1 ENS Live Breaking News

ఆ రైతులకు నష్టపరిహారం అందిస్తాం..

చిత్తూరు జిల్లాలోని కౌండిన్య వైల్డ్ లైఫ్ విభాగం ఉన్న ప్రాంతాలలో బారీగా ఏనుగులు సంచరిస్తున్నాయని, వాటి నుంచి ప్రజలను కాపాడేందుకు స్వల్ప వ్యవధిలో  కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తే ప్రభుత్వానికి పంపుతామని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ పేర్కొన్నారు.. గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు అటవీ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశమై  జిల్లాలో ఏనుగుల మరణాలు , రైతులకు జరిగిన నష్టం పై సమీక్షించారు. ఈ సంధర్భంగా  వెస్ట్ డి.ఎఫ్.ఓ రవి శంకర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతలైన పలమనేరు,పుంగనూరు, కుప్పం, చిత్తూరు అటవీ ప్రాంతాలను కలుపుకుంటూ సుమారు ఆరు వేల హెక్టార్ లలో కౌండిన్య ఎలీఫేంట్ జోన్ ఉందని ఈ ప్రాంతంలో 2012 లో ఎనిమిది ఏనుగులు సంచరించేవని, ప్రస్తుతం 70 నుంచి 90 ఏనుగులు ఉన్నాయని, 2013 నుండి ఇప్పటి వరకు 9 ఏనుగులు వివిధ కారణాలతో  మరణించడం జరిగిందని,  ఏనుగుల దాడులలో 10 మంది వ్యక్తులు మరణించారని, 37 ఆవులు మరణించగా, 9 మంది మనుషులను గాయ పడ్డారని తెలిపారు . పలమనేరు ప్రాంతంలో 4,610 హెక్టార్లకు గాను 3,426.8 హెక్టర్లు ఫెన్సింగ్ వేయడం జరిగిందని, మిగతా ప్రాంతంలో ఫెన్సింగ్ లేక పోవడం వల్ల ఈ ప్రాంతాలలో ఏనుగులు ఎక్కువగా సంచరించడం జరుగుతున్నదని తెలిపారు. ఇటీవల కాలంలో గ్రూపులుగా ఉన్న ఏనుగులు విడిపోవడం వల్ల అవి భయంకరంగా మారి స్వభావం మార్చుకొని దాడులకు పాల్పడుతున్నాయన్నారు. అటవీ ప్రాంతoలో అనేక చెరువులు మరియు మేతగా కొన్ని రకాల వృక్షాలు ఉన్నాయని, అయితే అప్పుడప్పుడు అటవీ ప్రాంతం సమీపంలో గల చెరుకు, వరి, అరటి, మామిడి, బీన్స్ వంటి పంటల రుచులు చూడడం వల్ల ఎక్కువగా పంటల పై దాడులు చేస్తూ అడ్డం వచ్చినప్పుడు వ్యక్తుల పై దాడులకు పాల్పడుతున్నాయన్నారు. 

ఇప్పటికే జిల్లాలో ఫెన్సింగ్ మరియు కందకాలు తవ్వడం జరిగిందని అయితే ఫెన్సింగ్ గ్యాప్ ఉన్న చోట బయటకు వస్తున్నాయని అదే విధంగా కందకాలలో కొన్ని చోట్ల రాళ్ళు రావడం వల్ల ఆపివేయడం జరిగిందని అటువంటి ప్రదేశాలలో జనావాసాల వైపు దూసుకొస్తున్నాయన్నారు. ఇటీ వల కరోనా పరిస్థితుల వల్ల జాతీయ రహదారుల పైన ట్రాఫిక్ లేక పోవడంతో  రోడ్ల పైకి కూడా వస్తున్నాయన్నారు. ఈస్ట్ డి.ఎఫ్.ఓ నరేంధిర న్ మాట్లాడుతూ కౌండిన్య ఎలిఫాంట్ జోన్ లో తిరుమల కొండలు ఉన్న శ్రీ వేంకటేశ్వర అభయా అరణ్యం, శేషాచల కొండలు కలసి ఉండడం వల్ల ఈ ప్రాంతంలో జాతీయ రహదార్లు ఉండడం వల్ల తరచూ రోడ్ల పైకి వస్తున్నాయని, ఈ ప్రాంతంలో సంచరిస్తూ మంచి ఆహారం దొరుకుతుండడo వల్ల వ్యవసాయ పొలాల పైన దాడులు చేస్తున్నాయన్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఏనుగులు ఎక్కువగా ఉండడం మన అటవీ ప్రాంతాలు ఈ ప్రాంతాలతో కలిసి ఉండడం వల్ల  అక్కడ్నుంచి మన ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నాయని తెలిపారు. ఏనుగులు  నుండి తమ పంటలను కాపాడుకోవాలని రైతులు భావించడం వల్ల ఏనుగుల పై దాడులకు వెళ్తున్నారని పలితంగా  మరణిస్తున్నారని, వీరికి నష్ట పరిహారం ఎప్పటికప్పుడు చెల్లిస్తూ న్నామన్నారు.  అయితె రైతులు నష్ట పరిహారం సరిపోదని తెలుపుతున్నారని  చెప్పారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఏనుగులు సంచరించే ప్రాంతాలలో ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానికి సంబందించి నివేధిక తయారు చేయాలని, అదే విధంగా వ్యవసాయ పంటలను కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం గురించి, ఫెన్సింగ్, కాంద కాలతో పాటు శాశ్వతమైన చర్యలకు ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు  వ్వ్యవసాయ అనుబంధ శాఖాధికారుల తో సమావేశమై ఒక వారం లోపు ప్రణాళికలు సిద్దం చేయాలని ,వాటిని పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. అదే విధంగా జాతీయ ఉపాధి హామీ కింద  అటవీ  శాఖ సమన్వయం తో పనులు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.  ఈ  సమావేశంలో ఫారెస్ట్ అధికారి వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

