1 ENS Live Breaking News

గోశాలలో నృసింహ జయంతి..

విశాఖలోని సింహగిరి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ గోశాలలో నృసింహ జయంతి మంగళవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ మహవిష్ణువు నాలుగో అవతారం నరసింహావతారం వైశాఖ శుద్ధ చతుర్దశినాడు అవతరించిన సందర్భంగా స్వామికి ప్రతీఏడా ఈరోజున జయంతి నిర్వహించడం ఆనవాయితా వస్తుంది. ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలంటూ భక్తిశ్రద్ధలతో  స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈఓ ఎంవీ సూర్యకళ, సిబ్బంది పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో స్వామి కార్యక్రమాలు నిబంధనలు పాటిస్తూ ఏకాంతంగానే చేపట్టారు దేవస్థాన అధికారులు..

Simhachalam

2021-05-25 14:17:29

శ్రీకాకుళం జిల్లాలో ఆక్సిజన్ ఆన్ వీల్స్..

శ్రీకాకుళం జిల్లాలో ఆక్సిజన్ ఆన్ వీల్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. పలాస సి.హెచ్.సిలో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ఆన్ వీల్స్ ను మంత్రి సీదిరి అప్పలరాజు మంగళవారం ప్రారంభించారు. ఆక్సిజన్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని తూర్పు నావికాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేంద్ర బహదూర్ సింగ్ రూపకల్పన చేశారు. పి.ఎస్.ఏ ఆక్సిజన్ ప్లాంట్ ను మొబైల్ ప్లాట్ ఫామ్ కింద అనుసంధానం చేసి అవసరమగు ఆసుపత్రుల వద్ద ఆక్సిజన్ అందించే కార్యక్రమాన్ని తూర్పు నావికాదళం చేపట్టింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ కోరిన మీదట తూర్పు నావికాదళం ఆక్సిజన్ ఆన్ వీల్స్ పలాస ఆస్పత్రి వద్ద సమకూర్చినది. ఈ ప్రాజెక్టును విశాఖపట్నం నావల్ డాక్ యార్డ్ నిపుణుల బృందం వచ్చి నిర్వహణ బాధ్యతలను చేపట్టింది. ఆసుపత్రి సిబ్బందికి కూడా దీనిపై శిక్షణను కల్పించారు. కోవిడ్ భాదితులకు 24 హెచ్ ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది. మూడు నెలల పాటు ఆసుపత్రి వద్ద ఈ ప్లాంట్ లభ్యంగా ఉంటుంది. ఈ మేరకు నేవీ అధికారులు ఒక ప్రకటన జారీ చేస్తూ సాధారణ ప్రజానీకానికి సహాయక చర్యల్లో నేవి ముందుంటుందని ప్రకటించారు.  డాక్టర్ అప్పలరాజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వీల్స్ ఆన్ ఆక్సిజన్ కార్యక్రమం బృహత్తరమైనదన్నారు. పలాస ఆసుపత్రులకు సుదూరం నుండి వచ్చే కోవిడ్ బాధితులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడా, నావల్ డాక్ యార్డ్ అధికారులు ఆర్.పి.సింగ్, ఉమేష్, దినేష్ దర్శవర్ధన్, టెక్కలి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ లీల తదితరులు పాల్గొన్నారు.

Palasa

2021-05-25 14:04:44

యాస్ తుఫాన్ పై సర్వ సన్నద్దం..

