1 ENS Live Breaking News

తర్డ్ వేవ్ పొంచిఉంది తప్పక టీకా వేయించుకోవాలి..

 క‌రోనా మూడో వేవ్ అక్టోబ‌రులో వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ప‌లు సంస్థలు, నిపుణులు చెబుతున్నందున ఈలోపే ప్రతి ఒక్కరూ టీకా వేయించుకొని క‌రోనా నుంచి ర‌క్షణ పొందాల‌ని జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ పిలుపునిచ్చారు. టీకా మాత్రమే క‌రోనా నుంచి ర‌క్షణ క‌ల్పిస్తుంద‌ని అందువ‌ల్ల నిర్లక్ష్యం వ‌హించ‌కుండా కోవిడ్ టీకా కేంద్రాల‌కు వెళ్లి టీకా వేయించుకోని వారంతా త‌క్షణ‌మే వేయించు కోవాల‌ని జిల్లా క‌లెక్టర్ సూచించారు. జిల్లాలో కోవిడ్ టీకా డోసులు అవ‌స‌ర‌మైన మేర‌కు సిద్ధంగా ఉన్నాయ‌ని ఆయా కోవిడ్ టీకా కేంద్రాల‌కు ఆదివారం వెళ్లి టీకా త‌ప్పనిస‌రిగా వేసుకోవాల‌న్నారు. ఉద‌యం 8 గంట‌ల నుంచే సిబ్బంది ఆయా కేంద్రాల్లో అందుబాటులో వుంటార‌ని పేర్కొన్నారు. జిల్లాలో 45 ఏళ్ల వ‌య‌సు దాటిన వారు, ఐదేళ్లలోపు వ‌య‌స్సుగ‌ల పిల్లల త‌ల్లులు ఎంత మంది వ‌చ్చినా టీకాలు వేసేందుకు సిద్ధంగా వున్నట్టు పేర్కొన్నారు. టీకా వేసుకోవ‌డం వ‌ల్ల మిమ్మల్ని మీరు ర‌క్షించుకోవ‌డంతోపాటు కుటుంబ స‌భ్యల‌కూ కోవిడ్ నుంచి ర‌క్షణ క‌ల్పించిన‌ట్లవుతుంద‌న్నారు. జిల్లాలో ఆదివారం నిర్వహించిన వాక్సినేష‌న్ స్పెష‌ల్ డ్రైవ్ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసిన‌ట్లు క‌లెక్టర్ పేర్కొన్నారు.

Vizianagaram

2021-06-19 06:25:02

మహా విశాఖలో తుక్కు కాలుష్యం..

