1 ENS Live Breaking News

అనాధపిల్లల ఖాతాల్లోకి రూ.10 లక్షలు..

ఒక‌వైపు జిల్లాలో కోవిడ్ క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటూనే మ‌రోవైపు రాష్ట్ర ప్ర‌భుత్వం ద్వారా కోవిడ్ ప్ర‌భావిత కుటుంబాల సంక్షేమానికి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లోని వివేకానంద స‌మావేశ మందిరంలో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన, తల్లిదండ్రుల్లో ఒకరు ఇంతకు ముందే మరణించి, ఇప్పుడు కోవిడ్ తో మరొకరు మరణించడం వల్ల  అనాథ‌లైన చిన్నారుల పేరిట రూ.10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే కార్యకమాన్ని కలెక్టర్ డి. మురళీధర్‌రెడ్డి ప్రారంభించారు. కాకినాడ గ్రామీణ మండ‌లం, తిమ్మాపురం గ్రామానికి చెందిన 11 ఏళ్ల  చిన్నారితోపాటు రాజ‌మ‌హేంద్ర‌వ‌రానికి చెందిన‌, ప్ర‌స్తుతం గోక‌వ‌రంలో సంర‌క్షుల వ‌ద్ద ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్ద‌రు చిన్నారుల సంర‌క్ష‌కుల‌కు డిపాజిట్‌కు సంబంధించిన ప‌త్రాల‌ను క‌లెక్ట‌ర్ అందించారు.  

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ కోవిడ్ విప‌త్తు కార‌ణంగా అనాథ‌లైన చిన్నారుల‌కు రూ.10 ల‌క్షల ఎక్స్‌గ్రేషియాను గౌర‌వ ముఖ్య‌మంత్రి ఇటీవ‌ల ప్ర‌క‌టించార‌ని, ఈ మేర‌కు జిల్లాలో అర్హుల‌ను గుర్తించి, వారికి ల‌బ్ధిచేకూర్చుతున్న‌ట్లు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లాస్థాయి వ‌ర‌కు కోవిడ్ నియంత్ర‌ణ‌, నివార‌ణతో పాటు బాధితుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. విలేజ్ ఐసోలేష‌న్ కేంద్రాలు, కోవిడ్ కేర్ కేంద్రాల్లో (సీసీసీ) అవ‌స‌ర‌మైన అన్ని సౌక‌ర్యాలు ఏర్పాటు చేశామ‌న్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేటు ఆసుప‌త్రుల్లో ఉచితంగా కోవిడ్, బ్లాక్‌ఫంగ‌స్ బాధితుల‌కు వైద్యం అందించేలా చూస్తున్నామ‌న్నారు. ఇన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ దుర‌దృష్ట‌వ‌శాత్తు కొన్ని కుటుంబాల్లో త‌ల్లిదండ్రులిద్ద‌రూ మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయ‌ని, ఇది అత్యంత విచార‌క‌ర‌మ‌న్నారు. ఈ కుటుంబాల బాధిత చిన్నారుల‌కు దేశంలో ఎక్క‌డా లేని విధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.10 ల‌క్ష‌లు డిపాజిట్ చేసే కార్య‌క్ర‌మాన్ని అమ‌లుచేస్తోంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా ప‌రిహారానికి అర్హులైన వారి పేరుతో ఏదైనా జాతీయ బ్యాంకులో రూ.10 ల‌క్ష‌లు డిపాజిట్ చేసి, బాండ్‌ను వారికి అందించనున్న‌ట్లు తెలిపారు. చిన్నారుల‌కు 25 ఏళ్లు నిండాక ఈ సొమ్ము