1 ENS Live Breaking News

కాకినాడ ఇనోదయ ఆసుపత్రికి కలెక్టర్ షాక్..

కోవిడ్ చికిత్స‌కోసం డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం కింద చేరిన‌ప్ప‌టికీ, నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తూ రోగి నుంచి వ‌సూలు చేసిన రూ.4,50,000 సొమ్మును కాకినాడ‌లోని ఇనోద‌య ఆసుప‌త్రి తిరిగి బాధితునికి చెల్లించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి, జేసీ (డీ) కీర్తి చేకూరి స‌మ‌క్షంలో బాధితునికి రిఫండ్ చెక్కును అందించింది. ఆరోగ్య‌శ్రీ కింద కోవిడ్ చికిత్స అందించేందుకు ఆసుప‌త్రిలో చేర్చుకున్న‌ప్ప‌టికీ త‌మ నుంచి రూ.4,50,000 మొత్తాన్ని వ‌సూలు చేశారంటూ రోగి మార్ని స‌త్తిరాజు కుమారుడు కాశీవిశ్వ‌నాథం, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖరరెడ్డితో క‌లిసి క‌లెక్ట‌ర్‌కు ఇటీవ‌ల ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై జేసీ (డీ) నేతృత్వంలోని ఆరోగ్య‌శ్రీ జిల్లా క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ విచారించింది. క‌మిటీ నివేదిక మేర‌కు ఇనోదయ ఆసుప‌త్రికి రూ.22,50,000 పెనాల్టీ విధించారు. రోగి నుంచి వ‌సూలు చేసిన మొత్తాన్నితిరిగి ఆయ‌న‌కు చెల్లించాల‌ని ఆదేశించారు. ఈ మేర‌కు తాజాగా బాధితునికి రిఫండ్ చెక్కు అందించారు. ఆసుప‌త్రిలో ప‌నిచేస్తున్న ఆరోగ్య‌మిత్ర‌ను విధుల నుంచి టెర్మినేట్ చేశామ‌ని, ఆసుప‌త్రి నుంచి పెనాల్టీ మొత్తాన్ని వ‌సూలు చేసిన‌ట్లు జేసీ (డీ) తెలిపారు. జిల్లాలో ఆరోగ్య‌శ్రీ కింద చేరిన రోగుల నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసినా, వైద్య సేవ‌లు అందించ‌డంలో వివ‌క్ష చూపినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని క‌లెక్ట‌ర్ హెచ్చ‌రించారు. ఈ కార్యక్రమం లో డా.వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ జిల్లా స‌మ‌న్వ‌య‌క‌ర్త డా. పి.రాధాకృష్ణ పాల్గొన్నారు.

Kakinada

2021-06-04 13:36:31

పండుగలా జగనన్న కాలనీ నిర్మాణాలు..

గుంటూరుజిల్లాలో నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు నిర్మాణాల కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని  గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నారు. శుక్రవారం పొన్నూరు పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 99.89 ఎకరాల్లో  నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు నిర్మాణ కార్యక్రమాన్ని పొన్నూరు శాసన సభ్యులు కిలారి వెంకట రోశయ్యతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లబ్ధిదారుల బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి పొన్నూరు శాసన సభ్యులు కిలారి వెంకట రోశయ్య అధ్యక్షత వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇంత పెద్దత్తున ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం చేపట్టడం ద్వారా పేదల సొంత ఇంటి కలలను సాకారం చేయబోతున్నామని కలెక్టర్ అన్నారు. ఇళ్ళ నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వమే పేదలందరికీ తక్కువ ధరలకు నిర్మాణ సామగ్రిని అందజేస్తుందని ప్రకటించారు. ఒకేసారి లబ్ధిదారులంతా పెద్ద ఎత్తున ఇళ్ళ నిర్మాణం చేపట్టడం ద్వారా పేదలకు నిర్మాణ సామాగ్రి తక్కువ ధరలకు లభించడం, ప్రయాణ ఖర్చులు, కూలీల సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంచి మనసుతో ఆలోచించి ఈ తరహా ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. 

స్థానిక శాసన సభ్యుల చొరవతో గ్రామీణ ప్రాంతాలు,పట్టణ ప్రాంతాలకు దగ్గరలో మరిన్ని కొత్త కాలనీలు  రూపుదిద్దుకోవడం జరుగుతుందని అన్నారు. అధికారులు దగ్గరుండి మరీ పేదల ఇళ్ళ నిర్మాణాలు పూర్తి అయ్యేలా సహయ,సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. ఇళ్ళ నిర్మాణాల పనుల విషయంలో రాజీ లేకుండా లబ్ధిదారులకు ఇష్టమైన రీతిలో పూర్తిచేసి ఇవ్వాలన్నారు. ఒక్క పొన్నూరు పట్టణంలోనే టిడ్కో బహుళ అంతస్తుల సముదాయాల పక్కన సుమారు 4,544 మంది లబ్ధిదారుల కోసం అన్ని వసతులతో కూడిన లేఅవుట్ ను ఏర్పాటుచేశామన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా మొత్తం మీద వారం రోజుల్లో 10 వేల ఇళ్ళ నిర్మాణాల పనులను చేపడతామన్నారు. పేదల ఇళ్ళ నిర్మాణ కార్యక్రమానికి సహకరిస్తున్న అధికారులు, శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులను అభినందిస్తున్నానని అన్నారు. ఈ ఇళ్ళ నిర్మాణ ప్రక్రియను చేపటట్టడం ద్వారా రాష్ట్ర ఆర్ధిక పురోగతిలో బలమైన మార్పులు వస్తాయన్న నమ్మకాన్ని ముఖ్యమంత్రి అందరిలో కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. టిడ్కో రహదారి పనులకు సంబంధించిన బిల్లు పెండింగ్ లో ఉందని, త్వరలో వాటిని విడుదల చేస్తామని అన్నారు.

