1 ENS Live Breaking News

తూఫాన్ ఎదుర్కోవడానికి NDRF బ్రుందాలు..

యాస్ తుఫాన్ వలన ఎటువంటి ప్రాణ నష్టం జరగరాదని పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్థార్ ఆదేశించారు. ఇచ్ఛాపురం మండలం డొంకూరు, కవిటి మండలం ఇద్దువనిపాలెం వంటి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని పోలీసు అధికారులను, ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలను ఆదేశించారు. బృందాలు మంగళవారం ఆయా ప్రాంతాలకు చేరుకున్నాయి. లైఫ్ జాకెట్స్, విద్యత్ రంపాలు, టార్చ్ లైటులు, డ్రాగన్ లైట్లు, రోపులు అత్యవసర సమయాల్లో వినియోగించే ఇతర సామగ్రితో యస్.డి.ఆర్.ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. ప్రజలను, పశువులను రక్షించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. పునరావాస కేంద్రాలకు తరలించేందుకు, రోడ్డు మార్గంలో చెట్లును తొలగించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కవిటి పోలీసు స్టేషన్ లో వాహనాలు, జే.సి.బిలను ఏర్పాటు చేశారు.

Srikakulam

2021-05-25 13:28:24

23362 మంది రైతులకు డా.వైఎస్సార్ భీమా..

డా. వై.ఎస్.ఆర్. పంటల బీమా పధకం క్రింద జిల్లాలోని  23 వేల 362  మంది  రైతులకు లబ్ధి చేకూరిందని జిల్లా కలెక్టర్ డా.ఎం. హరి జవహర్ లాల్ తెలిపారు.    ఖరీఫ్ 2020 కు గాను 32.49 కోట్ల రూపాయలు  రైతుల ఖాతాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిచే  నేరుగా  జమ  చేయడం జరిగిందన్నారు. మంగళవారం   ముఖ్యమంత్రి శ్రీ  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  వీడియో  కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా  రైత్జులకు పంటల బీమా పధకం పరిహారాన్ని వారి ఖాతాలలో జమ చేశారు.  ఈ కార్యక్రమానికి విజయనగరం  నుండి కలెక్టర్ తో పాటు  బొబ్బిలి శాసన సభ్యులు  శంబంగి వెంకట  చిన్న అప్పల నాయుడు  సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్,  వ్యవసాయ శాఖ సంయుక్త   సంచాలకులు  ఆషా దేవి పాల్గొన్నారు.  వీడియొ కాన్ఫరెన్స్ అనంతరం జిల్లాకు చెందిన రైతులకు చెక్కును అందజేశారు.
        అనంతరం మీడియా తో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో 2020 ఖరీఫ్ కు సంబంధించి  ఎక్కువగా  వరి, వేరు శెనగ, అరటి  పంటలకు పంటల బీమా పధకం క్రింద  పరిహారం చెల్లించడం జరిగిందన్నారు. సహాయం సకాలం లో అందితేనే  రైతుకు ఉపయోగంగా ఉంటుందని భావించి  రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల కోసం ప్రకటించిన అన్ని  పధకాలతో  ఒక కాలెండర్ ను  రూపొందించి, ప్రకటించిన తేదీలలోనే వారికి లబ్ధి చేకూర్చుతున్నారని పేర్కొన్నారు.  పధకాలన్ని పారదర్శకంగా అందించడం జరుగుతోందని, రైతు భరోసా కేంద్రాల్లో  సామాజిక తనిఖీ కోసం లబ్ధి దారుల జాబితాలను ప్రదర్శించడం జరుగుతోందన్నారు. కరోనా వంటి కష్ట కాలం లో ఈ ఆర్ధిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందని  తెలిపారు.

Vizianagaram

2021-05-25 13:25:40

గ్రామాల్లో ఐసోలేష‌న్ కేంద్రాలు ఏర్పాటు..

క‌రోనా వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవ‌డానికి ప్ర‌తీ పంచాయితీలో గ్రామ ఐసోలేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ చెప్పారు. కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డానికి బుధ‌వారం నాటికి జాబితాను సిద్దం చేయాల‌ని ఆదేశించారు. వివిధ శాఖ‌ల అధికారులు, ఎంపిడిఓలు, తాశీల్దార్లు, ఇఓపిఆర్‌డిలతో మంగ‌ళ‌వారం జూమ్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ మాట్లాడుతూ, ప్ర‌స్తుతం న‌మోదవుతున్న కోవిడ్ కేసుల్లో సుమారు 60శాతం గ్రామీణ ప్రాంతాల‌నుంచే వ‌స్తున్నాయ‌ని అన్నారు. వ్యాధి ఒక‌రినుంచి ఒక‌రికి వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు, వ్యాధి గ్ర‌స్తుల‌ను ఐసోలేట్ చేయాల్సి ఉంద‌న్నారు. అయితే కొంత‌మంది ఇళ్ల‌లో వ్యాధిగ్ర‌స్తులు ఏకాంతంగా ఉండ‌టానికి అవ‌కాశం లేక‌పోవ‌డం, త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల‌, వ్యాధి ఆ కుటుంబంలోని అంద‌రికీ సోకే ప్ర‌మాదం ఉంద‌న్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని, ఆయా గ్రామాల్లోనే ఐసోలేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని చెప్పారు. కోవిడ్ కేర్ సెంట‌ర్లు ఉన్న‌చోట మిన‌హా, వ్యాధి ఎక్కువ‌గా ఉన్న ప్ర‌తీ గ్రామంలోనూ ఐసోలేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు.

