1 ENS Live Breaking News

వార్డు సచివాలయాల్లో చెత్త వాహనాలుండాలి..

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని వార్డు సచివాలయాల్లో  ఒక చెత్త తరలించే వాహనం ఉండాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె తమ చాంబర్ నుండి సిస్కో వెబెక్స్ ద్వారా జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన వైధ్యాదికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఎఎంఒహెచ్ లు, శానిటరి సూపర్వైజర్, శానిటరి ఇన్స్పెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి సచివాలయానికి ఒక చెత్త తరలించే వాహనం ఉండాలని, అది ప్రతి రోజు రెండు ట్రిప్పులు తిరగాలని అధికారులను ఆదేశించారు. డోర్ టు డోర్ చెత్త సేకరణ, కాలువలు శుభ్రం చేయడం వంటి పనులు చేయడం ఎవ్వరికి కేటాయించనివి వారిచే చేయించాలని అన్ని పనులకు ఒకర్ని వాడరాదని, పోరుగుసేవల సూపర్వైజర్లను కాలువలు క్లీనింగు చేయుటకు ఉపయోగించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయరాదని డోర్ టు డోర్ సేకరించిన చెత్తను వెంట వెంటనే డంపింగు యార్డుకు తరలించాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త కనిపిస్తే శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు శానిటరి కార్యదర్శులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఇపిడిసిఎల్ వారు వైర్ల క్రింద ఉన్న కొమ్మలు తొలగించి అక్కడే వదిలివేస్తున్నారని వారిపై జరిమానా విధించాలని ప్రధాన వైధ్యాదికారిని ఆదేశించారు. 

ప్రతీ దుకాణాల ముందు మూడు డస్ట్ బిన్లు ఉండేలా చూడాలని, దుకాణాలలో నిషేదిత ప్లాస్టిక్ కవర్లు అమ్మిన యడల జరిమానా విధించాలని, యూజర్ చార్జీలు వసూలు చేయాలని ఆదేశించారు. ప్రతి సచివాలయాల పరిధిలో నూతనంగా నిర్మించిన ఇళ్ళు, ఖాళీ స్థలాలు ఎన్ని ఉన్నాయో వార్డు అడ్మిన్ కార్యదర్శిలు, శానిటరి కార్యదర్శిలు గుర్తించి వాటికి పన్నులు, ఖాళీ స్థలాలకు వి.ఎల్.టి. విధించాలని అదేశించారు. వచ్చే వారం నుండి  ప్రతి సచివాలయ పరిధిలో డోర్ టు డోర్ సీజనల్ వ్యాధులు సర్వే జరపాలని, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా చూడాలని వెటర్నరి డాక్టరును ఆదేశించారు. సచివాలయ పరిధిలో స్పందనలో వచ్చిన దరఖాస్తులను, వివిధ పేపర్లు వచ్చిన క్లిప్పింగులపై స్పందించి వాటిని వెంట వెంటనే పరిష్కరించి ప్రజల మన్నలను పొందాలని, ఎటువంటి అలసత్వము ప్రదర్శించకూడదని కమిషనర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన వైధ్యాదికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, వెటర్నరి డాక్టరు కిషోర్,  ఎఎంఒహెచ్ లు, శానిటరి సూపర్వైజర్లు, శానిటరి ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. 

GVMC office

2021-06-01 12:48:09

హౌసింగ్ లే ఔట్ పనులను పూర్తి చేయాలి..