పొన్నూరు శాసన సభ్యులు కిలారి వెంకట రోశయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలు ఇళ్ళ స్థలాల కోసం ఎదురు చూడకుండానే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదల బతులకుల్లో వెలుగులు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఇటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో పని చేయడం గొప్పవరంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో పేదలకు ఈ తరహా సేవలు అందించే ముఖ్యమంత్రిని చూడబోమని అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి వంటి గొప్పనాయకుడి తనయుడిగా రాష్ట్ర ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారన్నారు. రానున్న తరాలకు సరిపోయే విధంగా నవరత్నాలు- నిరుపేదలకు ఇళ్ళు కార్యక్రమం రూపొందించారని అన్నారు. నూతన ఇళ్ళ నిర్మాణాల కాలనీల్లో మౌలిక వసతులను సైతం వెంటనే కల్పించడం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం  చేపట్టలేదని అన్నారు. కోవిడ్ సమయంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇళ్ళ నిర్మాణాల ద్వారా ఉపాధి పనులు చూపించారని పేర్కొన్నారు.

 ప్రజల చేతుల్లో నిరంతరం డబ్బులు ఉండేలా సంక్షేమ పధకాలను రూపొందించడం ద్వారా ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారని ప్రశంసించారు. నవరత్నాల పథకాల పేరుతో చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి చేపట్టిన పధకాలు అన్నింటిలోనూ నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళ నిర్మాణాల పధకం తనకు స్వహతగా ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పేర్కొన్నారు.  ఇళ్ళ నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలంటే గృహనిర్మాణ శాఖ అధికారులకు టిడ్కో గృహనిర్మాణాల చెంత గదిని కేటాయించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. అందుకు కలెక్టర్ సుముఖత వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రజల జీవన విధానం మారబోతుందనడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పధకాలే నిదర్శనమని వెల్లడించారు.

సంయుక్త కలెక్టర్ ( సచివాలయాలు,అభివృద్ధి ) పి.ప్రశాంతి మాట్లాడుతూ వారం రోజుల్లో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నవరత్నాలు- నిరుపేదలకు ఇళ్ళ నిర్మాణాల కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడుతున్నామని అన్నారు. సుమారు 10వేల ఇంటి నిర్మాణాలు ప్రారంభమయ్యేలా అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పని చేస్తున్నామని అన్నారు. లబ్ధిదారులకు అవసరమైన నిర్మాణ సామగ్రిని అందుబాటులో ఉంచామన్నారు. ఒకే సారి ఇళ్ళ నిర్మాణ పనులు చేపట్టడం వలన లబ్ధిదారులకు పెద్దఎత్తున ఖర్చు తగ్గుతుందని అన్నారు. నిర్మాణాలు పలు దశల్లో ఉండగానే ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించే విషయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. ప్రజలంతా సంతోషంగా సొంత ఇళ్ళను నిర్మించుకోవాలని పిలుపు నిచ్చారు. 

తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన నవరత్నాలు- నిరుపేదలకు ఇళ్ళు నిర్మాణాల కార్యక్రమం పూర్తి చేసేందుకు తమవంతు కృషి చేస్తున్నామని అన్నారు. డివిజన్ లో అధిక సంఖ్యలో పేదలకు ప్రభుత్వం లక్షల విలువ చేసే ఇళ్ళ స్థలాలను ఉచితంగా అందివ్వడం గొప్ప విషయమన్నారు. తొలిదశలో తెనాలి డివిజన్ లో విడుదల చేసిన 3వేల ఇళ్ళను త్వరితగతిన పూర్తి చేయిస్తామన్నారు. పొన్నూరు వంటి ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ళతో పాటుగా పేదలకు ఆదునిక తరహాలో ఇళ్ళనిర్మాణాలు పూర్తిచేసి  మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.

గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వేణుగోపాలరావు మాట్లాడుతూ నవరత్నాలు- నిరుపేదలకు ఇళ్ళు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమం చేపట్టిందని అన్నారు. జిల్లాలోని ఇల్లులేని పేదప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సొంత ఇంటి కలలను సాకారం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఇళ్ళ నిర్మాణ కార్యక్రమాన్ని వందశాతం పూర్తి చేసేందుకు తమశక్తి వంచన లేకుండా పనిచేసి మంచిపేరు తెచ్చుకుంటామని పేర్కొన్నారు.

శిక్షణా కలెక్టర్ శుభం బన్సాల్ మాట్లాడుతూ పేద ప్రజలకోసం గృహ నిర్మాణ పధకం అందుబాటులోకి రావడం ప్రశంసనీయమన్నారు. ఇందుకోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పధకాల సేవలను కొనియాడారు. ప్రభుత్వ పధకాలు సమర్ధంతంగా పేదలకు వచ్చేలా చూడటంలో తనవంతు పాత్రను పోషిస్తామని వెల్లడించారు. అనంతరం సుజాత అనే మహిళా  లబ్ధిదారురాలి గృహ నిర్మాణానికి కలెక్టర్ వివేక్ యాదవ్, పొన్నూరు శాసన సభ్యులు కిలారి వెంకట రోశయ్య, సంయుక్త కలెక్టర్ ప్రశాంతి, తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్, ట్రైనీ కలెక్టర్ శుభం బన్సాల్ లు కొబ్బరి కాయలు కొట్టి, నవ ధాన్యాలు చల్లి, శంఖుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో నవరత్నాలు- నిరుపేదలకు ఇల్లు నిర్మాణ కార్యక్రమాలు అమలు చేస్తున్న తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ రూత్ రాణి, తహాశీల్ధార్ పద్మనాభుడు, ఎం.పి.డి.వొ అత్తోట దీప్తి, గృహనిర్మాణ, విద్యుత్తు, రెవెన్యూ, ఎపి ఫైబర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.      