మహావిశాఖను క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా ఉంచాలని, గెడ్డలు కాలువల్లో చెత్తవేయకూడదని ప్రతినిత్యం ప్రకటనలు ఊదరగొట్టే జివిఎంసి కమిషనర్ డా.స్రిజన సంస్థకే చెందిన కార్యాలయాలయాల్లోనే వాహనాల తుక్కు భారీగా పేరుకుపోతున్నా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు.  సంస్థకే చెందిన వెహికల్ గ్యారేజీ లోని చెత్తాచెదారాన్ని కాలువల్లోనే గ్యారేజీ సిబ్బంది వేస్తున్నా.. అత్యంత భారీ స్థాయిలో కాలుష్యానికి కారణమవుతున్నా పట్టించుకోకుండా పూర్తిగా పక్కన పెట్టాశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదేదో కావాలని అంటున్న మాట కాదు. నగరాభివ్రుద్ధికోసం అహర్నిసలు కష్టపడి పనిచేసే కమిషనర్ ను సంస్థలోని అధికారులు, సిబ్బందే తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పడానికి ఆధారాలతో అందిస్తున్న కధనమిది. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి చెందిన అధికార మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా ఫోటో ఆధారాలతో సహా అందిస్తున్న కధనంలో నిజమెంతుందో లాసెన్స్ బే కాలనీలోవ ఉన్న ఈ జివిఎంసీ వాహనాల గ్యారేజీని సందర్శిస్తే ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది. ఇక్కడ సంస్థకు చెందిన చాలా వాహనాలు తప్పుపట్టి పోయి ఉన్నాయి. వాటిని నిర్వీర్యం చేయడం గానీ, లేదంటే తుక్కు కింద అమ్మేయడం గానీ చేయకపోవడంతో ఈ గ్యారేజీలోని తుక్కపెద్ద ఎత్తున పేరుతకుపోతుంది. చాలా తప్పుపట్టిన చెత్తను పక్కనే వున్న పెద్ద డ్రైనేజీలో పడేస్తున్నారు ఇక్కడి సిబ్బంది. జివిఎంసీలో చెత్తను తరలించడానికి, కట్టడాల వ్యర్ధాలను తరలించడాని వినియోగించే వాహనాల కోసం ఇక్కడ గ్యారేజీని ఏర్పాటు చేశారు. అక్కడే వాహనాల రిపేరు, పట్టుబడిన వాహనాలను ఇక్కడ డంప్ చేస్తుంటారు ఈ తరుణంలో చాలా వాహనాలు తుప్పుపట్టి పోయాయి. అలా తుప్పపట్టిన వాహనాల్లో చాలా వాటికి పార్టులు కూడా మాయమయ్యాయని సమాచారం. వాటిని తప్పు లెక్కలో చూపించి కొత్తపార్టులు కొన్నట్టుగా జివిఎంసీ ఆధాయానికి కన్నం వేస్తున్నట్టుగా కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. జివిఎంసీలోవున్న చాలా విభాగాల్లో అత్యధికంగా ఖర్చుచేసే వాటిల్లో ఈ గ్యారేజి ఒకటి. మీడియా కూడా దీనిపై పెద్దగా ఫోకస్ పెట్టదు..అలా పెట్టిన మీడియాని జివిఎంసి అధికారులు, అక్కడి గ్యారేజీ సిబ్బంది ప్రశన్నం చేసుకొని వారి స్థాయిలో వారు ముడుపులు చెల్లించుకుంటారని కూడా తెలుస్తుంది. మామూళ్లు, ఖర్చులు, దొంగలెక్కలు పక్కనపెడితే ఈ గ్యారేజికి ఆనుకొని వున్న డ్రైనేజీ నేరుగా సముద్రంలోకి వెళుతుంది. ఇక్కడ వేసిన ఇనుప ముక్కలు, తప్పు తుక్కు నీటిలో కరగకుండా సముద్ర జాలాల్లోకి వెళ్లి ఆ ప్రాంతంలోని నీరు కూడా కలుషతం అవుతోంది. అసలు ఈ వెహికల్ గ్యారేజీ తుక్కును జివిఎంసి ఎందుకు పట్టించుకోవడం లేదు..ఎందుకు ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, దొంగలెక్కలు చూడటం లేదనే విషయాన్ని కాస్త లోతుగా పరిశీలిస్తే..తేడా వ్యవహారాల్లోని పర్శంటేజీలు అన్నీ ప్రధానకార్యాలయానికి వెళ్లకుండా ఉంటాయా అని చెబుతున్నారు..నగరాన్ని స్వచ్ఛంగా ఉంచాలని స్వచ్ఛభారత్ నిధులతో శుభ్రత పరిశుభ్రత చేస్తున్నట్టు నటిస్తున్న అధికారులు ఇలాంటి తుక్కు గ్యారేజీపైనా ద్రుష్టిసారిస్తే సంస్థ తరపున పెరుగుతున్న కాలుష్యం ఎంతో లెక్కతేలుతుంది. ఏ స్థాయిలో డ్రైనేజీలు కలుషితం అవుతున్నాయో గుర్తించవచ్చు. ఆ దిశగా చర్యలు తీసుకుంటారో లేదో వేచిచూడాలి..!

Visakhapatnam

2021-06-19 02:47:40

ఆరుతడి పంటలను ప్రోత్సహించాలి..

 రైతులు ఖరీఫ్, రబీ పంటలను సకాలంలో పూర్తి చేసి 50 శాతం విస్తీర్ణంలో 3వ పంటగా పప్పు ధాన్యాలు, పచ్చి రొట్టపైర్ల సాగును,  బోర్ల క్రింద వరికి బదులు లాభదాయకమైన ఆరుతడి పంటలను చేపట్టేలా ప్రోత్సహించాలని తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయ సలహా మండలి తీర్మానించింది.   శుక్రవారం జడ్పి సమావేశ మందిరంలో నూతనంగా ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం మండలి చైర్ పర్సన్ మోటూరు సాయి అధ్యక్షతన జరిగింది.  సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీతా ముఖ్య అతిధులుగా హాజరైయ్యారు.  జ్యోతి ప్రజ్వలన, ప్రార్థనాగీతాలతో సమావేశం ప్రారంభం కాగా నూతనంగా ఏర్పాటైన జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, సభ్యులకు అతిధులు అభినందనలు తెలియజేశారు. అనంతరం మండలి కన్వీనర్, జాయింట్ కలెక్టర్ డా.జి.లక్ష్మీశ రాష్ట్ర ప్రభుత్వం జిఓ ఎంఎస్ నెం.70 ద్వారా  ఏర్పాటు చేసిన జిల్లా, మండల, ఆర్.బి.కె. స్థాయి వ్యవసాయ సలహా మండళ్ల మౌళిక లక్ష్యాలను సభ్యులకు వివరించారు.