విశాఖ జిల్లాలో జగనన్న హౌసింగ్ మొదటి  దశ గ్రౌండింగ్  కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్  ప్రోజెక్ట్ డైరెక్టరు శ్రీనివాసరావును ఆదేశించారు.  మంగళవారం ఉదయం జిల్లా కలెక్టరు జగనన్నహౌసింగ్ మొదటి దశ పనుల పురోగతి పై హౌసింగ్, గ్రామీణ నీటి సరఫరా, ఎపిఇపిడిసిఎల్ అధికారులతో సమీక్షించారు. మొదటి దశలో భీమిలి, పెందుర్తి నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట నియోజికవర్గాలలో జగనన్న హౌసింగ్ లేఔట్ లలో పురోగతిపై చర్చించారు. నియోజిక వర్గాల ప్రత్యేకాధికారులకు వివరాలు తెలియజేయాలన్నారు. లేఔట్ లలో ఎలక్ట్రిఫికేషన్, నీటిసరఫరా, తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టరు 2 పి.అరుణ్ బాబు, పి.డి. హౌసింగ్ శ్రీనివాసరావు,  ఆర్.డబ్ల్యూఎస్ రవి కుమార్, ఎపిఇపిడిసిఎల్ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Collector Office

2021-06-01 12:18:07

వేక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి..

విశాఖ జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ జిల్లా వైద్య ఆరోగ్యాధికారి మరియు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారులను  ఆదేశించారు.  మంగళవారం ఉదయం కలెక్టరు ఈ విషయంపై తన ఛాంబర్ లో  వైద్యాధికారులతో చర్చించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు  జిల్లాలోని రైల్వే, నేవీ, స్టీల్ ప్లాంట్, తదితర సంస్థలకు ఎన్ని డోసులు పంపిణీ చేశారు, సదరు సంస్థలు ఎంత మందికి వ్యాకినేషన్ గావించాయి, మిగిలినవి ఎన్ని అనే విషయాలపై  వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమయము వృధా కారాదని, వారి వద్ద మిగిలిన వ్యాక్సిన్లను తెప్పించి  45  సంవత్సరములు దాటిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సినేషన్ ఇచ్చే ఏర్పాటు గావించాలని ఆదేశించారు. ఈ  సమావేశంలో జాయింట్ కలెక్టరు పి.అరుణ్  బాబు, డి.ఎమ్.హెచ్.ఒ. సూర్యనారాయణ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి జీవన్ రాణి పాల్గొన్నారు.

Collector Office

2021-06-01 12:15:36

అర్హులైన ప్రతీ ఒక్కరికీ పించను..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరినీ పించను మంజూరు చేస్తుందని జివిఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. మంగళవారం రెండవ జోన్ పరిధిలోని 13వ వార్డు పరిధిలో కొత్తగా మంజూరైన పించన్లను మేయర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలు ప్రతీ నిరుపేదకు అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. ప్రజలకు అన్ని సేవలు ఒకే చోట అందించాలనే లక్ష్యంతో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి పించన్లు కూడా అక్కడి నుంచే మంజూరు చేయిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు ఇంచార్జ్ కెల్లా సత్యనరాయణ, ఎస్.సి., ఎస్.టి. జిల్లా మాజీ అధ్యక్షులు పి.రామారావు, గుడ్ వర్క్ స్టేట్ అధ్యక్షులు వేముల కన్నా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

విశాఖసిటీ

2021-06-01 12:12:51

కరోనాలో పారిశుధ్య సిబ్బంది సేవలు అమోఘం..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బది కరోనా జాగ్రత్తలు పాటిస్తే ప్రజలకు సేవలు అందించాలని మేయర్ గోలగాని హరి వెంకట కుమారి కోరారు.  మంగళవారం రెండవ జోన్ పరిధిలో 13వ వార్డు లోని ఫ్రంట్ లైను వారియర్స్ అయిన 100 మంది పారిశుధ్య సిబ్బందికి భోజనం, మాస్కులు, శానిటైజర్సు, గ్లౌజులు పంపిణీ చేసారు. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో పారిశుధ్య కార్మికులకు  13వ వార్డు సెక్టరు-5 బాల్వాడి భవనంలో వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత వీటిని అందించడానికి ముందికి రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా 60 సంవత్స రాలు పైబడిన పారిశుధ్య సిబ్బంది ఏడుగురిని ఘనంగా సన్మానించారు.   ఈ కార్యక్రమంలో 13వ వార్డు ఇంచార్జ్ కెల్లా సత్యనరాయణ, ఎస్.సి., ఎస్.టి. జిల్లా మాజీ అధ్యక్షులు పి.రామారావు, గుడ్ వర్క్ స్టేట్ అధ్యక్షులు వేముల కన్నా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.  