బంగాళాఖాతంలో యాస్ తుఫాన్ ను ఎదుర్కొనుటకు సర్వ సన్నద్దతతో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.  మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లతో యాస్ తుఫాన్ ను ఎదుర్కొనుటకు సంసిధ్దతపై ఆయన వీడియోకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాస్ తుఫాన్ మూలంగా మూడు జిల్లాల్లో కోవిడ్ పేషెంట్లకు ఎటువంటి అంతరాయం కలుగకుండా తగు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఆక్సిజన్ తయారీ, నిల్వలపై ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. గాలులు వలన విద్యుత్ అంతరాయం ఏర్పడితే కోవిడ్ పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా తగు ఏర్పాటు చేసుకోవాలన్నారు.  తీవ్రమైన గాలులకు చెట్లు రోడ్లపై విరిగిపడితే రవాణాకు, ఆంబులెన్స్ లకు అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు.    ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలను సిద్దంగా ఉంచుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ  యాస్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో కోవిడ్ పేషెంట్లకు ఏ విధమైన ఇబ్బంది కలుగ కుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు.  స్టీల్ ప్లాంట్, తదితర కంపెనీల్లో ఆక్సిజన్ తయారీ, గ్యాస్ ఫిల్లింగ్, రీఫిల్లింగ్, ఆక్సిజన్ నిల్వలపై ముఖ్యమంత్రికి తెలిపారు.  ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ సేవలు అందించడం జరుగుతోందని, విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు చెప్పారు.  రెవెన్యూ, పంచాయితీ రాజ్ శాఖలు సిద్దంగా ఉన్నాయన్నారు. రవాణాకు, ఆంబులెన్స్ లకు అంతరాయం లేకుండా రోడ్లపై చెట్లు విరిగిపడితే తక్షణమే తొలగించేందుకు సిబ్బందిని సిద్దం చేసుకోవడమైనదని, ఎస్.డి.ఆర్.ఎఫ్, ఎన్.డి.ఆర్.ఎఫ్., కోస్ట్ గార్డు లను సిద్దం చేసుకున్నట్లు వివరించారు.  ఐ.ఎం.డి. రిపపోర్టును ఎప్పటికప్పుడు తెలియజేయనున్నట్లు తెలియజేశారు.  ఈ సమావేశంలో కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.  

Collector Office

2021-05-25 14:00:43

విశాఖజిల్లాలో 14652 మంది రైతులకు లబ్ది..

వై.యస్.ఆర్. పంటల భీమా పథకం ద్వారా జిల్లాలో 14,652 మంది రైతులు లబ్దిపొందుతున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు.   మంగళవారం  ఖరీఫ్ లో పంట నష్టపోయిన రైతులకు భీమా పరిహారం అందించడంలో భాగంగా "వైఎస్సార్ ఉచిత పంటల భీమా" పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, నర్సీపట్నం శాసన సభ్యులు పెట్ల ఉమా శంకర్ గణేష్,జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి పాల్గొని రూ.8.54 కోట్ల రూపాయల చెక్కును రైతులకు అందజేశారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ  రాష్ట్రం మొత్తం మీద 15.15 లక్షల రైతుల పంటల ఉచిత భీమా పథకంను రైతుల ఖాతాల్లో రూ.1820.23 కోట్లు ఆయన జమ చేసినట్లు పేర్కొన్నారు. 2 సంవత్సరాలలో రాష్ట్రంలో రైతులకు 83 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.  ఇచ్చిన హామీలన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు.  ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అనుకున్న సమయానికి పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు.  వ్యవసాయ శాఖ ఇన్ చార్జ్ జె.డి. మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-05-25 13:58:28

కాలువలు–గెడ్డలను శుభ్రం చేయాలి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాలలో కాలువలు, గెడ్డలు శుభ్రం చేయాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు శానిటేషన్ అధికారులను ఆదేశించారు.  క్షేత్రస్థాయిలో ప్రర్యటనలో భాగంగా 8వ జోన్ పరిధిలో 90వ వార్డును ఆయన స్వయంగా పరిశీలించ శానిటేషన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. రోడ్లు, కాలువలు, గెడ్డలను శుభ్రం చేసి చెత్తను వెంటవెంటనే డంపింగు యార్డుకు తరలించాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. డోర్ టు డోర్ చెత్తను కలక్షన్ చేయాలని, బహిరంగ ప్రదేశాలలో, కాలువలలో చెత్తను వేయకుండా చూడాలని ఆదేశించారు.  ప్రతి రోజు పారిశుధ్య సిబ్బంది డోర్ టు డోర్ చెత్తను సేకరించాలని, తడి-పొడి చెత్తను  వేరు వేరుగా తీసుకోవాలని ఆదేశించారు. 
ఈ పర్యటనలో 90వ వార్డు శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు శానిటరి కార్యదర్శి, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

