1 ENS Live Breaking News

రోడ్డు వెడల్పు అంచనాలు సమర్పించాలి..

విశాఖ జీవిఎంసీ పరిధిలోని చిన్నముషిడివాడ ప్రధాన రహదారి (శారదా పీఠం రోడ్డు) వెడల్పునకు అంచనాలను తయారుచేసి కౌన్సిల్ ఆమోదానికి పంపాలని కమిషనర్ డా.జి.స్రిజన ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని 8వజోన్ పరిధిలోని చిన్న ముషిడివాడ తదితర ప్రాంతాలలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను మార్చాలని అధికారులను ఆదేశించారు. చిన్న ముషిడివాడ మెయిన్ రోడ్డులో ఉన్న పార్కును అభివృద్ధి చేయాలని, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆమె మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెట్లను పెంచి పచ్చదనాన్ని పెంపొందించాలని, నిషేదిత ప్లాస్టిక్ ను విడనాడాలని, వర్షపు నీటిని ఆదా చేయాలని కమిషనర్ తెలిపారు. అనంతరం రూ.1.12కోట్ల వ్యయంతో సత్య నగర్ పార్కును అభివృద్ధి పరచాలని, దీనిని ఆగస్టు నాటికి యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రూ.48 లక్షల వ్యయంతో సత్యనగర్ లో ప్రధాన కాలువలను మరమత్తులు చేపట్టుటకు కౌన్సిల్ ఆమోదం కొరకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. పులగాని పాలెం 40 అడుగుల రోడ్డు విస్తరణ కొరకు అంచనాలను తయారు చేసి కౌన్సిల్ ఆమోదం కొరకు పంపాలని కమిషనర్ ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సేనాపతి వసంత, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, పర్యవేక్షక ఇంజినీరు రాజారావు, జోనల్ కమిషనర్ చక్రవర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మధుకుమార్, కార్యనిర్వాహక ఇంజనీర్ (మెకానికల్) చిరంజీవి, ఎఎంఒహెచ్ లక్ష్మి తులసి, అసిస్టెంట్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. 

చినముషిడివాడ

2021-06-05 12:33:29

పర్యావరణాన్ని మొక్కతోనే కాపాడాలి..

పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకట కుమారి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జీవిఎంసీ ప్రాంగణంలో  మేయర్ శనివారం డిప్యుటీ మేయర్ జియ్యాని శ్రీధర్ తో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 1972 జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా  ప్రకటించిందని, అప్పటినుండి పర్యావరణ పరిరక్షణకు  యావత్ ప్రపంచం కృషి చేస్తుందని అందులో భాగంగా మన విశాఖపట్నంలో  మొక్కలు నాటే కార్యక్రమం నా చేతుల మీదుగా  నాటడం నా అదృష్టంగా భావిస్తున్నానని మేయర్ తెలిపారు.  జీవ వైవిధ్యాన్ని, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటం లో అడవులు పాత్ర ఎంతో కీలకమైనదని,  రోజురోజుకు భూమిపై పచ్చదనం నశించిపోతుందని,  మానవుడు చెట్లను నరికి పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారని,  అడవులను నరికి నందు వలన అకాల వర్షాలు, అధిక ఎండలు, కరువు ఏర్పడి మానవజాతి మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని,  ఒక చెట్టు తొలగించే ముందు దాని స్థానంలో ఐదు మొక్కలు నాటాలని, నేడు ప్లాస్టిక్ భూతం పర్యావరణానికి అడ్డంకిగా మారిందని, కాలువలోను, గెడ్డలలోను చెత్త మరియు ప్లాస్టిక్ వస్తువులు వేయడం వలన చాలా వరకు నష్టం చేకూరుతుందని,  పర్యావరణ పరిరక్షణకు ప్రతి పౌరుడు కృషి చేయాలని అప్పుడే మనిషి దగ్గరకు ఎటువంటి రోగాలు దరిచేరవని మేయర్ తెలిపారు. డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ మాట్లాడుతూ, ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జివిఎంసి మేయర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగిందని,  చెట్లు  వలన మనకు ప్రాణవాయువు లభిస్తుందని అలాంటి చెట్లను నరికి వేయడం వలన మానవ మనుగడకే ప్రమాదం అని, కావున ప్రతి ఒక్కరు తమ ఇంటిముందు మొక్కలు  నాటాలని సూచించారు.  మన విశాఖ ఇప్పటికే పచ్చదనంతో మెరుస్తుందని, దీనిని మరింత  పచ్చదనంతో తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి అదనపు కమిషనర్ ఆషాజ్యోతి,  ఎ.డి.(హార్టికల్చర్) ఎం. దామోదర రావు,  ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, కార్యనిర్వాహక ఇంజనీర్ (పి.ఎల్.&సి) మెహర్ బాబా,  డాక్టర్ మురళీ మోహన్, యు.ఎన్.డి.పి. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-06-05 12:25:39