Chittoor

2021-06-17 09:59:00

కోవిడ్19 థర్డ్ వేవ్ ను ఎదుర్కోవాలి..

కోవిడ్ థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అంద‌రూ సిద్ధంగా ఉండాల‌ని సంయుక్త క‌లెక్ట‌ర్ ఆర్‌. మహేష్ కుమార్ వైద్యుల‌ను ఉద్దేశించి అన్నారు. ఒక‌టి ద‌శ‌లో క‌న్నారెండో ద‌శ‌లో ఎక్కువ విపత్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నామ‌ని, ఎక్కువ న‌ష్టాల‌న చ‌విచూశామ‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. గ‌త రెండు ద‌శ‌ల్లో జరిగిన ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకొని మూడో ద‌శ‌లో జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను ముందుగానే ఊహించి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్పారు. థ‌ర్డ్ వేవ్ నేప‌థ్యంలో ఒక వేళ‌ పిల్ల‌ల‌కు క‌రోనా సోకితే ఎలాంటి వైద్యం అందించాల‌నే అంశంపై మిమ్స్‌లో గురువారం నిర్వ‌హించిన ఒక రోజు అవ‌గాహ‌న స‌ద‌స్సును ఆయ‌న ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోనే విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఇలాంటి ముంద‌స్తు అవ‌గాహ‌న‌ స‌ద‌స్సు ఏర్పాటు చేయ‌టం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు. ఎలాంటి ప‌రిస్థితిని ఎదుర్కోడానికైనా వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాల‌ని, పిల్ల‌ల‌కు అందించ‌బోయే వైద్య విధానంపై అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని సూచించారు. 18 నుంచి 45 వ‌య‌సుల వారికి, 45 నుంచి 60 ఏళ్ల వ‌య‌స్సు వారికి వ్యాక్సినేష‌న్ అంద‌జేశామ‌ని గుర్తు చేశారు. 18 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌సు వారికే ఇంకా వ్యాక్సినేష‌న్ చేయ‌లేదుకాబ‌ట్టి మూడో ద‌శ‌లో వారిపై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. కావున పిల్ల‌ల ఆరోగ్యంపై త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త వ‌హించాల‌ని, ఒక వేళ వ్యాధి సోకితే ముందుగానే ల‌క్ష‌ణాలను గుర్తించేలా వైద్యులు అంద‌రిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల‌ను లేనిపోని అపోహ‌ల‌కు గురి చేయ‌వ‌ద్ద‌ని థ‌ర్డ్ వేవ్‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌టం ద్వారా వారిలో ధైర్యం నింపాల‌ని చెప్పారు. కార్య‌క్ర‌మంలో డీసీహెచ్ఎస్ డా. నాగ‌భూష‌ణ‌రావు, మిమ్స్ డైరెక్ట‌ర్ డా. భాస్క‌ర‌రాజు, స్పెష‌ల్ ఆఫీస‌ర్ హ‌రికిష‌న్ కుమార్‌, డా. వెంక‌టేశ్వ‌రరావు, వివిధ విభాగాల‌కు చెందిన ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు వైద్యులు, న‌ర్శింగ్ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-17 06:57:57

అప్పన్నకు మంత్రి వెల్లంపల్లి పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని  దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ ను రూపుమాసిపోయి ప్రజలు సాధారణ పరిస్థితి వచ్చేలా దీవించాలంటూ స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. కళ్యాణమండపాన్ని సందర్శించి శిల్పాలకు ప్రత్యేక తైలంతో శుద్ధిచేసిన కార్యక్రమాన్ని ప్రశంసించారు. అంతకు ముందు దేవాలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనాన్ని అందించారు.  ఈఓ మంత్రికి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ట్రస్టు ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు.