విశాఖ సిటీ

2021-06-01 12:09:00

కరోనాలో దాతల సహాయం మరువలేనిది..

కరోనా మహమ్మారి విజ్రుంభిస్తున్న తరుణంలో దాతలు ముందుకొచ్చి నిరుపేదలకు చేసే సహాయం మరువలేనిదని జివిఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. మంగళవారం విశాఖలోని యూత్ విత్ ఎ మిషన్ సంస్థ చేపట్టిన నిత్యవసర సరకుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, సంస్థ  డైరక్టర్ అనిల్ చోప్రా ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న కుటుంబాలకు, పేద వారికి నిత్యవసర సరుకులు బియ్యం, పప్పు, నూనె, పసుపు, కారం లాంటి తదితర వస్తువులు అందించడం అభినందనీయమన్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా కూలి చేసుకొనే వారికి పనులు లేక చాలా ఇబ్బంది పడుచున్నారని ఆలాంటి వాళ్లకి మరెన్నో సంస్థలు ముందుకు వచ్చి ఆదుకోవాలని మేయర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  సంస్థ డైరక్టర్ తోపాటుపా 11వ వార్డు ఇంచార్జ్ గొలగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-06-01 11:57:50

ఖాళీ స్థలాల్లో చెత్తవేస్తే భారీ జరిమానా..

మహావిశాఖ నగర పరిధిలోని ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తే భారీగా జరిమానా విధించాలని జివిఎంసి కమిషనర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఈ మేరకు నగరంలోని  జోన్ 6,  86వ వార్డు  కూర్మన్నపాలెం లోని ఉడా ( ఫేజ్ - 2) కాలనీల్లో ఆమె పర్యటించారు. ఈ సంరద్భంగా ఆమె మాట్లాడుతూ, ఖాళీ స్థలాలలో పిచ్చి మొక్కలు, చెత్త ఎక్కువగా ఉండడాన్ని గమనించి ఖాళీ స్థల యజమానులచే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించాలని సూచించారు.  మనమే శుభ్రం చేసి వారికి జరిమానా విధించాలని, ఇపిడిసిఎల్ సంస్థ చెట్లు కొమ్మలను తొలలాగించి ఆ ప్రదేశంలో వేసిన వారికి జరిమానా విధించాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. ఖాళీ ప్రదేశాలలో చుట్టు ప్రక్కల నివసిస్తున్న వారు చెత్త వెస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మొత్తం ఎన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి వాటికి వి.ఎల్.టి. వేసారా లేదా అని                    ఆరా తీసారు. సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రోడ్లను, కాలువలను శుభ్రంగా ఉంచాలని, డోర్ టు డోర్ చెత్త సేకరించాలని, తడి-పొడి చెత్తను వేరు వేరుగా తీసుకోవాలని, చెత్తను వెంట వెంటనే డంపింగు యార్డుకు తరలించాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు.  రెసిడన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కొలనీలోని లైట్లు, త్రాగునీరు మొదలైన సమస్యలపై కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్ళగా ఆ సమస్యలు పరిష్కరించాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ శ్రీధర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ నరేంద్ర, కార్యనిర్వాహక ఇంజినీరు చిరంజీవి, శానిటరి సూపర్వైజర్, శానిటరి ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.  

Kurmannapalem

2021-06-01 11:51:06

పోర్టిఫైడ్ రైస్ ను ఉపయోగించుకోవాలి..