సింహాద్రి అప్పన్నకు మంత్రి అవంతి పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ  నరసింహస్వామి వారికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శనివారం సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి కుటుంబానికి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆపై  కప్పస్తంభం ఆలింగనం చేసుకున్నారు. పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ఈఓ మంత్రికి ముత్తంశెట్టికి  ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో సింహాచలం బోర్డ్ సభ్యులు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, ఆలయ అధికారులు  పాల్గొన్నారు.

సింహాచలం

2021-06-05 12:19:18

విద్యా ఉపాదికే ప్రభుత్వం పెద్దపీట..

భ‌విష్య‌త్తులో యువ‌త‌కు సుస్థిర ఉపాధి, నాణ్య‌మైన జీవితం ల‌భించాల‌నే ల‌క్ష్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఉన్న‌త నైపుణ్యాలు, విలువ‌ల‌తో కూడిన విద్య‌ను అందించేందుకు కృషిచేస్తోంద‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూల‌పు సురేష్ పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పినిపే విశ్వ‌రూప్‌, వ్య‌వ‌సాయ శాఖా మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు, బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ‌,  రాష్ట్ర ఉన్న‌త విద్యాశాఖ స్పెష‌ల్ ఛీఫ్ సెక్ర‌ట‌రీ, జేఎన్‌టీయూకే ఇన్‌ఛార్జ్ ఉప‌కుల‌ప‌తి స‌తీష్‌చంద్ర‌, ఎంపీ వంగా గీత‌, ఎమ్మెల్సీ పండుల ర‌వీంద్ర‌బాబు, కాకినాడ అర్బ‌న్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి త‌దిత‌రుల‌తో క‌లిసి విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూల‌పు సురేష్ శ‌నివారం కాకినాడ జేఎన్‌టీయూలో ఏర్పాటుచేసిన భార‌త‌ర‌త్న బాబాసాహెబ్ డా. బీఆర్ అంబేడ్క‌ర్ కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. అనంత‌రం యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లో రూసా నిధుల‌తో నిర్మించ‌నున్న పీజీ బాలుర వ‌స‌తి గృహానికి శంకుస్థాప‌న చేశారు. నేష‌న‌ల్ స‌ర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్‌) ఆధ్వ‌ర్యంలో ఏర్పాటుచేసిన జ‌గ‌న‌న్న ప‌చ్చ‌తోర‌ణం కార్య‌క్ర‌మంలో పాల్గొని మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా స‌హ‌చ‌ర మంత్రుల‌తో క‌లిసి విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ మీడియాతో మాట్లాడుతూ బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ఆశాజ్యోతి బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేడ్క‌ర్ ఆశ‌యాల‌కు అనుగుణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యా రంగంలో విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌లు అమ‌లుచేస్తోంద‌ని తెలిపారు. 