విశాఖ

2021-05-25 13:43:50

జివిఎంసి సిబ్బందికి వ్యాక్సినేషన్ డ్రైవ్ ..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ సిబ్బంది ఆరోగ్యం కరోనా రహితంగా ఉంటేనే ప్రజలకు సత్వర సేవలు చేయడానికి ఆస్కారం వుంటుందని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జివిఎంసి సిబ్బందికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసి వ్యాక్షినేషన్ సెంటరును ఆమె మంగళవారం ప్రారంభించారు. జివిఎంసి ప్రధాన కార్యాలయంలో సిబ్బందికి అందరికి కోవేక్షిన్ రెండవ డోసు, కొవీషీల్డ్ మొదటి డోసు ప్రత్యేకంగా వేస్తున్నారన్నారు. దీనిని ప్రతీ ఉద్యోగి సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. నిత్యం ప్రజలతో మమేకం అయి ప్రజల మధ్య ఉండవలసి ఉన్నందున వ్యాక్సిన్ తప్పని సరిగా అందరూ వేయించుకోవాలని సూచించారు. ఇటీవల కొంతమంది జివిఎంసి సిబ్బంది కరోనాతో మరణించారని, వారి అందరి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. అందువలన సిబ్బంది అందరు ఈ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు.   

GVMC office

2021-05-25 13:37:29

తడి –పొడి చెత్తను వేరు చేసి ఇవ్వండి..

మహావిశాఖ నగర పరిధిలోని ప్రజలు శానిటేషన్ చెత్తవాహనాలకు తడి – పొడి చెత్త , ప్రమాదకరమైన చెత్తను వేరు చేసి ఇవ్వాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన తెలిపారు. మంగళవారం మూడవ జోన్ ఎం.వి.పి. కోలనీ సెక్టార్-6 ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో  కమిషనర్ మాట్లాడుతూ తడి –పొడి చెత్త మరియు  ప్రమాదకరమైన చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. ప్రతీ రోజు పారిశుధ్య సిబ్బంది వచ్చి డోర్ టు డోర్ చెత్త సేకరిస్తున్నదీ లేనిదీ ఆరా తెసారు. ప్రతీ రోజు పారిశుధ్య కార్మికులు డోర్ టు డోర్ చెత్త సేకరణ చేయించాల్సిన బాధ్యత పారిశుధ్య మేస్త్రి, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శులు దగ్గరుండి చూచుకోవాలని, లేని యడల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాయి రత్న అపార్ట్మెంట్ వారు తడి-పొడి చెత్తను వేరు చేసి ఇవ్వనందున వారిపైన సంతోషిమాత కిరాణా జనరల్ స్టోర్స్ ముందు డస్ట్ బిన్స్ లేనందున వారిపైన ఆగ్రహం వ్యక్తంచేస్తూ, ఇరువురికి అపరాధ రుసుం వసూలు చేయాలని శానిటరి సూపర్వైజర్ ను ఆదేశించారు. వర్షపు నీరు ఎక్కడా నిలువ ఉండకుండా చూడాలని, కాలువలు, గెడ్డలులలో ఉన్న చెత్తను సాయంత్రానికి శుబ్రం చేసి చెత్త తొలగించి వర్షపు నీటికి ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావం వలన చెట్లు, కొమ్మలు విరిగిపడిన వెంటనే యుద్ద ప్రాతిపదికన తొలగించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా చూడాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. అనంతరం ఫీవర్ సర్వే జరుగుచున్న విధానాన్ని స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానిక వాలంటీర్లుకు గాని, ఫీవర్ సర్వే బృందానికి గాని తెలియపరచాలని, కరోనా వైరస్ నకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాదికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, మూడవ జోనల్ కమిషనర్ శ్రీనివాస్, శానిటరి సూపర్వైజర్, శానిటరి ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.    

MVP Colony

2021-05-25 13:33:08

తూఫాన్ ఎదుర్కోవడానికి NDRF బ్రుందాలు..

యాస్ తుఫాన్ వలన ఎటువంటి ప్రాణ నష్టం జరగరాదని పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్థార్ ఆదేశించారు. ఇచ్ఛాపురం మండలం డొంకూరు, కవిటి మండలం ఇద్దువనిపాలెం వంటి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని పోలీసు అధికారులను, ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలను ఆదేశించారు. బృందాలు మంగళవారం ఆయా ప్రాంతాలకు చేరుకున్నాయి. లైఫ్ జాకెట్స్, విద్యత్ రంపాలు, టార్చ్ లైటులు, డ్రాగన్ లైట్లు, రోపులు అత్యవసర సమయాల్లో వినియోగించే ఇతర సామగ్రితో యస్.డి.ఆర్.ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. ప్రజలను, పశువులను రక్షించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. పునరావాస కేంద్రాలకు తరలించేందుకు, రోడ్డు మార్గంలో చెట్లును తొలగించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కవిటి పోలీసు స్టేషన్ లో వాహనాలు, జే.సి.బిలను ఏర్పాటు చేశారు.