             ఐసోలేష‌న్ కేంద్రాల కోసం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌, క‌ళాశాల లేదా సంక్షేమ వ‌స‌తి గృహాల‌ను ఎంపిక చేయాల‌న్నారు. ఆయా కేంద్రాల్లో వ్యాధిగ్ర‌స్తులు ఉండ‌టానికి అవ‌స‌ర‌మైన వ‌స‌తుల‌ను ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. అన్ని సౌక‌ర్యాల‌ను ప్ర‌భుత్వం క‌ల్పిస్తుంద‌ని, గ్రామ స‌ర్పంచ్ ఆధ్వ‌ర్యంలో ఆశా, ఎఎన్ఎంలు ఈ కేంద్రాల బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తార‌ని అన్నారు. కోవిడ్ ప‌రీక్ష‌ల కోసం ఎదురు చూడ‌కుండా, వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే ఈ కేంద్రాల‌కు త‌ర‌లించాల్సి ఉంటుంద‌ని చెప్పారు. ఈ కేంద్రాల‌ను జెడ్‌పి సిఇఓ, డిపిఓ జిల్లా స్థాయిలో ప‌ర్య‌వేక్షిస్తార‌ని, వైద్యారోగ్య‌శాఖ త‌గిన స‌హ‌కారాన్ని అందిస్తుంద‌ని  తెలిపారు.  గ్రామ ఐసోలేష‌న్ కేంద్రాల్లో పారిశుధ్యంపై ప్ర‌ధానంగా దృష్టి కేంద్రీక‌రించాల్సి ఉంటుంద‌న్నారు. త్రాగునీరు, మ‌రుగుదొడ్ల సౌక‌ర్యం త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు.

             జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు మాట్లాడుతూ, ఐసోలేష‌న్ కేంద్రాల ఏర్పాటుకు ప్ర‌భుత్వం జారీ చేసిన నిబంధ‌న‌ల‌ను వివ‌రించారు. వ్యాధి నియంత్ర‌ణ‌కు ఈ కేంద్రాలు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డతాయ‌ని, కాబ‌ట్టి మండ‌ల‌, గ్రామ స్థాయి అధికారులంతా, వీటి ఏర్పాటుకు యుద్ధ‌ప్రాతిపదిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. తాశీల్దార్లు, ఎంపిడిఓలు, ఇఓపిఆర్‌డిలు ఆయా గ్రామాల్లోని భ‌వ‌నాల‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిశీలించి, బుధ‌వారం నాటికి జాబితాల‌ను సిద్దం చేయాల‌ని ఆదేశించారు.
         
              ఈ కాన్ఫ‌రెన్స్‌లో  పార్వ‌తీపురం స‌బ్ క‌లెక్ట‌ర్ విదేహ్ ఖ‌రే, జిల్లా పంచాయితీ అధికారి కె.సునీల్ రాజ్‌కుమార్‌, జిల్లా ప‌రిష‌త్ సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, జిల్లా వైద్యారోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిఇఓ జి.నాగ‌మ‌ణి, డిడిఎల్ఓ రాజ్‌కుమార్‌, సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ కో-ఆర్డినేట‌ర్ చంద్రావ‌తి, ఇత‌ర అధికారులు మాట్లాడారు.

Vizianagaram

2021-05-25 13:20:58

తుపాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం..

యాస్ తుఫాన్ ను ఎదుర్కొడానికి జిల్లాలో  అన్ని  రకాల ముందస్తు ఏర్పాట్లతో యంత్రాంగాన్నిసిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి వివరించారు.  మంగళ వారం  పంటల బీమా పధకం ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర కు చెందిన ముగ్గురు జిల్లా కలెక్టర్లతో తుఫాన్ ఏర్పాట్ల పై సమీక్షించారు.  భారత వాతావరణ విభాగం చేస్తున్న  తుఫాన్ హెచ్చరికలను  అనుసరిస్తూ పరిస్థితుల్ని బట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు.  కోవిడ్ ఆసుపత్రుల్లో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆక్సిజన్ నిల్వలు , మందులు, ఆహారం  రానున్న నాలుగు రోజుల వరకు నిల్వలు చేసుకోవాలని  సూచించారు.  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా అన్నీ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  ముగ్గురు కలెక్టర్ల పై పూర్తి నమ్మకం ఉందని, బాగా పనిచేస్తారని కలెక్టర్లకు  అభినందించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఎం. హరి జవాహర్ లాల్ ముఖ్యమంత్రి తో  మాట్లాడుతూ    జిల్లాలో 5  కంట్రోల్ రూం లను ఏర్పాటు చేయడం జరిగిందని,  మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశామని, తుఫాన్ షెల్టర్ల ను ఏర్పాటు చేసి  నిత్యవసర సరుకులను కూడా సిద్ధం చేశామని తెలిపారు.  తీర ప్రాంతాల్లో పశువుల రక్షణకు షెల్టర్లను  ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.  తుఫాన్ వలన విద్యుత్ అంతరాయం ఏర్పడిన ఇబ్బంది లేకుండా కోవిడ్ ఆసుపత్రుల్లో రానున్న నాలుగు రోజులకు జనరేటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  ఆసుపత్రులకు అవసరమగు మందులు, మెటీరియల్ ను ముందుగానే ఇండెంట్ తీసుకొని  ఆక్సిజన్ ను రిజర్వ్ లో పెట్టడం జరిగిందన్నారు. కోవిడ్ కేర్ కేంద్రాల్లో కూడా సిలిండర్ లను సిద్ధం చేశామన్నారు. భోగాపురం ఆసుపత్రి లో 5 గురు కోవిడ్ రొగులు ఉన్నారని, అవసరమైతే వారిని షిఫ్ట్ చేయడానికి ప్రత్యామ్నాయం చూశామన్నారు.   విద్యుత్, జల వనరులు, ఆర్ అండ్ బి, రైల్వే  శాఖల వారితో సమీక్షించడం జరిగిందని, వారు కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  వరి, మొక్క జొన్న పంటలు నష్టం జరగకుండా రైతులకు టార్పాలిన్ లను అందించేలా  రైతు భరోసా కేంద్రాలను అలెర్ట్ చేయడం జరిగిందన్నారు.  భారత వాతావరణ సంస్థ నుండి ఎప్పటికప్పుడు అందిన హెచ్చరికలను జిల్లా అధికారులందరికి  గ్రూప్ ద్వారా పంపుతున్నామని తెలిపారు.  ఒరిస్సా లో వర్షాలు ఎక్కువగా కురిస్తే నాగావళి పొంగే అవకాశం ఉన్నందున, నదీ పరీవాహక ప్రాంతాలలో ప్రత్యేక అలెర్ట్స్ ను పంపడం జరుగుందని,  ఒరిస్సా కు చెందిన కలెక్టర్ లతో పరిస్తితి పై ఎప్పటికప్పుడు మాట్లాడడం జరుగుతోందని, సబ్ కలెక్టర్, పి.ఓ ల పర్యవేక్షణ లో  ఒక బృందం పని చేస్తోందని అన్నారు.  ఇప్పటి వరకు జిల్లాలో  యాస్  తుఫాన్ కారణంగా వర్షపాతం నమోదు కాలేదని, ఎలాంటి గాలులు, ఉరుములు  లేవని, వాతావరణం ప్రశాంతంగా ఉందని వివరించారు.  ఈ  వీడియొ కాన్ఫరెన్స్ లో సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్, శాసన సభ్యులు శంబంగి చిన్న అప్పల నాయుడు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-05-25 13:18:26

