1 ENS Live Breaking News

ఆక్వారైతులు మోసపోకూడదు..

ఆక్వా రైతులు మోసపోకుండా చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి లాఠకర్ మత్య్స శాఖ జెడి ని ఆదేశించారు.  గురువారం జిల్లా స్థాయి చేపలు, రొయ్యల చెరువుల స్క్రూటిని అమలు చేయు కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ హాలులో జెసి సుమిత్ కుమార్ తో కలసి నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి నీటి చేపలు పెంచే ప్రాంతాలను మరింత పెంచే విధంగా రైతులకు అవగాహన పరచాలని తెలిపారు. మత్స్యకారులకు అవసరమైన యాంత్రీకరణ పరికరాలు ఉన్నాయా లేదా అని జెడి అడుగగా మెటీరియల్ సరఫరా చేసేందుకు డీలర్లు ఉన్నట్లు జెడి వివరించారు. జిల్లాలో కోస్టల్ ప్రాంతం ఎక్కువగా ఉన్నందు వలన మత్య్స కారులకు అవసరమైన పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  చేప పిల్లల పెంచేందుకు ఆక్వా రైతులకు అధికంగా సరఫరా చేయాలని సూచించారు. ఇంకా ఏమి చేస్తే బాగుంటుందని రైతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. పంపిణీ చేస్తున్న చేపల ఆహారం నాణ్యమైనదిగా ఉందో లేదో పరిశీలిస్తూ ఉండాలని ఆదేశించారు. చేపలు, రొయ్యలకు తరచు ల్యాబ్ లో పరీక్షలు చేస్తూ ఉండాలని ఆదేశించారు.  చేపలు, రొయ్యలు చెరువుల కోసం  రైతులు సచివాలయాలు ద్వారా ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండల స్థాయిలో చేపలు, రొయ్యలు చెరువులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన వాటిని జిల్లా స్థాయి కమిటీ లో 107 చెరువులకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మీపతి, వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్, ఇరిగేషన్ డిఇ, మత్య్స శాఖ అధికారులు, మత్య్స కార రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-17 13:28:32

100% ఈ-క్రాపింగ్ నమోదు చేయాలి..

అనంతపురం  జిల్లాలో ఈ క్రాపింగ్ 100% నమోదు చేయాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు.  గురువారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు వ్యవసాయ మరియు అనుబంధ రంగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలకు ఆస్కారం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను అందించాలన్నారు. . విత్తనాలు, ఎరువులు అమ్మే దుకాణాలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రతి ఎకరంలోని పంట వివరాలు ఈ క్రాపింగ్ లో నమోదు చేయాలన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వంగడాల పై రైతులకు అవగాహన చేపట్టేలా మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ క్రాపింగ్ నిర్వహించే ఉద్యోగులకు మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణం పనులను  వేగవంతంగా పంచాయతీ రాజ్ శాఖతో సమన్వయం చేసుకుని త్వరిత గతిన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. 

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నిర్దేశించిన గడువు ప్రకారమే సమగ్ర విచారణ జరిపి త్వరిత గతిన నివేదిక అందించి రైతు కుటుంబాలకు ఆసరా కల్పించాలన్నారు.  ప్రతి గ్రామంలో బ్యాంకులకి సంబంధించిన అడ్వైజర్ కలిగే ఉండేవిధంగా వ్యవసాయ అధికారులు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన వివిధ శాఖలు వారివారి శాఖలకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ, ఉద్యాన శాఖ డీడీ సతీశ్, ఏపీ ఎమ్.ఐ.పీ పీడీ ఫిరోజ్ ఖాన్, పట్టు పరిశ్రమ జేడీ పద్మావతి, పశుసంవర్థక శాఖ వై.వేకంటేశు మరియు ఇతర అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Anantapur

2021-06-17 13:24:25

కమిషనర్ చెప్పడానికే కోవిడ్ నిబంధనలు..

కరోనా వైరస్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న తరుణంలో మహావిశాఖ నగరపాలక సంస్థ అధికారులు చెప్పడానికే శ్రీరంగ నీతులు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.. పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో కరోనా కేసులు తగ్గమంటే ఎలాతగ్గుతాయో జీవిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజనతో పాటు గురువారం సీఎంహెచ్ఓ జోనల్ కమిషనర్ ఫణిరాం, వెటర్నరి డాక్టర్ కిషోర్, కార్యనిర్వాహక ఇంజినీర్లు గణేష్ బాబు, చిరంజీవి, శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజినీర్లు కనీసం ఒక మీటరు సామాజిక దూరం కూడా పాటించకుండా చేస్తున్న పర్యటనలపై విమర్శలు పెల్లుభికేలా చేశాయి. ఈ వార్తలోని ఫోటో చూస్తే మీకే అర్ధమవుతుంది కరోనా నిబంధన ప్రకారం ఏ స్థాయిలో భౌతిక దూరం పాటించేస్తున్నారో.. ఆదివారం చికెన్, మటన్ దుకాణాల దగ్గర జనం భారీగా గుమికూడటం వలన కోరానా వైరస్ వ్యాప్తి అధికంగా వస్తుందని ప్రచారం చేసిన కమిషనర్ నేరుగా అధికారులను అదే స్థాయిలో వెంటబెట్టుకొని ప్రజా క్షేత్రంలో తిరగడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. అసలే కరోనా టీకా రెండు డోసులు వేసుకున్నా వైరస్ ప్రజలను వెంటాడుతున్న సమయంలో ప్రజలను కరోనా వైరస్ పై చైతన్యం తీసుకు రావాల్సిన అధికారులే ఈ విధంగా పర్యటనలు చేయడం విమర్శలకు తావిస్తుంది. సాధారణ జనం తిరిగితే..వారు చికెన్ షాపుల వద్దకు వెళితే కరోనా కేసులు వస్తాయన్న అధికారులు..అదే గుంపులు గుంపులుగా కమిషనర్ తో సహా దగ్గర దగ్గరగా తిరిగితే రావా అనే వాదన బలంగా వినిపిస్తుంది. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న సమయంలో జివిఎంసీ అధికారులే ఈ విధంగా గుంపులు గుంపులుగా తిరడంపై నగర ప్రజలు నవ్విపోతున్నారు. మీడియా ద్వారా కరోనా వైరస్ కోసం గొప్పలు చెప్పే అధికారులు ఉదయం వార్డుల్లోకి పర్యటకు వచ్చే సమయంలో ఒక్క అధికారి కూడా సామాజి దూరంగానీ, పరిశుభ్రత గానీ పాటించలేదనే విమర్శలు విశాఖలో హాట్ టాపిక్ గా మారాయి. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సమయంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అధికారులు  అత్యంత దగ్గరగా కలిసి వెళుతుండటం నగరవాసులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో సామాజిక దూరం పాటించే అధికారులు బాహ్య ప్రపంచంలో మాత్రం వాటిని గాలికొదిలేస్తున్నారనడానికి కమిషనర్ వార్డుల పర్యటనలే ప్రధాన సాక్షిగా కనిపిస్తున్నాయి. బహుసా జివిఎంసీ అధికారులకు, సిబ్బందికి ప్రభుత్వం నిర్ధేశించిన కరోనా నిబంధనలు పాటించకూడదనే ప్రత్యేక ఉత్తర్వులు ఉన్నాయో..లేదంటే అంత దగ్గరగా భౌతిక దూరం పాటించకుండా తిరిగా వారికి కరోనా వైరస్ సోకదేమో సాధారణ ప్రజలకు సోకినంత త్వరగా..!

