1 ENS Live Breaking News

ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రధాన కర్తవ్యం..

కరోనా లాంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడడమే అంతిమంగా మనందరి లక్ష్యం కావాలని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం నగరంలోని ఏడిసిసి బ్యాంక్ కార్యాలయం సమావేశ మందిరంలో రెండవ జిల్లా స్థాయి కోవిడ్ సమీక్షా కమిటీ సమావేశాన్ని జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జూమ్ కాన్ఫరెన్స్ రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఉష శ్రీ చరణ్, జొన్నలగడ్డ పద్మావతి, సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏడిసిసి బ్యాంక్ కార్యాలయం సమావేశ మందిరం నుంచి జిల్లా స్థాయి కోవిడ్ సమీక్షా కమిటీ సమావేశంలో అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా కట్టడికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు.

2 నుంచి 6 రోజుల లోపల జిల్లాలో ఆక్సిజన్ పడకలను పెంచుతాం :

జిల్లాలో 2 నుంచి 6 రోజుల లోపల ఆక్సిజన్ పడకలను మరిన్ని పెంచుతామన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ బెడ్లతో పాటు తాడిపత్రి వద్ద 500 ఆక్సిజన్ పడకలతో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రిని మరో 6 రోజుల లోపల ప్రారంభించడం జరుగుతుందని, ఇందుకోసం అన్ని రకాల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అలాగే నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద తాత్కాలిక ఆస్పత్రిలో 100 ఆక్సిజన్ పడకలు సిద్ధం చేస్తున్నామని, వాటిని మరింత పెంచుతామన్నారు. అలాగే పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి లో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ పడకలకు అవసరమైన ఆక్సిజన్ ను సరఫరా చేసి మరో 100 బెడ్లను పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో ఆక్సిజన్ పడకల సమస్య తీరే అవకాశముందన్నారు.

కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వైద్యం అందించాలి.. అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం :

జిల్లాలో కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వైద్యం అందించాలని, ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స హెచ్చరించారు. పాజిటివ్ వచ్చిన వారిని ప్రైవేట్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ కింద అర్హత ఉన్నా జాయిన్ చేసుకోకపోతే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని, ఈ విషయమై జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి), జిల్లా ఎస్పీ లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా చికిత్స కు ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే వసూలు చేయాలని డిఎంఅండ్హెచ్ఓ, డి సి హెచ్ ఎస్ లు అన్ని ఆసుపత్రులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఈ విషయాలపై ఎన్ఫోర్స్మెంట్ టీమ్లు పర్యవేక్షణ చేయాలన్నారు.

హోమ్ ఐసోలేషన్ కిట్లను హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి అందజేయాలి :

జిల్లాలో పాజిటివ్ వచ్చే హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్ కిట్లను ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి హోమ్ ఐసోలేషన్ కిట్లను మంగళవారం సాయంత్రంలోపు అందించాలన్నారు. జిల్లాలో అదనంగా 5 వేల హోమ్ ఐసోలేషన్ కిట్ల సిద్ధంగా ఉండేలా రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి కిట్లను తెప్పించుకోవాలని, కిట్లను సక్రమంగా వినియోగించుకునేలా చూడాలని డిఎంఅండ్హెచ్ఓ ను ఆదేశించారు. ఇందులో ఎలాంటి రాజీ పనికిరాదన్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్ఈజీఎస్ కింద ఉపాధి పనులను ఆపొద్దు :

జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్ఈజీఎస్ కింద ఉపాధి పనులను ఆపొద్దని మంత్రి పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పనులు కల్పించకపోతే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే వీలుందని, ఎక్కడ ఉపాధి పనులు ఆపేందుకు వీలు లేదని, కరోనా కేసులు ఎక్కడైనా పెరిగితే ఆ ఊరి గ్రామ పెద్దలతో మాట్లాడి, వారికి అవగాహన కల్పించి ఏ గ్రూపు వారికైతే కేసులు వచ్చాయో ఆ గ్రూపు వారికి పనులను కొద్ది రోజులు వాయిదా వేసేలా చూడాలని, అంతేగాని ఎక్కడగానీ కరోనా వల్ల ఉపాధి పనులు ఆగకుండా చూడాలన్నారు.