కరోనా రోగుల కోసం DCMS 5 ఆక్సిజన్ మిషన్లు..

వైర‌స్ ఉద్ధృతి అధికంగా ఉన్న కోవిడ్ రోగుల‌కు ఆక్సిజ‌న్ అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చేప‌డుతున్న చ‌ర్య‌ల్లో భాగ‌స్వామ్యం అవుతూ జిల్లా స‌హ‌కార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్‌) రూ.4,14,000 విలువైన అయిదు ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను జిల్లాకు అందించింది. ఈ మేర‌కు జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ), డీసీఎంఎస్ ఛైర్మ‌న్ డా. జి.ల‌క్ష్మీశ‌; డీసీఎంఎస్ అధికారులు.. మంగ‌ళ‌వారం ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డికి అంద‌జేశారు. కోవిడ్ బాధితుల‌కు అండ‌గా నిల‌వాల‌నే ఓ మంచి ఉద్దేశంతో ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించిన డీసీఎంఎస్‌కు క‌లెక్ట‌ర్ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి సొసైటీని అభినందించారు. కార్య‌క్ర‌మంలో అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ గీతాంజ‌లి శ‌ర్మ‌, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, డీసీఎంఎస్ సీఈవో పీబీఎం కుమార్‌, మేనేజ‌ర్ కె.శ్రీనివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-25 13:10:59

కరోనా బాధితుల కోసం NFCL 12 ఆక్సిజన్ మిషన్లు..

కోవిడ్ వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, బాధితుల‌కు వైద్య సేవ‌లు అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చేప‌డుతున్న చ‌ర్య‌ల్లో భాగ‌స్వామ్యం అవుతూ నాగార్జున ఫెర్టిలైజ‌ర్స్ అండ్ కెమిక‌ల్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్‌సీఎల్‌) 12 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను జిల్లాకు స‌మ‌కూర్చింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డిని క‌లిసి ఎన్ఎఫ్‌సీఎల్ ప్ర‌తినిధులు కాన్సంట్రేట‌ర్ల‌ను అందించారు. సామాజిక బాధ్య‌త‌గా కోవిడ్ రోగుల‌కు ప్రాణ‌వాయువును అందించే ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించిన ఎన్ఎఫ్‌సీఎల్‌కు క‌లెక్ట‌ర్ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. దాదాపు రూ.11 ల‌క్ష‌ల‌తో అయిదు లీట‌ర్ల సామ‌ర్థ్యంగ‌ల 12 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను సామాజిక బాధ్య‌త‌గా సంస్థ అందించిన‌ట్లు ఎన్ఎఫ్‌సీఎల్ సీనియ‌ర్ మేనేజ‌ర్ (పీఆర్‌) వి.ర‌వికుమార్ తెలిపారు. కార్య‌క్ర‌మంలో అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ గీతాంజ‌లి శ‌ర్మ‌, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, ఎన్ఎఫ్‌సీఎల్ సీనియ‌ర్ మేనేజ‌ర్ (హెచ్ఆర్‌) వై.ర‌మాదేవి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-25 13:09:18

ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దు..