విశాఖ సిటీ

2021-06-17 13:18:11

చెట్ల వ్యర్ధాలు ఎక్కడా కనిపించ కూడదు..

మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని ఎక్కడా చెట్ల వ్యర్ధాలు కనిపించకూడదని జివిఎంసి కమిషనర్ డా. జి.సృజన అధికారులను ఆదేశించారు. బుధవారం  నాలుగవ జోన్ లోని 34వ వార్డు పరిధిలో కొబ్బరితోట, అచ్చయమ్మపేట  ప్రాంతాలలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో  ఏపీఈపీడీసీఎల్ వారు విద్యుత్ వైర్ లకు ఆటంకం కలిగిన చెట్ల యొక్క కొమ్మలను తొలగించి  ఆ ప్రదేశంలోనే వదిలేస్తున్నారని వాటిని వారిచే ఆ వ్యర్థాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని వర్షపునీరు సాఫీగా వెళ్లేందుకు ప్రధాన కాలువలలోని చెత్తను తొలగించి, వాటి పలకలను వెంటవెంటనే మూసివేయాలని, డోర్ టు డోర్  చెత్తను సేకరించాలని, తడి-పొడి చెత్తను  వేరు వేరుగా తీసుకోవాలని, రోడ్లను సకాలంలో శుభ్రపరచాలని, డంపర్ బిన్ల వద్ద ఉన్న చెత్తను వెంటవెంటనే డంపింగ్ యార్డ్ తరలించాలని, డంపర్ బిన్ల చుట్టూ బ్లీచింగ్ జల్లించాలని, శానిటరి  అధికారులను ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలకుండా కాలువల్లో ఫాగ్గింగ్ చేయించాలని ప్రధాని వైద్యాధికారులను ఆదేశించారు. నీటి నిల్వలు లేకుండా చూడాలని, వారంలో ఒక రోజు “డ్రై” డే పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని వెటర్నరి డాక్టర్ కిషోర్ ను ఆదేశించారు.  ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ ఫణిరాం, వెటర్నరి డాక్టర్ కిషోర్, కార్యనిర్వాహక ఇంజినీర్లు గణేష్ బాబు, చిరంజీవి, శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.   

విశాఖ సిటీ

2021-06-17 12:52:54

ప్రతీఇంట్లోనూ కోవిడ్ వైద్యులుండాలి..

కోవిడ్ థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రతి ఇంట్లో ఒక వైద్యుడు తయారుగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు.    కోవిడ్ వైద్యం, మందులు, నివరణా పద్ధతుల పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఒక‌టో  ద‌శ‌లో క‌న్నా రెండో ద‌శ‌లో  ఎంతో మందిని కోల్పోయామని, 3వ దశ లో ఆ పరిస్థితి రాకుండా చూడాలని అన్నారు.  రెండు ద‌శ‌ల్లో జరిగిన ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకొని మూడో ద‌శ‌లో జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను ముందుగానే ఊహించి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్పారు. థ‌ర్డ్ వేవ్ నేప‌థ్యంలో ఒక వేళ‌ పిల్ల‌ల‌కు క‌రోనా సోకితే ఎలాంటి వైద్యం అందించాల‌నే అంశంపై మిమ్స్‌లో గురువారం నిర్వ‌హించిన ఒక రోజు అవ‌గాహ‌న స‌ద‌స్సు ముగింపు కార్యక్రమంలో వైద్యులను ఉద్దేశించి కాలెక్టర్  మాట్లాడారు.  ఎలాంటి ప‌రిస్థితిని ఎదుర్కోడానికైనా వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాల‌ని, పిల్ల‌ల‌కు అందించ‌బోయే వైద్య విధానంపై అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని సూచించారు. 3వ దశ లో  పిల్లలకు  వ్యాధి సోకే      అవకాశం ఉందని, ముందుగానే  ల‌క్ష‌ణాలను గుర్తించేలా వైద్యులు అంద‌రిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు.  కోవిడ్ థర్డ్ వేవ్ అకస్మాత్తుగా రావచ్చని, వేగంగా విస్తరించవచ్చని, ఎక్కువ కేసు లు నమోదయ్యే అవకాశం ఉండొచ్చని, అప్రమత్తత అవసరమని అన్నారు. జిల్లాలో  ఇప్పటికే 6 లక్షల మందికి వాక్సినేషన్ వేయడం జరిగిందని, వచ్ఛే నవంబర్ లోగా 18 లక్షల మందికి వాక్సినేషన్ వేయడానికి ప్రణాళికలు వేసామన్నారు.    ప్రజలు  భయన్దోళనలకు గురి కాకుండా వారిలో  మనో ధైర్యాన్ని నింపాలని అన్నారు. ముఖ్యముగా  పిల్లల తల్లి దండ్రులకు  అవగాహన కలిగించాలన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో డీసీహెచ్ఎస్ డా. నాగ‌భూష‌ణ‌రావు, ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ డా.అప్పల రాజు, ఆర్.ఎం.ఓ డా.గౌరి శంకర రావు,  మిమ్స్ డైరెక్ట‌ర్ డా. భాస్క‌ర‌రాజు, స్పెష‌ల్ ఆఫీస‌ర్ డా. హ‌రికిష‌న్ కుమార్‌, డా. వెంక‌టేశ్వ‌రరావు, డా.శాంతి, పలు విభాగాల‌కు చెందిన ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు వైద్యులు, న‌ర్శింగ్ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-17 11:47:06

ఎస్సీ, బీసిలకు రూ.5 లక్షల రుణాలు..