  వ్యవసాయ, ఉద్యాన, అనుబంద రంగాలలో మార్కెట్ డిమాండు, ఆగ్రో-క్లైమాటిక్ జోన్ల్ ల కనుగుణంగా లాభదాయకమైన పంటల వైవిద్యాలను రైతులలో ప్రోత్సహించేలా సపోర్ట్ ప్యాకేజిల అమలుకు ప్రభుత్వానికి సూచనలు చేయడం,  నికర వ్యావసాయిక ఆదాయలను పెంచే ఉత్తమ విధానాలపై వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా రైతులకు అవగాహన కల్పించడం, నీటి వనరుల సమర్థ వినియోగం, వ్యవసాయ ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలను విస్తరించడం, ప్రజల ఆహార బధ్రత, పౌష్టికత పెంచే పంటల సాగు ద్వారా రైతుల ఆర్థికంగా బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తుల డిమాండు, సప్లయి మద్య లోపాల సవరణ తదితర రైతు సంక్షేమ అంశాలపై జిల్లా వ్యవసాయ సలహా మండలి చర్చించి, రాష్ట్ర మండలి ద్వారా ప్రభుత్వానికి సూచనలు చేస్తుందని ఆయన తెలిపారు.  జిల్లా ఇన్చార్జి మంత్రి గౌరవ చైర్మన్ గాను, రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఆభ్యుదయ రైతు మోటూరు సాయి చైర్ పర్సన్ గాను, జిల్లా కలెక్టర్ వైస్ చైర్మన్ గాను అన్ని నియోజక వర్గాల నుండి ప్రోగ్రెసీవ్ ఫార్మర్లు 17 మందితో పాటు, జిల్లా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, జడ్పి, డిసిసిబి, డిసిఎంఎస్, వాటర్ యూజర్స్ అసోసియేషన్ల చైర్మన్లు, వ్యవసాయ, అనుబంధ రంగ శాఖల జిల్లా అధికారులుగా  జిల్లా సలహా మండలి ఏర్పాటైందని ఆయన వివరించారు.  సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ రైతు పక్షపాతిగా, రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి వినూత్నమైన ఆలోచనతో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ వేలాది మంది రైతులు సభ్యులుగా వ్యవసాయ సలహా మండళ్లను  ఏర్పాటు చేసారన్నారు.  రైతు భాగస్వామ్యంతోనే వ్యవవసాయ రంగంలో మంచి ఫలితాలు చేకూరతాయని,  నిర్ణయాలను పై స్థాయి నుండి రైతులపై రుద్దడం కాకుండా, తమకు అనువైన, ప్రయోజనకరమైన విధానాలను రైతులే నిర్ణయించుకునేలా వారి నుండి సూచనలు ఈ మండళ్ల ద్వారా స్వీకరించి  ప్రభుత్వం విధాన రూపకల్పన చేస్తుందన్నారు.  రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఉచిత పంటల భీమా, వడ్డీలేని రుణాలు, ఆర్ బి కెలు, ఇంటిగ్రేటెడ్ లాబ్ లు వంటి కార్యక్రమాల్లాగే వ్యవసాయ సలహా మండళ్లు కూడా చారిత్రాత్మకం నిలువనున్నాయన్నారు. ఈ క్రాప్ బుకింగ్ తప్పని సరి చేయడం ద్వారా ఏ పంట, ఎక్కడ, ఎంత ఉత్పత్తి ఉందో ఖచ్చితంగా నిర్థారించి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ ద్వారా రైతులకు అధిక ఆదాయం కల్పిస్తున్నామన్నారు. నూతనంగా ఏర్పాటైన వ్యవసాయ సలహా మండలి సభ్యులు తమ ప్రాంత రైతుల సమస్యలు, అవసరాలను ప్రభుత్వం దృష్టికి తేవాలని మంత్రి కన్నబాబు కోరారు. 

  రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ నిరాశా, నిస్పృహలతో వ్యవసాయం పట్ల రైతులల్లో పెరుతున్న అనాశక్తికి కారణాలను విశ్లేషించి, రైతులు విశ్వాసం, సంతోషాలతో సాగుచేపట్టేలా తిరిగి ఆకర్షితులను చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేపడుతున్న ఆదర్శ వ్యవసాయ సంస్కరణలలో భాగాంగా వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశారన్నారు. పంట వేయడానికి, వేసాక దాన్ని పండించేందుకు, పండిని పంటను అమ్ముకోవడానికి రైతులు పడుతున్న ఇక్కట్లకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు శాశ్వత ముగింపు పలుకుతాయన్నారు.  జిల్లాలో డ్రయిన్లు ప్రధాన సమస్యగా ఉన్నాయని, బోదెలు, పిల్లకాల్వల స్థాయి డ్రెయిన్ల నిర్వహణ ఆర్బికేల ద్వారా చేపట్టాలని ఆయన సూచించారు.    కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత మాట్లాడుతూ వ్యవసాయం దేశానికి వెన్నెముకని, రైతును రాజుగా చూడాలనే స్వర్గీయ డా.వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాన్ని తనయుడుగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సాకారం చేస్తున్నారన్నారు.  సాంకేతికంగా వచ్చిన అభివృద్ది వ్యవసాయ రంగ పురోగతికి తోడ్పడేలా లాబ్ లలో జరిగిన పరిశోధనలు క్షేత్రాలలో ప్రయోజనాలుగా వికసించాలన్నారు.  కరోనా కాలంలో మిగిలిన అన్ని రంగాలు ఆగినా రైతులు అన్నం పెట్టే పంటల సాగును వీడలేదని, ఈ కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం రైతులు అండగా నిలిచి ఆదుకున్నాయన్నారు. సమావేశంలో  విశిష్ట అతిధులుగా పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే డా.సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పంట వచ్చేందు 15 రోజుల ముందే ప్రారంభించాలని, డిమాండు, స్థానిక వినియోగం లేని బొండాలు వంటి  రకాలను రైతులు చేపట్టకుండా అవగాహన కల్పించాలని సూచించారు.  జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ జిల్లాలో నీటి వినియోగం ఎక్కవగా ఉండే వరి సాగునే రైతులు ఎక్కవగా ఎంచుకుంటున్నందున, నీటి సరఫరాలో ఒడిదుకులు రాకుండా గోదావరి, ఏలేరు వ్యవస్థలలో సమర్థమైన నీటి యాజమాన్యం ఉండాలని సూచించారు.  జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్ పర్సన్ మోటూరి సాయి మాట్లాడుతూ రైతు బావుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు.  రైతు సంక్షేమం కొరకు జగన్మోహనరెడ్డి చేపట్టినన్ని పధకాలు మరెక్కడా లేవని, రైతాంగంలో  క్రొత్త ఆశలు, ఆకాంక్షలను నింపుతున్నాయన్నారు.  
    