తీసుకునేందుకు వీలుంటుంద‌ని, అప్ప‌టివ‌ర‌కు ఈ డిపాజిట్‌పై వ‌చ్చే వ‌డ్డీ మొత్తాన్ని నెల‌వారీగానీ, మూడు నెల‌ల‌కోసారి గానీ తీసుకోవ‌చ్చ‌ని వివ‌రించారు. వ‌డ్డీ ద్వారా వ‌చ్చే సొమ్ము చిన్నారుల చ‌దువుకు, ఇత‌ర అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. చిన్నారుల భ‌విష్య‌త్‌ను దృష్టిలో ఉంచుకొని ప్ర‌భుత్వం ఈ ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. చిన్నారుల‌కు అధిక వ‌డ్డీ వెళ్లేలా బ్యాంక‌ర్ల‌కు కూడా విజ్ఞ‌ప్తి చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. చిన్నారుల‌కు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల ఫ‌లాలు అందేలా ఆయా శాఖ‌ల అధికారుల‌కు ఆదేశాలిచ్చామ‌న్నారు. ఇలాంటి చిన్నారులు ఇంకా ఎవ‌రైనా ఉంటే మీడియాతో పాటు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు ఐసీడీఎస్ అధికారుల‌కు తెలియ‌జేయాల‌న్నారు. గ్రామ స్థాయిలో కోవిడ్ క‌ట్ట‌డి క‌మిటీల‌కు నేతృత్వం వ‌హిస్తున్న స‌ర్పంచ్‌లు ఈ విష‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. 
    కాకినాడ గ్రామీణ మండ‌లం తిమ్మాపురం గ్రామానికి చెందిన 11 ఏళ్ల చిన్నారి శ‌ర‌ణ్య‌తో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ బాగా చ‌దువుకొని, డాక్ట‌ర్ కావాల‌ని మార్గ‌నిర్దేశ‌నం చేశారు. కాకినాడ ఆర్ఎంసీలో వైద్య విద్య‌ను అభ్య‌సించాల‌ని ఆకాంక్షించారు. త‌ల్లిదండ్రులను కోల్పోవ‌డంతో నీకు ఎదురైన క‌ష్టం ఇంకెవ‌రికీ రాకుండా ఉండాలంటే త‌ప్ప‌నిస‌రిగా డాక్ట‌ర్ కావాల‌ని చిన్నారి భ‌విష్య‌త్‌కు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జేసీ (ఆర్) డా. జి. లక్ష్మీశ, జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (డబ్ల్యూ) జి.రాజకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఐసీడీస్ పీడీ జీవీ సత్యవాణి, డీఎంహెచ్‌వో ఎన్. ప్రసన్నకుమార్, డీసీపీవో వెంక‌ట్‌ తదితరులు పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మం ద్వారా ల‌బ్ధి పొందేందుకు అర్హ‌త‌లు:
- ద‌ర‌ఖాస్తు చేసుకునే తేదీ నాటికి 18 ఏళ్ల లోపు వ‌య‌సుండాలి.
- కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన వారి పిల్ల‌లు.
- తల్లిదండ్రుల్లో ఒకరు ఇంతకు ముందే మరణించి, ఇప్పుడు కోవిడ్‌తో మరొకరు మరణించిన వారి పిల్ల‌లు.
- కుటుంబ ఆదాయం దారిద్ర్యరేఖ‌కు దిగువ‌న ఉండాలి.
- కోవిడ్ పాజిటివ్ రిపోర్టును స‌మ‌ర్పించాలి.
- ఇత‌ర బీమా సంస్థ‌ల నుంచి ల‌బ్ధిపొంద‌ని వారు అర్హులు.
- జిల్లాకు సంబంధించి చిన్నారుల వివ‌రాల‌ను టోల్‌ఫ్రీ నెంబ‌రు 1098కు కాల్‌చేసి, అందించ‌వ‌చ్చు.