క‌రోనా కార‌ణంగా బీసీ, ఎస్సీ కుటుంబాల‌లో సంపాదించే వ్య‌క్తి చ‌నిపోతే వారి కుటుంబ స‌భ్యుల‌కు రూ.5 ల‌క్ష‌ల రుణ స‌దుపాయం క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని, దీనికి సంబంధించిన ప్ర‌క్రియ‌ను స‌మ‌న్వ‌యంతో నిర్వ‌హించాల‌ని జేసీ జె. వెంక‌ట‌రావు అధికారుల‌ను ఆదేశించారు. జీవ‌నాధారం కోల్పోయిన కుటుంబాల‌కు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు బాధిత కుటుంబీకుల‌ను గుర్తించే ప్ర‌క్రియ స‌క్ర‌మంగా చేప‌ట్టాల‌ని సూచించారు. సంబంధిత ద‌ర‌ఖాస్తుల‌ను ఆయా మండ‌ల‌, మున్సిప‌ల్ కేంద్రాల‌కు అంద‌జేయాల‌ని చెప్పారు. రుణ మంజూరు ప్ర‌క్రియ‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసే నిమిత్తం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపీడీవోల‌తో జేసీ గురువారం జూమ్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. బీసీ కార్పోరేష‌న్‌, ఎస్సీ కార్పోరేష‌న్ ఈడీల‌తో క‌లిపి నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో రుణ మంజూరు ప్ర‌క్రియ‌కు సంబంధించిన అంశాల‌ను వివ‌రించారు. అర్హ‌త‌లు, నిబంధ‌న‌లు తెలియ‌జేశారు. నిర్ణీత గ‌డువులోగా బాధిత కుటుంబీకుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించాల‌ని, ఇత‌ర ప్ర‌క్రియ‌లు పూర్తి చేయాల‌ని అధికారుల‌కు సూచించారు.

కాన్ఫ‌రెన్స్‌లో బీసీ కార్పోరేష‌న్ ఈడీ నాగ‌రాణి, ఎస్సీ కార్పోరేష‌న్ ఈడీ జ‌గ‌న్నాధ‌రావు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపీడీవోలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అర్హ‌తలు.. ఇత‌ర నిబంధ‌న‌లు

@బీసీ, ఎస్సీ కుటుంబాల‌కు ఆధార‌మైన భార్య‌, భ‌ర్త (18 నుంచి 60 ఏళ్ల వ‌య‌సు)  ఏ ఒక్క‌రు క‌రోనాతో చ‌నిపోయినా ఈ రుణ సాయానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
@ఏడాదికి రూ. 3 ల‌క్ష‌ల లోపు ఆదాయం మాత్ర‌మే ఉండాలి.
@ఎస్సీ వ‌ర్గానికి చెందిన వారు ఈ నెల 20వ తేదీ లోపు, బీసీ వ‌ర్గానికి చెందిన వారు ఈ నెల 23వ తేదీ లోపు బియ్యం కార్డు, ఆధార్ కార్డు, మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను ద‌ర‌ఖాస్తుకు జ‌త‌చేసి  గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో అంద‌జేయాలి.
@ప‌రిశీల‌న అనంత‌రం అర్హులైన ల‌బ్ధిదారుల‌కు రూ.5 ల‌క్ష‌ల రుణం మంజూరు చేస్తారు.
@రాయితీ రూ.1 ల‌క్ష వ‌ర‌కు ఉంటుంది.

Vizianagaram

2021-06-17 11:45:36

ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలి..

రాష్ట్ర ప్రభుత్వం న‌వ‌ర‌త్నాల కింద అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను అర్హులైన వారికి అందించ‌డంలో జిల్లా నెంబ‌ర్‌వ‌న్‌గా వుంటోంద‌ని, బ్యాంకుల స‌హ‌కారంతో అమ‌లు చేసే  ప‌థ‌కాల్లోనూ జిల్లా మొద‌టి స్థానంలో నిలిచేందుకు వీలుగా బ్యాంకు అధికారులు, జిల్లా అధికారులు స‌మ‌న్వయంతో స‌మిష్టిగా ప‌నిచేసి జిల్లాను అగ్రస్థానంలో నిల‌పాల్సి వుంద‌ని జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ పేర్కొన్నారు. వ్యవ‌సాయ ప్రధాన‌మైన జిల్లా అయినందున వ్య‌వ‌సాయ‌, ఆధారిత రంగాలైన పాడిప‌రిశ్రమ, గొర్రెలు, మేక‌ల పెంప‌కం వంటి యూనిట్ల ఏర్పాటును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వాటికి రుణాలు అంద‌జేయాల‌ని బ్యాంక‌ర్లను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన‌ కౌలు రైతుల‌కు పంట‌రుణాలు ఇవ్వాల‌ని భావిస్తోంద‌ని, దీనిలో భాగంగా జిల్లాలో 34 వేల మందికి సి.సి.ఆర్‌.సి. కార్డులు ఇస్తున్నామ‌ని వారంద‌రికీ పంట‌రుణాలు ఇవ్వాల‌ని కోరారు. జిల్లాలో ప్రస్తుత ఖ‌రీఫ్ సీజ‌నులో రూ.1861 కోట్ల పంట‌రుణాలు ఇవ్వాల‌ని ల‌క్ష్యంగా నిర్ణయించ‌డం జ‌రిగింద‌ని, ఇప్పటివ‌ర‌కు రూ.732 కోట్లు ఇచ్చార‌ని, మిగిలిన వారికి కూడా వెంట‌నే రుణాలు మంజూరు చేయ‌డం ద్వారా రైతులంద‌రికీ స‌కాలంలో పంట‌కు అవ‌స‌ర‌మైన పెట్టుబ‌డి అందించ‌డానికి చ‌ర్యలు చేప‌ట్టాల‌ని బ్యాంకుల‌ను క‌లెక్టర్ కోరారు. జిల్లా క‌న్సల్టేటివ్ క‌మిటీ స‌మావేశం క‌మిటీ ఛైర్మన్, జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అధ్యక్షత‌న గురువారం క‌లెక్టర్ కార్యాల‌యంలో జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ వ్యవసాయానికి తోడుగా పాడిప‌రిశ్రమ‌, గొర్రెలు లేదా మేక‌ల పెంప‌కం వంటి అద‌న‌పు ఆదాయం స‌మ‌కూరే మార్గాల‌ను చూప‌డం ద్వారా  రైతుల ఆదాయం రెండింత‌లు అయ్యేలా చ‌ర్యలు చేప‌ట్టాల్సి వుంద‌న్నారు. పాడిప‌రిశ్రమ రంగంలో ఈ జిల్లాకు మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని, రాష్ట్రంలో చిత్తూరు త‌ర్వాత పాడిప‌రిశ్రమ‌లో ఆ స్థాయిలో నిలిచేది విజ‌య‌న‌గ‌రం మాత్రమేన‌ని చెప్పారు. ఈ రంగానికి బ్యాంకులు స‌హ‌కారం అందించి చేయూత ప‌థ‌కం కింద యూనిట్ల మంజూరుకు స‌హ‌క‌రించాల‌న్నారు. ప‌శుసంవ‌ర్ధక శాఖ‌, డి.ఆర్‌.డి.ఏ. అధికారులు కూడా బ్యాంకుల‌ను నిత్యం సంప్రదిస్తూ జిల్లాకు మంజూరైన యూనిట్లన్నీ ఏర్పాట‌య్యేలా చ‌ర్యలు చేప‌ట్టాల‌న్నారు. జాయింట్ క‌లెక్టర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు ఆధ్వర్యంలో బ్యాంకు అధికారులు, ప్రభుత్వ శాఖ‌ల  అధికారులు ప‌నిచేసి వ‌చ్చే డిసిసి స‌మావేశం నాటికి ఆశించిన మేర‌కు ల‌క్ష్యాలు సాధించి జిల్లాను రెండోస్థానంలోకి తీసుకు రావాల‌ని ఆదేశించారు.