Ponnuru

2021-06-04 13:13:56

కరోనా పరీక్షలు మరింతగా పెంచండి..

విశాఖజిల్లాలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ వైద్యాధికారులతో కలక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లాలో టెస్టింగ్ నిర్వహణ, టెస్టుల రిపోర్టులు, వ్యాక్సినేషన్, ఐసోలేషన్ కిట్స్ అందించడం, ఆక్సిజన్ సిలిండర్లు మొదలగు అంశాలపై సమీక్షించారు జిల్లాలో కోవిడ్ పరీక్షలు విస్తృతంగా నిర్వహించాలని పాజిటివ్ లను గుర్తించి వారికి అవసరమైన చికిత్సలు అందించడం ఖచ్చితంగా జరగాలన్నారు.

కోవిడ్-19 అరికట్టడానికి గానూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడడం  అందరూ తప్పక పాటించాలన్నారు. ఈ విషయాలపై విస్తృతంగా ప్రచారం గావించాలన్నారు. ఐసోలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కిట్స్ అందించాలని, ఇది సమస్య కారాదన్నారు. ఏజెన్సీలో పరీక్షల నిర్వహణ లాబ్ కి పంపి రిజల్ట్ తెలపడంలో ఆలస్యం జరుగుతోందని దీన్ని నివారించాలన్నారు. ఇందుకుగాను మధ్యాహ్నం వరకు టెస్టింగ్ చేసి వాటిని పాడేరు, అరకు మండల కేంద్రాల నుండి రెండు వాహనాల్లో సేకరణ చేసి తీసుకురావడానికి తగు చర్యలు చేపట్టాలన్నారు. దీనివల్ల టెస్ట్ శాంపిల్స్ కలెక్ట్ చేసిన పిదప రిజల్ట్ ఆలస్యము నివారించవచ్చన్నారు.  జిల్లా వ్యాప్తంగా రేపటి నుండి రోజుకు పది వేల పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
  కోవిడ్ పరీక్షల నిర్వహణ రిజల్ట్ వెల్లడిలో సూక్ష్మ స్థాయిలో సమస్యలు గుర్తించి పరిష్కరించాలన్నారు. 104 కాల్ సెంటర్ ను కోవిడ్ లక్షణాలు ఉన్నవారు సంప్రదించి సహకారం పొందాలన్నారు.

వ్యాక్సినేషన్ : జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం గావించాలన్నారు. ఏవైనా సంస్థలు ప్రైవేటు ఆసుపత్రులలో వారి సిబ్బందికి పరీక్షలు చేయించుకుంటామని ముందుకు వస్తే అనుమతించాలన్నారు. ఈ విషయంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి తగు చర్యలు తీసుకోవాలన్నారు కోవిడ్ వర్కర్స్, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ వైద్య సిబ్బంది జీతాల బిల్లును సత్వరమే తయారు చేసి సబ్మిట్ చేయాలని ఆదేశించారు

కోవిడ్ వలన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు పేరిట రూ.10 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్ చేయడానికి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి ఆక్సిజన్ సిలిండర్ల లభ్యతపై చర్చించారు. పాడేరు జిల్లా ఆసుపత్రికి; అరకు ఏరియా ఆసుపత్రి మరియు సి.హెచ్.సి చింతపల్లికి ఆక్సిజన్ సిలిండర్లు పంపాలన్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి  డాక్టర్ సూర్యనారాయణ, జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసరు జీవన్ రాణి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రామలింగరాజు, డాక్టర్ మురళీ మోహన్, డాక్టర్ వసుంధర తదితరులు హాజరయ్యారు.

విశాఖ కలెక్టరేట్

2021-06-04 12:54:43

ఆదివారం మాంసం అమ్మకాలు నిషేధం..

కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్న ద్రుష్ట్యా  మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఆదివారం(జూన్ 6న) మాంసం, చేపలు, రొయ్యలు  అమ్మకాలు నిషేధ ప్రక్రియ కొనసాగుతుందని  జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ప్రకటించారు. అధికంగా మాంసం దుకాణాల దగ్గర జనం అత్యధికంగా గుమిగూడుతున్నట్టు తమ ద్రుష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.  కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం  కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించినప్పటికీ ప్రజలు గుంపులు గుంపులుగా దుకాణాల వద్ద చేరడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. ఇకపై కర్ఫ్యూ సమయంలో ఎవరు బయట తిరిగినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ప్రజల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకొని, కోరనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు కమిషనర్ వివరించారు.