Kakinada

2021-05-26 13:48:04

అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు. కోవిడ్ రెండవ దశ తీవ్రంగా ఉన్న దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పోలీసు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. జివిఎంసి సిబ్బంది  కోవిడ్-19 సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నందున భవన నిర్మాణాలపై సరైన పర్యవేక్షణ చేయలేకపోతున్నార్నారు.  దీనిని ఆసరాగా తీసుకొని భవన నిర్మాణదారులు, అనధికారంగా గాని, నిబంధనలకు విరుద్ధంగా గాని అనధికార ఫ్లోర్లు నిర్మిస్తే అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి కట్టడాలను గుర్తించి అవి ఏ దశలో ఉన్నవైననూ వాటిపై చర్యలు చట్టపరంగా తీసుకుంటామని హెచ్చరించారు. సదరు భవన యాజమాన్యంపై అపరాధ రుసుం విధించచడంతో పాటు, క్రిమనల్ చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు.

GVMC office

2021-05-26 13:33:24

దోమల నివారణకు “డ్రై” డే పాటించాలి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలంతా దోమల నియంత్రణకు స్వచ్చందంగా ముందుకు వచ్చి వారానికి ఒక రోజుడ్రై పాటించాలని కమిషనర్ డా.జి.స్రిజన కోరారు. బుధవారం రెండవ జోన్ పరిధిలోని 7వ వార్డు మధురవాడ స్వతంత్ర నగర్ లో జివిఎంసి కమిషనర్  పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  సీజనల్ వ్యాధులు దృష్టిలో పెట్టుకొని అందరు వారంలో ఒక్క రోజు “డ్రై” డే పాటించాలని, కుండీల లోని నీరు నిల్వ ఉంచకుండా ఎండబెట్టుకోవాలన్నారు. పరిసర ప్రాంతాల్లో కొబ్బరిబొండాలు, నీరు నిల్వ ఉండే వస్తువులు, ప్లాస్టిక్ సామగ్రి లాంటివి ఉండకుండా చూసుకోవాలన్నారు. కొందరి ఇంటివద్ద ఉన్న కుండీలను ఆమె స్వయంగా పరిశీలించి, మెలేరియా సిబ్బంది నిత్యం ప్రతి ఇంటిని పరిశీలించేలా చూడాలని  వెటర్నరి డాక్టరును ఆదేశించారు. తడి–పొడి చెత్త సేకరణ, డోర్ టు డోర్ చెత్త నిర్వహణ పై పారిశుధ్య సిబ్బంది వస్తున్నదీ లేనిదీ ఆరా తీసారు. రోడ్లు, కాలువలను, గెడ్డలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి డంపింగు యార్డుకు తరలించాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. ప్రధాన రహదారిపై ఉన్న దుకాణాల ముందు డస్ట్ బిన్లు లేకపోవడంపై శానిటరి ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శిని వివరణ కోరాలని జోనల్ కమిషనరును ఆదేశించారు. తడి-పొడి చెత్తను వేరువేరుగా తీసుకోవాలని పారిశుధ్య సిబ్బందికి సూచించారు. ఫీవర్ సర్వే ఏ విధంగా జరుగుచున్నదని స్థానిక ప్రజలు అడిగితెలుసుకున్నారు. ఫీవర్ సర్వే బృందం వచ్చినప్పుడు వారికి సహకారం అందించి కరోనా వైరస్ ను అరికట్టాలని సూచించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, కార్యనిర్వాహక ఇంజినీరు (మెకానికల్) చిరంజీవి, సహాయక ఇంజినీరు(వాటర్ సప్లై) శ్రీహరి, సహాయక ఇంజినీరు(వర్క్స్)   శ్రీనివాస్, వెటనరీ డాక్టరు కిషోర్, 7వ వార్డు శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శిలు, తదితరులు పాల్గొన్నారు. 

Madhurawada

2021-05-26 13:28:55

పారిశుధ్య సిబ్బందిని సర్దుబాటు చేయాలి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ లోని సచివలయాల వారిగా పారిశుధ్య కార్మికులను సర్దుబాటు చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె “సిస్కొ వెబెక్స్” (CISCO Webex)ద్వారా  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని సచివాలయాలలో ఒక పారిశుధ్య కార్మికుడు ఉంటె మరికొన్ని సచివాలయాల పరిధిలో 22 మంది వరకు ఉన్నారని వారిని సర్దుబాటు చేయాలని, ప్రతి వార్డు సచివాలయాలలో 7 నుండి 8 మంది పారిశుధ్య కార్మికులు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య కార్మికులు ఎవ్వరు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో మనం ఎంతమందికి జీతాలు చెల్లిస్తున్నామో పూర్తి వివరాలు తెలియపరచాలని అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు ఆదేశించారు.  డోర్ టు డోర్ చెత్త సేకరణ సరిగా చేయడం లేదని దాని వలన బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తున్నారని, దీనిని అడ్డుకట్ట వేసే బాధ్యత శానిటరి ఇన్స్పెక్టర్, పారిశుధ్య మేస్త్రి, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శులు వహించవలసి ఉంటుందని హెచ్చరించారు.  డోర్ టు డోర్ చెత్త నిర్వహించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తడి – పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని, ఆలా ఇవ్వని యడల చెత్త తీసుకోరాదని  శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. చికెన్ సెంటర్లు, మార్కెట్లు, హోటల్స్, రెస్టారెంట్లు వద్ద ప్రతి రోజు చెత్తను నిల్వ ఉంచకుండా చూడాలన్నారు.  ట్రీ వేస్ట్, రోడ్లపై చెత్త, ఇళ్ళల్లోని వేస్ట్, EPDCL వారు కట్ చేసిన ట్రీ వేస్ట్ ను మధ్యాహ్నం 12.00  గంటలలోపు డంపింగు యార్డుకు తరలించాలని ఆదేశించారు. చెత్త నిర్వహన సరిగా లేదని కంప్లైంటు ఏ  రూపంలో వచ్చిన వాటిని పరిష్కరించి రీ-జోయండర్సు ఇవ్వాలని ఆదేశించారు. యూజర్ చార్జీలు వసూలుకు యాప్ రూపొందించాలని అదనపు కమిషనర్  డా. వి. సన్యాసిరావు ఆదేశించారు. జివిఎంసి సిబ్బంది వ్యాక్సినేషన్ మొదటి డోస్ ఎంతమంది వేయించుకోవాలో, రండవ డోస్ ఎంతమంది వేయించుకోవాలో తెలియపరచాలని ప్రధాన వైధ్యాదికారిని ఆదేశించారు. రోడ్ స్వీపింగు మెషీన్ సరిగా పనిచేయడం లేదని వాటిని పరిశీలించాలని కార్యనిర్వాహక ఇంజినీరు చిరంజీవిని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, కార్యనిర్వాహక ఇంజినీరు (మెకానికల్)  చిరంజీవిని ,ఎఎంఒహెచ్ లు, శానిటరి ఇన్స్పెక్టర్ల తోనూ పాల్గొన్నారు. 

