిపెడితే  బావుంటుందనేది నగరవాసుల మాట..మరి పట్టించుకుంటారో లేదో చూడాల్సిందే..!

Visakhapatnam

2021-06-18 01:47:42

విశాఖను మరింతగా అభివ్రుద్ధి చేస్తాం..

పరిపాలనా రాజధానిగా మారబోతున్న విశాఖనగరాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు, మురికివాడ రహిత విశాఖ గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని  వ్యవసాయ, కోపరేటివ్, మార్కెటింగ్ శాఖ మాత్యులు మరియు జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు కురసాల కన్నబాబు అన్నారు.  గురువారం జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఆధ్వర్యంలో పర్యాటక, సాంస్కృతిక మరియు  యువజన శాఖా మాత్యులు ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి, జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, డా. బి.వి.సత్యవతి, పెందుర్తి నియోజిక వర్గ శాసన సభ్యులు అదీప్ రాజ్,  డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ తో కలిసి జివిఎంసి చేపడుతున్నపలు  అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ రూ.3వేల కోట్లతో జివిఎంసి అభివృద్ధి పనులను చేపట్టడమైనదని, వచ్చే మార్చి నాటికి ఇది పూర్తి కావాలని కమిషనర్ ను అదేశించారు. విశాఖపట్నం ఒక అంతర్జాతీయ నగరంగా రూపొందుతున్నందున నగర ప్రణాళిక ప్రకారం అన్ని వార్డులలో అభివృద్ధిని వేగవంతం చేయాలని కమిషనర్ ను ఆదేశించారు. 850 ఎకరాల ముడసర్లోవ లో  రిజర్వాయరు ను, పార్కును ఆధునీకరించి, అభివృద్ధి పరిచేందుకు రూ.100కోట్లు మంజూరు చేశారన్నారు.    ఈ ప్రాజెక్టులో “థీం పార్కు” లో భాగంగా అన్ని సదుపాయాలతో వచ్చే ఏడాదినాటికి పూర్తి చేయాలని కమిషనర్ ను ఆదేశించారు. “అమృత్” కు సంబంధించిన ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. 

వార్డుల వారీగా ప్రణాలికలను సిద్ధం చేసి ఆయా వార్డులలో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, చేపడుతున్న ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలన్నారు. నగరంలో 11 వందలు ఖాళీ స్తాలాలను గుర్తించడమైనదని, వాటి ద్వారా జివిఎంసి కి రెవెన్యూ పెంచుకోవాలని, వచ్చిన ఆదాయంతో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. పట్టణ ప్రణాలికా విభాగం చాలా బాధ్యతతో వ్యవహరించాలని, ఆక్రమణలు, అనధికార కట్టడాలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని కమిషనర్ కు సూచించారు. గుర్తించిన ఖాళీ స్థలాల్లో ముందుగా వాకింగ్ ట్రాక్ లు ఏర్పాట్లు చేయాలన్నారు. దీనివలన ఆక్రమణలు జరగకుండా ఉంటాయన్నారు. తరువాత రక్షణ గోడలు, గ్రీన్ ఫెన్సింగు ఏర్పాటు చేసుకొని, ఖాళీ స్థలాలను ఆక్రమణకు గురికాకుండా పటిష్ట పరుచుకోవాలని కమిషనర్ ను సూచించారు. “విశాఖ పచ్చ తోరణం” పధకంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. జోనల్ వ్యవస్థను పటిష్ట పరచాలన్నారు. 

అనంతరం రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు విశాఖ నగరాన్ని మురికివాడ రహిత విశాఖగా తీర్చి దిద్దేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. విశాఖ నగరంలో 774 మురికివాడ రహిత ప్రాంతాలను గుర్తించడమైనదని అందులో, 156 ప్రైవేట్ స్థలాల్లో ఉండగా, మిగిలినవి ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయన్నారు. ఇక్కడ నివసిస్తున్న నివాసితులకు ఇళ్ళ పట్టాలను అందజేస్తామన్నారు. ఇందుకు సంబందించిన నివేదికను సిద్దం చేయవలసినదిగా జివిఎంసి కమిషనర్ ను రాజ్యసభ సభ్యులు ఆదేశించారు. గతంలో డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అందించిన ఇళ్ళకు, జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం. పధకం క్రింద ఇచ్చిన ఇళ్ళకు రిపేర్లు చేయించాలని, అందుకు ఒక్కొక్క ఇంటికి రూ.10 వేలు పభుత్వం మంజూరు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల                                    స్థలాల్లో  మురికివాడలు   ఉన్నట్లయితే  ఆయా  సంస్థలతో  చర్చలు  జరిపి వారికి  ప్రత్యామ్నాయం ఏర్పాటు 