    జిల్లాలో గతంలోలా రైతులు 3 పంటలు పండించేలా ఖరీఫ్ పంటల సాగును జూలై మాసాంతంలోపున, రబీ పంటలను డిశంబరు 31 లోపున ఊడ్పులు పూర్తి చేసేలా పంట కాలాలను సవరించించుకుని మూడో పంటగా కనీసం 50 శాతం విస్తీర్ణంలో పప్పు ధాన్యాలు, పచ్చి రొట్ట పైర్లను వేయాలని కమిటీ సూచించింది. ఇందుకు ప్రస్తుత సీజనలు కోల్పయిన 15 రోజుల పంటకాలాన్ని  వెదజల్లే విధానం, డ్రమ్ సీడింగ్ విధానాల ద్వారా తగ్గించే రైతులను వ్యవసాయ శాఖ అధికారులు ప్రోత్సహించాలని మంత్రి కన్నబాబు ఆదేశించారు. బోర్ల క్రింద పంటల మార్పిడి క్రింద అపరాలు, చిరిధాన్యాల సాగు ప్రోత్సాహః  -  జిల్లాలోని 11 మెట్ట మండలాల్లోని సుమారు 21వేల హెక్టార్లలో బోర్ల క్రింద వరి సాగు జరుగుతోదని, ఈ విస్తీర్ణాన్ని పంట మార్పిడి క్రింద దశల వారీగా వరి నుంచి తక్కవ నీటితో ఎక్కవ ఆదాయం ఇచ్చే పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, చిరిధాన్యాలు, ఆయిల్ పామ్ వంటి పంటల సాగులోకి మార్చాలన మండలి సూచించింది.   రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వ్యవసాయ విద్యుత్ గా ఎకరాకు ఏడాదికి 49 వేలు సబ్సిడీ ఇస్తోందని, దీని లాభదాయకం కాని వరి సాగుకు వాడటం సముచితం కాదని, రైతులు తక్కవ నీటితో ఆధిక దిగుబడులు, ఆదాయం అందించే ఆరతడి పంటలను చేపట్టాలని మంత్రి కన్నబాబు కోరారు.  ఈ మండలాల్లో ఈ ఏడాది 25 శాతం, వచ్చే ఏడాది 40 శాతం, తదుపరి ఏడాదికి 100 శాతం బోర్ల క్రింది విస్తీర్ణాన్ని ఆరుతడి పంటల క్రింది తేవాలని, ఇందుకు అవసరమైన రాయితీలు అందిస్తామన్నారు.  మైక్రో ఇరిగేషన్ క్రింద డ్రిప్, స్ప్రింక్లర్ లకు రాయితీలు తిరిగ కల్పిస్తామని, అయితే అవి దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. 


  జిల్లాలో రైతులు ఎక్కవగా పండిస్తున్న బొండాలు రకానికి స్థానిక వినియోగం లేకపోవడం, కేరళలో డిమాండు తగ్గిపోవడం వల్ల ఈ రకం ధాన్యానికి రైతులు సరైన ధర పొందలేకపోతున్నారని, ఇటువంటి డిముం లేని రకాల స్థానంలో జిల్లా రైతులు అధిక డిమాండు, ధర పలుకుతున్న స్వర్ణ, సాంబమసూరి, శ్రీకాకుళం సన్నాలు వంటి రకాల సాగు చేపట్టేలా ఆర్బికేలు, వ్యవసాయ క్షేత్రాధికారులు రైతులను ప్రోత్సహించాలని మంత్రి కన్నబాబు సూచించారు. పొలం గట్లపై కంది పంటల సాగు, సమీకృత వ్యవసాయానికి ప్రోత్సాహం  -  జిల్లాలో 50 వేల ఎకరాల రైతుల పొలం గట్లపై కంది పంటను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదించగా,  విస్తీర్ణాన్ని కనీసం 100 ఎకరాల పొలం గట్లకు పెంచాలని మంత్రి కన్నబాబు ఆదేశించారు.  అలాగే రైతులకు బహుళ ఆదాయాలను ఇచ్చే సమీకృత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. 