Srikakulam

2021-05-25 13:28:24

23362 మంది రైతులకు డా.వైఎస్సార్ భీమా..

డా. వై.ఎస్.ఆర్. పంటల బీమా పధకం క్రింద జిల్లాలోని  23 వేల 362  మంది  రైతులకు లబ్ధి చేకూరిందని జిల్లా కలెక్టర్ డా.ఎం. హరి జవహర్ లాల్ తెలిపారు.    ఖరీఫ్ 2020 కు గాను 32.49 కోట్ల రూపాయలు  రైతుల ఖాతాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిచే  నేరుగా  జమ  చేయడం జరిగిందన్నారు. మంగళవారం   ముఖ్యమంత్రి శ్రీ  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  వీడియో  కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా  రైత్జులకు పంటల బీమా పధకం పరిహారాన్ని వారి ఖాతాలలో జమ చేశారు.  ఈ కార్యక్రమానికి విజయనగరం  నుండి కలెక్టర్ తో పాటు  బొబ్బిలి శాసన సభ్యులు  శంబంగి వెంకట  చిన్న అప్పల నాయుడు  సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్,  వ్యవసాయ శాఖ సంయుక్త   సంచాలకులు  ఆషా దేవి పాల్గొన్నారు.  వీడియొ కాన్ఫరెన్స్ అనంతరం జిల్లాకు చెందిన రైతులకు చెక్కును అందజేశారు.
        అనంతరం మీడియా తో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో 2020 ఖరీఫ్ కు సంబంధించి  ఎక్కువగా  వరి, వేరు శెనగ, అరటి  పంటలకు పంటల బీమా పధకం క్రింద  పరిహారం చెల్లించడం జరిగిందన్నారు. సహాయం సకాలం లో అందితేనే  రైతుకు ఉపయోగంగా ఉంటుందని భావించి  రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల కోసం ప్రకటించిన అన్ని  పధకాలతో  ఒక కాలెండర్ ను  రూపొందించి, ప్రకటించిన తేదీలలోనే వారికి లబ్ధి చేకూర్చుతున్నారని పేర్కొన్నారు.  పధకాలన్ని పారదర్శకంగా అందించడం జరుగుతోందని, రైతు భరోసా కేంద్రాల్లో  సామాజిక తనిఖీ కోసం లబ్ధి దారుల జాబితాలను ప్రదర్శించడం జరుగుతోందన్నారు. కరోనా వంటి కష్ట కాలం లో ఈ ఆర్ధిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందని  తెలిపారు.

Vizianagaram

2021-05-25 13:25:40

గ్రామాల్లో ఐసోలేష‌న్ కేంద్రాలు ఏర్పాటు..

క‌రోనా వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవ‌డానికి ప్ర‌తీ పంచాయితీలో గ్రామ ఐసోలేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ చెప్పారు. కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డానికి బుధ‌వారం నాటికి జాబితాను సిద్దం చేయాల‌ని ఆదేశించారు. వివిధ శాఖ‌ల అధికారులు, ఎంపిడిఓలు, తాశీల్దార్లు, ఇఓపిఆర్‌డిలతో మంగ‌ళ‌వారం జూమ్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ మాట్లాడుతూ, ప్ర‌స్తుతం న‌మోదవుతున్న కోవిడ్ కేసుల్లో సుమారు 60శాతం గ్రామీణ ప్రాంతాల‌నుంచే వ‌స్తున్నాయ‌ని అన్నారు. వ్యాధి ఒక‌రినుంచి ఒక‌రికి వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు, వ్యాధి గ్ర‌స్తుల‌ను ఐసోలేట్ చేయాల్సి ఉంద‌న్నారు. అయితే కొంత‌మంది ఇళ్ల‌లో వ్యాధిగ్ర‌స్తులు ఏకాంతంగా ఉండ‌టానికి అవ‌కాశం లేక‌పోవ‌డం, త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల‌, వ్యాధి ఆ కుటుంబంలోని అంద‌రికీ సోకే ప్ర‌మాదం ఉంద‌న్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని, ఆయా గ్రామాల్లోనే ఐసోలేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని చెప్పారు. కోవిడ్ కేర్ సెంట‌ర్లు ఉన్న‌చోట మిన‌హా, వ్యాధి ఎక్కువ‌గా ఉన్న ప్ర‌తీ గ్రామంలోనూ ఐసోలేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు.