జ‌గ‌న‌న్న తోడు యూనిట్ల ఏర్పాటులోనూ బ్యాంక‌ర్లు జిల్లా అధికారుల‌కు స‌హ‌క‌రించి ప్రభుత్వం నిర్దేశించిన ల‌క్ష్యాల సాధ‌న‌కు తోడ్పాటు అందించాల‌ని కలెక్టర్ కోరారు. ప‌ట్టణాల్లో ఈ ప‌థ‌కం కింద రుణాలు ఆశించిన మేర‌కు అందించిన‌ప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కొంత త‌క్కువ‌గా ఇచ్చార‌ని, ఆ లోటు లేకుండా చూడాల‌ని చెప్పారు. 

జిల్లా గ‌త ఏడాది వార్షిక రుణ ప్రణాళిక ల‌క్ష్యాల సాధ‌న‌పై నూత‌న లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజ‌ర్‌ గా బాధ్యత‌లు స్వీక‌రించిన ఎం.శ్రీనివాస్ నివేదిస్తూ పంట‌రుణాల మంజూరులో గ‌త ఏడాది 97.16శాతం ల‌క్ష్యాల‌ను సాధించామ‌ని, వ్య‌వ‌సాయ టెర్మ్ రుణాల మంజూరులో జిల్లా గ‌త ఏడాది 128.14శాతం ల‌క్ష్యాల‌ను సాధించింద‌ని, వ్య‌వ‌సాయ సంబంధిత ప‌రిశ్రమ‌ల‌కు రుణాల మంజూరులో 50.52శాతం ల‌క్ష్యాల‌ను సాధించిన‌ట్లు వివ‌రించారు. దీనిపై జిల్లా క‌లెక్టర్ స్పందిస్తూ ప‌రిశ్రమ‌ల శాఖ ద్వారా ఈ ఏడాది ఫుడ్ ప్రాసెసింగ్ ప‌రిశ్రమ‌లు, సంబంధిత యూనిట్ల ఏర్పాటులో ల‌క్ష్యాల‌ను సాధించాల‌ని స్పష్టంచేశారు.

న‌బార్డు ఏ.జి.ఎం. హ‌రీష్ మాట్లాడుతూ బ్యాంకులు ఇచ్చే రుణాల్లో వ్యవ‌సాయ అనుబంధ రంగాల‌కే 40శాతం త‌గ్గకుండా రుణాలు ఇవ్వాల్సి వుంటుంద‌న్నారు. ప్రతి బ్యాంకు త‌మ ప‌రిధిలో ఎస్‌.సి., ఎస్‌.టి., మ‌హిళ‌ల‌కు క‌నీసం ప్రభుత్వ ప‌థ‌కాల‌కు సంబంధించి ఏడాదిలో ఒక్క యూనిట్ అయినా మంజూరు చేయ‌వ‌ల‌సి వుంటుంద‌న్నారు. జిల్లాలోని భార‌తీయ స్టేట్‌బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉపాధి శిక్షణ సంస్థకు ఏ ప్లస్ గ్రేడింగ్ వ‌చ్చింద‌ని శిక్షణ కేంద్రం ఇన్‌చార్జి అధికారి వివ‌రించారు.

స‌మావేశంలో జాయింట్ క‌లెక్టర్(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, డి.ఆర్‌.డి.ఏ. ఏపిడి సావిత్రి, బి.సి.కార్పొరేష‌న్ ఇ.డి. జి.జ‌గ‌న్నాధ‌రావు, బి.సి.కార్పొరేష‌న్ ఇ.డి. నాగ‌మ‌ణి, మెప్మా పిడి సుధాక‌ర్‌, ప‌రిశ్రమ‌ల కేంద్రం జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ కోట ప్రసాద‌రావు, ఉద్యాన‌శాఖ డి.డి. శ్రీ‌నివాస‌రావు, వ్యవ‌సాయ శాఖ డి.డి.  అన్నపూర్ణ‌, ప‌శుసంవర్ధక శాఖ జె.డి. ర‌మ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-17 11:43:58

క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం..

వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ద్వారా వ్యర్ధాల నిర్వహణ సమర్ధవంతంగా జరిగినప్పుడు క్లీన్ ఆంధ్రప్రదేశ్ సాధ్యం అవుతుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృధ్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం ఉదయం  గుంటూరు నగరపాలక సంస్థ శివారున ఓబులునాయుడు పాలెం లోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృధ్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ మరియు డైరక్టర్  ఎం మల్లిఖార్జున నాయక్, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, స్వచ్చాంధ్ర కార్పోరేషన్ ఎండీ సంపత్ కుమార్తో కలిసి పరిశీలించారు. ప్లాంట్లోని టిప్పర్ ఫ్లోర్, బాయిలర్ ఏరియా, టర్బైన్ కంట్రోల్ రూం ప్రాంతాలను మంత్రి, అధికారులు పరిశీలించారు. కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిందాల్  వేస్ట్ ఎనర్జీ  ప్రాజెక్టు వివరాలను జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్  లిమిటెడ్ ప్రాజెక్టు ప్రెసిడెంట్ ఎంఎం చారి పవర్ పాయింట్ ప్రెజేంటేషన్ ద్వారా మంత్రివర్యులకు, శాసనసభ్యులకు అధికారులకు వివరించారు. ప్లాంట్ నిర్మాణం, మిషనరీ ఏర్పాటు పనులు నూరు శాతం పూర్తి అయ్యాయని, విద్యుత్ సబ్ స్టేషన్ కు అనుసంధానం పనులు, నీటి సౌకర్యం కల్పిస్తే 20 రోజులలో ప్లాంట్ను వినియోగంలోకి తీసుకువస్తామని ఎంఎం చారి తెలిపారు. దీనిపై మంత్రి బోత్స సత్యనారాయణ స్పందిస్తూ సబ్ స్టేషన్ అనుసంధాన పనులు వారంలో పూర్తి చేయాలని, నీటి సౌకర్యంకు సంబంధించి పైపులైను పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కు అవసరమైన వ్యర్ధాలను పూర్తి స్థాయిలో సెగ్రిగ్రేషన్ చేసి అందించేందుకు స్వచ్చాంధ్ర కార్పోరేషన్ అధికారులు మున్సిపాల్టీలలోని క్షేత్రస్థాయి అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి గృహాలలోనే సెగ్రిగ్రేషన్ జరిగేలా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృధ్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ  వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు 2016 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం జిందాల్ సంస్థతో  18 నెలల్లో ప్లాంట్ను ప్రారంభించేలా ఎంవోయు చేసుకుందన్నారు. గుంటూరు, విజయవాడతో పాటు 9 మున్సిపాల్టీలలో వ్యర్ధాలను ఇక్కడికి తీసుకువచ్చి విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారన్నారు. అయితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 10 శాతం మాత్రమే ప్లాంట్ పనులు జరిగాయన్నారు. అప్పటి నుంచి ప్లాంట్ పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవటంతో ప్రస్తుతం పనులు పూర్తి అయ్యి ప్రారంభ దశకు చేరుకుందన్నారు. ప్లాంట్కు సంబంధించిన పెండింగ్లో ఉన్న పనులు వెంటనే పరిష్కరించేందుకు మున్సిపల్, ఇంజనీరింగ్, విద్యుత్ రాష్ట్రస్థాయి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, ప్లాంట్ అధికారులతో సమావేశం నిర్వహించామన్నారు. 

ప్లాంట్కు అవసరమైన నీటి సరఫరా, విద్యుత్ సబ్ స్టేషన్ అనుసంధాన పనులు పెండింగ్లో ఉన్నాయని వీటిని పదిహేను రోజుల్లో పూర్తి చేసి వచ్చే నెలలో ప్లాంట్ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు, విజయవాడ నగరపాలక సంస్థతో పాటు తెనాలి, చిలకలూరిపేట, సత్తెనపల్లి, మంగళగిరి, నరసరావుపేట, పొన్నూరు, తాడేపల్లి మున్సిపాల్టీల నుంచి సేకరించిన వ్యర్ధాల ద్వారా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో గంటకు 15 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉందన్నారు. ఉత్పత్తి చేసిన విద్యుత్ను ప్రభుత్వం రూ.6.12 పైసలకు కొనుగోలు చేస్తుందన్నారు. గుంటూరుతో పాటు విశాఖ పట్ణణంలోను వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా లేదా వర్చువల్ విధానంలో జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్లాంట్ వలన పర్యావరణానికి, పరిసర ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని జాగ్రత్తలు తీసుకోవటం జరిగిందన్నారు. జిల్లాలోని డోర్ టూ డోర్ వ్యర్ధాల సేకరణ కోసం స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ద్వారా 720 వాహనాలు అందించటం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సూచనల మేరకు ప్లాంట్ పరిధిలోని 5 కీమీ లోపు ఉన్న గ్రామాల నుంచి సేకరించిన వ్యర్ధాలను సైతం ఇక్కడకు తరలించే అంశంను పరిశీలిస్తామన్నారు.

 ప్లాంట్కు అవసరమైన 0.15 ఎంఎల్డీ నీటిని సమీపంలోని వెంగళాయ పాలెం గ్రామం నుంచి పైపులైను ద్వారా సరఫరా చేయటం జరుగుతుందన్నారు. వెంగళాయపాలెంలో నగరపాలక సంస్థకు చెందిన 2.5 ఎంఎల్డీ వాటర్ ప్లాంట్ ఉందని, అక్కడి గ్రామ ప్రజలకు అవసరమైన నీటిని పూర్తి స్థాయిలో అందించిన తర్వాతే ప్లాంట్కు నీటి సరఫరా చేస్తామన్నారు. వెంగళాయపాలెం గ్రామం రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత నియోజకవర్గంలో ఉన్నందున మంత్రి, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, నగరపాలక సంస్థ, పంచాయితీ అధికారులు గ్రామ ప్రజలతో చర్చించి వారికి ఇబ్బంది కలగకుండా ప్లాంట్కు నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు నగరపాలక సంస్థలో మిగిలిన యూజీడీ పనులు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఆవరణలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృధ్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మొక్కలు నాటారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయరు కావటి శివనాగ మనోహర్ నాయుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మద్ధాళి గిరిధర్, సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబు, నరసరావు పేట శాసనసభ్యులు డా. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర మధ్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి లక్ష్మణ రెడ్డి, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శుభం బన్సాల్, మున్సిపల్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ చంద్రయ్య, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ, మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ నిరంజన్ రెడ్డి, నరసరావుపేట కమిషనర్ రామచంద్రారెడ్డి, సత్తెనపల్లి కమిషనర్ శ్రీనివాసరావు, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనివాసులు, నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీరు దాసరి శ్రీనివాసరావు, గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి భాస్కర రెడ్డి, పశ్చిమ మండల తహశీల్దారు మోహనరావు, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయరు బాల వజ్ర బాబు,  జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏజీఎం రామకృష్ణ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-06-17 11:41:05

సేవా దృక్పథం గొప్ప సంస్కారం..

సేవా దృక్పథం గొప్ప సంస్కారం అని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు. గురువారం ఉదయం బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటును జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా 350 పడకలకు నేరుగా ఆక్సిజన్ అందించగలిగేలా 500 ఎల్పీఎమ్ సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంటును ప్రారంభించడంపై జిల్లా కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ ప్లాంటు ద్వారా లిక్విడ్ ఆక్సిజన్ నిల్వలపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్డిటి సంస్థ సేవా దృక్పథంతో వ్యవహరించడం గొప్ప విషయమన్నారు. ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు ఏర్పాటు వల్ల కరోనా సోకిన వారికి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆక్సిజన్ ను నిరంతరంగా అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా రూ.75 లక్షలు వెచ్చించి ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు నిర్మాణం చేపట్టామని ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం డైరెక్టర్ అన్నే ఫెర్రర్ తెలిపారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. ఏ.సిరి, ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్, ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ విశాల ఫెర్రర్, ఆర్డీటీ హాస్పిటల్ డైరెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. 