  డ్రెయిన్లలో గుర్రపు డెక్క, తూడు పూడిక సమస్య పరిష్కారానికి వాటి తొలగింపు ప్రక్రియను యాన్యూవల్ మెయింటినెన్స్ (వార్షిక నిర్వహణ) కి అప్పగించి, ఎప్పటికప్పడు తొలగించే ప్రతిపాదనను ఇరిగేషన్ శాఖతో చర్చించి తగు నిర్ణయం గైకొంటామని మంత్రి కన్నబాబు తెలిపారు.    ఆలాగే బోదెలు, చిన్న కాల్వల నిర్వహణను ఆర్బికే ల క్రిందకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ సమావేశంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, వ్యవసాయ శాఖ జేడి ఎన్.విజయకుమార్, డిడిలు వి.టి.రామారావు, ఎస్.మాధవరావు,  ఉద్యాన వన శాఖ డిడి ఎస్.రామ్మెహన్, పశుసంవర్థక శాఖ జెడి డా. సూర్యప్రకాషరావు, అనుబంధ శాఖల అధికారులు,  మండలి సభ్యులు పాల్గొన్నారు. 

కాకినాడ

2021-06-18 15:10:23

ఆస్పత్రి నిర్మాణాలు వేగం పెంచాలి..

అనుకున్న లక్ష్యం కంటే ముందుగా ఆసుపత్రి భవనాల నిర్మాణాలు పూర్తవ్వాలని బి.సి సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రి రాజోలు నియోజకవర్గములోని సఖినేటిపల్లి మండలం యిదే గ్రామంలో నిర్మిస్తున్న ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యేతో  కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామస్థాయిలో వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందించాలనే లక్ష్యంతో నూతన ఆసుపత్రి భవనాలను ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. వాటిని అధికారులు దగ్గరుండి త్వరగా  నిర్మాణపనులు జరిగేలా చూడాలని ఆదేశించారు. అదే దారిలో తిరిగి వస్తుండగా కాలువలో పేరుకుని పోయిన గుఱ్ఱపుడెక్క ని ఉపాధిహామీ పధకంలో పనులు  ఎగ్జిక్యూట్ చేసి వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమములో వైద్యసిబ్బంది స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. రాజోలు సర్కిల్ యిదే స్పెక్టర్ దుర్గా శేఖర్ రెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు.

సఖినేటిపల్లి

2021-06-18 15:07:36

4,582 సచివాలయాల్లో జీరో కేసులు..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో 4,582 వార్డుల్లో శుక్రవారం నాడు ఒక కరోనా కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2,887 సచివాలయాల్లో ఒక కేసు, 2,042 సచివాలయాల్లో 2 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 9,500 సచివాలయాల్లో 2 కంటే తక్కువ కేసులు ఉన్నాయన్నారు. 900 సచివాలయాల్లో 10 కంటే ఎక్కువ కేసులు ఉన్నాయన్నారు. ఈ వార్డుల్లో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. విశాఖలో సిటీలో 1,168 కేసులు, రాజమండ్రిలో 594 కేసులు ఉన్నాయన్నారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల జాబితాలను ఆయా జిల్లా కలెక్టర్లకు అందజేశామని, ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించామన్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 67,629 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. 104 కాల్ సెంటర్ కు గడిచిన 24 గంటల్లో 1,648 ఫోన్ కాల్స్ వచ్చాయని, వాటిలో 176 కాల్స్ ఆసుపత్రుల్లో అడ్మిషన్లకు, 896 కాల్స్ వివిధ సమాచారాలకు, 248 కాల్స్ టెస్టులకు వచ్చాయని తెలిపారు. యాక్టివ్ కేసులు సంఖ్య తగ్గుతున్నా హోం ఐసోలేషన్లో ఉన్న 21,598 మందికి ఫోన్లు చేసి వారి ఆరోగ్య పరిస్థితులను ఆరా తీస్తూ మందుల వినియోగం, ఇతర విషయాలపైనా 5,196 వైద్యులు సలహాలు సూచనలు అందజేశారన్నారు. 


124 మంది తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల గుర్తింపు
కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలను రాష్ట వ్యాప్తంగా 124 మంది పిల్లలను గుర్తించామన్నారు. వారిలో 86 మంది పేరున వివిధ బ్యాంకుల్లో రూ.10 లక్షల చొప్పున నగదు డిపాజిట్ చేశామన్నారు. మిగిలిన వారి పేరున సోమవారంలోగా బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేస్తామన్నారు. రాష్ట్రంలో 2,678 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని, 185 మంది మృతి చెందారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,419 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నాయని, 966 మంది డిశ్చార్జయ్యారని తెలిపారు. 783 మందికి సర్జరీ చేశామని తెలిపారు. జూన్ 17 వ తేదీ సాయంత్రం వరకూ అంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు 9,803 అందుబాటులో ఉన్నాయన్నారు. వచ్చే వారం కేంద్రం నుంచి అంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు రానున్నాయన్నారు. 39,812 పొసకొనజోల్ ఇంజక్షన్లు, 74,035 పొసకొనజోల్ మాత్రలు అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. 