GVMC office

2021-06-04 12:40:43

అక్రమ కట్టడాలకు సహకరిస్తే చర్యలు..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అక్రమ నిర్మాణాలు కనిపిస్తే ఉపేక్షించేది లేదని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన పట్టణ ప్రణాళికా అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఆమె చీఫ్ సిటీ ప్లాన్నర్ విద్యుల్లత, సిటీ ప్లానర్లు, ఎ.సి.పి., డి.సి.పి., టి.పి.ఒ. లు మరియు వార్డు సచివాలయ ప్లానింగు కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా నగరంలో అనధికార నిర్మాణాలపై దృష్టి పెట్టాలని ఎటువంటి ఒత్తిళ్లకు లోను కావద్దని, వార్డు ప్లానింగు కార్యదర్శులను ఆదేశించారు. మీ మాట వినని యడల,  పై అధికారుల దృష్టికి తీసుకురావాలని చాలా వరకు స్లాబ్ లెవెల్స్ వచ్చిన తరువాత గుర్తించి వాటిపై చర్యలు తీసుకునే బదులు గ్రౌండ్ లెవల్స్ లోనే గుర్తించి వాటిని ఆపాలని ఆదేశించారు. వార్డు ప్లానింగ్ కార్యదర్శులు రూల్ పొజిషన్ తెలుసుకోవాలని, ప్లాన్ ఇచ్చేముందు అన్ని డాక్యుమెంట్స్ సక్రమంగా ఉంటేనే ప్లాన్ ఇచ్చేందుకు ముందుకు వెళ్ళాలని సూచించారు. గతంలో ప్లానింగు అధికారులు చాలా తక్కువుగా ఉండేవారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్ధం ప్రతీ సచివాలయానికి ఒక ప్లానింగు కార్యదర్శిని నియమించిందని మీ పరిధిలో ప్రతీ రోజు తిరిగినట్లయితే అనధికార కట్టడాలు ఉండవన్నారు. జివిఎంసి పరిధిలో 570 మంది ప్లానింగు కార్యదర్శులు ఉన్నారని, వారంతా నిబద్దతతో పని చేయాలని కమిషనర్ ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలలో అక్రమ కట్టడాలు, దుకాణాలు, బడ్డీలు కనిపిస్తే మొదటిగా వార్డు ప్లానింగు కార్యదర్శిలే బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషనర్ హెచ్చరించారు. కొన్ని కూడళ్ళలో హాకర్సు జోన్లు ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా దుకాణాలన్ని ఒకే దగ్గర ఉండే విధంగా యు.సి.డి విభాగంతో కలసి పనిచేయాలని వారికి ఐ.డి. కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. పట్టణ ప్రణాళికా అధికారులు ప్రతి రోజు వార్డులలో పర్యటించాలని కమిషనర్ ఆదేశించారు. నగరంలో హోర్డింగ్స్, బ్యానర్లు ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయని, వాటిని నిర్మూలించాలని అధికారులను ఆదేశించారు. గతంలో సరిగా పని చేయని 12 మంది అధికారులను ప్రభుత్వానికి సరండర్ చేసానని, అయినా మీలో ఎటువంటి మార్పు రాలేదని టౌన్ ప్లానింగు అధికారులను హెచ్చరించారు. ప్రతి రోజు స్పందనలోను, సోషల్ మీడియాలోను, వాట్స్ యాప్ లోను, న్యూస్ పేపర్ క్లిప్పింగ్సు లోను యాడ్వర్స్ న్యూస్ కనిపిస్తే వాటిపై 24గంటలలో చర్యలు తీసుకోవాలని, రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. గృహ నిర్మాణ వ్యర్ధాలను రోడ్డు ప్రక్కన డంపింగు చేస్తున్నారని, వాటిని గుర్తించాలని, భవనములు నిర్మించుటకు వాడే ఇసుక, పిక్క, బ్రిక్స్ లాంటివి రోడ్డుపై వేసి రోడ్లను బ్లాక్ చేస్తున్నారని వారిపై తగు చర్యలు తీసుకొని జరిమానా విధించాలని ఆదేశించారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో చీఫ్ సిటీ ప్లాన్నర్ విద్యుల్లత తో పాటు సిటీ ప్లానర్లు, ఎ.సి.పి.లు, డి.సి.పి., టి.పి.ఒ.లు, వార్డు సచివాలయ ప్లానింగు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.        

GVMC office

2021-06-04 12:35:25

కోవిడ్ నియంత్రణకు ఆక్వారైతుల విరాళం రూ.31.76లక్షలు..

 కోవిడ్ రెండో ద‌శ ఉద్ధృతి నేప‌థ్యంలో సామాజిక బాధ్య‌త‌గా తూర్పుగోదావరి జిల్లా ఆక్వా రైతుల అసోసియేషన్ కోవిడ్ స‌హాయ‌నిధికి రూ.31,76,000 విరాళంగా అందించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లో సంఘం ప్ర‌తినిధులు కాకినాడ అర్బ‌న్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌రరెడ్డి స‌మ‌క్షంలో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డికి చెక్కును అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ విప‌త్తు స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు వైద్య‌, ఇత‌ర సేవ‌లు అందించ‌డంలో ప్ర‌భుత్వం చేస్తున్న కృషిలో భాగ‌స్వామ్యమ‌వుతూ విరాళం అందించిన తూర్పుగోదావరి జిల్లా ఆక్వా రైతుల అసోసియేషన్‌కు అభినంద‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. జిల్లా ప్ర‌జ‌ల త‌రఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో అహర్నిశలూ కృషి చేస్తున్న గౌరవ  ముఖ్య‌మంత్రి, మంత్రులు, శాసన సభ్యులు, కలెక్టర్, ఎస్‌పీ, ప్రభుత్వ యంత్రాంగానికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు సంఘం ప్ర‌తినిధులు పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో ఫిష‌రీస్ జేడీ పీవీ స‌త్య‌నారాయ‌ణ‌, ఆక్వా రైతు సంఘం ప్ర‌తినిధులు సీహెచ్‌వీ సూర్యారావు, కుర్రా రఘు, వి.రాంబాబు, ఎం.సతీస్‌రాజు, పేరా బత్తులరాజశేఖర్, బుల్లి రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-04 10:47:26

లోక కల్యాణార్ధం కనకమ్మవారికి గంట్ల పూజలు..