Anantapur

2021-06-17 11:39:29

గురువారం చందన లభ్యత 28 కేజీలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారికి సమర్పించే  మూడో విడత చందనం అరగదీత ప్రక్రియ గురువారం సంప్రదాయంగా ప్రారంభమైంది. మొత్తం 28 కిలోల చందనం లభ్యమైనట్టు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ రోజు నుంచి మరో నాలుగు రోజుల పాటు చందనం అరగదీత కార్యక్రమం నిర్వహించిన తరువాత  ఈ నెల 24వ తేదీ జ్యేష్ట పూర్ణిమ సందర్బంగా స్వామివారికి మూడో విడత చందన సమర్పణ సమర్పిస్తారు. అదే రోజు స్వర్ణ పుష్పార్చన, శ్రీమణవాళ మహామునుల మాస తిరునక్షత్రం ఉంటుందన్న ఈఓ స్వామివారికి చందనం సమర్పించాలనుకునే భక్తులు అరకిలోకి రూ.10,116 ,  కిలోకి 20,116 సమర్పించుకోవచ్చునన్నారు. అరకిలో చందన సమర్పణ చేసినవారికి 200 గ్రాముల చందనం చెక్క, కేజీ సమర్పించినవారికి 300 గ్రాముల చందనం ముక్కతోపాటు శేష వస్త్రం  ప్రసాదంగా ఇస్తారని వివరించారు. చందన సమర్పణకు ఆన్ లైన్లో సొమ్ము చెల్లించాక చిరునామా, గోత్రనామాలతో పాటు వివరాలను స్క్రీన్ షాట్ తీసి  6303800736 వాట్సప్ నంబర్ కు పంపించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని అప్పన్న భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈఓ కోరారు.


Simhachalam

2021-06-17 11:22:32

భూసేకరణ వేగవంతం చేయాలి..

సోలార్ పార్కుల ఏర్పాటు, టేకులేడు ఇండస్ట్రియల్ ఏరియా, హెచ్ఎన్ఎస్ఎస్ కింద వివిధ రిజర్వాయర్ లకు సంబంధించి, నేషనల్ హైవే కింద చేపడుతున్న  రహదారులు తదితర ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్ ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్ లోని విసి హాల్ నుంచి సోలార్ పార్కులు, టేకులేడు ఇండస్ట్రియల్ ఏరియా, హెచ్ఎన్ఎస్ఎస్ కింద వివిధ రిజర్వాయర్ లకు సంబంధించి, జాతీయ రహదారులు తదితర ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ విషయమై జిల్లాలోని ఆర్డీఓ లు, తహశీల్దార్ లతో జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ముదిగుబ్బ మండలంలో చేపడుతున్న సోలార్ పార్కుకు సంబంధించి ఈ నెల 22వ తేదీ లోపు భూ సేకరణ పూర్తిచేసి ప్రతిపాదనలు పంపించాలన్నారు. కంబదూరు మండలంలో చేపడుతున్న సోలార్ పార్కుకు సంబంధించి భూసేకరణ చేపట్టి పంపించిన ప్రతిపాదనల మీద లీజ్ అగ్రిమెంట్ లను వెంటనే పూర్తిచేయాలని, ఈ విషయమై సోలార్ అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారు. ముదిగుబ్బ, కంబదూరు మండలాల్లో ఏర్పాటు చేస్తున్న సోలార్ పార్కులకు సంబంధించి భూసేకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మానిటర్ చేస్తున్నారని, భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలన్నారు.

 హెచ్ఎన్ఎస్ఎస్ కింద చేపడుతున్న తోపుదుర్తి రిజర్వాయర్ కు సంబంధించి బండ్ పోర్షన్ పనులను జూలై నెల ఆఖరి కల్లా పూర్తి చేయాలన్నారు. దేవరకొండ రిజర్వాయర్ బండ్ పోర్షన్ పనులను జూలై 15 లోపు పూర్తి చేసేలా చూడాలన్నారు. ముట్టాల రిజర్వాయర్ కు సంబంధించి జూలై నెలాఖరుకల్లా భూసేకరణ పనులు పూర్తి చేయాలని సూచించారు. తోపుదుర్తి, దేవరకొండ, ముట్టాల రిజర్వాయర్ లకు సంబంధించి భూసేకరణ డిక్లరేషన్ ప్రతిపాదనలు వేగంగా పూర్తి చేయాలని జేసీ ఆదేశించారు.

చిలమత్తూరు మండలంలోని టేకులేడు ఇండస్ట్రియల్ ఏరియా (ఎస్ఈజెడ్)కు సంబంధించి భూసేకరణ వేగవంతంగా చేపట్టాలని చిలమత్తూరు తహసీల్దార్ ను జేసీ ఆదేశించారు. టేకులేడు ఇండస్ట్రియల్ ఏరియాకు సంబంధించి రోడ్ విస్తరణకు కూడా భూసేకరణ చేయాలన్నారు. పది రోజుల్లోగా గుర్తించిన భూమికి సంబంధించి డాక్యుమెంట్ పరిశీలన చేయాలని ఏపీఐఐసీ జెడ్ఎంకు సూచించారు. అలాగే నేషనల్ హైవే కింద చేపడుతున్న ఎన్ హెచ్ 42 రహదారి, కదిరి బైపాస్ రోడ్డు, కళ్యాణదుర్గం - రాయదుర్గం మద్యం వేస్తున్న నేషనల్ హైవే 544 డిడి తదితర వాటికి సంబంధించి భూసేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జెసి ఆదేశించారు. హెచ్ఎల్సీ కింద పిఏబిఆర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించి భూసేకరణ పనులు చేపట్టాలన్నారు. భూసేకరణ పనులు పూర్తి చేయడం వల్ల ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తవుతాయని, వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ విషయమై తహశీల్దార్ లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్ఓ గాయత్రీ దేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరప్రసాద్, రవీంద్ర, నేషనల్ హైవేస్ ఎస్ ఈ మురళీమోహన్, ఎన్ హెచ్ఏఐ పిడి మీనా, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ వెంకటరమణ, హెచ్ఎల్సి ఎస్ఈ రాజశేఖర్, ఆర్అండ్బీ అధికారులు, వివిధ శాఖల ఈఈలు, డిఈ లు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-17 10:37:46

ప్రజలకు గ్రామాల్లో ప్రభుత్వ సేవలన్నీ..

