1 ENS Live Breaking News

స్వామి సేవలన్నీ కళ్యాణమండపంలోనే..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానంలో  స్వామివారికి ఆదివారం, గురువారం, ఏకాదశినాడు తప్ప మిగతా అన్ని రోజుల్లోనూ సహస్రనామం, అష్టత్తరాలతను కళ్యాణ మండపంలో నిర్వహించాలని నిర్ణయించినట్టు ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. ఈ మేరకు దేవస్థానంలోని అర్చకులు, ప్రధాన సిబ్బందితో ఆమే సమావేశం అయి పలు నిర్ణయాలు తీసుకున్నారు. స్వామి సేవల్లో పాల్గొన్నవారికి లైవ్ లింక్ ప్రత్యేకంగా పంపించాలని నిర్ణయించారు.  శుక్రవారం నుంచే ఈ సేవలు ప్రారంభంకానున్నాయని చెప్పిన ఈఓ.. కోవిడ్ 19 సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఈసమయంలో  స్వామిని మరింత నిశితంగా చూసేందుకు భక్తులకు అవకాశం కలుగుతోంది.  సహస్రనామాలు ఉదయం 7:00 నుంచి 8:00 గంటల వరకు , అష్టోత్తరం ఉదయం 10:30 నుంచి 11:30 వరకు, గురువారం, ఆదివారం, ఏకాదశినాడు వేరే సేవలున్న రోజుల్లో  సహస్రనామాలు, అష్టోత్తరాలుండవుని ఈఓ వివరించారు..

Simhachalam

2021-06-02 13:05:42

అప్పన్న హుండీ ఆదాయం రూ. 32.42 లక్షలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీ లెక్కింపులో 32లక్షల 42వేల 439  రూపాయల ఆదాయం సమకూరినట్టు ఈఓ ఎంవీ సూర్యకళ తెలియ జేశారు. ఈ మేరకు దేవస్థానంలో ఆమె మీడియాలో మాట్లాడారు. కోవిడ్ నిబంధన లతో దేవస్థానంలో మూడు హుండీలను లెక్కింపు చేపట్టినట్టు చెప్పారు. ఉన్న సిబ్బంది తోనే  మధ్యాహ్నం 12:00 గంటల వరకు లెక్కింపు చేపట్టినట్టు వివరించారు. మిగతా హుండీల లెక్కింపు తేదీని రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామన్నారు.  దేవస్ధాన అధికారులు, ట్రస్టు బోర్డు సభ్యుల పర్యవేక్షలో కౌంటింగ్ జరిగిందని వివరించారు. నగదుతోపాటు 70 యూరోలు, 20 డాలర్లుకూడా హుండీల్లో స్వామికి వచ్చాయని చెప్పారు.

Simhachalam

2021-06-02 12:59:43

మెప్మా పిడిగా సుధాక‌ర్‌..

విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణ పేద‌రిక నిర్మూళ‌నా సంస్థ (మెప్మా) ప్రాజెక్టు డైరెక్ట‌ర్‌గా బి.సుధాక‌ర‌రావు బుధ‌వారం అద‌న‌పు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆయ‌న ప్ర‌స్తుతం డుమా ఏపిడిగా విధులు నిర్వ‌హిస్తున్నారు. ఇది కాకుండా, 104 కాల్ సెంట‌ర్ ఇన్‌ఛార్జిగా కూడా క‌మాండ్ కంట్రోల్ రూములో బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల వ‌ర‌కూ మెప్మా పిడిగా అద‌న‌పు బాధ్య‌త‌లు నిర్వ‌హించిన‌ కె.సుగుణాక‌ర‌రావు, ఆ బాధ్య‌త‌ల‌నుంచి త‌ప్పుకోవ‌డంతో, సుధాక‌ర‌రావును ఇన్‌ఛార్జిగా నియ‌మించారు. బాధ్య‌త‌లు స్వీక‌రించిన సుధాక‌ర్‌ను ప‌లువురు అధికారులు, సిబ్బంది అభినందించారు.