కరోనా మహమ్మారి పీడలు సమసిపోయేలా శ్రీశ్రీశ్రీ కనకమహా లక్ష్మి అమ్మవారు సమస్త జీవకోటిని కరుణించాలని తల్లిని వేడుకున్నట్టు సింహాచలం ట్రస్టుబోర్డు ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్లశ్రీనుబాబు చెప్పారు. శుక్రవారం హనుత్ జయంతి, ఏకాదశిని పురస్కరించుకొని విశాఖలోని కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో దేవాదాయశాఖ  ఆలయాల్లో యజ్ఞయాగాదులు చేపట్టడం ప్రశంసనీయమని  కొనియాడారు. భక్తులకు ఎలాటి ఇబ్బందులు లేకుండా ఆన్ లైన్ లో దర్శనాలు ప్రత్యేక సేవలు కల్పిస్తుందన్నారు.కరోనా వైరస్ నియంత్రణ జరిగి ప్రజలు సాధారణ జీవితం గడపాలన్నదే తన అబిమతమన్నారు. అంతకుముంద జివిఎంసీదుర్గాదేవి, తాటిచెట్లపాలెం అభయాంజనేయ స్వామి ఆలయాల్లో శ్రీనుబాబు ప్రత్యేకంగా పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. సమాజాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని తాను అమ్మ వార్లు,
స్వామి ని కోరుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే అనేక చోట్ల ధన్వంతరి హోమాలు,
యజ్ఞాలలో పాల్గొని పూజలు కూడాచేపట్టినట్టు గంట్ల వివరించారు. 

విశాఖసిటీ

2021-06-04 10:10:32

అంతర్జాతీయ స్థాయిలో నగర పార్కులు..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని పార్కులు అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి వీలుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి సృజన అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె శివాజీ పార్క్ లోని హార్టికల్చర్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శివాజీ పార్కుతో పాటు జివిఎంసి పరిధిలోని సుమారు 170 కోలనీ పార్కులను ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం అభివృద్ధి చేశారని వాటిని నూతన హంగులతో ఆకర్షణీయంగా మార్పులు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, వివిధ ప్రతిభావంతులకు  ఉపయోగపడే విధంగా పార్క్ లను ఒకటికి పది సార్లు సందర్శకులు వచ్చి చూసే విధంగా తీర్చిదిద్దడానికి  అధ్యయనం చేసి ఒక ప్రణాళికతో ముందుకు రావాలని ఆదేశించారు. పార్కులో వినూత్న సౌకర్యాలు కలిగి ఆర్గానిక్ పార్కు, ట్రాఫిక్ రూల్స్ మొదలైనవి ఏర్పాటు చేయాలని, అవి పిల్లలు నేర్చుకొనే విధంగా ఉండాలని, పార్కుల అభివృద్ధి కొరకు ఇతర రాష్ట్రాలలోని కొన్ని పార్కులను అధ్యయనం చేసి రావాలని కమిషనర్ అధికారులకు సూచించారు.       
ఈ పర్యటనలో ప్రధాన ఇంజినీరు పి. రవికృష్ణ రాజు, పర్యవేక్షక ఇంజినీర్లు వేణుగోపాల్, రాజా రావు, శ్యామ్సన్ రాజు, శివప్రసాద రాజు, రాయల్ బాబు, కార్యనిర్వాహక ఇంజినీరు (పి.ఎల్.& సి) మెహెర్ బాబా, అసిస్టెంట్ డైరక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఎం. దామోదర రావు తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-06-03 16:37:44

విశాఖనగరంలో వేక్సినేషన్ కేంద్రాలివే..

మహా విశాఖపట్నం నగర పరిధిలోని  శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుర్తించిన ప్రాంతాల్లో  కొవీషీల్డ్ వ్యాక్సినేషన్ మొదటి డోసు (45 సంవత్సరాలు పైబడిన వారికి),  రెండవ డోసు 84రోజులు పైబడిన వారికి వ్యాక్సినేషన్ వేస్తున్నట్టు జివిఎంసి కమిషనర్  డా. జి. సృజన ఒక ప్రకటనలో తెలిపారు. కొవీషీల్డ్ వేయి ప్రాంతాలు అల్లిపురం, భీమునిపట్నం,  బుచ్చిరాజుపాలెం,  చెంగల్ రావు పేట,  చిన్న వాల్తేర్, జ్ఞానపురం, మద్దిలపాలెం, నరవ,  వన్ టౌన్,  ఆర్.పి.పేట, సాగర్ నగర్, స్వర్ణ భారతి, అనకాపల్లి, మల్కాపురం, విద్యుత్ నగర్ర్, ఆరిలోవ  ఎఫ్.ఆర్.యు సెంటర్, మధురవాడ పి.హెచ్.సి., శ్రీహరిపురం ఎఫ్.ఆర్.యు సెంటర్, గాజువాక పి.హెచ్.సి., కణితి,  శ్రీహరిపురం, పెద గంట్యాడ పి.హెచ్.సి., ఆర్.హెచ్..సి. సింహాచలం, ఆర్.టి.సి. ఎం, దువ్వాడ పి.హెచ్.సి., గోపాలపట్నం పి.హెచ్.సి., ఫిషర్ మేన్ కోలనీ, కప్పరాడ, లక్ష్మి నగర్, ప్రసాద్ గార్డెన్స్, తగరపు వలస, బర్మా క్యాంపు, ఓల్డ్ గాజువాక, పెద్ద గంట్యాడ, శ్రీహరిపురం, యు.ఎఫ్.డబ్ల్యూ.సి.(అనకాపల్లి). ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషన్ తెలిపారు.  