కరోనా కట్టడికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయం చేసుకొని పని చేయాలి :

జిల్లాలో కరోనా కట్టడికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు. రాయలసీమలో అనంతపురం జిల్లా జనాభా చాలా ఎక్కువ ఉందని, ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని, పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

తాడిపత్రి వద్ద 500 ఆక్సిజన్ పడకలతో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రి పూర్తయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అనంతపురం నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన 300 పడకల తాత్కాలిక ఆస్పత్రి పూర్తయితే ఆస్పత్రిని ప్రారంభించేందుకు తాను వచ్చే అవకాశం ఉందని లేదా మంత్రి శంకర నారాయణ, ఎంపి, ఎమ్మెల్యేలు ప్రారంభించాలని మంత్రి బొత్స సూచించారు.

కళ్యాణదుర్గం కోవిడ్ కేర్ సెంటర్ లో మరో ఐదు అదనపు ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. రైతులు ప్రస్తుతం క్రాప్ లోన్లు చెల్లిస్తున్నారని, రుణాల చెల్లింపుకు వారికి మరింత అదనంగా సమయం ఇచ్చేలా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ ఉంది కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని, ఈ పాస్ తీసుకునే కర్ణాటక వెళ్లాల్సి ఉంటుంది అనేది తెలియజేయాలని పోలీసులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా అధికారులు, నోడల్ అధికారులు పాల్గొనగా, జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నగరపాలక సంస్థ మేయర్ వసీం, జిల్లాలోని అన్ని మండలాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Anantapur

2021-05-24 15:01:49

యాస్ తుపాను పట్ల జాగ్రత్తగా ఉండాలి..

యాస్ తుఫాను పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది. గత నాలుగురోజులుగా అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతోంది. సోమ వారం తుఫాను ప్రభావం అధికంగా ఉండే ఇచ్చాపురం మండలం డొంకూరు, కవిటి మండలం ఇద్దివానిపేట తదితర గ్రామాల్లో జిల్లా కలెక్టర్ జె నివాస్, పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ పర్యటించారు. పరిస్ధితులను పూర్తి స్ధాయిలో పరిశీలించారు. గ్రామ ప్రజలతో మాట్లాడి యాస్ తుఫాను మంగళ వారం నాటికి అతి తీవ్ర రూపం దాల్చనుందని, 26వ తేదీన పారదీప్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని వివరించారు. తుఫాను ప్రభావం ఇచ్చాపురం నుండి సంతబొమ్మాలి మండలాల వరకు అధికంగా ఉండనుందని పేర్కొంటూ సముద్రానికి అత్యంత సమీపంలో ఉన్న డొంకూరు, ఇద్దివానిపాలెం వంటి  గ్రామాలపై మరింత ఎక్కువ ప్రభావం ఉండనుందని తెలిపారు. జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు గ్రామస్తులు తరలివెళ్ళాలని స్పష్టం చేసారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగరాదని కావున ముందుగానే సురక్షిత కేంద్రాలకు వెళ్ళాలని అన్నారు. పశువులను కూడా సురక్షిత ప్రదేశాలకు తరలించాలని కలెక్టర్ పేర్కొన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహార సౌకర్యాలు కల్పిస్తున్నామని, పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు, ముసలి వారికి అవసరమైన ఆహారం, మందులు సిద్ధం చేసామని చెప్పారు. సోమ వారం సాయంత్రం నుండి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఫైలిన్, హుద్ హుద్, తితిలి వంటి తుఫాను ప్రభావాలను చవి చూసిన మీదట ఎటువంటి అజాగ్రత్త చర్యలు ఉండరాదని ఆయన స్పష్టం చేసారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడా, డిప్యూటి సూపరింటిండెంట్ ఆప్ పోలీస్ శివరామ రెడ్డి, మండల అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-24 14:58:07

నిబంధనలు పాటించకపోతే వేటు తప్పదు..