చేయవలసినదని రాజ్యసభ  సభ్యులు కమిషనర్ ను  ఆదేశించారు. జివిఎంసిలో  ఉన్న ప్రతి జోన్ లో వెయ్యి  మందికి సరిపోయేటట్లు ఒక  కన్వెన్షన్ సెంటర్ ను కట్టించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఒక కన్వెన్షన్ సెంటర్ కు రూ.5 కోట్లు ఖర్చు అవుతుందని, మొత్తంగా 8 కన్వెన్షన్ సెంటర్లకు రూ. 40 కోట్లు ఖర్చు అవుతుందని, ఇందుకు ఎం.పి. లేడ్స్ నుండి తమవంతు నిధులను అందిస్తానని, అవసరమైతే సి.ఎస్.ఆర్. నిధులను కూడా ఏర్పటు చేసుకోవాలని కమిషనర్ కు సూచించారు. జివిఎంసి కి సంబంధించిన వాణిజ్య సముదాయాలు, కళ్యాణ మండపాలు, దుకాణాల యొక్క లీజుల వివరాలతో కూడిన నివేదికను తదుపరి సమీక్షలో సమర్పించవలసినదిగా కమిషనర్ ను ఆదేశించారు.  

అనంతరం, టూరిజం, సాంస్కృతిక, యువజనాభివృద్ధి శాఖా మాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా బీచ్ లు, గ్రీన్ బెల్టులు విశాఖ నగర నివాసితులకు మౌళిక సదుపాయాలు కల్పించే విధంగా అభివృద్ధి చేయాలన్నారు. జివిఎంసికి సంబంధించి వాణిజ్య సముదాయాలు, దుకాణాల కు సంబంధించి రెవెన్యూ వసూలు పరిశీలించి రెవెన్యూ పెంచాలన్నారు. నగరంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ కు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు నిర్ణీత సమయంలో పూర్తి చేసి ఒక మంచి నివాసిత విశాఖగా రూపొందించాలన్నారు. జివిఎంసి 98 వార్డులలో మురికివాడలు గుర్తించడమైనదని, అక్కడ నివాసితులకు జరిగిన ఎన్నికలలో ఇళ్ళ పట్టాలను ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అందుకు సంబందించిన చర్యలు త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ కు సూచించారు. భీమిలి నియోజక వర్గంలో మొక్కలు నాటాలని, పార్కులు ఏర్పాటు చేయాలని, కావలసిన మౌళిక సదుపాయాలను కల్పిస్తూ అభివృద్ధి పనులను చేపట్టాలని కమిషనర్ కు మంత్రి సూచించారు. 

అనంతరం లోక్ సభ సభ్యులు ఎం.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న ఫుట్ పాత్ లకు ఎక్కువ స్థలం కేటాయించడం వల్ల వాహనాలు రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని, ఇకపై చేపట్టబోయే రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఫుట్ పాత్ ల వెడల్పును తగ్గించి, రోడ్లు యొక్క  వెడల్పును పెంచాలని కమిషనర్ కు సూచించారు.  లేఔట్ లో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి వాటికి పన్ను విధించినట్లయితే జివిఎంసి కి  ఆర్థిక లాభం చేకూరుతుందని కమిషనర్ కి సూచించారు. అనంతరం అనకాపల్లి లోక్ సభ సభ్యులు డాక్టర్ బి. వి.సత్యవతి మాట్లాడుతూ అనకాపల్లిలోని డ్రైనేజీ నీరు పంట పొలాల్లో కలుస్తుందని, వాటికోసం కల్వర్ట్ లను కట్టించాలని కమిషనర్ కు సూచించారు. అనకాపల్లిలో శాంతి పార్కు, అన్నమయ్య పార్కు మరమ్మతులు చేసి సుందరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ కు సూచించారు.  