ఈ మార్పులు, సంస్క‌ర‌ణ‌లు దేశానికే ఆద‌ర్శ‌వంతంగా నిలుస్తున్నాయ‌ని, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లిష్ మాధ్య‌మంలో బోధ‌న‌, సీబీఎస్ఈ పాఠ్య‌ప్ర‌ణాళిక అమ‌లుకు గౌర‌వ ముఖ్య‌మంత్రి కృషిచేస్తున్నార‌న్నారు. నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వ‌ర్క్ (ఎన్ఐఆర్ఎఫ్‌)లో తొలి ప‌ది స్థానాల్లో ఎస్‌వీయూ, ఏయూ, జేఎన్‌టీయూ త‌దిత‌ర విశ్వ‌విద్యాల‌యాల‌ను నిలిపే ల‌క్ష్యంతో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, విద్య‌లో ప్ర‌మాణాలు పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. అత్యున్న‌త నైపుణ్యాల‌తో ఉన్న‌త విద్య‌ను అందించే ల‌క్ష్యంతో విద్యా రంగంలో స‌మూల మార్పుల‌కు ప్ర‌భుత్వం కృషిచేస్తోంద‌న్నారు. విద్యారంగంలో జ‌గ‌న‌న్న విద్యాదీవెన‌, వ‌స‌తి దీవెన వంటి సంక్షేమ కార్య‌క్ర‌మాలు కూడా అమ‌ల‌వుతున్నాయ‌ని, మ‌న‌బ‌డి-నాడునేడు ద్వారా పాఠ‌శాల‌ల రూపురేఖ‌లు పూర్తిగా మారిపోయాయ‌న్నారు. నాడునేడు తొలిద‌శ‌లో రూ.3,600 కోట్లు, రెండో ద‌శ‌లో దాదాపు రూ.నాలుగు వేల కోట్ల‌తో పాఠశాల‌ల‌ను అభివృద్ధి చేస్తున్న‌ట్లు తెలిపారు. జూనియ‌ర్‌, డిగ్రీ క‌ళాశాల‌ల‌ను కూడా మౌలిక వ‌స‌తులు, విద్యా ప్ర‌మాణాల ప‌రంగా అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు తెలిపారు. విద్యార్థి జీవితంలో ప‌రీక్ష‌లు చాలా ముఖ్య అంశ‌మ‌ని, త‌ల్లిదండ్రుల ఆందోళ‌న‌, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప‌రీక్ష‌ల‌ను వాయిదావేశామ‌ని, కోవిడ్ ఉద్ధృతి త‌గ్గిన త‌ర్వాత అన్ని జాగ్ర‌త్త‌ల‌తో ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని, జులై నాటికి ప‌రిస్థితి కుదుట‌ప‌డే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని వెల్ల‌డించారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ వ‌ల్ల ఉన్న‌త విద్యాకోర్సుల్లో ప్ర‌వేశాలు, పోటీప‌రీక్ష‌లు త‌దిత‌రాల ప‌రంగా విద్యార్థుల‌కు ఇబ్బందులు త‌ప్పుతాయ‌న్నారు. కోవిడ్ మేనేజ్‌మెంట్  విష‌యంలో రాష్ట్రంలో తీసుకుంటున్న చ‌ర్య‌లు ఇత‌ర రాష్ట్రాల‌కు స్ఫూర్తిగా నిలుస్తున్నాయ‌ని మంత్రి ఆదిమూల పు సురేష్ స్ప‌ష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో జేఎన్‌టీయూ-కాకినాడ రిజిస్ట్రార్ ప్రొఫెస‌ర్ సీహెచ్ స‌త్య‌నారాయ‌ణ‌; జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిట‌రింగ్ క‌మిటీ స‌భ్యులు న‌క్కా చిట్టిబాబు, వ‌ర్సిటీ అధికారులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-05 12:07:20

జూన్ 8న డిడిఆర్సీ సమావేశం..

విజ‌య‌న‌గ‌రం జిల్లా అభివృద్ధి స‌మీక్ష మండ‌లి స‌మావేశం జూన్ 8వ తేదీన ఉద‌యం 10.30 గంట‌ల‌కు క‌లెక్ట‌ర్ కార్యాల‌య ఆడిటోరియంలో జ‌రుగుతుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి  వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అధ్య‌క్ష‌త‌న జ‌రిగే స‌మావేశంలో జిల్లాకు చెందిన ఉప ముఖ్య‌మంత్రి  పాముల పుష్ప‌శ్రీ‌వాణి, పుర‌పాల‌క శాఖ మంత్రి  బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, జిల్లాకు చెందిన పార్ల‌మెంటు స‌భ్యులు, శాస‌న‌స‌భ్యులు, శాస‌న మండ‌లి స‌భ్యులు పాల్గొంటార‌ని పేర్కొన్నారు. అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల జిల్లాస్థాయి అధికారులు ఈ స‌మావేశంలో పాల్గొంటార‌ని తెలిపారు. జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి కార్య‌క్ర‌మాల అమ‌లుపై ఈ స‌మావేశంలో చ‌ర్చిస్తార‌ని వెల్ల‌డించారు.

విజయనగరం

2021-06-05 11:58:39

ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి..

ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని  శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు  పిలుపునిచ్చారు. శనివారం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవస్థానం పరిధిలోని గోశాల వద్ద సహచర సభ్యులతో కలిపి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా గంట్ల మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరూ తమ ఇంటి ఆవరణలోనే  మొక్కలను నాటాలన్నారు. చిన్న పిల్లలకు ఇప్పటి నుంచే మొక్కలు నాటడం ఆలవాటు చేస్తే వారి తరం వచ్చేసరికి పచ్చదనం పరిఢవిల్లుతుందన్నారు. ముఖ్యంగా ఫలసాయాలు, పచ్చదనం ఇచ్చే మొక్కలు నాటడం ద్వారా అవి భావి తరాల వారికి ఎంతో బాగ ఉపయోగపడతాయన్నారు.  ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది కూడా పాల్గొని మొక్కలు నాటారు.