విశాఖ సిటీ

2021-06-03 16:24:02

జగనన్న కాలనీలతో మరో అనంతను నిర్మాస్తున్నాం..

జగనన్న ఇళ్ల నిర్మాణం ద్వారా జిల్లాలో మరో అనంతను నిర్మించనున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. జిల్లాలో 1044 గ్రామ పంచాయితీలు ఉండగా 1045 జగనన్న కాలనీలను నిర్మిస్తున్నామని.. అంటే మరో ఆనంతను నిర్మిస్తున్నామని కలెక్టర్ వివరించారు. పట్టణ శివారు ప్రాంతంలోని ధోని ముక్కల లేఅవుట్ లో నిర్వహించిన జగనన్న కాలనీల గృహ నిర్మాణ ప్రారంభ మహోత్సవ వేడుకలలో జిల్లా గంధం చంద్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ విషయంలో పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తాయని జిల్లాలో మాత్రం సమస్యలు లేకుండా భూ సేకరణ చేపట్టామన్నారు. రెవెన్యూ యంత్రాంగం కృషితో వివాదాస్పదం కాని భూమిని సేకరించడం, భూ హక్కుదారులకు మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించి సమస్యలను నివారించామన్నారు. పేదలందరికీ ఇళ్ల నిర్మాణం ద్వారా జిల్లాలో దాదాపు 25 శాతం మంది లబ్ది పొందనున్నారన్నారు. మరెంతో మందికి ఉపాధి దక్కనుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో దాదాపు 15 శాతంతో సమానమైన మొత్తాన్ని మొదటి విడత ఇళ్ల నిర్మాణాలకు కేటాయించడం అంటే ఈ కార్యక్రమం యొక్క భారీ తనాన్ని అర్థం చేసుకోవలన్నారు. ఒకప్పుడు అమెరికాలో ఆర్థిక సంక్షోభం సంభవించినప్పుడు పేదలతో ఏదో ఒక పని చేయించి వారికి డబ్బులు అందించారని, మళ్లీ నేడు కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఉపయోగ పడే ఇళ్ల నిర్మాణాల పనుల ద్వారా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. 

Guntakal

2021-06-03 14:18:49

వాహన మిత్ర దరఖాస్తులు సత్వరం అప్లోడ్ చేయాలి..

వాహన మిత్ర పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకునే దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిశీలించి అప్లోడ్ చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు.గురువారం మధ్యాహ్నం వాహన మిత్ర దరఖాస్తుల పరిశీలన మరియు సకాలంలో అప్లోడ్ చేసే అంశంపై జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్ తో కలిసి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్,మున్సిపల్ ఆర్డీ,జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు,వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డ్ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ సెక్రెటరీ లతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,ఈనెల 15వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా మూడో విడత వాహన మిత్ర లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు  గ్రామ,వార్డు సచివాలయం పరిధిలో అందే దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిశీలించి అప్లోడ్ చేయాలన్నారు. దరఖాస్తుల పరిశీలనకు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డ్ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ సెక్రెటరీ లకు రెండు రోజుల గడువు మాత్రమే ఉందన్నారు.ఆ గడువులోపు వారికి అందిన దరఖాస్తులు అన్నింటిని ప్రభుత్వం జారీ చేసిన నియమ నిబంధనల మేరకు పరిశీలించి అప్లోడ్ చేయాలన్నారు.అలాగే ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లకు కూడా ఈనెల 10,11తేదీ లోపు వారి పరిధిలో ఉన్న దరఖాస్తులలో 2 శాతం దరఖాస్తులను భౌతికంగా తనిఖీ చేయాలన్నారు. వారు ఈనెల 11వ తేదీ లోపు దరఖాస్తులను పరిశీలించి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.

 ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ, దరఖాస్తులు పరిశీలనకు తక్కువ వ్యవధి ఉన్నందున ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు,వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డ్ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ సెక్రెటరీలు వారికి నిర్దేశించిన గడువులోపు దరఖాస్తులను పరిశీలించాలన్నారు.లబ్ధిదారుల జాబితాను వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో ఉంచడం జరిగిందన్నారు.సొంతంగా ఆటో, టాక్సీ ,క్యాబ్, లైట్ వెహికల్ గూడ్స్ నడిపేవారు, ఆధార్ కార్డు,తెల్ల రేషన్ కార్డు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు కలిగి ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వాళ్ళ కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి పొందేందుకు వీలుందన్నారు.పైన పేర్కొన్న అధికారులనుండి అందిన అప్లికేషన్లకు సంబంధించి ఈ నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ ఆమోదించి 13,14 తేదీలలో ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందన్నారు.