              అనంతరం నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ పారిశుద్ధ్య సిబ్బంది తక్కువగా ఉన్నందున పారిశుద్ధ్య పనులను పూర్తి స్థాయిలో జరగడం లేదని అందుకు కావలసిన సిబ్బందిని పొరుగు సేవల ద్వారా నియమించుకోవాలని కోరారు. సచివాలయ సిబ్బంది విధులు సక్రమంగా జరిగేటట్లు జోనల్ కమిషనర్లు పర్యవేక్షణ జరపాలన్నారు. హనుమంతవాక జంక్షన్ నుండి అడవివరం వరకు బి.ఆర్.టి.ఎస్. రోడ్డులలో మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ కు మేయర్ సూచించారు.   అనంతరం పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు అదీప్ రాజ్ మాట్లాడుతూ, పెందుర్తి నియోజకవర్గం లో ఆక్రమణలు అధికంగా ఉన్నాయని, వాటిని అదుపు చేసే చర్యలు చేపట్టాలని కమిషనర్ కు సూచించారు. నియోజకవర్గంలోని పలు వార్డులలో సమస్యలు పరిష్కరించాలన్నారు. పెందుర్తి బి.ఆర్.టి.ఎస్ రోడ్డు పూర్తి చేయాలని కమిషనర్ కు సూచించారు. 

అనంతరం డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ మాట్లాడుతూ, వార్డులలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని, చేపట్టబోయే “థీం పార్కులు” అన్ని సదుపాయాలతో అభివృద్ధి చేయాలని, ఆక్రమణలను, అనధికార  కట్టడాలను అదుపు చేసే చర్యలు చేపట్టాలని కమిషనర్ కు సూచించారు. 
అనంతరం జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన,  జివిఎంసినకు సంబంధించి జరుగుతున్న, జరగబోయే పలు అభివృద్ధి పనులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా  ప్రజా ప్రతినిధులకు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పలు అభివృద్ధి పనులను రూ.2921.57 కోట్లతో జరుగుతున్నాయని, అందులో 61 స్మార్ట్ సిటీ ప్రాజెక్టు లు, ఏ.డి.బి. ఆర్థిక నిధులతో  నాలుగు వాటర్ సప్లై మరియు ఇతర పనులు, “అమృత” పథకంలో భాగంగా మూడు వాటర్ సప్లై, మరియు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులు, ఏ. పి.యు.ఐ.ఎం.ఎల్. లో భాగంగా స్మార్ట్ సిటీ నిధులతో రెండు సివరేజ్ ప్రాజెక్టు పనులు, వేస్ట్ ఎనర్జీ పనులు జరుగుతున్నాయని ప్రజా ప్రతినిధులకు వివరించారు. 

కొత్తగా ప్రతిపాదించిన ప్రాజెక్టు పనులు రూ.5,174కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించడం అయినదని, అందులో పరిశ్రమలకు 100ఎం.ఎల్.డి డి-శాలినేషన్ ప్లాంట్, ఏలేరు నుండి జివిఎంసికి 12 టిఎంసిల నీటిని తీసుకొచ్చేటందుకు, ముడసర్లోవ లో “థీం పార్కు” ను అభివృద్ధి చేయుటకు, మరియు రిక్రెయేషన్ జోన్ అభివృద్ధి చేయుటకు.. గాజువాక, సత్యం జంక్షన్, హనుమంతువాక జంక్షన్, కార్ షెడ్ జంక్షన్ల వద్ద నాలుగు“ఫ్లై ఓవర్” లు  నిర్మించుటకు, జివిఎంసి పరిధిలో 25 “థీం పార్కు”లు ఏర్పాటు చేయుటకు, 14 వాటరు బాడీస్   అభివృద్ధి చేయుటకు, పలు రోడ్లు అభివృద్ధి చేయుటకు, 15వ ఫైనాన్స్ కమిషన్ కింద  పలు రోడ్లు, జంక్షన్ లు  అభివృద్ధి చేయుటకు, 8 కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్, కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయుటకు ప్రణాళికలు  సిద్ధంచేశామని ప్రతి ప్రజాప్రతినిధులకు కమిషనర్ వివరించారు. స్మశాన వాటికలు అభివృద్ధి చేస్తామని ఎలక్ట్రికల్ క్రిమిటోరియం ఒకటి ఏర్పాటు చేయడమైనదని, మరో మూడు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరంలో ఐదు కోట్ల రూపాయలతో రెండు లక్షల మొక్కలు నాటుతామని కమిషనర్ తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో ప్రధాన ఇంజనీరు రామకృష్ణ రాజు, అదనపు కమిషనర్లు పి. ఆషా జ్యోతి,  డా. వి. సన్యాసిరావు, పర్యవేక్షక ఇంజనీర్లు వినయ్ కుమార్, వేణుగోపాల్, కె.వి.ఎన్.రవి, శివప్రసాద్ రాజు, శ్యామ్సన్  రాజు, రాజారావు, గణేష్ బాబు, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి,  జెడి(అమృత్) విజయ భారతి, యుసిడి(పి.డి.) వై. శ్రీనివాసరావు, ఉద్యానవన శాఖ సహాయక సంచాలకులు ఎం.దామోదర రావు, డి.సి.ఆర్. పి.నల్లనయ్య, అందరు జోనల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. 