GVMC office

2021-05-25 15:53:33

రాజమండ్రి

2021-05-25 15:19:57

సాగర్ సిమెంట్స్ కోవిడ్ విరాళం రూ.5 లక్షలు..

అనంతపురం జిల్లాలో కోవిడ్ నియంత్రణ చర్యలకు తమవంతు సహాయంగా సాగర్ సిమెంట్స్ రూ.ఐదు లక్షల విరాళం ప్రకటించింది. తాత్కాలిక ఆసుపత్రి ప్రాంగణంలోనే సాగర్ సిమెంట్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఈపీ రంగా రెడ్డి,  హెచ్ ఆర్ శ్రీమన్నారాయణలు ఐదు లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టరుకు గంధం చంద్రుడికి అందజేశారు. గతంలో కోవిడ్ పై పోరాటంలో భాగంగా సీఎం రిలీఫ్ ఫండుకు రూ.25 లక్షల రూపాయలు, పోలీసు శాఖకు రూ.2 లక్షల రూపాయల విలువైన పీపీఈ కిట్లను అందజేయడమే గాక తాజాగా ఐదు లక్షల రూపాయల విరాళం అందించిన సాగర్ సిమెంట్స్ మేనేజ్ మెంటును కలెక్టర్ అభినందించారు. కరోనా సమయంలో దాతల సహాయం కోవిడ్ రోగుల ప్రాణాలను కాపాడుతుందని అన్నారు.

Tadipatri

2021-05-25 14:40:53

ఆసుపత్రిలో ఆహ్లాదకర వాతావరణం ఉండాలి..

తాడిపత్రి అర్జాస్ స్టీల్ వద్ద ఏర్పాటు చేస్తున్న 500 పడకల తాత్కాలిక ఆసుపత్రిలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణం పచ్చదనంతో నిండిపోవాలన్నారు. మంగళవారం సాయంత్రం తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. ఆసుపత్రిలో స్వచ్ఛ వాతావరణం కనిపించాలన్నారు. వేస్ట్ మ్యానేజ్ మెంట్ పకడ్బందీగా నిర్వహించాలని, 500 పడకల ఆసుపత్రి నిర్వహణకు కావాల్సిన సిబ్బందిని నియమించుకోవాలని తాడిపత్రి మునిసిపల్ కమిషనర్ ను అదేశించారు. ఆసుపత్రిలో వాహనం అనేది కనిపించకూడదన్నారు. వాహనాల పార్కింగ్ పూర్తిగా ఆసుపత్రి అవరణం బయటే ఉండాలన్నారు. సహాయకుల కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. సహాయకుల కోసం ప్రత్యేక భోజన శాల, వెయిటింగ్ హాల్ ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రిలో సహాయకులను నియంత్రించేందుకు ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని పోలీసు శాఖను అదేశించారు. సహాయకుల కోసం రిజిస్టర్ నిర్వహించుకుని బాధితుల వద్ద గడిపే సమయాన్ని నియంత్రించాలన్నారు. 

 పూర్తయిన సర్జ్ ట్యాంకు నిర్మాణం 
అర్జాస్ స్టీల్స్ వారు పూర్తి చేసిన సర్జ్ ట్యాంకును కలెక్టర్ పరిశీలించారు. సర్జ్ ట్యాంక్ వరకూ అనుకున్న సమయానికి ఆక్సిజన్ సరఫరా చేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సర్జ్ ట్యాంకు నుంచి పడకలకు ఆక్సిజన్ సప్లై చేయడానికి సంబంధించిన పనులు పూర్తి చేయాలని ఏపీఎమ్ఎస్ ఐడీసీ ఈఈ ని ఆదేశించారు. కోవిడ్ బాధితులకు వైద్య అందించేందుకు అవసరమైన సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, మందులను సిద్ధం చేసి ఉంచామని డీఎంహెచ్వో తెలిపారు. 

జిల్లా కలెక్టర్ ఆసుపత్రి పర్యవేక్షణలో అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ, ఆర్డీవో గుణ భూషణ్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ ఈ తదితరులు పాల్గొన్నారు. 