             ఐసోలేష‌న్ కేంద్రాల కోసం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌, క‌ళాశాల లేదా సంక్షేమ వ‌స‌తి గృహాల‌ను ఎంపిక చేయాల‌న్నారు. ఆయా కేంద్రాల్లో వ్యాధిగ్ర‌స్తులు ఉండ‌టానికి అవ‌స‌ర‌మైన వ‌స‌తుల‌ను ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. అన్ని సౌక‌ర్యాల‌ను ప్ర‌భుత్వం క‌ల్పిస్తుంద‌ని, గ్రామ స‌ర్పంచ్ ఆధ్వ‌ర్యంలో ఆశా, ఎఎన్ఎంలు ఈ కేంద్రాల బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తార‌ని అన్నారు. కోవిడ్ ప‌రీక్ష‌ల కోసం ఎదురు చూడ‌కుండా, వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే ఈ కేంద్రాల‌కు త‌ర‌లించాల్సి ఉంటుంద‌ని చెప్పారు. ఈ కేంద్రాల‌ను జెడ్‌పి సిఇఓ, డిపిఓ జిల్లా స్థాయిలో ప‌ర్య‌వేక్షిస్తార‌ని, వైద్యారోగ్య‌శాఖ త‌గిన స‌హ‌కారాన్ని అందిస్తుంద‌ని  తెలిపారు.  గ్రామ ఐసోలేష‌న్ కేంద్రాల్లో పారిశుధ్యంపై ప్ర‌ధానంగా దృష్టి కేంద్రీక‌రించాల్సి ఉంటుంద‌న్నారు. త్రాగునీరు, మ‌రుగుదొడ్ల సౌక‌ర్యం త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు.

             జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు మాట్లాడుతూ, ఐసోలేష‌న్ కేంద్రాల ఏర్పాటుకు ప్ర‌భుత్వం జారీ చేసిన నిబంధ‌న‌ల‌ను వివ‌రించారు. వ్యాధి నియంత్ర‌ణ‌కు ఈ కేంద్రాలు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డతాయ‌ని, కాబ‌ట్టి మండ‌ల‌, గ్రామ స్థాయి అధికారులంతా, వీటి ఏర్పాటుకు యుద్ధ‌ప్రాతిపదిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. తాశీల్దార్లు, ఎంపిడిఓలు, ఇఓపిఆర్‌డిలు ఆయా గ్రామాల్లోని భ‌వ‌నాల‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిశీలించి, బుధ‌వారం నాటికి జాబితాల‌ను సిద్దం చేయాల‌ని ఆదేశించారు.
         
              ఈ కాన్ఫ‌రెన్స్‌లో  పార్వ‌తీపురం స‌బ్ క‌లెక్ట‌ర్ విదేహ్ ఖ‌రే, జిల్లా పంచాయితీ అధికారి కె.సునీల్ రాజ్‌కుమార్‌, జిల్లా ప‌రిష‌త్ సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, జిల్లా వైద్యారోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిఇఓ జి.నాగ‌మ‌ణి, డిడిఎల్ఓ రాజ్‌కుమార్‌, సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ కో-ఆర్డినేట‌ర్ చంద్రావ‌తి, ఇత‌ర అధికారులు మాట్లాడారు.

Vizianagaram

2021-05-25 13:20:58

తుపాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం..