విశాఖ నగరంలోని ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, కొవిడ్‌ రోగుల నుంచి అధిక చార్జిలు వసూళ్లు చేయడంతో పాటు, 50శాతం పడకలు ఆరోగ్యశ్రీకి కేటాయింపు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవరించిన ఆరు ఆసుపత్రులకు భారీగా జరిమానాలు వేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌(విలేజ్‌, వార్డు సచివాలయం అండ్‌ హెల్త్‌), ఆరోగ్యశ్రీ అడిషనల్‌ సీఈవో పి.అరుణ్‌బాబు తెలిపారు. సోమవారం జాయింట్‌ కలెక్టర్‌ ఛాంబర్‌లో డిస్ట్రిక్ట్‌ డిస్ల్‌ప్లేనరీ కమిటీ(డిడిసి) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్మన్‌గా జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌బాబు, సభ్యులుగా ఆంధ్రా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌, డిఎంహెచ్‌వో డాక్టర్‌ పిఎస్‌ సూర్యనారాయణ, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌ డాక్టర్ కె. రాజేష్‌ పాల్గొన్నారు.  నగరంలోని ఆరోగ్యశ్రీ తాత్కాలిక ఆసుపత్రులతో పాటు, కొవిడ్‌ ఆసుపత్రులుగా ఉన్న వాటికి ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులు పాటిస్తూ ఆరోగ్యశ్రీకి 50శాతం పడకలు కేటాయించాలని నోటీసులు జారీ చేసి, పలు సార్లు హెచ్చరించినప్పటికీ వారిలో ఏమాత్రం మార్పు రానందున వారందరికీ జరిమానాలు విధించామని జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు. అయితే రోగులకు అందుతున్న సేవల్లో లోపాలను ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌ గుర్తించారని,  వివరాల మేరకు  ఆయా ఆసుపత్రులకు డిఎంహెచ్‌వో జరిమానాలు విధించారు. అయితే వీటిలో  ఎఎన్‌బీచ్‌ ,  కెకెఆర్‌,రమ్య, ఎస్‌ఆర్‌ ఆసుపత్రులకు రూ.లక్ష చొప్పున,  ఆసుపత్రి, శ్రద్ద, ఆదిత్య ఆసుపత్రిలకు రూ.రెండు లక్షల చొప్పున మొత్తం జరిమానా లు విధించామన్నారు. జెమ్స్‌ , దుర్గా ఆసుపత్రిలకు కేవలం హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు. నగరంలోని ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ఆసుపత్రులతో పాటు, తాత్కాలికంగా అనుమతి పోందిన ఆసుపత్రులకూడా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆరోగ్యశ్రీలో 50 శాతం పడకలు కేటాయింపుతో పాటు, ప్రభుత్వం నిర్దేశించిన ధరలనే వసూళ్లు చేయాలని లేని పక్షంలో మిగిలిన ఆసుపత్రులను సైతం తనిఖీలు నిర్వహించి వారిపై జరిమాలను, కేసులు నమోదు చేస్తామన్నారు. ముఖ్యంగా ఆదిత్య ఆసుపత్రి యాజామాన్యం వారు వారం రోజుల లోపు ఆరోగ్యశ్రీ సేవలు అందించకపోతే సదరు ఆసుపత్రికి భారి జరిమానా విధించడంతో పాటు, క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందన్నారు.

Collector Office

2021-05-24 14:53:47

సచివాలయంలోనే సమస్య పరిష్కారం కావాలి..