Simhachalam

2021-06-05 03:39:30

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి..

పర్యావరణ పరిరక్షణలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని  శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానం అనువంశిక ధర్మకర్త సంచయిత గజపతి పిలుపునిచ్చారు. శనివారం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవస్థానం పరిధిలోని తోటల్లో ఆమె ఈఓతో  కలిపి పండ్ల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరూ తమ ఇంటి ఆవరణలోనే రెండు మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతలు వారే చూసుకోవాలన్నారు. ముఖ్యంగా ఫలసాయాలు, పచ్చదనం ఇచ్చే మొక్కలు నాటడం ద్వారా అవి భావి తరాల వారికి ఎంతో బాగ ఉపయోగపడతాయన్నారు. అంతేకాకుండా వాతావరణ కాలుష్యం కాకుండా అడ్డుకోవడానికి మంచి ఆయుధంగా కూడా పనిచేస్తాయన్నారు. భూమితల్లి ఒడిలో తమ బిడ్డల్లా మొక్కలను పెంచి మన చుట్టూ వున్న వాతావరణాన్ని పచ్చగా చేసుకోవడం ద్వారా మనం పీల్చే గాలికూడా స్వచ్ఛంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది కూడా పాల్గొని మొక్కలు నాటారు.

Simhachalam

2021-06-05 02:45:55

ఎన్ఎంఆర్ ఉద్యోగుల వేతనాలు పెంపు..

నామిన‌ల్ మ‌స్ట‌ర్ రోల్ (ఎన్ఎంఆర్‌) 2021-22 సంవత్సరానికి ఉద్యోగులు, కార్మికులకు రోజువారీ క‌నీస వేత‌నాలను నైపుణ్యం గ‌ల‌వారికి రూ.650,  పాక్షిక నైపుణ్యాలున్న వారికి రూ.460, నైపుణ్యం లేని వారికి రూ.370 లుగా పెంచుతూ నిర్ణ‌యించిన‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. శుక్ర‌వారం క‌లెక్ట‌ర్  అధ్య‌క్ష‌త‌న ఎన్ఎంఆర్ పద్దతిలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు వేత‌న నిర్ణయం పై ప్ర‌త్యేక క‌మిటీ స‌మావేశం వ‌ర్చువ‌ల్‌గా జ‌రిగింది. వినియోగ‌దారు ధ‌ర‌ల సూచీ (సీపీఐ) ఆధారంగా మదింపు చేసి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీస‌ర్, కార్మిక‌శాఖ డిప్యూటీ క‌మిష‌న‌ర్‌లు వేత‌నాల‌పై రూపొందించిన ప్ర‌తిపాద‌న‌ల‌పై క‌మిటీ చ‌ర్చించింది. అదే విధంగా 2020-21లో నిర్దేశించిన నైపుణ్యం ఉన్న‌వారికి రూ.643, మ‌ధ్య‌త‌ర‌హా నైపుణ్యం ఉన్న‌వారికి రూ.460, నైపుణ్యం లేనివారికి రూ.367 వేత‌నాలకు, ప్ర‌స్తుత ప్ర‌తిపాద‌న‌ల మ‌ధ్య వ్య‌త్యాసాల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జి.రాజ‌కుమారి స‌మావేశంలో వివ‌రించారు. అన్ని అంశాల‌నూ సహేతుకంగా ప‌రిశీలించిన మీద‌ట క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి.. 2021-22కు కొత్త క‌నీస వేత‌నాల‌ను సవరిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. జిల్లాలో న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం కింద భారీఎత్తున జ‌ర‌గ‌నున్న ఇళ్ల నిర్మాణాలు, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ను దృష్టిలో ఉంచుకొని వేత‌నాల‌ను స్థిరీకరించామని క‌లెక్ట‌ర్ తెలిపారు. ఉపాధి క‌ల్పించే వారికి, ఉపాధి పొందే వారికి ఇద్ద‌రికీ ఇబ్బంది లేకుండా స‌మ‌తుల్యం పాటిస్తూ క‌మిటీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. కొత్త వేత‌నాల‌ను ప‌టిష్టంగా అమ‌ల‌య్యేలా సంబంధిత శాఖ‌ల అధికారులు చూడాల‌ని, నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై కేసులు న‌మోదు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, సీపీవో బాలాజీ, కార్మిక శాఖ అదనపు కమిషనర్ ఎన్. బుల్లిరాణి తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-04 16:00:24

చంద్రుడూ గుడ్ జాబ్..సీఎం వైఎస్ జగన్..