యాస్ తుఫాన్ ను ఎదుర్కొడానికి జిల్లాలో  అన్ని  రకాల ముందస్తు ఏర్పాట్లతో యంత్రాంగాన్నిసిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి వివరించారు.  మంగళ వారం  పంటల బీమా పధకం ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర కు చెందిన ముగ్గురు జిల్లా కలెక్టర్లతో తుఫాన్ ఏర్పాట్ల పై సమీక్షించారు.  భారత వాతావరణ విభాగం చేస్తున్న  తుఫాన్ హెచ్చరికలను  అనుసరిస్తూ పరిస్థితుల్ని బట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు.  కోవిడ్ ఆసుపత్రుల్లో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆక్సిజన్ నిల్వలు , మందులు, ఆహారం  రానున్న నాలుగు రోజుల వరకు నిల్వలు చేసుకోవాలని  సూచించారు.  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా అన్నీ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  ముగ్గురు కలెక్టర్ల పై పూర్తి నమ్మకం ఉందని, బాగా పనిచేస్తారని కలెక్టర్లకు  అభినందించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఎం. హరి జవాహర్ లాల్ ముఖ్యమంత్రి తో  మాట్లాడుతూ    జిల్లాలో 5  కంట్రోల్ రూం లను ఏర్పాటు చేయడం జరిగిందని,  మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశామని, తుఫాన్ షెల్టర్ల ను ఏర్పాటు చేసి  నిత్యవసర సరుకులను కూడా సిద్ధం చేశామని తెలిపారు.  తీర ప్రాంతాల్లో పశువుల రక్షణకు షెల్టర్లను  ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.  తుఫాన్ వలన విద్యుత్ అంతరాయం ఏర్పడిన ఇబ్బంది లేకుండా కోవిడ్ ఆసుపత్రుల్లో రానున్న నాలుగు రోజులకు జనరేటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  ఆసుపత్రులకు అవసరమగు మందులు, మెటీరియల్ ను ముందుగానే ఇండెంట్ తీసుకొని  ఆక్సిజన్ ను రిజర్వ్ లో పెట్టడం జరిగిందన్నారు. కోవిడ్ కేర్ కేంద్రాల్లో కూడా సిలిండర్ లను సిద్ధం చేశామన్నారు. భోగాపురం ఆసుపత్రి లో 5 గురు కోవిడ్ రొగులు ఉన్నారని, అవసరమైతే వారిని షిఫ్ట్ చేయడానికి ప్రత్యామ్నాయం చూశామన్నారు.   విద్యుత్, జల వనరులు, ఆర్ అండ్ బి, రైల్వే  శాఖల వారితో సమీక్షించడం జరిగిందని, వారు కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  వరి, మొక్క జొన్న పంటలు నష్టం జరగకుండా రైతులకు టార్పాలిన్ లను అందించేలా  రైతు భరోసా కేంద్రాలను అలెర్ట్ చేయడం జరిగిందన్నారు.  భారత వాతావరణ సంస్థ నుండి ఎప్పటికప్పుడు అందిన హెచ్చరికలను జిల్లా అధికారులందరికి  గ్రూప్ ద్వారా పంపుతున్నామని తెలిపారు.  ఒరిస్సా లో వర్షాలు ఎక్కువగా కురిస్తే నాగావళి పొంగే అవకాశం ఉన్నందున, నదీ పరీవాహక ప్రాంతాలలో ప్రత్యేక అలెర్ట్స్ ను పంపడం జరుగుందని,  ఒరిస్సా కు చెందిన కలెక్టర్ లతో పరిస్తితి పై ఎప్పటికప్పుడు మాట్లాడడం జరుగుతోందని, సబ్ కలెక్టర్, పి.ఓ ల పర్యవేక్షణ లో  ఒక బృందం పని చేస్తోందని అన్నారు.  ఇప్పటి వరకు జిల్లాలో  యాస్  తుఫాన్ కారణంగా వర్షపాతం నమోదు కాలేదని, ఎలాంటి గాలులు, ఉరుములు  లేవని, వాతావరణం ప్రశాంతంగా ఉందని వివరించారు.  ఈ  వీడియొ కాన్ఫరెన్స్ లో సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్, శాసన సభ్యులు శంబంగి చిన్న అప్పల నాయుడు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-05-25 13:18:26

కరోనా రోగుల కోసం DCMS 5 ఆక్సిజన్ మిషన్లు..