ప్రజారోగ్య పరిరక్షణ కోసమే ప్రభుత్వం సరఫరా చేస్తున్న సూక్ష్మ పోషకాలు కలిగిన బలవర్ధకపు బియ్యం (పోర్టిఫైడ్ రైస్) ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కోరారు.  కురుపాంలో మంగళవారం పోర్టిఫైడ్ బియ్యం పంపిణీని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పోర్టిఫైడ్ బియ్యంపై అపోహలు ఉన్నాయని అయితే ఇవి ప్రజల ఆరోగ్యం కోసం విటమిన్లు పోషకాలను కలిపిన సాధారణ బియ్యమేనని స్పష్టం చేసారు. జిల్లా వ్యాప్తంగా 7 లక్షల కుటుంబాలకు ఈ బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలందరి ఆరోగ్యాలకు పరిరక్షించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు.
ఇవి సాధారణ బియ్యం కాదని ప్లాస్టిక్ బియ్యమని  కూడా కొందరు అపోహపడుతున్నారని చెప్పారు. ఈ కారణంగానే కొంతమంది ఈ బియ్యాన్ని తాము సద్వినియోగం చేసుకోకుండా మార్కెట్లో ఇతరులకు ఇచ్చేయడం లాంటి పనులు చేస్తున్నారన్నారు. అయితే ఈ బియ్యంపై ప్రజల్లో ఉన్న అపోహల్లో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. ఈ బియ్యాన్ని మిల్లింగ్ చేసే సమయంలో వీటిలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12 కలుపుతారని వివరించారు. ఈ సూక్ష్మసోషకాలను కలగలిపిన ఈ బియ్యాన్ని తిన్నవారికి పోషకాలు బాగా అందుతాయని, శరీరంలో నాడీ వ్యవస్థ మెరుగ్గా పని చేస్తుందని, గర్భిణీ స్త్రీలలో పిండం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రస్తుతం కురుపాం  నియోజకవర్గంలో 5 మండలాల్లో 73,391 బియ్యం కార్డులు ఉన్నాయని, ప్రతి నెలా 1620 మెట్రిక్ టన్నుల బియ్యం నియోజక వర్గంలో ఫిబ్రవరి 2021 నుండి 108 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ద్వారా ఇంటింటికీ బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతుందన్నారు. ఈ నెల నుంచి కురుపాం నియోజక వర్గం ఆన్ని మండలాల్లోని ఫోర్ట్ ఫెడ్ బియ్యం సూక్ష్మ పోషకలున్న బలవర్ధక బియ్యాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు.ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ బియ్యాన్ని తయారు చేయించి పంపిణీ చేస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా 7 లక్షల కార్డుదారులకు ఈ బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోందని పుష్ప శ్రీవాణి వెల్లడించారు. కాగా రాష్ట్రంలో ప్రజలందరి ఆరోగ్యాలను పరిరక్షించడానికి, పేదలకు కూడా అత్యాధునికమైన వైద్య సదుపాయాలను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రూ.8 వేల కోట్లతో నిర్మించనున్న 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేసారు. అత్యవసరమైన వైద్య సేవలు, అత్యాధునిక చికిత్సల కోసం రాష్ట్రానికి చెందిన ప్రజలు ఇతర రాష్ట్రాలలోని నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలతో పాటుగా మొత్తం 16 ప్రాంతాల్లో మెడికల్ హబ్ లను ఏర్పాటు చేసే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని పుష్ప శ్రీవాణి ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం సబ్ కలెక్టర్ విధేకర, కురుపాం గ్రామ సర్పంచ్ గార్ల సుజాత, కళింగ వైశ్య, ఐరక కార్పొరేషన్ డైరెక్టర్లు కె.సురేష్, గవర విజయ్, కళింగ వైశ్య జిల్లా అధ్యక్షుడు అందవరపు కోటేశ్వరరావు, నాయకులు శెట్టి నాగేశ్వరావు, కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.

Kurupam

2021-06-01 11:45:10

అనాధలైన చిన్నారుల వివరాలు తెలియజేయండి..