 సాగర్ సిమెంట్స్ రూ.5 లక్షలు విరాళం 
జిల్లాలో కోవిడ్ నియంత్రణ చర్యలకు తమవంతు సహాయంగా సాగర్ సిమెంట్స్ రూ.ఐదు లక్షల విరాళం ప్రకటించింది. తాత్కాలిక ఆసుపత్రి ప్రాంగణంలోనే సాగర్ సిమెంట్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఈపీ రంగా రెడ్డి,  హెచ్ ఆర్ శ్రీమన్నారాయణలు ఐదు లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టరుకు అందజేశారు. గతంలో కోవిడ్ పై పోరాటంలో భాగంగా సీఎం రిలీఫ్ ఫండుకు రూ.25 లక్షల రూపాయలు, పోలీసు శాఖకు రూ.2 లక్షల రూపాయల విలువైన పీపీఈ కిట్లను అందజేయడమే గాక తాజాగా ఐదు లక్షల రూపాయల విరాళం అందించిన సాగర్ సిమెంట్స్ మేనేజ్ మెంటును కలెక్టర్ అభినందించారు. 

Anantapur

2021-05-25 14:33:43

తుపానును సమర్ధవంతంగా ఎదుర్కోవాలి..

నైరుతి రుతుపవన కాలంలో ఎదురైయ్యే తుఫానులు, వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పటిష్టమైన విపత్తు నియంత్రణ ప్రణాళికలతో సంసిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి అధికారులను ఆదేశించారు.  మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి జిల్లా, డివిజన్, మండల అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిజాస్టర్ మిటిగేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జూన్ నుండి సెప్టెంబరు వరకూ నైరుతి రుతుపవన కాలంలలో తరచుగా తుఫానులు, వరదలు వంటి విపత్తులు సంభవిస్తున్నాయన్నారు.  కాకినాడ, అమలాపురం, పెద్దపురం డివిజన్ల పరిధిలోని 13 తీర మండలాలు తుఫానుల వల్ల ప్రభావితమౌతుండగా, ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లోని 27 మండలాలు వరదల తాకిడికి గురైతున్నాయన్నారు.  గత అనుభవాలను పరిగణలోకి గైకొంటూ తుఫానులు, వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ శాఖల ద్వారా చేపట్టవలసిన  విధివిధానాలతో  ప్రమాణిక విపత్తు నియంత్రణ ప్రణాళికలను రూపొందించడం జరిగిందని, ఈ ప్రణాళికల ప్రకారం అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తుఫాను, వరద ప్రభావానికి లోనైయ్యే అన్ని మండలాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలన్నిటినీ సక్రమంగా పనిచేసేలా చూడాలని, విపత్తు నివారణ, నియంత్రణకు అవసరమైన సామాగ్రి నిల్వలను ఫ్లడ్ స్టోర్ లలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. విపత్తు హెచ్చరిక వెలువడిన వెంటనే నియంత్రణ అధికారులు అందరూ తమతమ మండల ప్రధాన కార్యస్థానాలకు చేరుకుని, సహాయ, పునరావాస యంత్రాగాన్ని  సంసిద్ధ పరచాలన్నారు. విపత్తు తాకిడి మండలాల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న కోవిడ్ రోగులకు ఆరోగ్య సేవలందిస్తున్న కమ్యూనిటి హెల్త్ సెంటర్లు, విలేజి ఐసోలేషన్ సెంటర్లు ఇతర వ్యవస్థలకు విఘాతం కలుగకుండా అవసరమైన చర్యలుచేపట్టాలని, అవసరమైతే ముందే సురక్షిత ప్రాంతానికి తరలించాలని సబ్ కలెక్టర్లు, ఆర్డిఓలను ఆదేశించారు. అలాగే ఈ కేంద్రాలన్నిటిలో జనరేటర్లు విధిగా ఉండేలా చూడాలన్నారు.  అవసరమైన మందుల  నిల్వలను వైద్యఆరోగ్య అధికారులు, ఆహార, నిత్యావసర సరుకుల నిల్వలను పౌర సరఫరా అధికారులు విపత్తు తాకిడ్ మండలాల్లో తగిన పరిమాణంలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.  సహాయక చర్యల కొరకు లైసెన్స్డు బోట్లును పోర్టు, మత్స్య, టూరిజం శాఖల అధికారులు గుర్తించి ఉంచాలన్నారు. రహదారుల పునరుద్దరణకు అవసరమైన జెసిబిలు, పవర్ రంపాలను ఆర్ అండి బి అధికారులు, విద్యుత్ సరఫరా పునరుద్దరణకు అవసరమైన సిబ్బంది, సామాగ్రిని ట్రాన్స్ అధికారులు సిద్దం చేయాలని తెలిపారు. ప్రభావిత ప్రాంతాలలో త్రాగునీటి సమస్య రాకుండా ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు తగు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేపట్టాలన్నారు. భారీ వర్షాలు, వరద ముంపుల గురించి రైతులను సకాలంలో అప్రమత్తం చేసి, పంటలను కాపాడుకునే విధానాలపై అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. తుఫానుల గురించి  మత్య్సకారులను హెచ్చరించి, సురక్షితంగా తీరానికి చేరుకునేలా మత్య్సశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద కట్టలను నిశితంగా తనిఖీ చేసి బలహీనమైన గట్లను పటిష్టపరచాలని, వరద జల మట్టాల సమాచారాన్ని ఎప్పటికప్పడు రక్షణ, సహాయ యంత్రాంగానికి తెలియజేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రభలకుండా మున్సిపల్ కమీషనర్లు, పంచాయితీ అధికారులు పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమాచార వ్యవస్థకు అంతరాయం కలుగకుండా సెల్ టవర్ల వద్ద జనరేటర్లు, ఆయిల్ నిల్వలు ఉంచాలని వివిద సెల్యూలర్ కంపెనీల ఆపరేటర్లను ఆదేశించారు.
తూర్పు మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాను ప్రభావం జిల్లా పై అంతగా లేదని, అయినప్పటికి అప్రమత్తతను సడలించకుండా హై ఎలర్ట్ కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. 
సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) జి.లక్ష్మీశ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఐటిడిఏల పిఓలు, సబ్ కలెక్టర్లు, ఆర్డిఓలు, తహశిల్దారులు తదితరులు పాల్గొన్నారు.  