Simhachalam

2021-06-17 06:29:59

3వ విడత చందన అరగదీత ప్రారంభం..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారికి సమర్పించే  మూడో విడత చందనం అరగదీత ప్రక్రియ గురువారం సంప్రదాయంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ట్రస్టు ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు పాల్గొని స్వామివారి కోసం గందాన్ని అరగదీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీన జ్యేష్ట పూర్ణిమ సందర్బంగా స్వామివారికి మూడో విడత చందన సమర్పణ చేయనున్నారు. ఈనేపథ్యంలో చందనం చెక్కల అరగదీతను ఉద్యోగులు మొదలుపెట్టారు. బేడామండపంలో ఏర్పాటు చేసిన సానల ( రాళ్లు ) పై నాలుగు రోజుల పాటు ఉద్యోగులు చెక్కలను అరగదీసి పచ్చి గంధాన్ని తీస్తారు. రోజువారీ తీసిన గంధాన్ని తూకం వేసి అర్చకులు స్వాధీనం చేసుకుంటారు. వాటిని స్వామివారి భండాగారం భద్రపరిచిన గంధంలో సుగంధ ద్రవ్యాలను కలిపి జ్యేష్ట పున్నమినాడు స్వామివారికి సమర్పణ చేస్తారు. చందన సమర్పణలో భాగస్వాములు కావాలనుకునే భక్తులు అరకిలోకి రూ.10,116 ,  కిలోకి 20,116 సమర్పించుకో వచ్చునని అధికారులు ప్రకటించారు. అరకిలో చందన సమర్పణ చేసినవారికి 200 గ్రాముల చందనం చెక్క, కేజీ సమర్పించినవారికి 300 గ్రాముల చందనం ముక్కతోపాటు శేష వస్త్రం  ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. చందన సమర్పణకు ఆన్ లైన్లో సొమ్ము చెల్లించాక చిరునామా, గోత్రనామాలతో పాటు వివరాలను స్క్రీన్ షాట్ తీసి  6303800736 వాట్సప్ నంబర్ కు పంపించాలని తెలిపారు.

Simhachalam

2021-06-17 06:14:04

అప్పన్నకు ఎమ్మెల్సీ బుద్దా పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీశ్వరరావు కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రోటోకాల్ ప్రకారం దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ కుటుంబంలో త్వరలో వివాహం జరగబోతోందని, స్వామివారి ఆశీస్సులకోసం దేవాలయానికి వచ్చానని బుద్ధాతెలియజేశారు. సింహాద్రి అప్పన్నకు శుభలేక అందించానని విరించారు అంతకు ముందు అర్చకులు వేద ఆశీర్వాదాన్ని అందించారు. ఆలయ ఏఈఓ రాఘవ కుమార్ ప్రసాదాన్ని అందించారు. 

Simhachalam

2021-06-17 05:38:58

జీవిఎంసీలో అధికారుల జూ.. లకటక..!