కరోనా వైరస్ భారినపడి తల్లిదండ్రులు మృతిచెంది అనాధలైన చిన్నారుల వివరాలు తెలియ జేయాలని విశాఖ అర్భన్ తహసీల్దార్ జ్నానవేణి కోరారు. మంగళవారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ కారణం తల్లిదండ్రులు మృుతి చెంది అనాధలైన చిన్నారులకు ప్రభుత్వం జీవో నెంబరు 243ని అనుసరించి  రూ.పది లక్షలు ఎక్స్ గ్రేషియా మొత్తం బ్యాంకులో ఫిక్సిడ్ జిపాజిట్ చేస్తుందన్నారు. అలాంటి వారి సమాచారం తెలియజేయాలని వార్డు కార్పోరేటర్లను, స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేశామన్నారు. అనాధలైన పిల్లలను ఆదుకోవడానికి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలన్నారు. అలాంటి వారి వివరాలను స్వయంగా తన నెంబరుకు 9849903824  తెలియజేయవచ్చునన్నారు. అనాధలైన చిన్నారుల భవిష్యత్తును కాపాడాలని తహసీల్దార్ జ్నానవేణి కోరుతున్నారు.

Visakhapatnam

2021-06-01 04:30:44

అనంతలో శాశ్వత క్రయోజనిక్ ట్యాంకర్..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషితో జిల్లాలో ఆక్సిజన్ నిల్వలు పెంచేలా చర్యలు చేపట్టడంలో భాగంగా శాశ్వత క్రయోజనిక్ ట్యాంకర్ ఏర్పాటు చేశామని అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య తెలిపారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తో కలిసి  అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో శాశ్వత క్రయోజనిక్ ట్యాంకర్ ను ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజారోగ్యాన్ని  కాపాడేందుకు ఎంపీలాడ్స్ నిధుల ద్వారా జిల్లాలో నెలకొన్న లిక్విడ్ ఆక్సిజన్ కొరత తీర్చేందుకు 10 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన లిక్విడ్ ఆక్సిజన్ శాశ్వత క్రయోజనిక్ ట్యాంకర్ చాలా తక్కువ సమయంలో ఏర్పాటు చేసి ప్రారంభించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.ఎంపీలాడ్స్ నిధుల ద్వారా రూ .24 లక్షల వ్యయంతో శాశ్వతంగా క్రయోజనిక్ ట్యాంక్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో ఎక్కడైనా ,ఏదైనా ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు అయిపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. ఇదివరకే జిల్లాకు వాహనం పైన అమర్చబడి ఉన్న క్రయోజనిక్ ట్యాంకర్ ను  తెప్పించడం జరిగిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరియు డి ఆర్ డి ఓ సహకారాలతో జిల్లాలోఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్లు  మంజూరు అయ్యాయని ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్  మహమ్మద్ వసీం సలీం, జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ, రైతు భరోసా ) నిశాంత్ కుమార్ జాయింట్ కలెక్టర్( గ్రామ , వార్డు సచివాలయం )  డా. ఏ. సిరి ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు , మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.వి ఎస్ ఎన్ మూర్తి , ఆర్ఎం ఓ డా.విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-05-31 15:57:21

సత్వర వైద్య సహాయమే ప్రభుత్వ లక్ష్యం..

కోవిడ్ నేపథ్యంలో  ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు . ముఖ్యంగా అనంతపురం ఎంపీ తలారి రంగయ్య నిధుల నుంచి కూడా ఒక శాశ్వత ట్యాంకర్ ను జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రి లో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం ఎంతో శుభపరిణామమన్నారు. దీనివల్ల కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండవని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని విధాలా ఆక్సిజన్ నిల్వలు పెంచుకునే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. గతంలో బయట ప్రాంతాల నుండి వచ్చే ఆక్సిజన్ పై ఆధారపడే వారమని ప్రస్తుతం ఆసుపత్రిలోనే స్వతహాగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకొని వాడుకునే విధంగా క్రయోజనిక్ ట్యాంకర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.గత ఏడాది మార్చి నుండి ఒక సంవత్సర కాలంలో సుమారు 40 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ,కదిరి, గుంతకల్లు ఏరియా ఆసుపత్రులలో కూడా ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.కరోనాబాధితులకు తాడిపత్రిలో 500 పడకలు, అనంతపురం సూపర్ స్పెషాలిటీ వద్ద 250 పడకలతో తాత్కాలిక ఆసుపత్రుల ఏర్పాటు చర్యలు తీసుకున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్  మహమ్మద్ వసీం సలీం, జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ, రైతు భరోసా ) నిశాంత్ కుమార్ జాయింట్ కలెక్టర్( గ్రామ , వార్డు సచివాలయం )  డా. ఏ. సిరి ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు , మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.వి ఎస్ ఎన్ మూర్తి , ఆర్ఎం ఓ డా.విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-05-31 15:54:32