తాడిపత్రి తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'చంద్రుడూ.. గుడ్ జాబ్' అంటూ జిల్లా కలెక్టరు గంధం చంద్రుడును అభినందించారు. కోవిడ్ కష్ట కాలంలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ నిల్వలను ఉపయోగించుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రిని నిర్మించిన జిల్లా అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. అంతకు ముందుు సీఎం వర్చువల్ విధానంలో ఆసుపత్రిని ప్రారంభించారు.  ఆసుపత్రి నిర్మాణంలో పాలు పంచుకున్న అర్జాస్ స్టీల్స్, మేఘా గ్రూప్ మరియు ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఆసుపత్రిలో డాక్టర్లు అవసరమైతే స్వతహాగా డాక్టర్లైన ఎమ్మెల్యేలైన మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి సేవలను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి సరదాగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నుంచి అభినందనలు దక్కడపై జిల్లా కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చే వారికి బెడ్డు లేదు అని ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారం 500 ఆక్సిజన్ పడకలతో తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణం చేపట్టి, అహర్నిశలూ పని చేశామని, కేవలం రెండు వారాల్లో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయగలగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. తమ కష్టానికి ముఖ్యమంత్రి నుంచి అభినందన దక్కడం బోనస్ అన్నారు.  ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ .. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆసుపత్రిలో కడప, కర్నూలు జిల్లాల ప్రజలకు పడకలు కేటాయిస్తామన్నారు. కేవలం 14 రోజుల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం జరిగిందన్నారు. ఆక్సిజన్ అందిస్తున్న అర్జాస్ స్టీల్స్,  ఆక్సిజన్ సరఫరా కోసం కాపర్ పైపులు అందించిన మేఘా గ్రూప్ మరియు స్థల దాతలకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. 

Tadipatri

2021-06-04 15:53:02

రుణాలు సత్వరమే వచ్చేలా చూడండి..

జగనన్న తోడు పథకంలో అర్హులందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీన లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో రుణాలు జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించనున్న నేపధ్యంలో జిల్లాలోని పరిస్థితిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శుక్రవారం తన ఛాంబర్లో సమీక్షించారు.
చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారికి వడ్డీ లేని రుణాలు ఇప్పించి వారిని ఆదుకోవాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి ఈ పథకాన్నిఆన్ లైన్ చేస్తున్నందున అర్హులంద రూ లబ్దిపొందేలా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 32,248 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు ఈ సందర్భంగా కలెక్టరుకు తెలిపారు. వీరిలో పట్టణ ప్రాంతాల్లోని 10 వేల మందికి పి.ఎమ్. స్వనిధి నిధులను పి.డి.సి.సి. బ్యాంకు ద్వారా అందించాల్సి ఉందన్నారు. మిగ తావారికి డి.ఆర్.డి.ఏ. ద్వారా స్త్రీనిధి నిధులతో ఈ ఆర్థిక సహాయం అందించాల్సి ఉందని వారు వివరించారు. అయితే బ్యాంకుల వద్ద కొన్ని దరఖాస్తులు పరిశీలన పెండింగ్ లో ఉందని అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వీటిని వెంటనే పరిష్కరించి అర్హులందరికీ రుణాలు మంజూరు చేసేలా చూడాలని బ్యాంకు అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.ఎస్. చేతన్ (సచివాలయాలు, అభివృద్థి), డి.ఆర్.డి.ఏ. పి.డి. బాబూరావు, మెప్మా పి.డి. పి.వి. నారాయణ, ఎల్.డి.ఎమ్. యుగంధర్, పి.డి.సి.సి. బ్యాంకు సి.యి.ఓ. శివకోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు

2021-06-04 15:37:23

సుందర నగరంగా మన ఒంగోలు..