ఎంతో క‌ష్ట‌ప‌డి పండించిన ధాన్యాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌క్కువ ధ‌ర‌కు అమ్ముకోవ‌ద్ద‌ని, ప్ర‌భుత్వం క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర  (ఎంఎస్‌పీ)కు ప్ర‌తి ధాన్యం గింజ‌నూ కొనుగోలు చేసేందుకు ప‌టిష్ట వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటుచేసి, ఈ వ్య‌వ‌స్థ ద్వారా పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం జిల్లా అధికారుల‌తో క‌లిసి క‌లెక్ట‌రేట్‌లోని వివేకానంద స‌మావేశ‌మందిరంలో జాయింట్ క‌లెక్ట‌ర్ జిల్లాలో 2020-21 ర‌బీ ధాన్యం సేక‌ర‌ణ‌పై మీడియా స‌మావేశం ఏర్పాటుచేశారు. ఈ సంద‌ర్భంగా జేసీ మాట్లాడుతూ ద‌ళారులు, క‌మిష‌న్ ఏజెంట్లు వదంతుల‌ను వ్యాప్తిచెందిస్తూ రైతుల‌ను త‌ప్పుదోవ‌ప‌ట్టిస్తున్నార‌ని,  రైతులు ఇలాంటి వాటిని న‌మ్మ‌వ‌ద్ద‌న్నారు. ముఖ్యంగా బోండాలు (ఎంటీయూ 3626) ర‌కం పండించిన రైతులు ఆందోళ‌న‌తో ఎంఎస్‌పీ కంటే త‌క్కువ ధ‌ర‌కు అమ్ముకోవ‌ద్ద‌ని, ఏవైనా సందేహాలుంటే వెంట‌నే రైతు భ‌రోసా కేంద్రాల‌ను సంప్ర‌దించాల‌ని సూచించారు. జిల్లాలో నాలుగు ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బోండాలు ర‌కం ధాన్యాన్ని పండించ‌డం జ‌రిగింద‌ని, స‌గ‌టు నాణ్య‌త‌కే మ‌ద్ద‌తు ధ‌ర ల‌భిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. క్వింటాకు రూ.1,868; 75 కేజీల‌కు రూ.1,401 మ‌ద్ద‌తు ధ‌ర‌ను ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని జేసీ వెల్ల‌డించారు.

 ప్ర‌స్తుతం జిల్లాలో 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప‌నిచేస్తున్నాయ‌ని.. వీటిని 865 రైతు భ‌రోసా కేంద్రాలు, 400 రైస్ మిల్లుల‌తో అనుసంధానించిన‌ట్లు జేసీ తెలిపారు. ఇప్ప‌టికే రైతు భ‌రోసా కేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు స‌హాయ‌కులు, గ్రామ వ్య‌వ‌సాయ స‌హాయ‌కులు క్షేత్ర‌స్థాయిలో అందుబాటులో ఉన్నార‌ని, రైతులు వీరిని సంప్ర‌దిస్తే చాలు.. వెంట‌నే ధాన్యం కొనుగోలుకు చ‌ర్య‌లు తీసుకుంటార‌ని వివ‌రించారు. క్రాప్‌బుక్‌లో న‌మోదైన ఖాతాకు ప‌ది రోజుల్లోనే ధాన్యం సొమ్ము జ‌మ‌వుతుంద‌న్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే జిల్లాస్థాయి క‌మాండ్ కంట్రోల్ రూం నెంబ‌రు 88866 13611కు ఫోన్‌చేసి, నివృత్తి చేసుకోవాల‌ని రైతులకు సూచించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ కంట్రోల్‌రూం ద్వారా 314 మందికి మార్గ‌నిర్దేశ‌నం ల‌భించింద‌ని, వారినుంచి స‌జావుగా ధాన్యం కొనుగోలు జ‌రిగిన‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. స‌మావేశంలో సివిల్‌స‌ప్ల‌య్స్ జిల్లా మేనేజ‌ర్ ఇ.ల‌క్ష్మీరెడ్డి, వ్య‌వ‌సాయ శాఖ జేడీ ఎన్‌.విజ‌య్‌కుమార్‌, డీఎస్‌వో పి.ప్ర‌సాద‌రావు పాల్గొన్నారు.

Kakinada

2021-05-25 13:05:13

కరోనాలో దాతల సహాయం మరువలేనిది..

కరోనా సమయంలో దాతలు చేసే సహాయ సహకారాలు మరువలేనివని జాయింట్ క‌లెక్ట‌ర్ (ఏ అండ్ డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారిని కొనియాడారు. కాకినాడ జేఎన్‌టీయూ ప్రొఫెస‌ర్ (సీఎస్‌సీ), అడ్మిష‌న్స్ విభాగం డైరెక్ట‌ర్ డా. కేవీ ర‌మ‌ణ‌రావు సామాజిక బాధ్య‌త‌గా రూ.మూడు ల‌క్ష‌ల విలువైన మూడు ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, గ్లూకోజ్ మీట‌ర్ల‌ను జిల్లాకు అందించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో జెసిని క‌లిసి కాన్సంట్రేట‌ర్లు, గ్లూకోజ్ మీట‌ర్ల‌ను అంద‌జేశారు. సామాజిక బాధ్య‌త‌గా కోవిడ్ బాధితుల‌కు త‌మ వంతు స‌హాయం అందించాల‌నే గొప్ప మ‌న‌సుతో చికిత్స ఉప‌క‌ర‌ణాల‌ను అందించిన డా. కేవీ ర‌మ‌ణ‌రావును జేసీ  అభినందించారు. ఈవిధంగానే మరింత మంది దాతలు ముందుకు రావడం ద్వారా ప్రాణ నష్టం అధిక సంఖ్యలో బాధితులకు సత్వర వైద్యం అందించడానికి వీలుపడుతుందని జెసి సూచించారు.

Kakinada

2021-05-25 13:03:31

ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రధాన కర్తవ్యం..

కరోనా లాంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడడమే అంతిమంగా మనందరి లక్ష్యం కావాలని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం నగరంలోని ఏడిసిసి బ్యాంక్ కార్యాలయం సమావేశ మందిరంలో రెండవ జిల్లా స్థాయి కోవిడ్ సమీక్షా కమిటీ సమావేశాన్ని జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జూమ్ కాన్ఫరెన్స్ రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఉష శ్రీ చరణ్, జొన్నలగడ్డ పద్మావతి, సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏడిసిసి బ్యాంక్ కార్యాలయం సమావేశ మందిరం నుంచి జిల్లా స్థాయి కోవిడ్ సమీక్షా కమిటీ సమావేశంలో అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా కట్టడికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు.