Kakinada

2021-05-25 14:24:43

గోశాలలో నృసింహ జయంతి..

విశాఖలోని సింహగిరి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ గోశాలలో నృసింహ జయంతి మంగళవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ మహవిష్ణువు నాలుగో అవతారం నరసింహావతారం వైశాఖ శుద్ధ చతుర్దశినాడు అవతరించిన సందర్భంగా స్వామికి ప్రతీఏడా ఈరోజున జయంతి నిర్వహించడం ఆనవాయితా వస్తుంది. ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలంటూ భక్తిశ్రద్ధలతో  స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈఓ ఎంవీ సూర్యకళ, సిబ్బంది పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో స్వామి కార్యక్రమాలు నిబంధనలు పాటిస్తూ ఏకాంతంగానే చేపట్టారు దేవస్థాన అధికారులు..

Simhachalam

2021-05-25 14:17:29

శ్రీకాకుళం జిల్లాలో ఆక్సిజన్ ఆన్ వీల్స్..

శ్రీకాకుళం జిల్లాలో ఆక్సిజన్ ఆన్ వీల్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. పలాస సి.హెచ్.సిలో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ఆన్ వీల్స్ ను మంత్రి సీదిరి అప్పలరాజు మంగళవారం ప్రారంభించారు. ఆక్సిజన్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని తూర్పు నావికాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేంద్ర బహదూర్ సింగ్ రూపకల్పన చేశారు. పి.ఎస్.ఏ ఆక్సిజన్ ప్లాంట్ ను మొబైల్ ప్లాట్ ఫామ్ కింద అనుసంధానం చేసి అవసరమగు ఆసుపత్రుల వద్ద ఆక్సిజన్ అందించే కార్యక్రమాన్ని తూర్పు నావికాదళం చేపట్టింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ కోరిన మీదట తూర్పు నావికాదళం ఆక్సిజన్ ఆన్ వీల్స్ పలాస ఆస్పత్రి వద్ద సమకూర్చినది. ఈ ప్రాజెక్టును విశాఖపట్నం నావల్ డాక్ యార్డ్ నిపుణుల బృందం వచ్చి నిర్వహణ బాధ్యతలను చేపట్టింది. ఆసుపత్రి సిబ్బందికి కూడా దీనిపై శిక్షణను కల్పించారు. కోవిడ్ భాదితులకు 24 హెచ్ ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది. మూడు నెలల పాటు ఆసుపత్రి వద్ద ఈ ప్లాంట్ లభ్యంగా ఉంటుంది. ఈ మేరకు నేవీ అధికారులు ఒక ప్రకటన జారీ చేస్తూ సాధారణ ప్రజానీకానికి సహాయక చర్యల్లో నేవి ముందుంటుందని ప్రకటించారు.  డాక్టర్ అప్పలరాజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వీల్స్ ఆన్ ఆక్సిజన్ కార్యక్రమం బృహత్తరమైనదన్నారు. పలాస ఆసుపత్రులకు సుదూరం నుండి వచ్చే కోవిడ్ బాధితులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడా, నావల్ డాక్ యార్డ్ అధికారులు ఆర్.పి.సింగ్, ఉమేష్, దినేష్ దర్శవర్ధన్, టెక్కలి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ లీల తదితరులు పాల్గొన్నారు.