Tadepalle

2021-06-18 15:00:46

క్లాప్ తో క్లీన్ అనంతగా మారిపోవాలి..

క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో అనంత నగరపాలక సంస్థ కూడా క్లీన్ గా మారిపోవాలని నగర మేయర్ వసీం సలీమ్ అన్నారు. శుక్రవారం క్లీన్ ఆంధ్రప్రదేశ్  కార్యక్రమంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  నగర పాలక సంస్థ పరిది లో పని చేస్తున్న రిసోర్స్ పర్సన్ లకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ, మన ఇంటి పరిసరాలతో పాటు వార్డులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజలు సహకరించే విధంగా వారిని చైతన్య పరచాలన్నారు. పేరుకు పోయిన చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడంతోపాటు, నగరం మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచేలా అధికారులు, సిబ్బంది క్రుషి చేయాలన్నారు. శిక్షణ ద్వారా తెలుసుకున్న అంశాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో  డిప్యుటీ మేయర్ వాసంతి సాహితీ, మునిసిపల్ కమిషనర్ .వి.వి యస్ మూర్తి, డిప్యుటీ కమిషనర్ రమణా రెడ్డి , అనిల్ 37 వ కార్పొరేటర్, టౌన్ ప్రాజెక్ట్ అధికారి  విశ్వజ్యోతి, సిటీ మిషన్ మేనేజర్ శ్రీనివాస రెడ్డీ,  కమ్యునిటీ ఆర్గనైజర్లు, రిసోర్స్ పర్సన్ లు పాల్గొన్నారు.

Anantapur

2021-06-18 14:34:05

భక్తులందరికీ అప్పన్న లడ్డూ ప్రసాదం..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ ప్రసాదం కొరత లేకుండా చేసేందుకు దేవస్థాన అధికారులు చర్యలు చేపట్టారు. కోవిడ్ తరువాత ప్రసాద అమ్మకాలను ప్రారభించిన దేవస్థానం. వాటి సంఖ్యను రోజు రోజుకీ పెరగుతున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా పెంచుతున్నారు. శుక్రవారం ఈ మేరకు లడ్డూ తయారీ పోటు కేంద్రాన్ని ఈఓ ఎంవీ సూర్యకళ సందర్శించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు శని, ఆదివారాల్లో అధికంగా వస్తారని అందరికీ ప్రసాదం అందుబాటులో ఉండే విధంగా సరిపడినన్ని లడ్డూలు తయారు చేయాలని ఆదేశించారు.  అదే సమయంలో లడ్డూ రుచి, వాసన, బరువు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చూడాలని పోటు సిబ్బంది ఆదేశించారు. లడ్డు తయారీ విధానాన్ని స్వంయగా పరిశీలించారు. కార్యక్రమంలో ఏఈఓ రాఘవ కుమార్, ట్రస్ట్ బోర్డు సభ్యులు సూరిబాబు, దినేష్ రాజు తదితరులుల పాల్గొన్నారు.

Simhachalam

2021-06-18 14:31:45

ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలి..

కరోనా నేపథ్యంలో గ్రామాల్లో ఫీవర్ సర్వే పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. గ్రామాల్లో కరోనా నేపథ్యంలో చేపడుతున్న ఫీవర్ సర్వే ని ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి పరిశీలించాలన్నారు. ఫీవర్ సర్వేని జాగ్రత్తగా చేపట్టాలని, ఫీవర్ సర్వే లో జ్వరం, దగ్గు, జలుబు తదితర లక్షణాలు ఉన్న వారి జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలని ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను ఆదేశించారు. గ్రామాల్లో శానిటేషన్ ప్రక్రియను నిరంతరం జరిగేలా చూడాలని శానిటేషన్ సెక్రటరీలకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ, డిపిఓ పార్వతి, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ కల్యాణి, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-18 14:27:45

అప్పన్నకు రూ.లక్ష విరాళం..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారికి విశాఖకు చెందిన బాపూజీ నగర్ దంపతులు ప్రభాకర్ రెడ్డి , విజయలక్ష్మి లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. శుక్రవారం ఆలయం వెలుపల  ఈఓ ఎంవీ సూర్యకళకు ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును అందజేశారు. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ఈ మొత్తాన్ని విరాళంగా సమర్పించినట్టు దాతలు తెలియజేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలను తీసుకోవడంతో పాటు వేద పండితుల ఆశీర్వచనాన్ని కూడా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Simhachalam

2021-06-18 14:25:10

సింహాద్రి నాధునికి స్పీకర్ పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని శాసన సభాపతి తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్పీకర్ కుటుంబం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ ను రూపుమాసిపోయి ప్రజలు సాధారణ పరిస్థితి వచ్చేలా దీవించాలంటూ స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. అంతేకాకుండా స్వామివారి ఆలయ అభివ్రుద్ధికి తనవంతు క్రుషి చేస్తానని హామీఇచ్చారు. అంతకు ముందు దేవాలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనాన్ని అందించారు.  ఈఓ స్పీకర్ కుటుంబానికి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ట్రస్టుబోర్టు సభ్యులు, సూరిబాబు, దినేష్ రాజులు పాల్గొన్నారు.