Vizianagaram

2021-06-02 12:52:17

వాహనమిత్ర పధకానికి దరఖాస్తు చేసుకోండి..

ఆటో, ట్యాక్సీ, క్యాబ్ వాహ‌న‌దారుల‌కు ఆర్థిక సాయం అందించే నిమిత్తం రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న వాహ‌నమిత్ర ప‌థ‌కానికి అర్హ‌త క‌లిగిన వారు ఈ నెల 7వ తేదీ లోగా ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. ల‌బ్ధిదారుల‌కు ఒక్కొక్క‌రికి రూ.10వేల ఆర్థిక సాయం వ‌రుస‌గా మూడో సంవ‌త్స‌రం కూడా అందించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని కావున కొత్తగా వాహ‌నాలు కొనుగోలు చేసుకున్న‌వారు సంబంధిత స‌చివాల‌యంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. గ‌తంలో ద‌ర‌ఖాస్తు చేసుకొని సాయం పొందిన వారు మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేయ‌న‌వ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే పాత‌వారు స‌చివాల‌యాల్లో ల‌బ్ధిదారుల జాబితాల‌ను స‌రిచూసుకోవాల‌ని ఒక వేళ పేర్లు లేన‌ట్ల‌యితే మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని చెప్పారు. ద‌ర‌ఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, తెల్ల రేష‌న్‌ కార్డు, వాహ‌నం యొక్క రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికేట్‌, డ్రైవింగ్ లైసెన్స్‌, బ్యాంకు ఖాతా పాస్ బుక్ మొద‌టి పేజీ కాపీ, కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం స‌మ‌ర్పించాల‌ని వివ‌రించారు. వాహ‌నం భార్య పేరుమీద‌ ఉండి ఆమెకు లైసెన్స్ లేక‌పోయినా, భ‌ర్త‌కు లైసెన్స్ ఉంటే అర్హులేన‌ని చెప్పారు. అలాగే వాహ‌నం తల్లి, తండ్రి లేదా కూతురు, కుమారుడు పేరిట ఉండి లైసెన్స్ మేజ‌ర్ కుమారుడు పేరుమీద ఉన్నా ప‌థ‌కానికి అర్హులేన‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. ద‌ర‌ఖాస్తు నింప‌డంలో, నింపిన ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించ‌టంలో స‌మ‌స్యలు ఉన్న‌చో స్థానిక ఎంపీడీవో, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో సంప్ర‌దించాల‌ని సూచించారు. ఈ నెల 7వ తేదీ లోగా స‌మ‌ర్పించిన ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న ప్ర‌క్రియ 12వ తేదీలోపు పూర్త‌వుతుంద‌ని పేర్కొన్నారు. జూన్ 15వ తేదీన ముఖ్య‌మంత్రి చేతుల‌ మీదుగా అర్హులైన ల‌బ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.10వేల ఆర్థిక సాయం జ‌మ అవుతుంద‌ని వివ‌రించారు. ఈ మేర‌కు జిల్లాలో సంబంధిత విభాగాల అధికారులతో బుధ‌వారం టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి ల‌బ్ధిదారుల ఎంపిక‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశారు. సంబంధిత సాంకేతిక ప్ర‌క్రియ‌లు పూర్తి చేయాల‌ని, ల‌బ్ధిదారుల ఎంపికిలో పార‌ద‌ర్శ‌క‌త వ‌హించాల‌ని సూచించారు. టెలీకాన్ఫ‌రెన్స్‌లో సంయుక్త క‌లెక్ట‌ర్లు జి.సి. కిశోర్ కుమార్‌, జె. వెంక‌ట‌రావు, జిల్లా ర‌వాణా శాఖ ఉప క‌మిష‌న‌ర్ శ్రీ‌దేవి, సీఈవో టి. వెంక‌టేశ్వ‌రరావు, ఎంపీడీవోలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-02 12:49:21

చివరి సాగుభూమి నీరందిస్తాం..