Palasa

2021-05-25 14:04:44

యాస్ తుఫాన్ పై సర్వ సన్నద్దం..

బంగాళాఖాతంలో యాస్ తుఫాన్ ను ఎదుర్కొనుటకు సర్వ సన్నద్దతతో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.  మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లతో యాస్ తుఫాన్ ను ఎదుర్కొనుటకు సంసిధ్దతపై ఆయన వీడియోకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాస్ తుఫాన్ మూలంగా మూడు జిల్లాల్లో కోవిడ్ పేషెంట్లకు ఎటువంటి అంతరాయం కలుగకుండా తగు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఆక్సిజన్ తయారీ, నిల్వలపై ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. గాలులు వలన విద్యుత్ అంతరాయం ఏర్పడితే కోవిడ్ పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా తగు ఏర్పాటు చేసుకోవాలన్నారు.  తీవ్రమైన గాలులకు చెట్లు రోడ్లపై విరిగిపడితే రవాణాకు, ఆంబులెన్స్ లకు అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు.    ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలను సిద్దంగా ఉంచుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ  యాస్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో కోవిడ్ పేషెంట్లకు ఏ విధమైన ఇబ్బంది కలుగ కుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు.  స్టీల్ ప్లాంట్, తదితర కంపెనీల్లో ఆక్సిజన్ తయారీ, గ్యాస్ ఫిల్లింగ్, రీఫిల్లింగ్, ఆక్సిజన్ నిల్వలపై ముఖ్యమంత్రికి తెలిపారు.  ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ సేవలు అందించడం జరుగుతోందని, విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు చెప్పారు.  రెవెన్యూ, పంచాయితీ రాజ్ శాఖలు సిద్దంగా ఉన్నాయన్నారు. రవాణాకు, ఆంబులెన్స్ లకు అంతరాయం లేకుండా రోడ్లపై చెట్లు విరిగిపడితే తక్షణమే తొలగించేందుకు సిబ్బందిని సిద్దం చేసుకోవడమైనదని, ఎస్.డి.ఆర్.ఎఫ్, ఎన్.డి.ఆర్.ఎఫ్., కోస్ట్ గార్డు లను సిద్దం చేసుకున్నట్లు వివరించారు.  ఐ.ఎం.డి. రిపపోర్టును ఎప్పటికప్పుడు తెలియజేయనున్నట్లు తెలియజేశారు.  ఈ సమావేశంలో కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.  

Collector Office

2021-05-25 14:00:43

విశాఖజిల్లాలో 14652 మంది రైతులకు లబ్ది..

వై.యస్.ఆర్. పంటల భీమా పథకం ద్వారా జిల్లాలో 14,652 మంది రైతులు లబ్దిపొందుతున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు.   మంగళవారం  ఖరీఫ్ లో పంట నష్టపోయిన రైతులకు భీమా పరిహారం అందించడంలో భాగంగా "వైఎస్సార్ ఉచిత పంటల భీమా" పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, నర్సీపట్నం శాసన సభ్యులు పెట్ల ఉమా శంకర్ గణేష్,జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి పాల్గొని రూ.8.54 కోట్ల రూపాయల చెక్కును రైతులకు అందజేశారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ  రాష్ట్రం మొత్తం మీద 15.15 లక్షల రైతుల పంటల ఉచిత భీమా పథకంను రైతుల ఖాతాల్లో రూ.1820.23 కోట్లు ఆయన జమ చేసినట్లు పేర్కొన్నారు. 2 సంవత్సరాలలో రాష్ట్రంలో రైతులకు 83 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.  ఇచ్చిన హామీలన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు.  ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అనుకున్న సమయానికి పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు.  వ్యవసాయ శాఖ ఇన్ చార్జ్ జె.డి. మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-05-25 13:58:28