2 నుంచి 6 రోజుల లోపల జిల్లాలో ఆక్సిజన్ పడకలను పెంచుతాం :

జిల్లాలో 2 నుంచి 6 రోజుల లోపల ఆక్సిజన్ పడకలను మరిన్ని పెంచుతామన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ బెడ్లతో పాటు తాడిపత్రి వద్ద 500 ఆక్సిజన్ పడకలతో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రిని మరో 6 రోజుల లోపల ప్రారంభించడం జరుగుతుందని, ఇందుకోసం అన్ని రకాల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అలాగే నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద తాత్కాలిక ఆస్పత్రిలో 100 ఆక్సిజన్ పడకలు సిద్ధం చేస్తున్నామని, వాటిని మరింత పెంచుతామన్నారు. అలాగే పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి లో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ పడకలకు అవసరమైన ఆక్సిజన్ ను సరఫరా చేసి మరో 100 బెడ్లను పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో ఆక్సిజన్ పడకల సమస్య తీరే అవకాశముందన్నారు.

కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వైద్యం అందించాలి.. అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం :

జిల్లాలో కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వైద్యం అందించాలని, ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స హెచ్చరించారు. పాజిటివ్ వచ్చిన వారిని ప్రైవేట్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ కింద అర్హత ఉన్నా జాయిన్ చేసుకోకపోతే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని, ఈ విషయమై జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి), జిల్లా ఎస్పీ లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా చికిత్స కు ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే వసూలు చేయాలని డిఎంఅండ్హెచ్ఓ, డి సి హెచ్ ఎస్ లు అన్ని ఆసుపత్రులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఈ విషయాలపై ఎన్ఫోర్స్మెంట్ టీమ్లు పర్యవేక్షణ చేయాలన్నారు.

హోమ్ ఐసోలేషన్ కిట్లను హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి అందజేయాలి :

జిల్లాలో పాజిటివ్ వచ్చే హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్ కిట్లను ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి హోమ్ ఐసోలేషన్ కిట్లను మంగళవారం సాయంత్రంలోపు అందించాలన్నారు. జిల్లాలో అదనంగా 5 వేల హోమ్ ఐసోలేషన్ కిట్ల సిద్ధంగా ఉండేలా రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి కిట్లను తెప్పించుకోవాలని, కిట్లను సక్రమంగా వినియోగించుకునేలా చూడాలని డిఎంఅండ్హెచ్ఓ ను ఆదేశించారు. ఇందులో ఎలాంటి రాజీ పనికిరాదన్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్ఈజీఎస్ కింద ఉపాధి పనులను ఆపొద్దు :

జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్ఈజీఎస్ కింద ఉపాధి పనులను ఆపొద్దని మంత్రి పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పనులు కల్పించకపోతే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే వీలుందని, ఎక్కడ ఉపాధి పనులు ఆపేందుకు వీలు లేదని, కరోనా కేసులు ఎక్కడైనా పెరిగితే ఆ ఊరి గ్రామ పెద్దలతో మాట్లాడి, వారికి అవగాహన కల్పించి ఏ గ్రూపు వారికైతే కేసులు వచ్చాయో ఆ గ్రూపు వారికి పనులను కొద్ది రోజులు వాయిదా వేసేలా చూడాలని, అంతేగాని ఎక్కడగానీ కరోనా వల్ల ఉపాధి పనులు ఆగకుండా చూడాలన్నారు.

కరోనా కట్టడికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయం చేసుకొని పని చేయాలి :

జిల్లాలో కరోనా కట్టడికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు. రాయలసీమలో అనంతపురం జిల్లా జనాభా చాలా ఎక్కువ ఉందని, ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని, పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

తాడిపత్రి వద్ద 500 ఆక్సిజన్ పడకలతో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రి పూర్తయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అనంతపురం నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన 300 పడకల తాత్కాలిక ఆస్పత్రి పూర్తయితే ఆస్పత్రిని ప్రారంభించేందుకు తాను వచ్చే అవకాశం ఉందని లేదా మంత్రి శంకర నారాయణ, ఎంపి, ఎమ్మెల్యేలు ప్రారంభించాలని మంత్రి బొత్స సూచించారు.

కళ్యాణదుర్గం కోవిడ్ కేర్ సెంటర్ లో మరో ఐదు అదనపు ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. రైతులు ప్రస్తుతం క్రాప్ లోన్లు చెల్లిస్తున్నారని, రుణాల చెల్లింపుకు వారికి మరింత అదనంగా సమయం ఇచ్చేలా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ ఉంది కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని, ఈ పాస్ తీసుకునే కర్ణాటక వెళ్లాల్సి ఉంటుంది అనేది తెలియజేయాలని పోలీసులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా అధికారులు, నోడల్ అధికారులు పాల్గొనగా, జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నగరపాలక సంస్థ మేయర్ వసీం, జిల్లాలోని అన్ని మండలాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Anantapur

2021-05-24 15:01:49

యాస్ తుపాను పట్ల జాగ్రత్తగా ఉండాలి..