Simhachalam

2021-06-18 14:22:00

3వ విడత నాడు-నేడు పూర్తిచేయాలి..

మనబడి నాడు-నేడు కింద చేపట్టిన మొదటి దశ పనులను జూన్ మూడో వారంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్సు హాలు నందు మనబడి నాడు-నేడు పనులపై జిల్లా  విద్యా, అనుబంధ రంగాల శాఖలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్వాంగసుందరంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులు పై ఉన్నదని ఆమె తెలిపారు. పది రకాల సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణం  పాఠశాలలలో ఉండే విధంగా కార్యక్రమాలు అమలు చేయాలని అధికారులను హెచ్చరించారు. తొలిదశ పాఠశాలల్లో  వివిధ పనులు రన్నింగ్ వాటర్ తో మరుగుదొడ్లు, విద్యుత్తు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, రక్షిత మంచి నీరు, విద్యార్థులకు, సిబ్బంది, ఫర్నిచర్, రిపేర్లు, గ్రీన్ చాక్ బోర్డులు, అదనపు గదులు తదితర పలు పనులపై సంబంధిత ఎస్ఈ పి ఆర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో, సంబంధిత ఇంజనీర్లతో ఆరా తీశారు. నాణ్యతలో ఎక్కడా రాజీ లేకుండా    పది రకాల సౌకర్యాలను జిల్లాలోని మొదటి విడత  నాడు నేడు కార్యక్రమం ద్వారా చేపట్టి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యారంగాన్ని జిల్లాలో సంబంధిత అధికారులు కలిసికట్టుగా కృషి చేసి ప్రథమ స్థానంలో నిలిచే విధంగా కృషి చేయాలని తెలిపారు.

జూలై నుంచి నాడు-నేడు రెండవ విడత పనులను చేపట్టాల్సి ఉంటుందని, అందువలన మొదటి దశలో అక్కడక్కడా మిగిలిపోయిన మైనర్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానోపాధ్యాయులు క్రియాశీలకంగా పని చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతుల కల్పన చేయాలన్నారు. వాల్ పెయింటింగ్స్, డిజిటల్ తరగతులు, మంచి నీటి వసతి తదితర అంశాల్లో లోపాలు ఉండకూడదన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిరి, విద్యా శాఖపై డిఈవో శామ్యూల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ, ఇంజనీర్లు శివరాం ప్రసాద్, శివ కుమార్, ఎస్ ఈ పంచాయతీ రాజ్ శాఖ భాగ్యరాజ్, ఆర్ఐఓ నాయక్,  పాలిటెక్నిక్, ప్రభుత్వ ఐ టి ఐ, ప్రిన్సిపాల్ లు, తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-18 14:19:20

మత్తు పదార్ధాల నిర్మూలనే లక్ష్యం..

తిరుపతి నగరంలో గంజాయి లాంటి మత్తు పదార్థాల వాడకాన్ని నిర్ములించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. రుపతిలో శుక్రవారం సాయంత్రం ఆయన భవాని నగర్, సప్తగిరి నగర్, అన్నారావు సర్కిల్, కేటీ రోడ్డు, గలివీధి, చిన్నబజారు వీధి, గాంధీ రోడ్డు, బండ్ల వీధి, తాతయ్య గుంట ప్రాంతాల్లో ఆయన కాలినడకన పర్యటించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా , ఎన్ని శక్తులు అడ్డు తగిలినా ఉక్కుపాదంతో తొక్కేస్తామని హెచ్చరించారు. ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్టు, లేదా బెదిరిస్తున్నట్టు తన సెల్ ఫోన్ కి కాల్ చేస్తే తగు విధంగా స్పందించి, చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.  తి
 కొంత మంది యువకులు మత్తుకు బానిసలుగా మారుతున్నారని ఆవేదన చెందారు. ఇలాంటి ఇప్పటికైనా ఇలాంటి యువకులు, చైతన్య వంతులు కావాలన్నారు.  మత్తు పదార్థాల నిర్ములన  కోసం పోలీసు యంత్రాంగం చేపడుతున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని, పోలీసు యంత్రంగం  పనితీరును  ప్రశంసించారు. స్థానికులు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలను విక్రయించే వారిపై నిఘా ఉంచి, విక్రయాల లింక్ ను తుంచి వేస్తామన్నారు. మత్తును అంతముందించే వరకు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.  గంజాయి స్థావరాలను గుర్తించి, వారి భరతం పట్టేందుకు భూమన నిత్యం నగరంలో కాలినడన .. పర్యటిస్తూ, మత్తు రాయుళ్ల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు.