500 పడకల ఆసుపత్రి త్వరలోనే ప్రారంభం..

తాడిపత్రి ప్రాంతంలోని ఆర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో 500 ఆక్సిజన్ పడకలతో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆసుపత్రి వద్ద పూర్తి అయిన పనులను  జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్ పరిశీలించారు. సోమవారం తాడిపత్రి వద్ద ఆర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆసుపత్రి పనులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అన్ని పనులు పూర్తి స్థాయిలో పూర్తి అయిన వని అతి త్వరలోనే ఆసుపత్రిని ప్రారంభిస్తామని, ఎలక్ట్రిసిటీ, శ్యానిటేషన్ అప్రోచ్ రోడ్డు , ఫెన్సింగ్ మరియు ఆక్సిజన్ సప్లై పనులు అన్నీ పూర్తి అయినాయని,  తాత్కాలిక బాత్ రూం ల యందు వాటర్ సప్లై , బాత్ రూం ఔట్ పుట్ నందు సంపులు ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచాలని ఆదేశించారు. డాక్టర్లు మరియు నర్స్ లకు సంబంధించి రోజువారీ ఆహారము మరియు వారు నివాసం  ఉంటున్న టేక్ ఇంజనీరింగ్ కాలేజీ నందు ప్రత్యేకంగా తనిఖీ చేసి, వారికి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఇంఛార్జి అధికారులకు సూచించారు;  కార్యక్రమంలో  ఏపీఎంఎస్ఐడిసి డిఈ చంద్రశేఖర్ రెడ్డి, తహశీల్దార్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Tadipatri

2021-05-31 15:52:46

11.30 వరకే అప్పన్న ప్రసాద విక్రయాలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానంలో జూన్ 1 నుంచి సింహాద్రి అప్పన్న  దర్శనాల సమయం పెంచిన సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. సోమవారం ఆమె ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. స్వామివారి దర్శనాలు జరుగుతున్న సమయం అంటే 11.30 వరకూ మాత్రమే ప్రసాదాల విక్రయాలు జరుగుతాయని చెప్పారు. భక్తుల సౌకర్యార్ధం రూ.300, 100, టోల్ గేట్ల టిక్కెట్లను ఒకే చోట అందించే ఏర్పాటు చేశామన్నారు.  కోవిడ్ నిబంధనలను ద్రుష్టిలో పెట్టుకొని క్యూలైన్య శానిటైజేషన్ చేయించినట్టు చెప్పారు. భక్తులంతా ఖచ్చితంగా మాస్కులు ధరించి ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని ఈఓ తెలియజేశారు.

Simhachalam

2021-05-31 15:49:38

అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు..