యాస్ తుఫాను పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది. గత నాలుగురోజులుగా అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతోంది. సోమ వారం తుఫాను ప్రభావం అధికంగా ఉండే ఇచ్చాపురం మండలం డొంకూరు, కవిటి మండలం ఇద్దివానిపేట తదితర గ్రామాల్లో జిల్లా కలెక్టర్ జె నివాస్, పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ పర్యటించారు. పరిస్ధితులను పూర్తి స్ధాయిలో పరిశీలించారు. గ్రామ ప్రజలతో మాట్లాడి యాస్ తుఫాను మంగళ వారం నాటికి అతి తీవ్ర రూపం దాల్చనుందని, 26వ తేదీన పారదీప్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని వివరించారు. తుఫాను ప్రభావం ఇచ్చాపురం నుండి సంతబొమ్మాలి మండలాల వరకు అధికంగా ఉండనుందని పేర్కొంటూ సముద్రానికి అత్యంత సమీపంలో ఉన్న డొంకూరు, ఇద్దివానిపాలెం వంటి  గ్రామాలపై మరింత ఎక్కువ ప్రభావం ఉండనుందని తెలిపారు. జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు గ్రామస్తులు తరలివెళ్ళాలని స్పష్టం చేసారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగరాదని కావున ముందుగానే సురక్షిత కేంద్రాలకు వెళ్ళాలని అన్నారు. పశువులను కూడా సురక్షిత ప్రదేశాలకు తరలించాలని కలెక్టర్ పేర్కొన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహార సౌకర్యాలు కల్పిస్తున్నామని, పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు, ముసలి వారికి అవసరమైన ఆహారం, మందులు సిద్ధం చేసామని చెప్పారు. సోమ వారం సాయంత్రం నుండి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఫైలిన్, హుద్ హుద్, తితిలి వంటి తుఫాను ప్రభావాలను చవి చూసిన మీదట ఎటువంటి అజాగ్రత్త చర్యలు ఉండరాదని ఆయన స్పష్టం చేసారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడా, డిప్యూటి సూపరింటిండెంట్ ఆప్ పోలీస్ శివరామ రెడ్డి, మండల అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-24 14:58:07

నిబంధనలు పాటించకపోతే వేటు తప్పదు..

విశాఖ నగరంలోని ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, కొవిడ్‌ రోగుల నుంచి అధిక చార్జిలు వసూళ్లు చేయడంతో పాటు, 50శాతం పడకలు ఆరోగ్యశ్రీకి కేటాయింపు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవరించిన ఆరు ఆసుపత్రులకు భారీగా జరిమానాలు వేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌(విలేజ్‌, వార్డు సచివాలయం అండ్‌ హెల్త్‌), ఆరోగ్యశ్రీ అడిషనల్‌ సీఈవో పి.అరుణ్‌బాబు తెలిపారు. సోమవారం జాయింట్‌ కలెక్టర్‌ ఛాంబర్‌లో డిస్ట్రిక్ట్‌ డిస్ల్‌ప్లేనరీ కమిటీ(డిడిసి) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్మన్‌గా జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌బాబు, సభ్యులుగా ఆంధ్రా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌, డిఎంహెచ్‌వో డాక్టర్‌ పిఎస్‌ సూర్యనారాయణ, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌ డాక్టర్ కె. రాజేష్‌ పాల్గొన్నారు.  నగరంలోని ఆరోగ్యశ్రీ తాత్కాలిక ఆసుపత్రులతో పాటు, కొవిడ్‌ ఆసుపత్రులుగా ఉన్న వాటికి ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులు పాటిస్తూ ఆరోగ్యశ్రీకి 50శాతం పడకలు కేటాయించాలని నోటీసులు జారీ చేసి, పలు సార్లు హెచ్చరించినప్పటికీ వారిలో ఏమాత్రం మార్పు రానందున వారందరికీ జరిమానాలు విధించామని జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు. అయితే రోగులకు అందుతున్న సేవల్లో లోపాలను ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌ గుర్తించారని,  వివరాల మేరకు  ఆయా ఆసుపత్రులకు డిఎంహెచ్‌వో జరిమానాలు విధించారు. అయితే వీటిలో  ఎఎన్‌బీచ్‌ ,  కెకెఆర్‌,రమ్య, ఎస్‌ఆర్‌ ఆసుపత్రులకు రూ.లక్ష చొప్పున,  ఆసుపత్రి, శ్రద్ద, ఆదిత్య ఆసుపత్రిలకు రూ.రెండు లక్షల చొప్పున మొత్తం జరిమానా లు విధించామన్నారు. జెమ్స్‌ , దుర్గా ఆసుపత్రిలకు కేవలం హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు. నగరంలోని ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ఆసుపత్రులతో పాటు, తాత్కాలికంగా అనుమతి పోందిన ఆసుపత్రులకూడా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆరోగ్యశ్రీలో 50 శాతం పడకలు కేటాయింపుతో పాటు, ప్రభుత్వం నిర్దేశించిన ధరలనే వసూళ్లు చేయాలని లేని పక్షంలో మిగిలిన ఆసుపత్రులను సైతం తనిఖీలు నిర్వహించి వారిపై జరిమాలను, కేసులు నమోదు చేస్తామన్నారు. ముఖ్యంగా ఆదిత్య ఆసుపత్రి యాజామాన్యం వారు వారం రోజుల లోపు ఆరోగ్యశ్రీ సేవలు అందించకపోతే సదరు ఆసుపత్రికి భారి జరిమానా విధించడంతో పాటు, క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందన్నారు.

Collector Office

2021-05-24 14:53:47

సచివాలయంలోనే సమస్య పరిష్కారం కావాలి..