ప్రజల సమస్యలు గ్రామసచివాలయంలోనే పరిష్కరించే విధంగా సిబ్బంది సేవలందించాలని ప్రకాశంజిల్లా పంచాయతీ అధికారి తూతిక విశ్వనాధ శ్రీనివాస్  సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఒంగోలు మండలంలోని మద్దిపాడు, లింగంగుంట గ్రామ సచివాలయాలను డిపీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అక్కడ ప్రజలకు అందుతున్న సేవల వవరాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూనే ప్రజలకు సేవలు అందించాలన్నారు. ఎవరినీ వివిధ రకాల ద్రువీకరణ పత్రాల కోసం పదే పదే సచివాలయం చుట్టూ తిప్పడానికి వీలు లేదన్నారు. ఫీవర్ సర్వే, వాక్సినేషన్ డ్యూటీలు చేస్తున్న సిబ్బందిని ఈ సందర్భంగా డిపిఓ అభినందించారు. తరువాత రికార్డులను పరిశీలించారు. గ్రామంలో కరోనా అదుపులోకి వచ్చేంత వరకూ శానిటేషన్ ప్రక్రియ పూర్తిస్థాయిలో చేపట్టాలన్నారు. మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయడంతోపాటు, పాజిటివ్ వచ్చిన వారి ఇల్ల వద్ద బ్లీచింగ్ చల్లించారు. విధులకు వచ్చే సిబ్బందితోపాటు, వివిధ పనులపై వచ్చే ప్రజలకు కూడా మాస్కులు ధరించకపోతే కార్యాలయంలోకి అనుమతించకూడదన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Maddipadu

2021-05-24 14:23:24

ఫీవర్ సర్వే పారదర్శకంగా చేయాలి..

ప్రకాశం జిల్లాలో ప్రతీ గ్రామంలోనూ ఇంటింటా ప్రతి ఒక్కరికీ నిర్వహించే జ్వర పీడితుల సర్వేను పారదర్శకంగా చేపట్టాలని  జిల్లా పంచాయతీ అధికారి తూతిక విశ్వనాధ శ్రీనివాస్  సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఈ మేరకు ఒంగోలు మండలంలోని మందువవారిపాలెంలో జరుగుతున్న ఫీవర్ సర్వేను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం డిపీఓ  మాట్లాడుతూ,  మే నెలాఖరు వరకు 11 విడతలుగా సర్వే చేయాల్సి ఉంటుందని సిబ్బందికి వివరించారు.  ఈ సర్వేలో పంచాయతీ కార్యదర్శులు, వి ఆర్ ఓ లు, సచివాలయ సిబ్బంది, ఎఎన్ఎమ్ లు, ఆశా కార్యకర్తలు, సచివాలయాల వలంటీర్లు మమేకమై ప్రతీ గృహాన్ని సందర్శించి సభ్యులు వారీగా సర్వే చేయాలన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం నిర్ధేశించిన కోవిడ్ సూచనలు పాటిస్తూ చేపట్టాలన్నారు.  జ్వరం, దగ్గు‌‌, రొంప, అయాసం వంటి ప్రాధమిక లక్షణాలును గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్ ల ద్వారా అంతర్జాలంలో నమోదు చేయాలని  ఆదేశించారు. ఈ సర్వేలో రోగాలని తేలిన వారికి అవసరమైన మందులను నేరుగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుండి తీసుకుని వచ్చి బాధితులకు ఇవ్వాలని కూడా ఆయన ఆదేశించారు. జిల్లాలో కోవిడ్ ఆసుపత్రల జాబితా ఆధారంగా పరిస్థితి తీవ్రంగా ఉన్నవారికి ఆయాన కేంద్రాలకు తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు మండల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Ongole