Tirupati

2021-06-18 14:15:32

అలిపిరి వరకూ గరుడ వారధి..

తిరుపతిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మించాల్సి ఉందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. శనివారం జరిగే బోర్డ్ మీటింగ్ లో ఈ విషయం పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తిరుమల లో శుక్రవారం ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తిరుపతిలో  ట్రాఫిక్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గరుడ వారధిని అలిపిరి వరకు పొడిగించాలని ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి విజ్ఞప్తులు అందాయన్నారు. ఈ మేరకు తాను పరిశీలన జరిపినట్లు చైర్మన్ తెలిపారు. గరుడ వారధి ఇప్పుడు ముగిసే చోటి నుంచి  అలిపిరి వరకు నిర్మించడానికి కొత్తగా అంచనాలు తయారు చేయించేలా శనివారం బోర్డ్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి  వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించిన కళ్యాణ మస్తు సామూహిక వివాహాల కార్యక్రమాన్ని పునః ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నా, కోవిడ్ కారణంగా అమలు చేయలేకపోయామన్నారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్టీ, ఎస్సీ,బీసీ, మత్స్యకార గ్రామాల్లో 500 ఆలయాలు నిర్మించాలనే నిర్ణయం కూడా  కోవిడ్ వల్ల అమలు చేయలేక పోయామని ఆయన తెలిపారు.

 రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు అమలు చేసే అంశం మీద నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. గత ఏడాదిన్నరగా కోవిడ్ వల్ల జన జీవనం ఇబ్బందిగా తయారైనా, టీటీడీ తరపున అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రపంచ ప్రజలందరు ఆరోగ్యంగా ఉండేలా ఆశీస్సులు అందించాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ సుందరకాండ పారాయణం, విరాట పర్వం పారాయణం లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించి ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు చైర్మన్ తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాబోయే రోజుల్లో ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం చేయించే అంశం కూడా శనివారం నాటి సమావేశంలో చర్చిస్తామని ఆయన తెలిపారు.

Tirupati

2021-06-18 14:14:47

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం..

దేశ చ‌రిత్ర‌లో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో, గ‌తంలో ఏ ప్ర‌భుత్వ‌మూ చేయ‌ని విధంగా రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగాల విప్ల‌వాన్ని సృష్టించామ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి అన్నారు. కేవ‌లం రెండేళ్ల‌లోనే రికార్డు స్థాయిలో 6ల‌క్ష‌ల‌, 3వేల‌, 756 మందికి త‌మ ప్ర‌భుత్వం, ఉద్యోగాలను క‌ల్పించింద‌ని చెప్పారు. తాడేప‌ల్లిలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో, 2021-2022 సంవ‌త్స‌రానికి సంబంధించిన జాబ్ కేలండ‌ర్‌ను శుక్ర‌వారం వ‌ర్చువ‌ల్ విధానంలో ముఖ్య‌మంత్రి విడుద‌ల చేశారు. ఈ ఏడాది సుమారుగా 10,143 ప్ర‌భుత్వ‌ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  విద్య‌, వైద్యం, పోలీసుశాఖ‌ల్లో పోస్టుల భ‌ర్తీకి ప్రాధాన్య‌త‌నిస్తూ, ఎపిపిఎస్‌సి, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, డిఎస్‌సీ త‌దిత‌ర నియామ‌క సంస్థ‌ల ద్వారా ప్ర‌తీ నెలా నోటిఫికేష‌న్ల‌తో పార‌ద‌ర్శ‌కంగా నియామ‌కాలు చేప‌డ‌తామ‌ని అన్నారు. క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డ‌మే కాకుండా, ఉద్యోగుల సంక్షేమానికి ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను సిఎం వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జిల్లా నుంచి క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, జిల్లా ఉపాదిక‌ల్ప‌నాధికారి వై.ర‌వీంద్ర‌కుమార్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-18 14:08:14

ఆదివారం మెగా కోవిడ్ వేక్సిన్ డ్రైవ్..

విజయనగరం జిల్లాలో ఆదివారం మెగా వాక్సినేషన్ డ్రైవ్ జిల్లాలో చేపట్టనున్నట్టు జాయింట్ కలెక్టర్ డా.ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. 45 ఏళ్ల పైబడిన వారికి, 0-5 ఏళ్ల లోపు పిల్లలు గల తల్లులకు ఈ డ్రైవ్ లో వాక్సిన్ వేయనున్నట్లు వెల్లడించారు. ఉదయం 8 నుంచి రాత్రి వరకు జిల్లాలోని కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాలన్నింటి లో వాక్సిన్ వేస్తారని పేర్కొన్నారు. కోవిషీల్డ్ వాక్సిన్ ను వేస్తారని తెలిపారు. ఈ డ్రైవ్ లో సుమారు 50 నుంచి 60 వేల మందికి ఒకే రోజున వాక్సిన్ వేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆయా వాక్సిన్ కేంద్రాలకు వెళ్లి వాక్సిన్ వేయించుకోవాలని జె.సి. సూచించారు.

Vizianagaram

2021-06-18 14:07:21