మహావిశాఖ నగర పాలక సంస్థలో అధికారంలో వున్న సిట్టింగ్ ప్రజాప్రతినిధుల సిఫార్సులన్నీ బుట్టదాఖలవుతున్నాయి.. తమ శాఖ మంత్రి చేసిన సిఫార్సులు, టిడిపి ప్రభుత్వంలోని ఓ మంత్రికి  వర్గానికి చెందిన వారు చేసే సిఫార్సులు తప్పా.. మిగిలిన అధికార పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సిఫార్సులు చెల్లుబాటు కావడం లేదు. పదేళ్లపాటు పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారికి ఏదో సహాయం చేద్దామని చేస్తున్న సిఫార్సులను జీవిఎంసీ అధికారులు  కావాలనే తోసిపుచ్చేస్తున్నారు.. వారి మట్టుకి వారు సిఫార్సు చేస్తే ఆ పోస్టు ఖాళీగా వున్నా.. అందులో సిబ్బందిని నియమించే అవకాశం వున్నా..వారికే ఎందుకివ్వాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మీరా కాస్త గట్టిగా అడిగితే ఆ స్థానాలు ఖాళీలు లేవని..అందులో సిబ్బంది పనిచేస్తున్నారని నాయకులను ఫోన్లోనే బురిడీ కొట్టించేస్తున్నారు.. దీనితో మంత్రుల సిఫారసులకు కూడా విలువ లేకుండా పోతే ఇక్కడ ఆ అధికారులు ఉంచాలా అనే వాదన బలంగా వినిపిస్తుంది.. అంతేకాదు  కావాలనే జోనల్ కమిషనర్ క్యాడర్ స్థాయి అధికారులను స్థాయి తగ్గించి చిన్న పోస్టుల్లో డిప్యుటేషన్ వేసి కూర్చోబెట్టి బలవంతంగా విధులు చేయిస్తున్నారు ఇక్కడి అధికారులు.  జీవిఎంసీలో కొన్నిస్థానాలను, పోస్టులను ఔట్ సోర్సిగ్ ద్వారా భర్తీచేసుకునే అవకాశం వున్నప్పకిటీ కావాలనే పనిచేస్తున్న సిబ్బందికే వాటి డిప్యుటేషన్లు బాధ్యత కట్టబెడుతున్నారు. దీనితో సదరు ఖాళీలలో అర్హతులుండీ బాగా పనిచేయగల సామర్ధ్యం ఉన్నవారిని ఆ ఖాళీల్లోకి తీసుకోవాలని ప్రజాప్రతినిధులు స్వయంగా ఫోన్ చేసిన చెప్పినా ఆ ఒక్కటీ అడక్కు అనే చందాన...ఆ పోస్టు ఖాళీగా లేదండీ ఖాళీ అయితే చూద్దామని తెగేసి చెప్పేస్తున్నారు. ఒక్కో అధికారికి రెండు మూడు విభాగాలు డిప్యుటేషన్లు వేస్తున్నారు..ఆ విషయాన్ని నేరుగా డిప్యుటేషన్ విధులు నిర్వహిస్తున్న వారే సహచర ఉద్యోగుల దగ్గర చెప్పి బోరున విలపిస్తున్నారు. పనిచేసేవారికే అదనంగా డిప్యుటేషన్లు వేయడంతో ప్రభుత్వం ద్రుష్టిలో ఆ పోస్టులు బర్తీచేయకుండా, ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీచేసుకునే వీలుకూడా లేకుండా పోతుంది. చాలా కాలం తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై ఇంత వరకూ కష్టపడి పనిచేసిన వారికి ఈ ప్రభుత్వంలో కూడా మనకి ఎలాంటి సహాయం దక్కేలా లేదు అనేట్టుగా వ్యవహరిస్తున్నారు. అలాగని అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఇతర విభాగాల్లో ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం ఆయా సర్వీసుల నుంచి వచ్చేవారిని నియమిస్తున్నారా అంటే అదీలేదు.. ప్రజా ప్రతినిధుల సిఫార్సుల మేరకు రెవిన్యూ సర్వీసు కేడర్ పోస్టులో కోపరేటివ్ సర్వీసు ఉద్యోగులను నియమిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా జివిఎంసీ అధికారులు వ్యవహరిస్తున్నప్పటికీ ఏ ప్రజాప్రతినిధి నోరు విప్పే పరిస్థితి లేదు. దీనితో జీవిఎంలోని కొందరు అధికారులు తమ అధికారం, పవర్ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వద్దే చూపిస్తున్నారు. ఈ విషయం కాస్త ఇక్కడి స్థానం కోసం ఎదురు చూస్తున్న కొందరు ఐఏఎస్ ల వరకూ చేరడంతో వారు జీవిఎసీకి వైపు చూస్తున్నారని తెలిసింది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్టు సమాచారం. కాకపోతే తమ శాఖ మంత్రి తనకు పూర్తి వెన్నుదన్నుగా వున్నారనే ధీమా కూడా జివిఎంసీ అధికారుల్లో పెరిగిపోవడం కూడా చర్చనీయాంశం అవుతుంది. అధికారంలో వున్న ప్రజాప్రతినిధుల ద్వారా పనులు జరగకపోతే ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం కూడా లేకపోలేదు. కాకపోతే జిల్లా అధికారులు మంత్రుల సిఫార్సులకి విలువ ఇస్తున్నా..కేవలం జీవిఎంసిలో మాత్రం అవి చెల్లుబాటు కాకపోవడం కూడా ఇపుడు హాట్ టాపిక్ అవుతోంది..!

GVMC office

2021-06-17 04:53:00

బ్రిక్స్ సమావేశాల్లో బిఎంఎస్ కీలకం..