సామాన్య ప్రజానీకానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు త్వరితగతిన అందించడంలో భాగంగా నిర్మించనున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ , బల్క్ మిల్క్ సెంటర్లు త్వరితగతిన ప్రారంభించుకునే విధంగా భవన నిర్మాణ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామంలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్, కొమానపల్లిలో రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ ల నిర్మాణ పనులకు ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల్లో భాగంగా శాశ్వత భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు జిల్లాలో ఈ నెల 17 వ తేదీ నుండి జూలై 2 వరకు 15 రోజులు భవన నిర్మాణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో పింఛను కోసం పంచాయతీ కార్యాలయాల వద్ద గంటల సమయం వేచియుండే పరిస్థితి ఉండేదని, అదేవిధంగా రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ, తదితర సేవలకు తహసీల్దార్ లేదా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునే పరిస్థితులను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలు నేరుగా ఇంటి ముంగిటికే అందుతున్నాయని తెలిపారు. ప్రజలకు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వేగంగా, నాణ్యమైన సేవలను అందించేందుకు ముఖ్యమంత్రి చక్కటి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని అన్నారు. చక్కటి వ్యవస్థకు శాశ్వత భవనాలను నిర్మించుకోవడం ద్వారానే మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందుతాయని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను బుక్ చేసుకునే సౌకర్యం ఏర్పాటు చేయడమే కాకుండా నాణ్యత లోపాలపై ఫిర్యాదులు చేసే విధానాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో టెస్టింగ్ సదుపాయంతో సహా  ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో అందే అన్ని వైద్య సేవలు అందుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమూల్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ ల ద్వారా పాలను సేకరించి, పేమెంట్స్ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 10  నియోజకవర్గాల్లో 90 శాతం భవన నిర్మాణాలు పూర్తి కావడం జరిగిందని, భవన నిర్మాణాలకు అవసరమైన ఇసుక, మెటీరియల్ సరఫరా, పేమెంట్ ప్రాసెసింగ్ అంశాలలో జాప్యం ఉండదని అన్నారు. గ్రామ స్థాయిలో ఇటువంటి భవనాలు నిర్మించుకోవడం గర్వకారణమని, రాబోయే రెండు మూడు నెలల్లో భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరారు.
      ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ  సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని అన్నారు. అదేవిధంగా రైతులకు వ్యవసాయ పరంగా ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సేవలను రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తూ, నాట్లు వేసే దగ్గర నుండి రైతు పండించిన పంటను అమ్ముకునే వరకూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతుందని అన్నారు. పేదవాడి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామంలో హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయడమే కాకుండా, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ ల ద్వారా పాలను సేకరించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం అందుతున్న సేవలు మరింత మెరుగ్గా, వేగంగా అందాలంటే భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు సమన్వయంతోపనిచేసి ముఖ్యమంత్రి లక్ష్యాలకు అనుగుణంగా భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు.
              భవన నిర్మాణ పక్షోత్సవాల్లో భాగంగా నియోజకవర్గంలోని గేదెల్లంక గ్రామంలో 17.5 లక్షలతో నిర్మించనున్న వైఎస్సార్ హెల్త్ క్లినిక్, కొమానపల్లి గ్రామంలో 90.04 లక్షలతో నిర్మించనున్న రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ భవన నిర్మాణాలకు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే, గ్రామ సర్పంచ్ లతో కలిసి శంఖుస్థాపన చేయారు.
        ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్(ఆసరా) జి.రాజకుమారి, ఆర్డీవో ఎన్ ఎస్ వి బి వసంత రాయుడు, జడ్పి సిఇఓ ఎన్ వి వి సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వర్ నాయక్, డ్వామా పిడి వరలక్ష్మి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిట్టిబాబు, గేదెల్లంక, కొమానపల్లి గ్రామ సర్పంచ్ లు ఎస్. పల్లయ్య, కె.ఇందిరా, మండల అధికారులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Mummidivaram

2021-06-17 10:02:33

ఆ రైతులకు నష్టపరిహారం అందిస్తాం..

చిత్తూరు జిల్లాలోని కౌండిన్య వైల్డ్ లైఫ్ విభాగం ఉన్న ప్రాంతాలలో బారీగా ఏనుగులు సంచరిస్తున్నాయని, వాటి నుంచి ప్రజలను కాపాడేందుకు స్వల్ప వ్యవధిలో  కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తే ప్రభుత్వానికి పంపుతామని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ పేర్కొన్నారు.. గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు అటవీ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశమై  జిల్లాలో ఏనుగుల మరణాలు , రైతులకు జరిగిన నష్టం పై సమీక్షించారు. ఈ సంధర్భంగా  వెస్ట్ డి.ఎఫ్.ఓ రవి శంకర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతలైన పలమనేరు,పుంగనూరు, కుప్పం, చిత్తూరు అటవీ ప్రాంతాలను కలుపుకుంటూ సుమారు ఆరు వేల హెక్టార్ లలో కౌండిన్య ఎలీఫేంట్ జోన్ ఉందని ఈ ప్రాంతంలో 2012 లో ఎనిమిది ఏనుగులు సంచరించేవని, ప్రస్తుతం 70 నుంచి 90 ఏనుగులు ఉన్నాయని, 2013 నుండి ఇప్పటి వరకు 9 ఏనుగులు వివిధ కారణాలతో  మరణించడం జరిగిందని,  ఏనుగుల దాడులలో 10 మంది వ్యక్తులు మరణించారని, 37 ఆవులు మరణించగా, 9 మంది మనుషులను గాయ పడ్డారని తెలిపారు . పలమనేరు ప్రాంతంలో 4,610 హెక్టార్లకు గాను 3,426.8 హెక్టర్లు ఫెన్సింగ్ వేయడం జరిగిందని, మిగతా ప్రాంతంలో ఫెన్సింగ్ లేక పోవడం వల్ల ఈ ప్రాంతాలలో ఏనుగులు ఎక్కువగా సంచరించడం జరుగుతున్నదని తెలిపారు. ఇటీవల కాలంలో గ్రూపులుగా ఉన్న ఏనుగులు విడిపోవడం వల్ల అవి భయంకరంగా మారి స్వభావం మార్చుకొని దాడులకు పాల్పడుతున్నాయన్నారు. అటవీ ప్రాంతoలో అనేక చెరువులు మరియు మేతగా కొన్ని రకాల వృక్షాలు ఉన్నాయని, అయితే అప్పుడప్పుడు అటవీ ప్రాంతం సమీపంలో గల చెరుకు, వరి, అరటి, మామిడి, బీన్స్ వంటి పంటల రుచులు చూడడం వల్ల ఎక్కువగా పంటల పై దాడులు చేస్తూ అడ్డం వచ్చినప్పుడు వ్యక్తుల పై దాడులకు పాల్పడుతున్నాయన్నారు. 