GVMC office

2021-06-17 15:31:20

వేగంగా సంక్షేమ పథకాల అమలు..

రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారని రాష్ట్ర విద్యుత్, అటవీ శాస్త్ర సాంకేతిక, పర్యావరణ శాఖ మంత్రి  బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని ఒంగోలు మండలం వలేటి వారి పాలేం గ్రామంలో భవన నిర్మాణ పక్షోత్సవాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ఈ నెల17 నుండి జులై 2 వ తేదీ వరకు గృహ నిర్మాణ పక్షోత్సవాలను ప్రభుత్వం నిర్వహించడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న గ్రామ సచివాలయాలు, రైతు భోరాసా కేంద్రాలు,విలేజీ హెల్త్ క్లినిక్స్ ,మహిళాపాల డైరీల భవనాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన పనులు ఈ భవన నిర్మాణ పక్షోత్సవాల్లో ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వలే టివారి పాలేం లో నిర్మిస్తున్న గ్రామ సచివాలయ ,రైతు భరోసా కేంద్రాలకు సిమెంట్ కాంక్రీట్ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ కృష్ణ వేణి, డి.పి.ఓ నారాయణ రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్.ఇ కొండయ్య, గ్రామ సర్పంచ్ ఎన్. ఉషారాణి, వై.సి.పి.నాయుకులు చుoడూరి రవి, సింగరాజు వెంకట్రావు, కటారి శంకర్ రావుతదితరులు పాల్గొన్నారు.

Ongole

2021-06-17 14:01:34

అనాధ పిల్లలకు అండగా ప్రభుత్వం..

విశాఖ జిల్లాలో కోవిడ్ మూలంగా తల్లితండ్రులను కాని, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన బాలలకు మహిళాభివృద్ది, శిశు సంక్షేమశాఖ అండగా వుంటుంది జిల్లా బాలల సంరక్షణ అధికారి ఏ.సత్యనారాయణ తెలిపారు. జిల్లా మహిళాశిశు సంక్షేమ సంస్థ పి.డి. సీతామహాలక్ష్మి ఆదేశాల మేరకు అటువంటి బాలల గృహాలకు వెళ్లి పరామర్శించి వారికి భరోసా కల్పిస్తున్నట్లు చెప్పారు. మధురవాడలో గల 8మంది బాలల గృహాలకు వెళ్ళి పిల్లలు యొక్క బాగోగులలో సంస్థ పాలుపంచు కుంటుందని అనాథ పిల్లల యొక్క సంరక్షకులకు తెలియజేశామన్నారు. సిబ్బంది జేసుదాసు తది తరులతో కలసి వెళ్లి వారికి సాంఘికరక్షణ, అవసరమైన తోడ్పాటు అందిస్తామని చెప్పామన్నారు.

Visakhapatnam

2021-06-17 13:49:04

రైతులకు సమాచారం అందించండి..