విజయనగరం  జిల్లాలోని  సాగుభూమి అంతటికీ నీరందేలా చర్యలు చేపట్టినట్టు  జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవాహర్ లాల్  తెలిపారు.   అందుకోసం నీటి పారుదల శాఖ ఒక ప్రణాళికను తయారు చేసిందని అన్నారు.   రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు  జిల్లా ఇంచార్జ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు  ఆధ్వర్యం లో బుధవారం జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం వర్చువల్ విధానం లో  జరిగింది. ఈ సమావేశం లో జిల్లాకు చెందిన శాసన సభ్యులు, శాసన  మండలి సభ్యులు వర్చువల్ గా పాల్గొన్నారు. జిల్లా నీటి వనరుల వివరాలను, సాగు నీటి ప్రణాళికలను ఎస్.ఈ తొలుత వివరించారు.  ఈ సందర్భంగా   జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ  జిల్లాలో  5,03,250 ఎకరాల ఆయకట్  కు  నీరందించవలసి ఉందని,  భారీ , మధ్య , చిన్న తరహా నీటి పారుదల వనరుల ద్వారా 35.75 టి.ఎం.సి ల నీటి నిల్వ  సామర్ధ్యం  ఉందని,  ప్రస్తుతం 8.272 టి.ఎం.సి ల నీరు నిల్వ ఉందని  తెలిపారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నందున  సాగు నీటికి ఇబ్బంది ఉందని భావిస్తున్నామన్నారు.   వర్షాలతో పాటు అన్ని జలాశయాలను, చప్టా లను, కల్వర్ట్  లను మరమ్మతులు చేసి  నీటి సామర్ధ్యాన్ని పెంచడానికి  తగిన ప్రణాళికలు తయారు చేశామన్నారు. 
బొబ్బిలి శాసన సభ్యులు శంబంగి వెంకట  చిన్న అప్పల నాయుడు  మాట్లాడుతూ ప్రొజెక్టులకు సంబంధించిన భూ సేకరణ  చెల్లింపులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే రైతులకు చెల్లించే ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ 14.80 కోట్ల కు గాను 10.80 కోట్ల బకాయిలు చెల్లించడం జరిగిందని, మిగిలిన మొత్తం కూడా సి.ఎఫ్.ఎం.ఎస్. లో బిల్ పెట్టడం జరిగిందన్నారు.  పార్వతిపురం శాసన సభ్యులు అలజంగి జోగా రావు మాట్లాడుతూ   నీటిని నెల రోజుల ముందుగానే విడుదల చేయాలని కోరారు. సాగు నీటి సామర్ధ్యాన్ని పెంచడానికి  మైనర్ ఇరిగేషన్ టాంక్ ల సామర్ధ్యాన్ని పెంచవలసి ఉందని కలెక్టర్ ను కోరారు. నీటి విడుదల కోసం ఆయా ప్రజా ప్రతినిధులతో చర్చించి,  తేదీలను ఖరారు చేస్తామని అన్నారు.  మైనర్ టాంక్ ల అభివృద్ధి కోసం  ఇప్పటికే 50 కోట్ల విలువ గల పనుల కోసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.   సాలూరు శాసన సభ్యులు రాజన్న దొర మాట్లాడుతూ పెద్ద గెడ్డ  పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.   
జంఝావతి రబ్బర్ డ్యామ్ అంతర్ రాష్ట్ర  సమస్యను  పరిష్కరించడానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయి లో చర్చ జరగవలసి ఉందని, దీనిని ప్రభుత్వ దృష్టికి తేవడం జరిగిందని అన్నారు.  ఈ ప్రాజెక్టు  పనుల కోసం 3.8 కోట్ల తో అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు.  ప్రపంచ బ్యాంక్  నిధులతో 20 పనులు మంజూరు కాగా 17 పనులు పురోగతి లో ఉన్నాయని తెలిపారు. ఈ ఖరీఫ్ కు ప్రతి ఏకరాకు సాగు నీరు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 
ఈ వర్చువల్ కాన్ఫరెన్స్ లో  జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ పోలేశ్వర రావు, ,  బొబ్బిలి ఎస్.ఈ రాంబాబు, ఈ ఈ లు  అప్పల నాయుడు, రామచంద్ర రావు, తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.  