ఇప్పటికే జిల్లాలో ఫెన్సింగ్ మరియు కందకాలు తవ్వడం జరిగిందని అయితే ఫెన్సింగ్ గ్యాప్ ఉన్న చోట బయటకు వస్తున్నాయని అదే విధంగా కందకాలలో కొన్ని చోట్ల రాళ్ళు రావడం వల్ల ఆపివేయడం జరిగిందని అటువంటి ప్రదేశాలలో జనావాసాల వైపు దూసుకొస్తున్నాయన్నారు. ఇటీ వల కరోనా పరిస్థితుల వల్ల జాతీయ రహదారుల పైన ట్రాఫిక్ లేక పోవడంతో  రోడ్ల పైకి కూడా వస్తున్నాయన్నారు. ఈస్ట్ డి.ఎఫ్.ఓ నరేంధిర న్ మాట్లాడుతూ కౌండిన్య ఎలిఫాంట్ జోన్ లో తిరుమల కొండలు ఉన్న శ్రీ వేంకటేశ్వర అభయా అరణ్యం, శేషాచల కొండలు కలసి ఉండడం వల్ల ఈ ప్రాంతంలో జాతీయ రహదార్లు ఉండడం వల్ల తరచూ రోడ్ల పైకి వస్తున్నాయని, ఈ ప్రాంతంలో సంచరిస్తూ మంచి ఆహారం దొరుకుతుండడo వల్ల వ్యవసాయ పొలాల పైన దాడులు చేస్తున్నాయన్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఏనుగులు ఎక్కువగా ఉండడం మన అటవీ ప్రాంతాలు ఈ ప్రాంతాలతో కలిసి ఉండడం వల్ల  అక్కడ్నుంచి మన ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నాయని తెలిపారు. ఏనుగులు  నుండి తమ పంటలను కాపాడుకోవాలని రైతులు భావించడం వల్ల ఏనుగుల పై దాడులకు వెళ్తున్నారని పలితంగా  మరణిస్తున్నారని, వీరికి నష్ట పరిహారం ఎప్పటికప్పుడు చెల్లిస్తూ న్నామన్నారు.  అయితె రైతులు నష్ట పరిహారం సరిపోదని తెలుపుతున్నారని  చెప్పారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఏనుగులు సంచరించే ప్రాంతాలలో ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానికి సంబందించి నివేధిక తయారు చేయాలని, అదే విధంగా వ్యవసాయ పంటలను కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం గురించి, ఫెన్సింగ్, కాంద కాలతో పాటు శాశ్వతమైన చర్యలకు ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు  వ్వ్యవసాయ అనుబంధ శాఖాధికారుల తో సమావేశమై ఒక వారం లోపు ప్రణాళికలు సిద్దం చేయాలని ,వాటిని పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. అదే విధంగా జాతీయ ఉపాధి హామీ కింద  అటవీ  శాఖ సమన్వయం తో పనులు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.  ఈ  సమావేశంలో ఫారెస్ట్ అధికారి వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

Chittoor

2021-06-17 09:59:00

కోవిడ్19 థర్డ్ వేవ్ ను ఎదుర్కోవాలి..

కోవిడ్ థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అంద‌రూ సిద్ధంగా ఉండాల‌ని సంయుక్త క‌లెక్ట‌ర్ ఆర్‌. మహేష్ కుమార్ వైద్యుల‌ను ఉద్దేశించి అన్నారు. ఒక‌టి ద‌శ‌లో క‌న్నారెండో ద‌శ‌లో ఎక్కువ విపత్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నామ‌ని, ఎక్కువ న‌ష్టాల‌న చ‌విచూశామ‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. గ‌త రెండు ద‌శ‌ల్లో జరిగిన ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకొని మూడో ద‌శ‌లో జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను ముందుగానే ఊహించి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్పారు. థ‌ర్డ్ వేవ్ నేప‌థ్యంలో ఒక వేళ‌ పిల్ల‌ల‌కు క‌రోనా సోకితే ఎలాంటి వైద్యం అందించాల‌నే అంశంపై మిమ్స్‌లో గురువారం నిర్వ‌హించిన ఒక రోజు అవ‌గాహ‌న స‌ద‌స్సును ఆయ‌న ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోనే విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఇలాంటి ముంద‌స్తు అవ‌గాహ‌న‌ స‌ద‌స్సు ఏర్పాటు చేయ‌టం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు. ఎలాంటి ప‌రిస్థితిని ఎదుర్కోడానికైనా వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాల‌ని, పిల్ల‌ల‌కు అందించ‌బోయే వైద్య విధానంపై అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని సూచించారు. 18 నుంచి 45 వ‌య‌సుల వారికి, 45 నుంచి 60 ఏళ్ల వ‌య‌స్సు వారికి వ్యాక్సినేష‌న్ అంద‌జేశామ‌ని గుర్తు చేశారు. 18 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌సు వారికే ఇంకా వ్యాక్సినేష‌న్ చేయ‌లేదుకాబ‌ట్టి మూడో ద‌శ‌లో వారిపై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. కావున పిల్ల‌ల ఆరోగ్యంపై త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త వ‌హించాల‌ని, ఒక వేళ వ్యాధి సోకితే ముందుగానే ల‌క్ష‌ణాలను గుర్తించేలా వైద్యులు అంద‌రిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల‌ను లేనిపోని అపోహ‌ల‌కు గురి చేయ‌వ‌ద్ద‌ని థ‌ర్డ్ వేవ్‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌టం ద్వారా వారిలో ధైర్యం నింపాల‌ని చెప్పారు. కార్య‌క్ర‌మంలో డీసీహెచ్ఎస్ డా. నాగ‌భూష‌ణ‌రావు, మిమ్స్ డైరెక్ట‌ర్ డా. భాస్క‌ర‌రాజు, స్పెష‌ల్ ఆఫీస‌ర్ హ‌రికిష‌న్ కుమార్‌, డా. వెంక‌టేశ్వ‌రరావు, వివిధ విభాగాల‌కు చెందిన ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు వైద్యులు, న‌ర్శింగ్ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-17 06:57:57

అప్పన్నకు మంత్రి వెల్లంపల్లి పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని  దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ ను రూపుమాసిపోయి ప్రజలు సాధారణ పరిస్థితి వచ్చేలా దీవించాలంటూ స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. కళ్యాణమండపాన్ని సందర్శించి శిల్పాలకు ప్రత్యేక తైలంతో శుద్ధిచేసిన కార్యక్రమాన్ని ప్రశంసించారు. అంతకు ముందు దేవాలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనాన్ని అందించారు.  ఈఓ మంత్రికి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ట్రస్టు ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు.

Simhachalam

2021-06-17 06:29:59