ప్రజల సమస్యలు గ్రామసచివాలయంలోనే పరిష్కరించే విధంగా సిబ్బంది సేవలందించాలని ప్రకాశంజిల్లా పంచాయతీ అధికారి తూతిక విశ్వనాధ శ్రీనివాస్  సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఒంగోలు మండలంలోని మద్దిపాడు, లింగంగుంట గ్రామ సచివాలయాలను డిపీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అక్కడ ప్రజలకు అందుతున్న సేవల వవరాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూనే ప్రజలకు సేవలు అందించాలన్నారు. ఎవరినీ వివిధ రకాల ద్రువీకరణ పత్రాల కోసం పదే పదే సచివాలయం చుట్టూ తిప్పడానికి వీలు లేదన్నారు. ఫీవర్ సర్వే, వాక్సినేషన్ డ్యూటీలు చేస్తున్న సిబ్బందిని ఈ సందర్భంగా డిపిఓ అభినందించారు. తరువాత రికార్డులను పరిశీలించారు. గ్రామంలో కరోనా అదుపులోకి వచ్చేంత వరకూ శానిటేషన్ ప్రక్రియ పూర్తిస్థాయిలో చేపట్టాలన్నారు. మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయడంతోపాటు, పాజిటివ్ వచ్చిన వారి ఇల్ల వద్ద బ్లీచింగ్ చల్లించారు. విధులకు వచ్చే సిబ్బందితోపాటు, వివిధ పనులపై వచ్చే ప్రజలకు కూడా మాస్కులు ధరించకపోతే కార్యాలయంలోకి అనుమతించకూడదన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Maddipadu

2021-05-24 14:23:24

ఫీవర్ సర్వే పారదర్శకంగా చేయాలి..

ప్రకాశం జిల్లాలో ప్రతీ గ్రామంలోనూ ఇంటింటా ప్రతి ఒక్కరికీ నిర్వహించే జ్వర పీడితుల సర్వేను పారదర్శకంగా చేపట్టాలని  జిల్లా పంచాయతీ అధికారి తూతిక విశ్వనాధ శ్రీనివాస్  సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఈ మేరకు ఒంగోలు మండలంలోని మందువవారిపాలెంలో జరుగుతున్న ఫీవర్ సర్వేను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం డిపీఓ  మాట్లాడుతూ,  మే నెలాఖరు వరకు 11 విడతలుగా సర్వే చేయాల్సి ఉంటుందని సిబ్బందికి వివరించారు.  ఈ సర్వేలో పంచాయతీ కార్యదర్శులు, వి ఆర్ ఓ లు, సచివాలయ సిబ్బంది, ఎఎన్ఎమ్ లు, ఆశా కార్యకర్తలు, సచివాలయాల వలంటీర్లు మమేకమై ప్రతీ గృహాన్ని సందర్శించి సభ్యులు వారీగా సర్వే చేయాలన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం నిర్ధేశించిన కోవిడ్ సూచనలు పాటిస్తూ చేపట్టాలన్నారు.  జ్వరం, దగ్గు‌‌, రొంప, అయాసం వంటి ప్రాధమిక లక్షణాలును గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్ ల ద్వారా అంతర్జాలంలో నమోదు చేయాలని  ఆదేశించారు. ఈ సర్వేలో రోగాలని తేలిన వారికి అవసరమైన మందులను నేరుగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుండి తీసుకుని వచ్చి బాధితులకు ఇవ్వాలని కూడా ఆయన ఆదేశించారు. జిల్లాలో కోవిడ్ ఆసుపత్రల జాబితా ఆధారంగా పరిస్థితి తీవ్రంగా ఉన్నవారికి ఆయాన కేంద్రాలకు తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు మండల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Ongole

2021-05-24 14:07:34

ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాద్యాయులకు వేక్సిన్..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో 45 ఏళ్లు దాటిన వివిధ శాఖ‌ల‌కు చెందిన‌ ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విలేక‌ర్ల‌కు మంగ‌ళ‌, బుధ‌వారాల్లో కోవిడ్ టీకా మొద‌టి డోసు వేయ‌నున్నారు. దీనికోసం జిల్లాలో మూడు ప్ర‌త్యేక శిబిరాల‌ను ఏర్పాటు చేయాల‌ని, జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేర‌కు జిల్లా వైద్యారోగ్య‌శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విజ‌య‌న‌గ‌రంలోని క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో, పార్వ‌తీపురంలోని ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో, బొబ్బిలి క‌ళాభార‌తి ఆడిటోరియం వ‌ద్ద ఈ వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. వీరంద‌రికీ కోవిషీల్డు టీకా మాత్ర‌మే మొద‌టి డోసుగా వేయ‌నున్నారు. వేక్సిన్‌కు వ‌చ్చే  ప్ర‌తీ ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా త‌మ గుర్తింపుకార్డును తీసుకురావాల్సి ఉంటుంది. కేవ‌లం ఉద్యోగుల‌కు మాత్ర‌మే వేక్సిన్ వేస్తామ‌ని, వారి కుటుంబ స‌భ్యుల‌కు వేక్సిన్ వేయ‌డం జ‌ర‌గ‌ద‌ని వైద్యారోగ్య‌శాఖ‌ అధికారులు స్ప‌ష్టం చేశారు.