Vizianagaram

2021-06-02 12:47:09

వైద్య, ఆరోగ్యానికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత..

రాష్ట్రంలో ప్రజలందరికీ అత్యాధునిక వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన చర్యలతో రాష్ట్రం ‘ఆరోగ్యాంధ్రప్రదేశ్’ గా మారుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు. ఆరోగ్య సేవలకు సిఎం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, రాష్ట్రంలో 95శాతం ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యాన్ని ఉచితంగా అందించడంతో పాటుగా వేల కోట్ల రుపాయల వ్యయంతో కొత్త మెడికల్ కాలేజీలు, హెల్త్ హబ్ లు, వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నారని వివరించారు.
పార్వతీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక వైద్యశాలను బుధవారం ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగానే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్ బాధితులకు 104 కాల్ సెంటర్  ద్వారా అవసరమైన సహాయ సహకారాలను అందించడం జరుగుతోందని చెప్పారు. కోవిడ్ నియంత్రణ కోసం సిఎం చేపట్టిన చర్యలను కేంద్ర మంత్రులు కూడా ప్రశంసించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసారు. రాష్ట్ర జనాభాలో 95శాతం మంది ప్రజలు ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో ఉండగా వారికి అవసరమైన చికిత్సలన్నింటినీ పూర్తి ఉచితంగా అందించడానికి, కోవిడ్ ఆస్పత్రుల్లోనూ 50శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ పథకానికి చెందిన రోగులకే కేటాయించడానికి చర్యలు తీసుకున్నారని చెప్పారు. అధిక ఫీజులను గుంజుతున్న ఆస్పత్రులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కూడా కార్పొరేట్ వైద్యసేవలు అందించడం ద్వారా పేదలకు ఆరోగ్యభరోసాను కల్పించారని కితాబిచ్చారు. కరోనా తో పాటుగా బ్లాక్ ఫంగస్ వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి వాటికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని పేర్కొన్నారు. అనారోగ్యానికి గురైన పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యాన్ని అందించడంతో పాటుగా చికిత్సానంతరం రోగి విశ్రాంతికాలంలోనూ ఇబ్బంది పడకుండా నెలకు రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని వైయస్సార్ ఆరోగ్య భరోసాగా అందిస్తున్నారని చెప్పారు. అత్యాధునికమైన వైద్య సేవలను పొందడానికి రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాలలోని నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా 16 హెల్త్ హబ్ లను ఏర్పాటు చేయడానికి చర్యలను తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఒక వైద్య కళాశాల, 500 పడకల అత్యాధునిక ఆస్పత్రి ఉండేలా రూ.8 వేల కోట్ల వ్యయంతో ఒకేసారి 16 కొత్త మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన కూడా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి ప్రస్తావించారు. ఇప్పటికే ప్రతి మండలంలోనూ 108 ఆంబులెన్స్ వాహనాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేసారు. ఇది కాకుండా రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ప్రజల ముంగిళ్లలోకే వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను కూడా ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యల ఫలితంగా రాష్ట్రం ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మారుతోందని పుష్ప శ్రీవాణి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగారావుతో పాటుగా పార్వతీపురం మున్సిపల్ ఛేర్ పర్సన్ బోన గౌరీశ్వరి కూడా పాల్గొన్నారు.

Parvathipuram

2021-06-02 12:45:33

పంపిణీకి సిద్ధమైన పాఠ్యపుస్తకాలు..