డిటిసి శివరాంకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, వాహన మిత్ర పథకం కింద లబ్ధి పొందేందుకు గతంలో ఉన్న నియమ నిబంధనలతోపాటు ప్రభుత్వం మరో ఆరు నిబంధనను చేర్చిందన్నారు.దరఖాస్తుదారుడురాష్ట్ర ప్రభుత్వం అందించే ఏ ఇతర ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొంది ఉండరాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండరాదని,ఆదాయ పన్ను చెల్లించే వారు అనర్హులని,300 యూనిట్లు పైబడి విద్యుత్ వాడేవారు, మూడెకరాల వ్యవసాయ భూమి, 10 ఎకరాల మెట్ట భూమి లేదా పది ఎకరాల వ్యవసాయ మరియు మెట్ట భూమి కలిగిన వారు అనర్హులన్నారు. అలాగే మున్సిపల్ ప్రాంతంలో వెయ్యి అడుగుల గృహ మరియు వాణిజ్య స్థలం కలిగి ఉన్నవారు కూడా అనర్హులన్నారు. అయితే శానిటరీ వర్కర్లు సంబంధించి వారి కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నప్పటికీ వారికి మినహాయింపు ఇచ్చారన్నారు.ఏరోజుకారోజు అండే దరఖాస్తు లన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.జిల్లాలో మొదటి విడతలో11,301 మందికి,రెండవ విడతలో13,200 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి కలిగించడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్డీ నాగరాజు పాల్గొన్నారు.

Anantapur

2021-06-03 14:12:30

అప్పన్న ఆలయ శిల్పసంపదకు కొత్తరూపం..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలోని చారిత్రక శిల్ప సంపదను భక్తులకు తెలియజేసే వినూత్న కార్యక్రమానికి ఈఓ ఎంవీ సూర్యకళ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా స్వామివారి ఆలయంలోని కళ్యాణ మండపంలోని శిల్పాలను మరింతగా కనిపించేలా వాటిని శుభ్రపరిస్తున్నారు. ఇక్కడి రాతి స్థంబాలపై వున్న అపురూప, దైవ శిల్పాలు కనిపించేలా వాటిని చక్కగా తైలంతో శుభ్రం చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా సిబ్బందిని వినియోగించి భక్తులకు వాటిని బాగా కనిపించేలా చర్యలు చేపట్టారు. గత కొద్ది రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఈఓ దగ్గరుండి పరిశీలిస్తున్నారు. సింహాచల ఆలయ ఈఓగా చేసిన ఏ ఒక్కరూ చేయని ఈపని చేసి స్వామివారి ఆలయంలో వున్న ఏళ్ల కాలం నాటి శిల్ప కళ భక్తులు తిలకించే విధంగా తీసుకున్న ఈఓ సూర్యకళ చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఈ రోజుచేపట్టిన ఈ పరిశుభ్రత కార్యక్రమంలో ఈఓతో పాటు ఏఈఓ రాఘవకుమార్, స్థానాచార్యులు పాల్గొన్నారు. అంతకు ముందు శుభ్రం చేసిన శిల్పాలను ఈఓ దగ్గరుంచి పరిశీలించారు.

Simhachalam

2021-06-03 14:05:20

వచ్చే జూన్ నాటికి ఇళ్లు పూర్తిచేస్తాం..

 రాష్ట్రంలో మొదటి దశ గృహ నిర్మాణాలు 2022-జూన్ నాటికి యుద్దప్రాతిపదికన పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  గురువారం ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి గృహ నిర్మాణాలకు వర్చ్యువల్ విధానంలో ఆయన శంకుస్థాపన చేశారు.  జిల్లాలో ఈ కార్యక్రమం భీమిలి నియోజక వర్గం వెల్లంకి గ్రామంలో ఏర్పాటు చేశారు.  రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలు వస్తున్నాయన్నారు.  ప్రణాళికా బద్దమైన కాలనీలు నిర్మాణం జరుగుతుందని, ప్రతి ఇంటికి తాగునీరు, భూగర్భ డ్రైనేజి, భూ గర్భ విద్యుత్ లైన్లు, భూ గర్భ ఇంటర్ నెట్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.  రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు స్థిరాస్థి ఉంటుందని చెప్పారు. లబ్దిదారులు స్వయానా నిర్మించుకొంటామంటే వారికి నాణ్యమైన సిమెంటు, ఇనుములను సరసమైన ధరలకు ప్రభుత్వమే సరఫరా చేస్తుందని, ఇందుకు గ్రామ స్థాయిలో గోడౌన్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.  ప్రతి జిల్లాకు గృహ నిర్మాణాలు చూసుకొనేందుకు ఒక జాయింట్ కలెక్టర్ ను నియమించనున్నట్లు వెల్లడించారు.  అర్హత గల ప్రతి లబ్దిదారునికి ఇళ్ల పట్టాలు జారీ చేసి గృహ నిర్మాణాలు చేస్తామన్నారు. ఎవరైనా తప్పిపోతే అలాంటి వారు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకొంటే పరిశీలన చేసి అర్హత గల లబ్దిదారులైతే 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు జారీ చేస్తారని తెలిపారు.  
  అనంతరం భీమిలి నియోజక వర్గం  ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలో  మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 303 గృహాలకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, ఆర్డిఓ పెంచల కిషోర్, గృహ నిర్మాణ శాఖ పిడి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాలో మొదటి దశలో 5 వేల గృహాలకు, 90 కోట్లు రూపాయలు అంచనా విలువతో నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు.  వారం రోజుల పాటు గృహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయని, భీమిలి నియోజక వర్గం ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలో 303 గృహాలకు శంఖుస్థాపన చేయడమైనదని, 5.45 కోట్ల రూపాయల అంచనా విలువతో నిర్మించడం జరుగుతుదరన్నారు. ప్రైవేటు లే అఔట్ లలో ఉన్నట్లుగానే గృహాల నిర్మాణాలు, భూ గర్భ డ్రైనేజి, విద్యుత్, ఇంటర్ నెట్ ఇతర మౌలిక సదుపాయాలు ఉంటాయని తెలిపారు.  ఒక్కొక్కరికి ఇంటి స్థలం, గృహం నిర్మాణం కలిపి 5 లక్షలు నుండి 15 లక్షల రూపాయలు విలువ చేసే ఇళ్లు  ఉంటుందని చెప్పారు.  పాదయాత్రంలో ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారని తెలిపారు.  జిల్లాకు అత్యధిక గృహాలు మంజూరుకు అధికారుల కృషి చేశారని, ఇళ్ల స్థలాలు మంజూరు పారదర్శకంగా జరిగిందన్నారు.  
  జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ గృహ నిర్మాణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వర్య్చువల్ విధానంలో ప్రారంభించినట్లు చెప్పారు.  జిల్లాలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.  జిల్లాలో గృహాలు నిర్మాణాలకు లబ్దిదారులు ఎవరైనా ముందుకు వస్తే అలాంటి వారికి నాణ్యమైన మెటీయల్ సరసమైన ధరలకు ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు.   హౌసింగ్ పై  ఒక జాయింట్ కలెక్టర్ ను ప్రభుత్వం నియమిస్తుందని వెల్లడించారు.  కోర్టు కేసులు ఉన్న ఇంటి స్థలాలు కోవిడ్ కారణంగా కోర్టులు జరుగుటలేదని, కోర్టు కేసులు పూర్తి చేసుకొని త్వరితగతిన  ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు.