వేక్సిన్ కు అనుమ‌తించే ప్ర‌భుత్వ ఉద్యోగులు ః
             వ్య‌వ‌సాయ‌శాఖ‌, ప‌శు సంవ‌ర్థ‌క‌, బ్యాంకులు, పౌర స‌ర‌ఫ‌రాలు, రేష‌న్ డీల‌ర్లు, డెయిరీ, దేవాదాయ‌శాఖ‌, మ‌త్స్య‌శాఖ‌, విద్యుత్‌, ఫుడ్ కార్పొరేష‌న్‌, ఉన్న‌త‌, ప్రాధ‌మిక‌ విద్యాశాఖల‌ సిబ్బంది, ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఉపాధ్యాయులు,  స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ‌, ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియా పాత్రికేయులు, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌, మార్కెటింగ్ శాఖ‌, రైతుబ‌జార్ సిబ్బంది మరియు వ్యాపారులు, మార్కెట్ క‌మిటీ సిబ్బంది మ‌రియు హ‌మాలీలు, మైనారిటీ సంక్షేమ‌శాఖ‌, పోర్టులు, పోస్ట‌ల్‌, రైల్వే, గ్రామీణాభివృద్ది శాఖ‌, ఉపాధిహామీ సిబ్బంది, నైపుణ్య శిక్ష‌ణా శాఖ, ప‌ర్యాట‌క శాఖ‌, ర‌వాణా, ఆర్‌టిసి, గిరిజ‌న సంక్షేమ‌శాఖ త‌దిత‌ర ప్ర‌భుత్వ శాఖ‌లకు చెందిన 45 ఏళ్లు పైబ‌డిన వారు త‌మ ఐడి కార్డును తీసుకువెళ్లి వేక్సిన్ వేయించుకోవ‌చ్చు.

మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు వేక్సిన్ ః
             విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో కొన్ని వ‌ర్గాలకు చెందిన, 45 ఏళ్లు దాటిన‌ ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు కూడా మంగ‌ళ‌, బుధ‌వారాల్లో  కోవిషీల్డు మొద‌టి డోసు వేయ‌నున్నారు. దీనికోసం ప్ర‌త్యేకంగా స్థానిక ఆనంద‌గ‌జ‌ప‌తి ఆడిటోరియంలో కార్పొరేష‌న్ వేక్సినేష‌న్ శిబిరాన్ని. వీరు కూడా త‌మ గుర్తింపు కార్డును చూపించి వేక్సిన్ వేయించుకోవ‌చ్చు.

వేక్సిన్ కు అనుమ‌తింప‌బ‌డే ప్ర‌యివేటు వ్య‌క్తులు ః
              న్యూస్ పేప‌ర్ విక్ర‌య‌దారులు, డోర్‌ డెలివ‌రీ ఏజెంట్లు, షాపింగ్ మాల్స్ యాజ‌మాన్యం, సిబ్బంది, మెడిక‌ల్ షాపు య‌జ‌మానులు, వ‌ర్క‌ర్లు, హొట‌ళ్లు, రెస్టారెంట్ల సిబ్బంది, ఫంక్ష‌న్ హాళ్ల య‌జ‌మానులు, సిబ్బంది,  ప్ర‌యివేటు బ‌స్సు ఆప‌రేట‌ర్లు, డ్రైవ‌ర్లు, టేక్సీ డ్రైవ‌ర్లు, ఆటో డ్రైవ‌ర్లు.

Vizianagaram

2021-05-24 13:48:59

వైభవంగా సింహగిరిపై ధన్వంతరీ హోమం..

ప్రజారోగ్యాన్ని కాంక్షిస్తూ సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో సోమవారం  ధన్వంతరి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్ల వారు జామున  స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రత్యేక ఆరాధన చేపట్టారు. గంగధార నుంచి  తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి అనంతరం  యాగశాలలో తొలుత స్వాతి నక్షత్ర హోమం పూజలుజరిపారు. ఆ తర్వాత  ధన్వంతరి హోమం , సుదర్శన యాగం నిర్వహించారు. ఈ సదర్భంగా అనువంశిక ధర్మకర్త సంచయిత గజపతి మాట్లాడుతూ, ప్రజలంతా ఆయురారోగ్యాలతో  సుభిక్షంగా ఉండాలని. ప్రజలు మెరుగైన ఆరోగ్యం పొందాలని ఈ ధన్వంతరీ హోమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు ను కరోనా భయం వెంటాడుతుందని, ఇలాంటి సమయంలో ధన్వంతరి హోమం నిర్వహిస్తే స్వామి ధయతో ఆభయాల తోపాటు వ్యాధులు రుగ్మతలు కూడా పూర్తిగా తొలగి పోతాయని ఈ మహాకార్యం చేపట్టినట్టు చెప్పారు.  స్థానాచార్యులు రాజగోపాల్ మాట్లాడుతూ, గతంలో కంచితో పాటు అనేక ప్రాంతాల్లో ఇటువంటి ఇబ్బందులు సంభవించినప్పుడు ఈ తరహాలోనే అక్కడ ధన్వంతరీ  హోమం తో పాటు అష్టకమ్ పఠనం చెయ్యడం తో ఆ ప్రాంతంలో వ్యాధులు, జబ్బులు, భయాలు  పూర్తిగా మటుమాయం అయ్యాయన్నారు తెలియజేశారు.  దేవ వైద్యులైన ధన్వంతుడ్ని పూజిస్తే సర్వ రోగాలు హరించుకు పోతాయని..త్వరలోనే కరోనా నుంచి సురక్షితంగా ప్రజలు బయట పడతారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈవో ఎంవీ సూర్యకళ తో పాటు ప్రత్యేక ఆహ్వానితులు గంట్లశ్రీనుబాబు, ట్రస్టుబోర్డు సభ్యుడు నాగేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు గోపాల కృష్ణమచార్యులు, పురోహితులు కరి సీతా రామా చార్యులు, రాజీవ్ లోచన తో పాటు పలువురు అర్చకులు..వైదిక వర్గాలు పాల్గొన్నాయి. హోమం అనంతరం ఆలయ బేడా మండపం లో పూజలు జరిపిన కలిస తో ప్రదక్షిణ లు నిర్వహించి స్వామికి చూపించారు. నిత్యకళ్యాణంకూడా ఘనంగా నిర్వహించారు.

Simhachalam

2021-05-24 13:31:24