విజయనగరం జిల్లాలోని అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థుల‌కు పంపిణీ చేసేందుకు పాఠ్య‌పుస్త‌కాలు సిద్ద‌మ‌య్యాయి. జిల్లాలో ఈ ఏడాది సుమారు  26ల‌క్షాల‌, 66వేల‌, 378 పుస్త‌కాలు అవ‌స‌ర‌మ‌ని అంచ‌నా. కాగా వీటిలో మొద‌టి విడ‌త‌గా 5ల‌క్ష‌ల‌, ఒక వెయ్యి, 471 పుస్త‌కాలు వ‌చ్చాయి. వీటిని ఆయా ప్రాంతాల్లోని గోదాముల్లో భ‌ద్ర‌ప‌రిచారు. ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా విద్యార్థుల‌కు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగ‌మ‌ణి తెలిపారు. కరోనా కేసుల ద్రుష్ట్యా ప్రత్యేక చర్యలు తీసుకొని విద్యార్ధులందరికీ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు డిఈఓ తెలియజేశారు.

Vizianagaram

2021-06-02 12:43:56

జగనన్న గోరుముద్ది విద్యార్ధులకు రక్ష..

జ‌గ‌న‌న్న గోరుముద్ద ప‌థ‌కం క్రింద విద్యార్థుల‌కు డ్రై రేష‌న్ స‌రుకుల‌ను, జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ పంపిణీ చేశారు. క‌లెక్ట‌రేట్‌లో బుధ‌వారం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ప్రాధ‌మిక పాఠ‌శాల విద్యార్థుల‌కు 4.5 కిలోలు, ప్రాధ‌మిక‌, ప్రాధ‌మికోన్న‌త పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు 6.5 కిలోలు చొప్పున కందిప‌ప్పును అంద‌జేశారు.  ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, జ‌గ‌న‌న్న గోరుముద్ద ప‌థ‌కం క్రింద‌ ప్ర‌భుత్వం పౌష్టికాహారం అంద‌జేయ‌డ జ‌రుగుతోంద‌న్నారు. క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో, పాఠ‌శాల‌లు మూసివేయ‌డం వ‌ల్ల‌, విద్యార్థుల‌కు ప్ర‌స్తుతం డ్రైరేష‌న్ స‌రుకుల‌ను పంపిణీ చేస్తున్నామ‌న్నారు. సెప్టెంబ‌రు 2020 నుంచి జ‌న‌వ‌రి 2021 వ‌ర‌కూ, ఐదు విడ‌త‌ల రేష‌న్ స‌రుకుల‌ను ప్ర‌స్తుతం అంద‌జేస్తున్నామ‌ని తెలిపారు. జిల్లాలో  మొత్తం 1,95,187 మంది విద్యార్థుల‌కు కందిప‌ప్పును త్వ‌ర‌లోనే పూర్తిగా పంపిణీ చేస్తామ‌ని చెప్పారు. ఇవి కాకుండా బియ్యం, గుడ్లు, చిక్కీల‌ను కూడా ఇప్ప‌టికే జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు.  ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగ‌మ‌ణి, ఏడి జ్యోతి, ఇత‌ర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-02 12:41:11

రేపు కోవిడ్ వేక్సినేషన్ కోసం స్పెషల్ డ్రైవ్..