శ్రీకాకుళం జిల్లాలో  ఖరీఫ్ సీజనుకు సంబంధించి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు  రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ జరుగుతుందని, ఈ సమాచారాన్ని రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని  సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ వ్యవసాయ శాఖాధికారులు, మండల అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం మండల తహశీల్ధారులు, మండల వ్యవసాయాధికారులతో ఆయన వీడియో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు సమన్వయంతో పని చేసి డా.వై. యస్.ఆర్.ఉచిత పంటల బీమా పథకంపై రైతులు వినియోగించుకునేలా చూడాలన్నారు. ప్రతీ రైతు ఇ - పంటలో నమోదయ్యేలా చూడాలని, ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న తర్వాత ఎంట్రీ సరిగా ఉందా లేదా అని సంబంధిత రైతులకు చూపించాలని చెప్పారు. తద్వారా ప్రభుత్వం అందించే నష్టపరిహారం, ఆర్థిక సహాయక కార్యక్రమాలకు అవకాశం ఉంటుందని చెప్పారు. రైతులు వద్దకు వెళ్లినప్పుడు కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. ఎన్ రోల్ చేసినట్లు రైతులకు ఎకనాలెడ్జ్ మెంట్ ఇవ్వాలని తెలిపారు. స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయా భూముల్లో పండించే పంటల వివరాలను తెలియజేయాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రతీ మండలంలో గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేసినప్పటికీ జిల్లాలో కంచిలి, కవిటి, పాలకొండ, రాజాం, శ్రీకాకుళం మండలాలు కొంతమేర గ్రామసభలు నిర్వహించారన్నారు. మిగిలిన మండలాలు త్వరితగతిన పూర్తిచేయాలని, రానున్న వారం రోజులు విస్తారంగా గ్రామసభలు నిర్వహించి రైతులు నష్టపోకుండా చూడాలని ఆదేశించారు. ఖరీఫ్ సీజనుకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు పంపిణీచేయబడుతుందని   ఈ విషయాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అన్నారు. స్వంత భూమి కలిగిన రైతులే కాకుండా కౌలురైతులకు ఇది వర్తిస్తుందని, ఈ విషయాన్ని కూడా కౌలు రైతులకు చేరవేయాలన్నారు.  ఇ – క్రాప్ నమోదులో ఆన్ లైన్ లో తలెత్తిన సమస్యలను జె.సి దృష్టికి తహశీల్ధారులు తీసుకురాగా వాటిని టెక్నికల్ సిబ్బందితో మాట్లాడి పరిష్కరిస్తామని హామీఇచ్చారు.

          ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు రాబర్ట్ పాల్ , ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-06-17 13:47:10

పెండింగ్ బిల్లులు చెల్లింపు జరగాలి..

ఇండియన్ నేవి  రాంబిల్లిలో  చేపట్టిన  ఎన్ ఎ ఒ బి  ప్రాజెక్టు లో అర్హులైన  నిర్వాసితులకు, ప్రభావితులకు పెండింగ్ లో ఉన్న చెల్లింపులను సత్వరమే పూర్తి చేయాలని  జాయింట్ కలెక్టర్  ఎం .వేణుగోపాల రెడ్డి తెలిపారు.  గురువారం  స్థానిక  కలెక్టరేట్ సమావేశమందిరంలో  నేవి, రెవెన్యూ, ఇరిగేషన్, మత్స్యశాఖ అధికారులతో  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన  మాట్లాడుతూ  ఎన్ ఎ ఒ బి  ప్రాజెక్టుకు సంబంధించి  అపరిష్కృతంగా  ఉన్న అన్ని సమస్యలపై  సంబందిత అధికారులు  క్షేత్రస్థాయిలో  తనిఖీ చేసి  తక్షణమే నివేదికను సమర్పించాలని  ఆదేశించారు. గతంలో  ప్రభుత్వం ప్రకటించిన మేరకు  అర్హులైన  లబ్దిదారులెవరికైనా  చెల్లింపులు  పెండింగ్ లో ఉంటే  సత్వరమే  పరిష్కరించాలని  కోరారు.  ఈ కార్యక్రమంలో  నేవి అధికారులు కెప్టెన్ ఆదినారాయణ, కెప్టెన్  టి.రాజశేఖర్,  కెప్టెన్ ఎస్. శివకుమార్,  ఆర్ డి ఓ లు సీతారామరావు, అనిత,  ఇరిగేషన్ ఎస్ ఇ సూర్యకుమార్,  ఎన్ ఎ ఒ బి , ఎస్ డి సి  జోసెఫ్, , మత్స్యశాఖ జెడి లక్ష్మణరావు,  రాంబిల్లి,  ఎస్.రాయవరం మండలాల  తహసిల్దార్లు, ఇతర  అధికారులు పాల్గొన్నారు. 