Bheemili

2021-06-03 13:46:07

బ్లాక్ ఫంగస్ రాకుండా ముందుగా సూచించండి..

శ్రీకాకుళం జిల్లాలో బ్లాక్ ఫంగస్ వ్యాప్తి కాకుండా ముందస్తు సూచనలు చేయాలని వైద్యులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ కోరారు. పలువురు బ్లాక్ ఫంగస్ భారీన పడటం జరుగుతోందని దానిని నివారించుటకు గల అవకాశాలు పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యులతో కరోనా, బ్లాక్ ఫంగస్ తదితర అంశాలపై గురు వారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్య మంత్రి మాట్లాడుతూ వైద్యానికి అత్యంత ప్రాధాన్యతను ప్రభుత్వం ఇస్తుందన్నారు. వైద్యుడు దేవునితో సమానంగా అందరూ భావిస్తారని ఇదే క్రమంలో కోవిడ్ లో వైద్యులు చాలా కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. వైద్యులు అందిస్తున్న సేవలు వలన ప్రభుత్వానికి గౌరవం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో జిల్లా కలెక్టర్, వైద్యులు మంచి సమన్వయంతో పనిచేస్తున్నారని ప్రతి అంశాన్ని విజయవంతంగా పరిష్కరిస్తున్నారని అన్నారు. రాష్ట్ర పురోగతిలో కరోనా మహమ్మారి పెద్ద ఆటంకంగా మారిందని దానిని కూడా అధిగమించే విధంగా వైద్యులు పనిచేస్తున్నారని చెప్పారు. కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్సలో ప్రతి అవకాశాన్ని వినియోగించుకుందామని, ఎంత ఖర్చు అయినా భరించుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. స్ఫూర్తివంతమైన సేవలు అందించి ప్రజల గుండెల్లో నిలవాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ సమర్ధవంతంగా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు.

      రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన వారికి పడకల ఏర్పాటులో పక్కాగా ఉండాలన్నారు. ఆరోగ్య శ్రీ క్రింద చేరే వారికి పడకలు కేటాయించే అంశంపై తగు అవగాహన కలిగించాలని అన్నారు. ప్రభుత్వం ఆరోగ్య శ్రీ క్రింద కరోనా చికిత్స అందించుటకు చిత్తశుద్ధితో ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం మీద రెండవ దఫా కరోనాలో జిల్లా యంత్రాంగం సమన్వయంతో అద్భుతంగా పనిచేసిందని, ఎక్కడా ఎటువంటి సమస్య లేకుండా నిర్వహించారని అభినందించారు. లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

        జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ కోవిడ్ చికిత్స అనంతరం బ్లాక్ ఫంగస్ సమస్య తలెత్తుతుందన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ప్రత్యేకంగా పడకలు కేటాయించామని పేర్కొన్నారు. అవసరమగు మందులను ప్రభుత్వం సరఫరా చేసిందని చెప్పారు. చిన్నపిల్లల్లో కరోనా కేసులు వస్తున్నాయని, వాటికి మంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. పిల్లలు త్వరగా వైద్యానికి స్పందిస్తున్నారని చెప్పారు. జిల్లాలో చిన్నారులకు సంబంధించిన వెంటిలేటర్లు ఇతర సామగ్రి కొంత మేర అవసరం ఉందని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. ఆక్సిజన్ లో స్వయం సమృద్ది దిశగా అడుగులు వేస్తున్నామని, పి.ఎస్.ఏ ప్లాంట్లను ఏర్పాటు చేయుటకు చర్యలు చేస్తున్నామని వివరించారు. రిమ్స్ లో ఆక్సిజన్ పడకలకు ఆక్సిజన్ పూర్తి స్ధాయిలో అందించగలమని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ.కృష్ణ వేణి, వైద్యులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-03 13:41:20