మన ఒంగోలు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర విద్యుత్, అటవీ శాస్త్ర సాంకేతిక, పర్యావరణ శాఖ మంత్రి  బాలినేని శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని 2.93 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడుతూ ఒంగోలు నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆమలు చేయడానికి ప్రణాళికలు తయారు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఒంగోలు నుండి కొప్పోలు రహదారిలో97లక్షల రూపాయల తో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. అలాగే గుంటూరు రోడ్లు లో మరియు కర్నూలు రోడ్డు లో 1.96కోట్ల రూపాయల తో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందనిఆయన అన్నారు.ఒంగోలు నగరంలో కోవిడ్ వల్ల అభివృద్ధి పనులు జ్యా పము జరుగుతుందన్నారు. త్వరలో ఒంగోలు నగరం లో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన చెప్పారు. కోవిడ్ నియంత్రణ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కారంచేడు ప్రభుత్వ వైద్యులు ఆరోగ్యం కాపాడటానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు.  ప్రభుత్వ వైద్యులు ఊపితిత్తులు మార్పిడి కోసం అయ్యే ఖర్చు1.5కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి ఇవ్వడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎస్.ఎన్. పాడు ఎమ్మెల్యే టి.జె.ఆర్.సుధాకర్ బాబు, ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీవ్ మేయర్ వేమూరి సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి, ఇ.ఇ సుందర్ రామిరెడ్డి, వై.సి.పి నాయకులు ఐ.ఘన శ్యామ్, సింగరాజు వెంకట్రావు, కటారి శంకర్ రావు,తదితరులు పాల్గొన్నారు. 

Ongole

2021-06-04 15:33:33

తిరుమ‌లలో ఘనంగా హనుమజ్జయంతి..

తిరుమల క్షేత్రంలోని అంజ‌నాద్రి కొండ‌పై ఆంజ‌నేయ‌స్వామివారు జ‌న్మించిన ఆకాశ గంగ తీర్థం వ‌ద్ద హ‌నుమ‌జ్జ‌యంతి వేడుక‌లను శుక్ర‌వారం తొలిసారిగా టిటిడి ప్రారంభించిన‌ట్లు టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి తెలిపారు. ఐదు రోజుల పాటు ఈ ఉత్స‌వాల‌ను అకాశ‌గంగ‌, జాపాలి వ‌ద్ద నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు.  ఇందులో భాగంగా ఆకాశ‌గంగ వ‌ద్ద అంజ‌నాదేవి, బాల ఆంజ‌నేయ‌స్వామివారికి నిర్మించిన ఆల‌యంలో అభిషేకం, త‌మ‌ల‌పాకుల‌తో పూజ‌, మ‌ల్లె పూల‌తో అర్చ‌న నిర్వ‌హించామ‌న్నారు. అదేవిధంగా శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహానికి అభిషేక, అర్చన, నివేదనలు నిర్వహించిన‌ట్లు తెలిపారు. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌ధ్యంలో ఇక్క‌డ‌కు రాలేని భ‌క్తులు ఎస్వీబిసి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వీక్షించి స్వామివారి అనుగ్ర‌హ‌నికి పాత్రులు కావాల‌ని కోరారు. ఈ ఉత్స‌వాల‌కు ఏర్పాట్లు చేసిన టిటిడి సిబ్బందిని ఆయ‌న అభినందించారు.  అనంత‌రం రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళిధ‌ర్ శ‌ర్మ మాట్లాడుతూ వైశాఖ శుద్ధ ద‌శ‌మినాడు హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాలు నిర్వ‌హిస్తార‌న్నారు. స్కంధ పురాణంలో తెలిపిన విధంగా మాతంగా మ‌హ‌ర్షి సూచ‌న మేర‌కు అకాశ‌గంగ తీర్థం వ‌ద్ద అంజ‌నాదేవి వేలాది సంవ‌త్స‌రాలు త‌ప‌స్సు చేసి ఆంజ‌నేయ‌స్వామివారికి జ‌న్మ‌నిచ్చిన‌ట్లు చెప్పారు. ఇప్పుడు ఆల‌యం నిర్మించిన ప్ర‌దేశంలోనే అంజ‌నాదేవి త‌ప‌స్సు చేసిన‌ట్లు తెలిపారు. భార‌తీయ స‌నాత‌న ధ‌ర్మం, సంస్కృతికి మూల‌మైన పురాణాల‌ను అనుస‌రించి ఆంజ‌నేయ‌స్వామివారు ఇక్క‌డ జ‌న్మించార‌ని వివ‌రించారు. త‌రువాత అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారిణి  జ‌యంతి సావిత్రి బృందం హ‌నుమంతుని వైభ‌వంపై హ‌రిక‌థ పారాయ‌ణం చేశారు. ఈ పూజ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు. సివిఎస్వో  గోపినాధ్ జెట్టి దంప‌తులు, ఎస్వీబిసి సిఇవో  సురేష్ కుమార్‌, విజివో  బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 9.00 గంటలకు ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వ‌హించారు.

Tirumala

2021-06-04 15:29:32

జాపాలి ఆంజనేయునికి పట్టు వస్త్రాలు..