వైద్య సేవ‌లు, ఇత‌ర చికిత్సలు అందించిన త‌ర్వాత క‌రోనా రోగుల నుంచి నిబంధ‌న‌ల మేర‌కే ఫీజులు వ‌సూలు చేయాల‌ని, అలా కాకుండా అధికంగా వ‌సూలు చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని జేసీ ఆర్‌. మ‌హేష్ కుమార్ హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వం ఇటీవ‌ల జారీ చేసిన‌ జీవో నెం.185లో పేర్కొన్న ప్ర‌తి నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని, నియ‌మావ‌ళిని అమ‌లు చేయాల‌ని ఆదేశించారు. కోవిడ్ సేవ‌లు, ఫీజుల వ‌సూలు, మందుల స‌ర‌ఫ‌రా త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్షించేందుకు జేసీ ఆర్‌. మ‌హేష్ కుమార్ సోమ‌వారం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో స‌మావేశం నిర్వ‌హించారు. 185 జీవో ప్ర‌కారం ఆరోగ్య శ్రీ సేవ‌ల‌కు, ప్రయివేటు సేవ‌ల‌కు ఎంతెంత‌ ఫీజు వ‌సూలు చేయాలో స్ప‌ష్టంగా పేర్కొన‌డ‌మైన‌ద‌ని ఈ సంద‌ర్భంగా తెలిపారు. చికిత్స అనంత‌రం నాన్ మెడిక‌ల్ నోడ‌ల్ ఆఫీస‌ర్ ప‌రిశీలించి కౌంటర్ సంత‌కం చేసిన త‌ర్వాతే బిల్లులు మంజూర‌వుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ ఆదేశాల‌ను, నిబంధ‌న‌లను పాటించ‌ని ఆసుప‌త్రుల యాజ‌మాన్యాల‌కు మూడు సార్లు జరిమానా విధిస్తామ‌ని.. త‌ర్వాత చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. ఆసుప‌త్రుల్లో అందే చికిత్స‌, ఇత‌ర సేవ‌ల‌పై నోడ‌ల్ ఆఫీస‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. థ‌ర్డ్ పార్టీ బృందం బిల్లుల విష‌యంలో.. సేవ‌ల విష‌యంలో రోగుల‌తో మాట్లాడి త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని వివ‌రించారు. అలాగే ఆసుప‌త్రుల్లో అందే సేవ‌ల‌పై, ఇత‌ర ప్ర‌క్రియ‌ల‌పై ఇంటిలిజెన్స్ నిఘా ఉంటుంద‌ని జేసీ వెంక‌ట‌రావు అన్నారు. బిల్లు త‌యారు చేసేట‌ప్ప‌డు ఏక మొత్తం వేయ‌రాద‌ని, ఏ సేవ‌కు ఎంత ఫీజు వ‌సూలు చేస్తున్నారో స్ప‌ష్టంగా పేర్కోవాల‌ని సూచించారు. క‌రోనా రోగుల‌ను ఉద‌యం 8.00 గంట‌లకు ముందు, రాత్రి 10.00 గంట‌ల త‌ర్వాత డిశ్చార్జి చేయ‌డానికి వీలులేద‌ని చెప్పారు. 

బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌పై ప్ర‌త్యేక దృష్టి..

బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌ను గుర్తించిన వెంట‌నే చికిత్స అంద‌జేయాల‌ని, ఆల‌స్యం చేయ‌రాద‌ని జేసీ మ‌హేష్ కుమార్ సూచించారు. వ్యాధి ల‌క్ష‌ణాలు గుర్తించిన వెంట‌నే డీసీహెచ్‌స్‌ను లేదా మిమ్స్ ఆసుప‌త్రిలో సంప్ర‌దించాల‌ని అక్క‌డ వ్యాధిని నిర్ధారించాక తదుప‌రి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. అలాగే కోవిడ్ రోగుల‌కు గానీ, బ్లాక్ ఫంగ‌స్ రోగుల‌కు గానీ అవ‌స‌ర‌మైన‌ మందుల ఇండెంట్‌ను ప్ర‌భుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఎం.డి.ఎ.పి. యాప్ ద్వారానే పెట్టాల‌ని సూచించారు. రోగుల‌కు వైద్య ప‌రమైన సేవ‌లందిచ‌టంలో నోడ‌ల్ ఆఫీస‌ర్లు బాధ్య‌తాయుతమైన పాత్ర పోషించాల‌ని పేర్కొన్నారు.