విశాఖ జిల్లాలో బుధవారం జిల్లాలో కరోనా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. ఉదయం 7 గంటల నుండి జిల్లా వ్యాప్తంగా 35 పి.హెచ్.సి.కేంద్రాలలో కోవాక్సిన్, కొవిషీల్డ్  వ్యాక్సిన్లు వేయడం జరుగుతుందన్నారు. 25 కేంద్రాలలో కోవ్యాక్సిన్, 10 కేంద్రాలలో కొవిషీల్డ్   45 సంవత్సరాలు దాటిన వారికి వేస్తారని తెలిపారు.  గ్రామ సచివాలయ సెక్రటరీలు, వాలంటీర్లు వారి పరిధిలో ఉన్న అర్హులైన వారందరికీ వ్యాక్సిన్లు వేయించాలని ఆదేశించడం జరిగింది అన్నారు. మిగతా గ్రామీణ పిహెచ్ సిలు, గిరిజన ప్రాంతంలోని పి. హెచ్ సిలలో లభ్యత బట్టి వాక్సినేషన్ జరుగుతుందని. 45 సం. లు  దాటిన వారికి మాత్రమే వాక్సినేషన్ వేయడం జరుగుతుందన్నారు. కోవాక్సిన్ మొదటి రెండవ డోసులు కూడా వేస్తున్నారని పేర్కొన్న కలెక్టర్  కొవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు మాత్రమే వేస్తారని చెప్పారు.  జిల్లాలో ఇంకా  వ్యాక్సిన్ వేయించుకోని వారు   ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

విశాఖ రూరల్

2021-06-01 16:28:33

జగనన్న ఇళ్లకు ఇసుక కొరత రాకూడదు..

అనంతపురం జిల్లాలో జూన్ 3 నుంచి ప్రారంభం కానున్న జగనన్న ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గుంతకల్లు పట్టణంలో నిర్మించనున్న అర్బన్ లే ఔట్ ను సందర్శించారు.  ఈనెల3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించనున్న సందర్భంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ గుంతకల్లుకు రానున్నారు. ఈ నేపథ్యంలో అర్బన్ లే ఔట్ వద్ద నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ పర్యవేక్షించారు. 
లేఅవుట్ వద్ద మీడియా ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 2,23,000 మంది జగనన్న ఇళ్ల పట్టాలు పొందారని, వాటిలో 1,11,000 మంది ఇళ్ల నిర్మాణాలను పేజ్-1 లో చేపట్టనున్నామన్నారు. జూన్ 3న జిల్లాలో 8,000 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తామన్నారు. గుంతకల్లు ఆర్బన్ లే అవుట్ లో 143 ఇళ్లకు పునాది వేయనున్నామని తెలిపారు. 
ఆరు నెలల్లోగా ఫేజ్-1 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా పేజ్-1లో చేపట్టనున్న లక్షకు పైగా నిర్మాణాలకు కావాల్సిన ఇసుక, సిమెంట్, ఇతర సామగ్రి గురించి అంచనాలు సిద్ధం చేశామన్నారు. ఆ మేరకు సామాగ్రి కొరత రాకుండా చూసేందుకు ప్రణాళిక  చేపట్టడం జరిగిందని  తెలిపారు.
సొంతంగా ఇళ్లు నిర్మించుకునే వారికి 20 టన్నుల ఇసుక  శ్రీకారం చుడుతున్నారని్పు వరకూ నిర్మాణం సమయంలో 5 టన్నులు, ఇంటి ఫినిషింగ్ పనులకు మరో 5 టన్నులు ఇవ్వడం జరుగుతుందన్నారు. 
అన్ని వసతులతో సర్వాంగ సుందరంగా జిల్లా వ్యాప్తంగా 1045 జగనన్న కాలనీలను ఏర్పాటు  శ్రీకారం చుడుతున్న మని తెలిపారు ఇప్పటికే నీటి వసతి కోసం బోర్లు వేయించామని, విశాల మైన రోడ్లు, పచ్చదనం మొక్కలు, ఆట స్థలం వంటి వసతులతో పాటు రెండు వేల పైన జనాభా లే ఔట్లలో ఉంటే పాఠశాలలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను కూడా మంజూరు చేయనున్నామన్నారు.
నూతన ఇసుక విధానం ద్వారా జిల్లాలో జేపీ గ్రూప్ ద్వారా ఇసుక తవ్వకాలు ప్రారంభించామన్నారు. ప్రస్తుతం ఉన్న 18 ఇసుక రీచులకు అదనంగా రీచులకు అనుమతుల కోసం పర్యావరణ అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపామని, ఇసుక కొరత రానివ్వమని అన్నారు. 
రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం కోసం 53,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయనుందని, ఆ రకంగా కరోనా కష్టకాలంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం కానుందన్నారు.