భారత దేశంలో బ్రిక్ సమావేశాల్లో బీఎంఎస్(భారతీయ మజ్దూర్ సంఘ్) కీలకం వ్యవహరించనుందని బిఎంఎస్, భారతీయ టెలీకాం ఎంప్లాయిస్ యూనియన్ నేషనల్ ప్రెసిడెంట్ వివిఎస్ సత్యన్నారాయణ అన్నారు. విశాఖలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జూలై నెలలో జరగనున్న బ్రిక్ సమావేశాల్లో బిఎంఎస్ అన్ని విభాగాల డెలిగేట్స్ పాల్గొంటారని అన్నారు. ఇంతటి కీలకమైన సమావేశాల్లో బీఎంఎస్ కీలకంగా వ్యవహరించడం ద్వారా దేశంలో బిఎంఎస్ ప్రాముఖ్యత మరోసారి తెలుస్తుందన్నారు. ఇప్పటికే ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం అహర్నిసలు పనిచేస్తున్న బిఎంఎస్ ఇపుడు బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనడం ద్వారా దేశంలో ఏ యూనియన్ కి దక్కని గౌరవం దక్కుతుందన్నారు. ఈ విషయంలో విశేషంగా క్రుషిచేసిన జాతీయ నాయకులు, వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న నేతలకు, డెలిగేట్స్ కు వివిఎస్ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. బిఎంఎస్ భారతదేశ యూనియన్లంటికంటే అత్యంత కీలకమనే విషయం బ్రిక్స్ సమావేశాల ద్వారా మరోసారి నిరూపణ అవుతుండటం ఆనందంగా వుందన్నారు. ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం పనిచేసే బీఎంఎస్ కి బ్రిక్స్ సమావేశాల్లో కీలకంగా వ్యవహరించడం ద్వారా తమపై మరింత బాధ్యత పెరుగనుందని వివరించారు.

Visakhapatnam

2021-06-17 02:41:17

సర్వీస్ రోడ్ పనులు పూర్తి చేయండి..

అనంతపురం లోని రాం నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ సర్వీస్ రోడ్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆర్ అండ్ బి, ట్రాన్స్ కో అధికారులకు మేయర్ వసీం సూచించారు. బుధవారం మేయర్ ఛాంబర్ లో తొలుత ఆయా విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా రాం నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తైనా సర్వీస్ రోడ్ పనులు  అర్దాంతరంగా అపి వేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి దృష్టికి తీసుకెళ్లారు. సర్వీస్ రోడ్ తోపాటు డ్రైనేజీలు పనులు కూడా చేపట్టక పోవడంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని సూచించారు. అదే విధంగా రాం నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ సర్వీస్ రోడ్ లో విద్యుత్ అధికారులు విద్యుత్ స్తంభాలు,డి పి లను మార్చక పోవడంతో రోడ్ మధ్యలో వాహనదారులకు ఇబ్బంది గా మారాయని వాటిని కూడా వెంటనే మార్చాలని సూచించారు. దీనితోపాటు నగరంలో విద్యుత్ లైన్ లకు అడ్డుగా ఉన్నాయని చెట్ల కొమ్మలను తొలగించి ఎక్కడివి అక్కడే రోడ్డుపై వదిలేసి వెళ్తున్నారని ఇకపై మీరు తొలగించిన కొమ్మలను మీరే తరలించాలని విద్యుత్ సిబ్బందికి మేయర్ సూచించారు. అనంతరం రాం నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ సర్వీస్ రోడ్ ప్రాంతంలో  మేయర్ వసీం తో పాటు నగర కమిషనర్ పివీవీఎస్ మూర్తి ట్రాన్స్ కో,ఆర్ అండ్ బి అధికారులు పర్యటించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు అనీల్ కుమార్ రెడ్డి,బాబా ఫక్రుద్దీన్,డివిజన్ కన్వీనర్ ప్రకాష్ రెడ్డి, ఎస్ సి రమేష్ చంద్ర,ఈ ఈ రామ్మోహన్ రెడ్డి,ఆర్ అండ్ బి ఈ ఈ చంద్రశేఖర్ రెడ్డి , ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏడిఈ ఉమాపతి, ఏ ఈ రవీంద్ర, కాంట్రాక్టర్ పద్మాకర్ బాబు రఘునాథ్ రెడ్డి,డి ఈ బాల సుబ్రమణ్యం,టౌన్ ప్లానింగ్ ఏసిపి రామలింగేశ్వర్,  సర్వేర్ కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-16 15:44:43

అనాధపిల్లలకు ప్రభుత్వం అండ..

కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం  విద్యుత్ గెస్ట్ హౌస్ లో కోవిడ్ తో తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు 10,00000 రూపాయలు చెక్కును  మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్ కారణంగా అనాధలైన పిల్లలను ఆదుకోవడానికి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో ఉదారంగా ఆలోచించారని అన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ  సిద్ధార్థ కౌశల్, ఐ.సి.డి.ఎస్ పి.డి.జి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు

2021-06-16 15:41:46

కోవిడ్ లో ఖైదీల బాగోగుల‌పై ఆరా..

జైళ్లలో వివిధ ర‌కాల శిక్షలు అనుభ‌విస్తున్న ఖైదీలు బాగోగుల‌పై సీనియ‌ర్ సివిల్‌ జ‌డ్జి, జిల్లా న్యాయ‌సేవాధికార సంస్థ కార్య‌ద‌ర్శి వి. ల‌క్ష్మీరాజ్యం ఆరా తీశారు. జిల్లా జైళ్ల సూప‌రింటెండెంట్ మ‌రియు జిల్లాలోని స‌బ్ జైళ్ల సూప‌రింటెండెంట్స్‌తో ఆమె బుధ‌వారం వ‌ర్చువ‌ల్ విధానంలో మాట్లాడారు. జైళ్లలో విధులు నిర్వ‌హించే సిబ్బంది, శిక్ష‌లు అనుభ‌వించే ఖైదీలు కోవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూప‌రింటెండెంట్స్‌కు సూచించారు. వివిధ రకాల శిక్ష‌లు అనుభ‌విస్తున్న ఖైదీలు క్ర‌మ శిక్ష‌ణ‌తో కూడిన మంచి న‌డ‌వ‌డిక క‌లిగి ఉండాలని ఈ సంద‌ర్భంగా ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. అనంత‌రం ఉచిత న్యాయం, బెయిల్‌, ఆహారం త‌దిత‌ర స‌దుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం హై పవర్ కమిటీ ద్వారా సబ్ జైళ్లలోని శిక్ష పడిన ఖైదీలలో అర్హులైన కొందరిని బెయిల్, ఇండెర్స్ బెయిల్ ద్వారా విడుదల చేయ‌టం గురించి చ‌ర్చించారు. జిల్లాలో ఐదుగురు బెయిల్పై విడుదలకు అర్హ‌త సాధించార‌ని గుర్తు చేశారు. కార్య‌క్ర‌మంలో జిల్లా సబ్ జైళ్ల అధికారి మధుబాబు, విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలి, చీపురుప‌ల్లి, పార్వతీపురం సబ్ జైళ్ల సూపరింటెండెంట్‌లు టి. దుర్గారావు, ఎస్.కె. మదీన, కృష్ణ‌మూర్తి, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-16 15:26:10

నాడు-నేడు పనులు వేగవంతం చేయాలి..

నాడు - నేడు కార్యక్రమం కింద అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో చేపట్టిన పనులు వేగవంతం చేసి పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు.  బుధవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నాడు - నేడు కార్యక్రమం కింద ఆస్పత్రులలో చేపట్టిన పనుల పురోగతిపై జిల్లా వైద్య అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో  జేసీ కీర్తి చేకూరి సమీక్షించారు.జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లకు వచ్చే ప్రజలకు  పూర్తిస్థాయిలో అన్ని సేవలు అందించే విధంగా ఆసుపత్రులలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. పనులలలో నాణ్యత ప్రమాణలను మరింత మెరుగుపరుచుకుని నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ కు జిల్లాలో ఉన్న అన్ని ఆసుపత్రులు స్థానం సంపాదించి విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.సమర్థవంతమైన ఐఇసి, సిగ్నేజీలు, ల్యాండ్‌స్కేప్ మొదలైన వాటిని ఉపయోగించడం ద్వారా  అన్ని పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలలో నాణ్యతను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. కె వి ఎస్ గౌరీశ్వర రావు, ఇతర వైద్య అధికారులు,ఆర్‌అండ్‌బి, ఎపిఎంఐఎస్‌డిసి, ఎన్‌హెచ్‌ఎం, జిల్లా నాణ్యత బృందం, మండల అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-16 15:19:29

ఇంటి పోషకుడికి భీమా కల్పించాలి..