Collector Office

2021-06-17 13:45:43

జివిఎంసీకి దివీస్ మాస్కులు వితరణ..

దివీస్ సంస్థ జివిఎంసికి 15వేల మాస్కులను వితరణ చేసింది. గురువారం కార్యాలయంలో అదనపు కమిషనర్  డా. వి. సన్యాసిరావు కు మాస్కులను వాటిని సంస్థ సిబ్బంది అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్  మాట్లాడుతూ, కరోనా సమయంలో పారిశుధ్య సిబ్బంది కోసం మాస్కులు  దివీస్ సంస్థ అందించడం అభినందనీయమన్నారు. ఇవేకాకుండా ఇంకా 5 వేల మాస్కులు త్వరలో అందజేస్తుందని తెలిపారని అన్నారు. మొత్తం 20వేలు మాస్కులు జివిఎంసికి అందిస్తుందని, ఈ మాస్కులను ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఫ్రంట్లైన్ వారియర్స్ నకు అందిస్తామని అదనపు కమిషనర్ తెలిపారు. దివీస్  సంస్థ సి.ఎస్.ఆర్ ఫండ్స్ నుంచి నిధులు కేటాయించారని, గత పన్నెండు రోజుల నుండి 12 మందికి ఉపాధి కల్పించి వారికి ఈ మాస్కులను తయారు చేయించారని తెలిపారు. సంస్థ మేనేజర్ వై.యస్.కోటేశ్వరరావు, సి.ఎస్.ఆర్. మేనేజర్ డి సురేష్ కుమార్ కు మాస్కులు అందించినందుకు అదనపు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు.  ఇదే స్ఫూర్తితో ఇంకా మరిన్ని సంస్థలు ముందుకు వచ్చి ఫ్రంట్లైన్ వారియర్స్ వారికి చేదోడుగా నిలవాలని పిలుపునిచ్చారు.  

Visakhapatnam

2021-06-17 13:42:53

కోవిడ్ బాధిత కుటుంబాలకు రుణాలు..

కుటుంబ ప్రధాన పోషకుడు కోవిడ్ కు గురై మృతి చెందిన వెనుకబడిన తరగతులకు చెందిన కుటుంబాలకు రాయితీతో కూడిన రుణాలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం చైర్మన్ శ్రికేష లాఠకర్ అన్నారు. ప్రధాన పోషణకర్త కరోనా బారిన పడి చనిపోతే కుటుంబములోని తదుపరి పోషణకర్తకు బి.సి. కార్పోరేషన్ ద్వారా నేరుగా ఎన్.బి.సి.ఎఫ్.డి.సి నిధులతో స్వయం ఉపాధి పథకాలు మంజూరు చేయడం జరుగతుందన్నారు. ఒక్కొక్క కుటుంబానికి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు స్వయం ఉపాధి పథకాలు 20 శాతం సబ్సిడీతో మంజూరు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. చనిపోయిన కుటుంబ పోషణకర్త 18 - 60 సంవత్సరముల వయసు కలిగిన వారుగా ఉండాలని, కుటుంబ సంవత్సర ఆదాయము రూ.3 లక్షలు లోపు ఉండాలని ఆయన చెప్పారు. ఆధార్ కార్డు, రేషన్, రైస్ కార్డు, కరోనా భారిన పడి చనిపోయిన మరణ ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రము కలిగి ఉండాలని ఆయన వివించారు. ప్రతిపాదిత దరఖాస్తులు ఈ నెల 22వ తేదిలోపు బి.సి. కార్పోరేషన్ కార్యాలయానికి సమర్పించాలని ఆయన కోరారు. జిల్లాలో అందరు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమీషనర్లు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. మండల, మున్సిపాలిటీలలో కరోనా బారిన పడి చనిపోయిన బిసి కుటుంబములోని సభ్యులు తక్షణమే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమీషనర్లకు ప్రతిపాదనలను అవరసరమైన ధ్రువ పత్రములతో సమర్పించాలని పేర్కొన్నారు.

Srikakulam

2021-06-17 13:39:08

పారదర్శకంగా ఫీవర్ సర్వే చేపట్టాలి..

గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల స్థాయిలో ఫీవ‌ర్ స‌ర్వేల‌ను అత్యంత క‌చ్చిత‌త్వంతో నిర్వ‌హించేలా చూడాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం జాయింట్ క‌లెక్ట‌ర్లు డా. జి.ల‌క్ష్మీశ‌, కీర్తి చేకూరి, జి.రాజ‌కుమారి త‌దిత‌రుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి.. వ‌ర్చువ‌ల్ విధానంలో జిల్లా, డివిజ‌న‌ల్‌, మండ‌ల స్థాయి అధికారులతో ప్ర‌భుత్వ ప్రాధాన్య కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల ప్ర‌గ‌తిపై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌తి వారం సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు స‌చివాల‌యాల స్థాయిలో వాలంటీర్లు, ఆశాలు ఫీవ‌ర్ స‌ర్వేను నిర్వ‌హించి, వైర‌స్ ల‌క్ష‌ణాలున్న వారిని గుర్తించాల‌న్నారు. ఫీవ‌ర్ స‌ర్వేలో నిర్ల‌క్ష్యం చూపిన 33 మంది వాలంటీర్ల‌ను ఇప్ప‌టికే తొల‌గించామ‌ని.. అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించిన సిబ్బందిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. కోవిడ్ విప‌త్తుకు సంబంధించి ఏ చిన్న నిర్ల‌క్ష్య‌మైనా పెద్ద స‌మ‌స్య‌కు దారితీస్తుంద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్ర‌స్థాయిలో త‌నిఖీలు చేసి, ఫీవ‌ర్ స‌ర్వే స‌మ‌ర్థ‌వంతంగా జ‌రిగేలా చూడాల‌ని, ఈ నెలాఖ‌రుకు పాజిటివిటీ రేటును ఒక‌టి కంటే త‌క్కువ‌కు ప‌రిమితం చేసేందుకు కృషిచేయాల‌ని సూచించారు. రోజుకు ప‌దివేల ప‌రీక్ష‌ల‌ను ఫోక‌స్డ్‌గా చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. కోవిడ్ ఆసుప‌త్రుల్లో వైద్య సేవ‌ల‌పై నిరంత‌ర ప‌రిశీల‌న‌లు కొన‌సాగించాలని.. బాధితుల‌కు నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందేలా చూడాల‌ని నోడ‌ల్ ఆఫీస‌ర్ల‌కు సూచించారు. డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ కింద పూర్తిస్థాయిలో సేవ‌లందేలా చూడాల‌ని, నాన్ ఆరోగ్య‌శ్రీ విష‌యంలో ఆసుప‌త్రులు ప్ర‌భుత్వం నిర్దేశించిన ఫీజుల‌ను మాత్ర‌మే వ‌సూలు చేసేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. 
మూడో వేవ్ ముప్పు పొంచి ఉంద‌న్న సూచ‌న‌ల నేప‌థ్యంలో ముంద‌స్తు స‌న్న‌ద్ధ‌త‌తో ఆసుప‌త్రుల్లో మౌలిక వ‌స‌తులు, సిబ్బంది నియామ‌కాలు, శిక్ష‌ణ ప్ర‌క్రియ‌కు కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్న‌ట్లు తెలిపారు. 