ఈ కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్లు సిరి. నిశాంత్ కుమార్., ట్రైనింగ్ కలెక్టర్ సూర్య తేజ, ఆర్డీవో   గుణ భూషణ రెడ్డి. గుంతకల్ మున్సిపల్ కమిషనర్  బండి శేషన్న, హౌసింగ్ పీడీ చంద్రమౌళి ఈశ్వర్ రెడ్డి విద్యుత్ శాఖ సూపర్డెంట్ ఇంజనీర్ వర కుమార్ ఆర్డబ్ల్యూఎస్, ఎమ్మార్వో రాము, మున్సిపల్ శాఖ ఇంజనీర్లు విశ్వనాథం, తదితరులు పాల్గొన్నారు.,.

Guntakal

2021-06-01 16:23:39

2021-06-01 16:19:21

జూన్ 10 వరకూ జిల్లాలో కర్ఫ్యూ..

కోవిడ్‌-19 విప‌త్తు నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల మేర‌కు జిల్లాలో ప్ర‌స్తుతం ప్ర‌తిరోజూ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి ఉద‌యం ఆరు గంట‌ల వ‌ర‌కు అమ‌ల‌వుతున్న క‌ర్ఫ్యూను జూన్ 10 వ‌ర‌కు కొన‌సాగించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. ఈ మేర‌కు మంగ‌ళవారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. జిల్లా వ్యాప్తంగా క‌ద‌లిక‌ల‌కు అనుమ‌తించిన స‌మ‌యంలోనూ 144 సెక్ష‌న్ అమ‌ల్లో ఉంటుంద‌ని, అయిదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడకూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.  ఆసుప‌త్రులు, డ‌యాగ్నోస్టిక్ ల్యాబ్‌ల‌కు, ఫార్మ‌సీలతో పాటు అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల పంపిణీతో ముడిప‌డిన వాటికి క‌ర్ఫ్యూ నుంచి మిన‌హాయింపు ఉంటుంద‌ని తెలిపారు. కోవిడ్ వైర‌స్ వ్యాప్తిని నిరోధించేందుకు ఈ నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లుచేయాల‌ని క‌లెక్ట‌ర్ అధికారుల‌ను ఆదేశించారు.

Kakinada

2021-06-01 16:14:17

కోవాగ్జిన్ టీకా కోసం ప్రత్యేక ఏర్పాటు..

కోవాగ్జిన్ రెండవ డోసు టీకా వేయించుకునేందుకు యిపుడు ఆన్ లైన్ ల్లో  బుక్ చేసుకునే సదుపాయం ఉందని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి  ఒక ప్రకటన లో తెలియజేశారు. రాజమండ్రి, కాకినాడ అర్బన్ లో ఆన్ లైన్లో   https://selfregistration.cowin.gov.in/ లింక్ లో నమోదు చేసుకుని స్లాట్ ప్రాకారం నేరుగా వేక్సినేషన్ కేంద్రానికి  వెళ్లి టీకా వేయించు కోవచ్చునని తెలియజేశారు. ఇది సెకండ్ డోస్ టీకా లకు మాత్రమే ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. తొలిడోసు కోవాగ్జిన్ వేసుకున్నవారు రెండవ డోసు వేసుకోవడానికి ఎక్కడికీ వెళ్లలకుండానే ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని నేరుగా ఆన్ లైన్ లో తెలిపిన కేంద్రాలకు వెళ్లి వేక్సిన్ వేయించుకోవచ్చునని కలెక్టర్ ఆ ప్రకటనలో సూచించారు.

Kakinada

2021-06-01 16:11:31