వైఎస్సార్ బీమా పథకానికి సంబంధించి రైస్ కార్డు కలిగిన ప్రతి కుటుంబ పోషకుడికి బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు.  బుధవారం అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు,  డిఆర్డిఎ పిడి లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పించనున్నామన్నారు. బీమా సౌకర్యానికి అర్హులు , వారి నామినీల నుంచి బయోమెట్రిక్ డేటా సేకరించాలన్నారు.   జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ 18 నుండి 50 సంవత్సరాలు ఉన్న వారు సాధారణ మరణం చెందితే లక్ష రూపాయలు, 18 నుండి 70 సంవత్సరాలు కలిగి ప్రమాద వశాత్తూ మరణిస్తే వారికి రూ.5 లక్షలు బీమా సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని రూపొందించిందని తెలిపారు. వాలంటీర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్ లు పారదర్శకంగా సర్వే చేసి పది రోజుల్లోగా ఆన్లైన్ లో బీమా హక్కుదారులు, నామినీల వివరాలు నమోదు చేయాలన్నారు. జూలై ఒకటవ తేదీ నుండి అమలు కానున్న వైయస్సార్ చేయూత లో మిగిలిన వారి వివరాలను త్వరతగతిన నమోదు చేయాలని ఆదేశించారు.  ఈ సందర్భంగా బీమా హక్కు దారులతో పాటు నామినీల నుంచి కూడా బయోమెట్రిక్ వివరాల సేకరించడంలో ఇబ్బందులున్నాయని డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి విన్నవించారు. చాలా సందర్భాల్లో నామినీలు ఒక చోట, బీమా లబ్ది దారులు ఒక చోట ఉండటం వల్ల ఇద్దరి వివరాలు సేకరించడం సమస్యగా మారిందన్నారు. కార్యక్రమంలో డీపీఎం సత్యనారాయణ తదితరులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. 

Anantapur

2021-06-16 15:10:23

ఆలయ భూములు పరిరక్షిస్తాం..

 రాష్ట్రంలోని దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం నాడు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో దేవాదాయ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  దేవాదాయ శాఖకు చెందిన  ఆస్తులు, భూముల ద్వారా మరింత ఆదాయం లభించే విధంగా పారదర్శకంగా ఉండే లీజు విధానాన్ని తీసుకువస్తామని అన్నారు. అన్యాక్రాంతం అయిన భూములను తిరిగి శాఖ ఆధీనంలోకి తెస్తామని అన్నారు. భూములకు ఫెన్సింగ్ వేయించి ఆక్రమణలను నివారిస్తామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని భూములను కామన్ గుడ్ ఫండ్ నిధులతో లేదా అవసరమైతే పీపీపీ విధానంలో పరిరక్షిస్తామని చెప్పారు. మాన్సాస్ ట్రస్టు నిర్వహణ పారదర్శకంగా లేదని, అకౌంట్లను ఆడిట్ చేయిస్తామని తెలిపారు. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మరియు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆస్తుల లీజు విధానాన్ని మెరుగు పరచాలని అన్నారు.  పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతామని తెలిపారు.

రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని, చట్టవిరుద్ధంగా ఇతరుల ఆధీనంలో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ దేవాదాయ భూముల పరిరక్షణకు రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ, బివి సత్యవతి, జి.మాధవి, విప్ బూడి ముత్యాల నాయుడు, శాసనసభ్యులు అదీప్ రాజ్, కరణం ధర్మశ్రీ, కె.భాగ్యలక్ష్మి, జి.అమర్ నాథ్, ఉమా శంకర గణేష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్, కమీషనర్ అర్జున రావు, జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, ఆర్డీవో లు కిషోర్, సీతారామారావు, లక్ష్మీ శివ జ్యోతి, అనిత, దేవాదాయ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-06-16 15:08:13

అమూల్ కిఏర్పాట్లు పూర్తిచేయాలి..

అమూల్ ప్రాజెక్టు అమలుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) చాంబర్లో జిల్లాలో అమూల్ ప్రాజెక్టు అమలు నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమూల్ ప్రాజెక్ట్ ను అమలు చేస్తోందని, ఈ నేపథ్యంలో అమూల్ ప్రాజెక్ట్ కింద జిల్లాలో పాల సేకరణ సజావుగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో హిందూపురం, అనంతపురం, కదిరి క్లస్టర్ లను అమూల్ ప్రాజెక్టు అమలు కోసం గుర్తించడం జరిగిందని, ఆయా క్లస్టర్ల వివరాలను అమూల్ టీం వారు హెడ్ ఆఫీస్ కి పంపించడం జరిగిందన్నారు. జిల్లాలో గుర్తించిన మూడు క్లస్టర్లలో ఏ క్లస్టర్ బాగుంటుంది అనేది అమూల్ టీం ఎంపిక చేస్తారని, ఎంపిక చేసిన క్లస్టర్ లో రూట్లు ఫైనలైజ్ అయ్యాక సంబంధిత క్లస్టర్ లోని గ్రామాల్లో మహిళా డైరీ సమాఖ్య సంఘాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా పాలను సేకరించడం జరుగుతుందన్నారు. అమూల్ ప్రాజెక్టు అమలు విషయమై రెండు రోజుల్లోగా సమగ్ర సమాచారం అందించాలని అధికారులను జెసి ఆదేశించారు. అమూల్ ప్రాజెక్టు అమలుపై డిఆర్డిఎ, డ్వామా, పశుసంవర్ధకశాఖ, డైరీ శాఖ, డిప్యూటీ కోపరేటివ్ ఆఫీసర్ లు కోర్ టీంగా ఉంటారని, వారందరూ సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ జెడి వెంకటేష్, డిప్యూటీ డైరెక్టర్ స్వరూపారాణి, హిందూపురం, పెనుగొండ, అనంతపురం, ధర్మవరం డిప్యూటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-16 14:08:05

నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలి..

శక్తి వంచన లేకుండా పని చేసి లక్ష్యాన్ని చేదించాలని వ్యవసాయ శాఖ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ పై జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీరాములు నాయుడు లతో కలసి సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఈ క్రాప్ ఖచ్చితంగా అమలు చేసి తీరాలన్నారు. ఈ క్రాప్ కు సంబంధించి వివరాలను  టం టం, సోషల్ మీడియా, తదితర వాటి ద్వారా రైతులకు తెలియజేయాలన్నారు. రైతులు వద్దకు వెళ్లినప్పుడు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎన్ రోల్ చేసినట్లు రైతులకు ఎకనాలెడ్జ్ మెంట్ ఇవ్వాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పరిశీలించి ఆయా భూముల్లో ఏ ఏ పంటలు ఉన్నాయో తెలియజేయాలన్నారు.  జెసి సుమిత్ కుమార్ మాట్లాడుతూ ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న తర్వాత ఎంట్రీ సరిగా ఉందా లేదా అని సంబంధిత రైతులకు చూపించాలని చెప్పారు. ప్రైస్ మోనిటరింగ్ కమిటీ కు సంబంధించి వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల పై జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్  వివరించారు. జిల్లా స్థాయిలోనే ధరలను నిర్ణయించాలని కమీషనర్ చెప్పారు. 

రైతులకు ప్రొవిజనల్ గా మంజూరు చేయాలని ఎడిలను కమిషనర్ అరుణ్ కుమార్ ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ధరలు సరి చూసుకుని రైతులకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.   ట్రాక్టర్ కంపెనీలతో  సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గాల్లో   ఇంటిగ్రేటెడ్ లేబ్స్ త్వరితగతిన పూర్తిచేయాలని కమిషనర్ అరుణ్ కుమార్ ఆదేశించారు. నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో వివరాలను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సింటెక్స్ వాటర్ ట్యాంక్ లు,. ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. రణస్థలం, రాజాం, ఆముఉదాలవలస, కొత్తూరు మండలాల నియోజక వర్గాల ఆగ్రో లేబ్స్ జూలై 8 నాటికి అందజేయనున్నట్లు సంబంధిత డిఈ చెప్పారు.  మిగిలిన వాటిని ఆగస్టు నాటికి అందజేయనున్నట్లు తెలిపారు.

విత్తనాలు పంపిణీలో సమస్యలు లేకుండా చూడాలని ఎడిలను ఆయన ఆదేశించారు.వ్యవసాయ మందులు కనీసం రైతు భరోసా కేంద్రాల వద్ద కనీసం 5 టన్నులు పెట్టుకోవాలన్నారు. ఎరువులు, పురుగు మందులు, తదితరమైన అన్ని రకాల మందులు ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ డిడి పాల్ రాబర్ట్ కమిషనర్ కు వివరించారు. ఆర్.బి.కె. ల్లో వ్యవసాయ సంబంద ఎరువులు, మందులు కొనుగోలు చేస్తే రైతులకు ఒక భరోసా ఉంటుందని కమీషనర్ చెప్పారు.

జిల్లాలో పండించే పంటలు గూర్చి జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ కమిషనర్ కు వివరించారు. కలుపు నివారణ మందులు, తదితర పోస్టర్ లను విడుదల చేశారు.  ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్, వ్యవసాయ శాస్త్రవేత్త పివి సత్యనారాయణ, వంశధార ప్రాజెక్టు ఎస్ఈ డి. తిరుమలరావు, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాబర్ట్ పాల్,    వ్యవసాయఆగ్రోస్ డిఎం కె. జగన్ మోహన్ రావు హార్టీ కల్చర్  ఎ.డి.,  రాగోలు వ్యవసాయ కేంద్రం ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-16 13:59:41