ప‌క్షోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేయాలి:
గ్రామ స‌చివాల‌యాలు, రైతు భ‌రోసా కేంద్రాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బ‌ల్క్ మిల్క్ యూనిట్ల శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసే ల‌క్ష్యంతో జూన్ 17 నుంచి జులై 2 వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న భ‌వ‌న నిర్మాణ ప‌క్షోత్స‌వాల‌ను ప్ర‌ణాళిక ప్ర‌కారం విజ‌య‌వంతం చేసేందుకు కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. రూ.60 ల‌క్ష‌ల నుంచి రూ.80 ల‌క్ష‌ల వ్య‌యంతో నిర్మిస్తున్న భ‌వ‌నాల‌కు సంబంధించి ప్ర‌జాప్ర‌తినిధుల స‌హ‌కారంతో జూన్ చివ‌రినాటికి 100 శాతం గ్రౌండింగ్ పూర్త‌య్యేలా చూడాల‌ని.. ఎప్ప‌టిక‌ప్పుడు పూర్త‌యిన భ‌వ‌నాలకు ప్రారంభోత్స‌వాలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. గ్రామ స‌చివాల‌యాల‌కు అనుసంధానంగా డిజిట‌ల్ లైబ్ర‌రీల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన స్థ‌ల సేక‌ర‌ణ‌కు ప్ర‌తిపాద‌న‌లు రూపొందించి, పంపాల‌న్నారు. న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు లేఅవుట్ల‌లో ఇళ్ల నిర్మాణాల‌ను శ‌ర‌వేగంగా చేప‌ట్టేలా చూడాల‌ని.. హౌసింగ్‌, రెవెన్యూ, ఆర్‌డ‌బ్ల్యూఎస్, పంచాయ‌తీరాజ్‌, విద్యుత్ త‌దిత‌ర శాఖ‌ల‌న్నీ స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి, ల‌బ్ధిదారుల‌కు అందుబాటులో ఉండి గ్రౌండింగ్ జ‌రిగేలా చూడాల‌ని ఆదేశించారు. ఖ‌రీఫ్ స‌న్న‌ద్ధ‌త‌కు సంబంధించి ఆర్‌బీకేల‌లో విత్త‌నాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉండేలా చూడాల‌ని.. ఆర్‌బీకేలు రైతుల‌కు వ‌న్‌స్టాప్ కేంద్రంగా ఉండాల‌నే విష‌యాన్ని గుర్తించి, సేవ‌లందించాల‌ని వ్య‌వ‌సాయ అధికారులు, సిబ్బందికి సూచించారు. ఈ-క్రాప్ బుకింగ్‌కు అత్యంత ప్రాధాన్య‌మిచ్చి, 100 శాతం న‌మోదు ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌న్నారు. పంట ప్ర‌ణాళిక‌, వైవిధ్యంపై స‌ల‌హా బోర్డుల స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ముంపు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేయాల‌న్నారు. 343 రైతు గ్రూపుల‌కు రూ.15 లక్ష‌ల చొప్పున ప్రాజెక్టు వ్య‌యంతో క‌స్ట‌మ్ హైరింగ్ కేంద్రాల‌ను అందుబాటులోకి తీసుకురానున్న నేప‌థ్యంలో, పెండింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. 

జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ పంట‌సాగుదారు హ‌క్కు కార్డుల (సీసీఆర్‌సీ) జారీకి సంబంధించి గ‌తంలో జారీచేసిన ల‌క్ష కార్డుల‌కు అద‌నంగా ఈసారి మ‌రో రెండు ల‌క్ష‌ల కార్డుల‌ను జారీచేసి జిల్లాను ముందు వ‌రుస‌లో నిలిపేందుకు కృషిచేయాల‌ని సూచించారు. న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్ల లేఅవుట్ల‌లో లెవిలింగ్ ప‌నులు పెండింగ్ లేకుండా చూడాల‌ని ముఖ్య‌మంగా అమ‌లాపురం, రామ‌చంద్రాపురం డివిజ‌న్లు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పెండింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల‌ని ఆదేశించారు. అదే విధంగా ఖ‌రీఫ్ స‌న్న‌ద్ధ‌త‌, 90 రోజుల్లో ఇళ్ల ప‌ట్టాల‌కు సంబంధించి కొత్త‌గా సేక‌రించాల్సిన భూమి త‌దిత‌రాల‌పై జేసీ అధికారుల‌కు మార్గ‌నిర్దేశ‌నం చేశారు. కోవిడ్ నియంత్ర‌ణ‌, నివార‌ణ చ‌ర్య‌లు; స‌చివాల‌యాల వారీగా ఫీవ‌ర్ స‌ర్వేలు, క్లినిక్‌ల నిర్వ‌హ‌ణ త‌దిత‌ర అంశాల‌పై జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి సూచ‌న‌లు చేశారు. వైఎస్సార్ చేయూత‌, బీమా త‌దిత‌ర ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌స్తుతం స‌చివాల‌యాల స్థాయిలో చేయాల్సిన ప‌నుల‌తో పాటు భ‌వ‌న నిర్మాణాల ప‌క్షోత్స‌వాల‌పై జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) జి.రాజ‌కుమారి స‌మావేశంలో వివ‌రించారు. స‌మావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, జేడీ (ఎ) ఎన్‌.విజ‌య్‌కుమార్‌, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు, ఎస్ఈ పీఆర్ బీఎస్ ర‌వీంద్ర‌, హౌసింగ్ పీడీ జి.వీరేశ్వ‌ర ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-17 13:37:33