తిరుమలలోని జాపాలి తీర్థంలో గల శ్రీ ఆంజనేయస్వామివారికి హనుమజ్జయంతి సంద‌ర్భంగా టిటిడి అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు శుక్ర‌వారం ఉద‌యం పట్టు వస్త్రాలు స‌మ‌ర్పించి ప్ర‌త్యేక పూజ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ ఆకాశ గంగ తీర్థంలో అంజ‌నాదేవి త‌ప‌స్సు చేసి వాయుదేవుని ఆశీర్వ‌దంతో ఆంజ‌నేయ‌స్వామివారికి జ‌న్మ‌నిచ్చింద‌న్నారు. త్రేత‌యుగంలో అంజ‌నాద్రి కొండ‌పై జాపాలి మ‌హ‌ర్షి త‌ప‌స్సు చేసి ఆంజ‌నేయ‌స్వామివారిని ప్ర‌స‌న్నం చేసుకున్నార‌ని తెలిపారు. కావున ఈ క్షేత్రానికి జాపాలి క్షేత్రం అని పేరు వ‌చ్చింద‌ని, ఇక్క‌డ ఉన్న స్వామివారు స్వ‌యంభూ అని వివ‌రించారు. దుష్ట శ‌క్తుల‌ను సంహ‌రించే ఆంజ‌నేయ‌స్వామివారు క‌రోనా మ‌హ‌మ్మ‌రిని నిర్ములించి లోకంలోని ప్ర‌జ‌ల‌కు ఆయురారోగ్యాల‌ను ప్ర‌సాదిస్తార‌న్నారు. అంత‌కుముందు ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న టిటిడి అద‌న‌పు ఈవో దంప‌తులకు, సివిఎస్వో  గోపినాధ్ జెట్టి దంప‌తుల‌కు హ‌థీరాంజీ మ‌ఠం మ‌హంతు  అర్జున్‌దాస్ స్వాగ‌తం ప‌లికారు.  కారోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారికి అభిషేకం, పూజ కార్య‌క్ర‌మాల‌ను ఏకాంతంత‌గా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా జాపాలి క్షేత్రంలో టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి  పి.ఆర్‌.ఆనంద తీర్థాచార్యులు ఆధ్వ‌ర్యంలో క‌ళాకారులు ఉద‌యం 10 నుంచి 11 గంటల వరకు హనుమాన్ చాలీసా ప‌ఠించారు. అనంత‌రం అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య ద‌క్షిణామూర్తి శ‌ర్మ ఆధ్వ‌ర్యంలో అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు భాగ‌వ‌తార్ ఆంజ‌నేయ‌స్వామివారి అవిర్భంపై హ‌రిక‌థ పారాయ‌ణం చేశారు.  ఈ కార్యక్రమాల్లో  శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాధ్‌, ఒఎస్‌డి  పాల శేషాద్రి, ఆరోగ్యశాఖాధికారి డా.ఆర్.ఆర్.రెడ్డి, ఎస్టేట్ విభాగం డెప్యూటీ ఈవో  విజ‌య సార‌ధి, విజివో  బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-06-04 15:26:55

హ‌నుమ‌త్ సేవ.. అష్ట‌సిద్ధుల‌కు త్రోవ..