2021-05-24 14:07:34

ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాద్యాయులకు వేక్సిన్..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో 45 ఏళ్లు దాటిన వివిధ శాఖ‌ల‌కు చెందిన‌ ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విలేక‌ర్ల‌కు మంగ‌ళ‌, బుధ‌వారాల్లో కోవిడ్ టీకా మొద‌టి డోసు వేయ‌నున్నారు. దీనికోసం జిల్లాలో మూడు ప్ర‌త్యేక శిబిరాల‌ను ఏర్పాటు చేయాల‌ని, జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేర‌కు జిల్లా వైద్యారోగ్య‌శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విజ‌య‌న‌గ‌రంలోని క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో, పార్వ‌తీపురంలోని ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో, బొబ్బిలి క‌ళాభార‌తి ఆడిటోరియం వ‌ద్ద ఈ వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. వీరంద‌రికీ కోవిషీల్డు టీకా మాత్ర‌మే మొద‌టి డోసుగా వేయ‌నున్నారు. వేక్సిన్‌కు వ‌చ్చే  ప్ర‌తీ ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా త‌మ గుర్తింపుకార్డును తీసుకురావాల్సి ఉంటుంది. కేవ‌లం ఉద్యోగుల‌కు మాత్ర‌మే వేక్సిన్ వేస్తామ‌ని, వారి కుటుంబ స‌భ్యుల‌కు వేక్సిన్ వేయ‌డం జ‌ర‌గ‌ద‌ని వైద్యారోగ్య‌శాఖ‌ అధికారులు స్ప‌ష్టం చేశారు.

వేక్సిన్ కు అనుమ‌తించే ప్ర‌భుత్వ ఉద్యోగులు ః
             వ్య‌వ‌సాయ‌శాఖ‌, ప‌శు సంవ‌ర్థ‌క‌, బ్యాంకులు, పౌర స‌ర‌ఫ‌రాలు, రేష‌న్ డీల‌ర్లు, డెయిరీ, దేవాదాయ‌శాఖ‌, మ‌త్స్య‌శాఖ‌, విద్యుత్‌, ఫుడ్ కార్పొరేష‌న్‌, ఉన్న‌త‌, ప్రాధ‌మిక‌ విద్యాశాఖల‌ సిబ్బంది, ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఉపాధ్యాయులు,  స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ‌, ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియా పాత్రికేయులు, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌, మార్కెటింగ్ శాఖ‌, రైతుబ‌జార్ సిబ్బంది మరియు వ్యాపారులు, మార్కెట్ క‌మిటీ సిబ్బంది మ‌రియు హ‌మాలీలు, మైనారిటీ సంక్షేమ‌శాఖ‌, పోర్టులు, పోస్ట‌ల్‌, రైల్వే, గ్రామీణాభివృద్ది శాఖ‌, ఉపాధిహామీ సిబ్బంది, నైపుణ్య శిక్ష‌ణా శాఖ, ప‌ర్యాట‌క శాఖ‌, ర‌వాణా, ఆర్‌టిసి, గిరిజ‌న సంక్షేమ‌శాఖ త‌దిత‌ర ప్ర‌భుత్వ శాఖ‌లకు చెందిన 45 ఏళ్లు పైబ‌డిన వారు త‌మ ఐడి కార్డును తీసుకువెళ్లి వేక్సిన్ వేయించుకోవ‌చ్చు.

మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు వేక్సిన్ ః
             విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో కొన్ని వ‌ర్గాలకు చెందిన, 45 ఏళ్లు దాటిన‌ ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు కూడా మంగ‌ళ‌, బుధ‌వారాల్లో  కోవిషీల్డు మొద‌టి డోసు వేయ‌నున్నారు. దీనికోసం ప్ర‌త్యేకంగా స్థానిక ఆనంద‌గ‌జ‌ప‌తి ఆడిటోరియంలో కార్పొరేష‌న్ వేక్సినేష‌న్ శిబిరాన్ని. వీరు కూడా త‌మ గుర్తింపు కార్డును చూపించి వేక్సిన్ వేయించుకోవ‌చ్చు.