సమావేశంలో జేసీలు ఆర్‌. మ‌హేష్ కుమార్‌, జె. వెంక‌ట‌రావు, డీసీహెచ్ఎస్ నాగ‌భూష‌ణ‌రావు, డీఎం&హెచ్‌వో ర‌మ‌ణ కుమారి, ఆరోగ్య శ్రీ జిల్లా కో-ఆర్డినేట‌ర్ అప్ప‌ల‌రాజు, వైద్యాధికారులు, ప్ర‌యివేటు ఆసుపత్రుల నిర్వాహ‌కులు, ఆరోగ్య శ్రీ కార్య‌క‌ర్త‌లు, ఫార్మసిస్టులు త‌దిత‌రులు పాల్గొన్నారు.


Vizianagaram

2021-05-31 15:39:38

అన్నదానం, ప్రసాదం కేంద్రాల ఆధునీకరణ డిజైన్లకు ఆహ్వానం..

సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో భక్తులకు అత్యంత నాణ్యమైన అన్న ప్రసాదాలను అందించాలని ట్రస్టు బోర్డు ఛైర్మన్ సంచయిత గజపతి, సభ్యులు, ఈఓ  ఎంవీ సూర్యకళ నిర్ణయించారు. ట్రస్టు బోర్డు సూచనల మేరకు అన్నదానం, ప్రసాదం తయారీ కేంద్రాలను పూర్తి స్థాయిలో  ఆధునీకరణ కోసం ఈఓ ఆసక్తి ఉన్నవారి నుంచి డిజైన్లు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఈఓ మీడియాతో మాట్లాడుతూ,  దైవభక్తి ఉన్న ఔత్సాహిక  డిజైన్లను ట్రస్టు బోర్డు  పరిశీలించాక తదుపరి చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు.  దాతలు ముందుకొచ్చి అన్న ప్రసాదాల కిచెన్ల ఆధునీకరణలో పాల్గొనవచ్చున్నన్నారు. ఎక్కువ మంది భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలు అందించేందుకు  ఆటోమేటిక్ మెకనైజ్డ్ , శానిటైజ్డ్ కిచెన్లు  ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. దేవస్థానం ఇచ్చిన టెక్నికల్ క్రైటీరియా పాటిస్తూ సింహాచలం అన్నదానం , కిచెన్ల ఆధునీకరణ చేసేవారు డిజైన్లు సమర్పించవచ్చు. మరిన్ని వివరాల కోసం దేవస్థానం వెబ్ సైట్  www.simhachalamdevasthanam.net  లేదా  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వెబ్ సైట్   www.tender.apeprocurement.gov.in  లను చూడవచ్చు. EOI (ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇట్రస్టు)  గురించి వివరాలు తెలుసుకోవడానికి దేవాలయం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.రవిరాజుకు 9618072527 ఫోన్ చేసి తెలుసుకోవచ్చనన్నారు.  

                   దేవస్థానంలో ప్రస్తుతం ప్రతి రోజూ మ్యాన్యువల్ గా 15,000 పులిహోర ప్యాకెట్లు, 20,000 లడ్డూ ప్యాకెట్లను తయారు చేస్తోందని ఇకపై భక్తుల అవసరాలను దృష్టిలోపెట్టుకుని  వీటి తయారీకి మెషీన్లు కూడా వినియోగించనున్నామన్నారు. రోజుకు దాదాపు 15,000 మందికి అన్నప్రసాదం అందించేలా అన్నప్రసాదం గ్రౌండ్ ఫ్లోర్ , సెంట్రల్ స్టోర్ కిచెన్ ను యాంత్రీకరించనున్నామని  ఈఓ తెలిపారు.  డిజైన్లు చేసిన వారికి ఎలాంటి పారితోషకం ఇవ్వరని, కేవలం స్వామివారిపై ఉన్న భక్తితోనే ఉచితంగానే డిజైన్లు సమర్పించాల్సి వుంటుందని పేర్కొన్నారు.

Simhachalam

2021-05-31 15:38:22