వైర‌స్ ఉద్ధృతి అధికంగా ఉన్న కోవిడ్ రోగుల‌కు ఆక్సిజ‌న్ అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చేప‌డుతున్న చ‌ర్య‌ల్లో భాగ‌స్వామ్యం అవుతూ జిల్లా స‌హ‌కార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్‌) రూ.4,14,000 విలువైన అయిదు ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను జిల్లాకు అందించింది. ఈ మేర‌కు జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ), డీసీఎంఎస్ ఛైర్మ‌న్ డా. జి.ల‌క్ష్మీశ‌; డీసీఎంఎస్ అధికారులు.. మంగ‌ళ‌వారం ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డికి అంద‌జేశారు. కోవిడ్ బాధితుల‌కు అండ‌గా నిల‌వాల‌నే ఓ మంచి ఉద్దేశంతో ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించిన డీసీఎంఎస్‌కు క‌లెక్ట‌ర్ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి సొసైటీని అభినందించారు. కార్య‌క్ర‌మంలో అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ గీతాంజ‌లి శ‌ర్మ‌, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, డీసీఎంఎస్ సీఈవో పీబీఎం కుమార్‌, మేనేజ‌ర్ కె.శ్రీనివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-25 13:10:59

కరోనా బాధితుల కోసం NFCL 12 ఆక్సిజన్ మిషన్లు..

కోవిడ్ వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, బాధితుల‌కు వైద్య సేవ‌లు అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చేప‌డుతున్న చ‌ర్య‌ల్లో భాగ‌స్వామ్యం అవుతూ నాగార్జున ఫెర్టిలైజ‌ర్స్ అండ్ కెమిక‌ల్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్‌సీఎల్‌) 12 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను జిల్లాకు స‌మ‌కూర్చింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డిని క‌లిసి ఎన్ఎఫ్‌సీఎల్ ప్ర‌తినిధులు కాన్సంట్రేట‌ర్ల‌ను అందించారు. సామాజిక బాధ్య‌త‌గా కోవిడ్ రోగుల‌కు ప్రాణ‌వాయువును అందించే ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించిన ఎన్ఎఫ్‌సీఎల్‌కు క‌లెక్ట‌ర్ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. దాదాపు రూ.11 ల‌క్ష‌ల‌తో అయిదు లీట‌ర్ల సామ‌ర్థ్యంగ‌ల 12 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను సామాజిక బాధ్య‌త‌గా సంస్థ అందించిన‌ట్లు ఎన్ఎఫ్‌సీఎల్ సీనియ‌ర్ మేనేజ‌ర్ (పీఆర్‌) వి.ర‌వికుమార్ తెలిపారు. కార్య‌క్ర‌మంలో అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ గీతాంజ‌లి శ‌ర్మ‌, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, ఎన్ఎఫ్‌సీఎల్ సీనియ‌ర్ మేనేజ‌ర్ (హెచ్ఆర్‌) వై.ర‌మాదేవి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-25 13:09:18

ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దు..

ఎంతో క‌ష్ట‌ప‌డి పండించిన ధాన్యాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌క్కువ ధ‌ర‌కు అమ్ముకోవ‌ద్ద‌ని, ప్ర‌భుత్వం క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర  (ఎంఎస్‌పీ)కు ప్ర‌తి ధాన్యం గింజ‌నూ కొనుగోలు చేసేందుకు ప‌టిష్ట వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటుచేసి, ఈ వ్య‌వ‌స్థ ద్వారా పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం జిల్లా అధికారుల‌తో క‌లిసి క‌లెక్ట‌రేట్‌లోని వివేకానంద స‌మావేశ‌మందిరంలో జాయింట్ క‌లెక్ట‌ర్ జిల్లాలో 2020-21 ర‌బీ ధాన్యం సేక‌ర‌ణ‌పై మీడియా స‌మావేశం ఏర్పాటుచేశారు. ఈ సంద‌ర్భంగా జేసీ మాట్లాడుతూ ద‌ళారులు, క‌మిష‌న్ ఏజెంట్లు వదంతుల‌ను వ్యాప్తిచెందిస్తూ రైతుల‌ను త‌ప్పుదోవ‌ప‌ట్టిస్తున్నార‌ని,  రైతులు ఇలాంటి వాటిని న‌మ్మ‌వ‌ద్ద‌న్నారు. ముఖ్యంగా బోండాలు (ఎంటీయూ 3626) ర‌కం పండించిన రైతులు ఆందోళ‌న‌తో ఎంఎస్‌పీ కంటే త‌క్కువ ధ‌ర‌కు అమ్ముకోవ‌ద్ద‌ని, ఏవైనా సందేహాలుంటే వెంట‌నే రైతు భ‌రోసా కేంద్రాల‌ను సంప్ర‌దించాల‌ని సూచించారు. జిల్లాలో నాలుగు ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బోండాలు ర‌కం ధాన్యాన్ని పండించ‌డం జ‌రిగింద‌ని, స‌గ‌టు నాణ్య‌త‌కే మ‌ద్ద‌తు ధ‌ర ల‌భిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. క్వింటాకు రూ.1,868; 75 కేజీల‌కు రూ.1,401 మ‌ద్ద‌తు ధ‌ర‌ను ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని జేసీ వెల్ల‌డించారు.