లోకంలోని మాన‌వులలో ఎవ‌రైతే హ‌నుమంతుడిని సేవిస్తారో వారికి అష్ట‌సిద్ధులు సిద్ధిస్తాయ‌ని ప్ర‌ముఖ పండితులు, జాతీయ సంస్కృత విశ్వ విద్యాల‌యం ఆచార్యులు రాణి స‌దాశివ‌మూర్తి ఉద్ఘాటించారు. తిరుమ‌ల‌లో హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాల్లో మొద‌టి రోజైన శుక్ర‌వారం నాద‌నీరాజ‌నం వేదిక‌పై  హ‌నుమంతుడు - అష్ట‌సిద్ధులు అనే అంశంపై ప్ర‌వ‌చన‌ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఉప‌న్య‌సిస్తూ యోగశాస్త్రంలో ప్ర‌సిద్ధి చెందిన ఎనిమిది సిద్ధులు ఉన్నాయ‌ని, అందులో అణిమ, మహిమ, ల‌ఘిమ‌, గ‌రిమ‌, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశ‌త్వం, వ‌శీత్యం ఉన్నాయ‌న్నారు. వెంక‌టాద్రి క్షేత్రంలోని అంజ‌నాద్రి కొండ‌పై జ‌న్మించిన ఆంజ‌నేయ‌స్వామిలో జ‌న్మ‌తః ఈ అష్ట‌సిద్ధులు ఉన్నాయ‌ని, అందువ‌ల‌నే సూర్యుని పండుగా భావించి సూర్య మండ‌లానికి వెళ్లాడ‌ని తెలిపారు. సుంద‌ర‌కాండ‌లో హ‌నుమంతుని ప్ర‌వేశం నుండి యుద్ధ కాండ చివ‌రి వ‌ర‌కు అష్ట‌సిద్ధుల వ‌ల‌న ఆయ‌న లోకానికి అద్భుతాల‌ను చూపించి రామాయ‌ణాన్ని ఒక సుంద‌ర‌ ఇతి హ‌సంగా మ‌ల‌చ‌డానికి కార‌ణం అయ్యార‌న్నారు.   స‌క‌ల దేవ‌తా స్వ‌రూప‌ముగా, రుద్రావ‌తార మూర్తిగా, వాయుదేవుని అంశ‌తో ఉద్భ‌వించిన ఆంజ‌నేయ‌స్వామి లోకాల‌ను అలంరించిన తీరు అద్భుత‌మ‌న్నారు. యోగ శాస్త్రంలో వాయు బంధ‌నం చేసి య‌మ నియ‌మ ఆశ‌నాదుల ద్వారా సాధ‌న చేసిన సాధ‌కుడు అష్ట‌సిద్ధుల‌ను పొంద‌గ‌ల‌ర‌ని చెప్పారు. అన్ని వ్య‌వ‌హ‌రాల్లో సాఫ‌ల్యం సాధించ‌డానికి ఆంజ‌నేయ‌స్వామిని ఉపాస‌న చేయ‌డం వ‌ల‌న అష్ట‌సిద్ధులు పొంద‌వ‌చ్చ‌ని వివ‌రించారు.   మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి విగ్రహానికి మ‌ధ్యాహ్నం 3 నుండి 3.30 గంట‌ల వ‌ర‌కు టిటిడి పూజా కార్యక్రమాలను నిర్వహించింది.

Tirumala

2021-06-04 15:24:32

స్వచ్ఛంద సంస్థలకు సహకారం అవసరం..

కోవిడ్ పై పోరులో స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యం అత్యంత విలువైనదని  జిల్లా సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ) కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. శుక్రవారం  కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ)  దినేష్ కుమార్ అధ్యక్షతన జిల్లా స్థాయి స్వచ్ఛంద సేవా సంస్థల సమన్వయ కమిటి సమావేశం జరిగింది. సందర్భంగా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ నివారణ కొరకు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ యంత్రాంగం కలిసి ప్రణాళికా బద్ధంగా పని చేసినట్లైతే మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జిల్లాస్థాయి ప్రభుత్వ సంస్థలు మరియు ఎన్.జి.ఓ కో- ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. కోవిడ్ ను ఎదుర్కొనడానికి చేపడుతున్న చర్యలలో భాగంగా అవసరమైన ప్రాజెక్ట్ నివేదికలను తయారుచేయడానికి, పరికరాలను సమకూర్చుకోవడానికి, మానవ  వనరుల సైన్యాన్ని తయారు చేసుకోవడానికి, వివిధ స్థాయిలలో నిధులను సమకూర్చుకోవడానికి స్వచ్ఛంద సేవా సంస్థల నుండి నిష్ణాతులైన వ్యక్తులు ముందుకు రావాలని ఆయన కోరారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల కు కూడా వెళ్లి  ప్రజల అవసరాల మేరకు సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం నుండి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ భాగస్వామ్యాన్ని క్షేత్రస్థాయిలో పటిష్ట పరచడానికి డివిజన్ మరియు మండల స్థాయి, గ్రామ స్థాయిలో కమిటిల ఏర్పాటుకు అవసరమైన ఉత్తర్వులను అధికారులకు త్వరలో జారీ చేస్తున్నట్లు తెలియజేశారు. జిల్లా స్థాయి ప్రభుత్వ సంస్థలు మరియు ఎన్.జి.ఓ కో- ఆర్డినేషన్ కమిటీకి సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన రావు, కన్వీనర్ గా పిల్లల రక్షణ అధికారి విజయ్ కుమార్ సభ్యులుగా నియమిస్తున్నట్లు తెలియజేశారు. ఇంకా ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ అధికారిని మనోరంజని వివిధ స్వచ్ఛంద సంస్థ లైన  రెడ్ క్రాస్, డి బి ఆర్ సి, సీడ్స్, వి ఆర్ ఓ, అసిస్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Guntur

2021-06-04 15:22:07