కాలువలు–గెడ్డలను శుభ్రం చేయాలి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాలలో కాలువలు, గెడ్డలు శుభ్రం చేయాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు శానిటేషన్ అధికారులను ఆదేశించారు.  క్షేత్రస్థాయిలో ప్రర్యటనలో భాగంగా 8వ జోన్ పరిధిలో 90వ వార్డును ఆయన స్వయంగా పరిశీలించ శానిటేషన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. రోడ్లు, కాలువలు, గెడ్డలను శుభ్రం చేసి చెత్తను వెంటవెంటనే డంపింగు యార్డుకు తరలించాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. డోర్ టు డోర్ చెత్తను కలక్షన్ చేయాలని, బహిరంగ ప్రదేశాలలో, కాలువలలో చెత్తను వేయకుండా చూడాలని ఆదేశించారు.  ప్రతి రోజు పారిశుధ్య సిబ్బంది డోర్ టు డోర్ చెత్తను సేకరించాలని, తడి-పొడి చెత్తను  వేరు వేరుగా తీసుకోవాలని ఆదేశించారు. 
ఈ పర్యటనలో 90వ వార్డు శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు శానిటరి కార్యదర్శి, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

విశాఖ

2021-05-25 13:43:50

జివిఎంసి సిబ్బందికి వ్యాక్సినేషన్ డ్రైవ్ ..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ సిబ్బంది ఆరోగ్యం కరోనా రహితంగా ఉంటేనే ప్రజలకు సత్వర సేవలు చేయడానికి ఆస్కారం వుంటుందని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జివిఎంసి సిబ్బందికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసి వ్యాక్షినేషన్ సెంటరును ఆమె మంగళవారం ప్రారంభించారు. జివిఎంసి ప్రధాన కార్యాలయంలో సిబ్బందికి అందరికి కోవేక్షిన్ రెండవ డోసు, కొవీషీల్డ్ మొదటి డోసు ప్రత్యేకంగా వేస్తున్నారన్నారు. దీనిని ప్రతీ ఉద్యోగి సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. నిత్యం ప్రజలతో మమేకం అయి ప్రజల మధ్య ఉండవలసి ఉన్నందున వ్యాక్సిన్ తప్పని సరిగా అందరూ వేయించుకోవాలని సూచించారు. ఇటీవల కొంతమంది జివిఎంసి సిబ్బంది కరోనాతో మరణించారని, వారి అందరి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. అందువలన సిబ్బంది అందరు ఈ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు.   

GVMC office

2021-05-25 13:37:29

తడి –పొడి చెత్తను వేరు చేసి ఇవ్వండి..

మహావిశాఖ నగర పరిధిలోని ప్రజలు శానిటేషన్ చెత్తవాహనాలకు తడి – పొడి చెత్త , ప్రమాదకరమైన చెత్తను వేరు చేసి ఇవ్వాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన తెలిపారు. మంగళవారం మూడవ జోన్ ఎం.వి.పి. కోలనీ సెక్టార్-6 ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో  కమిషనర్ మాట్లాడుతూ తడి –పొడి చెత్త మరియు  ప్రమాదకరమైన చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. ప్రతీ రోజు పారిశుధ్య సిబ్బంది వచ్చి డోర్ టు డోర్ చెత్త సేకరిస్తున్నదీ లేనిదీ ఆరా తెసారు. ప్రతీ రోజు పారిశుధ్య కార్మికులు డోర్ టు డోర్ చెత్త సేకరణ చేయించాల్సిన బాధ్యత పారిశుధ్య మేస్త్రి, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శులు దగ్గరుండి చూచుకోవాలని, లేని యడల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాయి రత్న అపార్ట్మెంట్ వారు తడి-పొడి చెత్తను వేరు చేసి ఇవ్వనందున వారిపైన సంతోషిమాత కిరాణా జనరల్ స్టోర్స్ ముందు డస్ట్ బిన్స్ లేనందున వారిపైన ఆగ్రహం వ్యక్తంచేస్తూ, ఇరువురికి అపరాధ రుసుం వసూలు చేయాలని శానిటరి సూపర్వైజర్ ను ఆదేశించారు. వర్షపు నీరు ఎక్కడా నిలువ ఉండకుండా చూడాలని, కాలువలు, గెడ్డలులలో ఉన్న చెత్తను సాయంత్రానికి శుబ్రం చేసి చెత్త తొలగించి వర్షపు నీటికి ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావం వలన చెట్లు, కొమ్మలు విరిగిపడిన వెంటనే యుద్ద ప్రాతిపదికన తొలగించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా చూడాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. అనంతరం ఫీవర్ సర్వే జరుగుచున్న విధానాన్ని స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానిక వాలంటీర్లుకు గాని, ఫీవర్ సర్వే బృందానికి గాని తెలియపరచాలని, కరోనా వైరస్ నకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాదికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, మూడవ జోనల్ కమిషనర్ శ్రీనివాస్, శానిటరి సూపర్వైజర్, శానిటరి ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.    

MVP Colony

2021-05-25 13:33:08