 ప్ర‌స్తుతం జిల్లాలో 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప‌నిచేస్తున్నాయ‌ని.. వీటిని 865 రైతు భ‌రోసా కేంద్రాలు, 400 రైస్ మిల్లుల‌తో అనుసంధానించిన‌ట్లు జేసీ తెలిపారు. ఇప్ప‌టికే రైతు భ‌రోసా కేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు స‌హాయ‌కులు, గ్రామ వ్య‌వ‌సాయ స‌హాయ‌కులు క్షేత్ర‌స్థాయిలో అందుబాటులో ఉన్నార‌ని, రైతులు వీరిని సంప్ర‌దిస్తే చాలు.. వెంట‌నే ధాన్యం కొనుగోలుకు చ‌ర్య‌లు తీసుకుంటార‌ని వివ‌రించారు. క్రాప్‌బుక్‌లో న‌మోదైన ఖాతాకు ప‌ది రోజుల్లోనే ధాన్యం సొమ్ము జ‌మ‌వుతుంద‌న్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే జిల్లాస్థాయి క‌మాండ్ కంట్రోల్ రూం నెంబ‌రు 88866 13611కు ఫోన్‌చేసి, నివృత్తి చేసుకోవాల‌ని రైతులకు సూచించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ కంట్రోల్‌రూం ద్వారా 314 మందికి మార్గ‌నిర్దేశ‌నం ల‌భించింద‌ని, వారినుంచి స‌జావుగా ధాన్యం కొనుగోలు జ‌రిగిన‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. స‌మావేశంలో సివిల్‌స‌ప్ల‌య్స్ జిల్లా మేనేజ‌ర్ ఇ.ల‌క్ష్మీరెడ్డి, వ్య‌వ‌సాయ శాఖ జేడీ ఎన్‌.విజ‌య్‌కుమార్‌, డీఎస్‌వో పి.ప్ర‌సాద‌రావు పాల్గొన్నారు.

Kakinada

2021-05-25 13:05:13

కరోనాలో దాతల సహాయం మరువలేనిది..

కరోనా సమయంలో దాతలు చేసే సహాయ సహకారాలు మరువలేనివని జాయింట్ క‌లెక్ట‌ర్ (ఏ అండ్ డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారిని కొనియాడారు. కాకినాడ జేఎన్‌టీయూ ప్రొఫెస‌ర్ (సీఎస్‌సీ), అడ్మిష‌న్స్ విభాగం డైరెక్ట‌ర్ డా. కేవీ ర‌మ‌ణ‌రావు సామాజిక బాధ్య‌త‌గా రూ.మూడు ల‌క్ష‌ల విలువైన మూడు ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, గ్లూకోజ్ మీట‌ర్ల‌ను జిల్లాకు అందించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో జెసిని క‌లిసి కాన్సంట్రేట‌ర్లు, గ్లూకోజ్ మీట‌ర్ల‌ను అంద‌జేశారు. సామాజిక బాధ్య‌త‌గా కోవిడ్ బాధితుల‌కు త‌మ వంతు స‌హాయం అందించాల‌నే గొప్ప మ‌న‌సుతో చికిత్స ఉప‌క‌ర‌ణాల‌ను అందించిన డా. కేవీ ర‌మ‌ణ‌రావును జేసీ  అభినందించారు. ఈవిధంగానే మరింత మంది దాతలు ముందుకు రావడం ద్వారా ప్రాణ నష్టం అధిక సంఖ్యలో బాధితులకు సత్వర వైద్యం అందించడానికి వీలుపడుతుందని జెసి సూచించారు.

Kakinada

2021-05-25 13:03:31