వేక్సిన్ కు అనుమ‌తింప‌బ‌డే ప్ర‌యివేటు వ్య‌క్తులు ః
              న్యూస్ పేప‌ర్ విక్ర‌య‌దారులు, డోర్‌ డెలివ‌రీ ఏజెంట్లు, షాపింగ్ మాల్స్ యాజ‌మాన్యం, సిబ్బంది, మెడిక‌ల్ షాపు య‌జ‌మానులు, వ‌ర్క‌ర్లు, హొట‌ళ్లు, రెస్టారెంట్ల సిబ్బంది, ఫంక్ష‌న్ హాళ్ల య‌జ‌మానులు, సిబ్బంది,  ప్ర‌యివేటు బ‌స్సు ఆప‌రేట‌ర్లు, డ్రైవ‌ర్లు, టేక్సీ డ్రైవ‌ర్లు, ఆటో డ్రైవ‌ర్లు.

Vizianagaram

2021-05-24 13:48:59

వైభవంగా సింహగిరిపై ధన్వంతరీ హోమం..

ప్రజారోగ్యాన్ని కాంక్షిస్తూ సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో సోమవారం  ధన్వంతరి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్ల వారు జామున  స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రత్యేక ఆరాధన చేపట్టారు. గంగధార నుంచి  తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి అనంతరం  యాగశాలలో తొలుత స్వాతి నక్షత్ర హోమం పూజలుజరిపారు. ఆ తర్వాత  ధన్వంతరి హోమం , సుదర్శన యాగం నిర్వహించారు. ఈ సదర్భంగా అనువంశిక ధర్మకర్త సంచయిత గజపతి మాట్లాడుతూ, ప్రజలంతా ఆయురారోగ్యాలతో  సుభిక్షంగా ఉండాలని. ప్రజలు మెరుగైన ఆరోగ్యం పొందాలని ఈ ధన్వంతరీ హోమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు ను కరోనా భయం వెంటాడుతుందని, ఇలాంటి సమయంలో ధన్వంతరి హోమం నిర్వహిస్తే స్వామి ధయతో ఆభయాల తోపాటు వ్యాధులు రుగ్మతలు కూడా పూర్తిగా తొలగి పోతాయని ఈ మహాకార్యం చేపట్టినట్టు చెప్పారు.  స్థానాచార్యులు రాజగోపాల్ మాట్లాడుతూ, గతంలో కంచితో పాటు అనేక ప్రాంతాల్లో ఇటువంటి ఇబ్బందులు సంభవించినప్పుడు ఈ తరహాలోనే అక్కడ ధన్వంతరీ  హోమం తో పాటు అష్టకమ్ పఠనం చెయ్యడం తో ఆ ప్రాంతంలో వ్యాధులు, జబ్బులు, భయాలు  పూర్తిగా మటుమాయం అయ్యాయన్నారు తెలియజేశారు.  దేవ వైద్యులైన ధన్వంతుడ్ని పూజిస్తే సర్వ రోగాలు హరించుకు పోతాయని..త్వరలోనే కరోనా నుంచి సురక్షితంగా ప్రజలు బయట పడతారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈవో ఎంవీ సూర్యకళ తో పాటు ప్రత్యేక ఆహ్వానితులు గంట్లశ్రీనుబాబు, ట్రస్టుబోర్డు సభ్యుడు నాగేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు గోపాల కృష్ణమచార్యులు, పురోహితులు కరి సీతా రామా చార్యులు, రాజీవ్ లోచన తో పాటు పలువురు అర్చకులు..వైదిక వర్గాలు పాల్గొన్నాయి. హోమం అనంతరం ఆలయ బేడా మండపం లో పూజలు జరిపిన కలిస తో ప్రదక్షిణ లు నిర్వహించి స్వామికి చూపించారు. నిత్యకళ్యాణంకూడా ఘనంగా నిర్వహించారు.

Simhachalam

2021-05-24 13:31:24

కోవిడ్ లో అధికారుల సేవలు మరువలేనివి..

కోవిడ్ నియంత్రణలో వైద్యులు, అధికారులు పగలూరాత్రి సేవలు అందిస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రశంసించారు.  సోమవారం మంత్రి భీమిలి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ పూర్తి స్థాయిలో కరోనా నియంత్రణకు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. కరోనా పాజిటివ్ బారిన పడిన వారు హోమ్ ఐసోలేషన్ లో లేకుండా బక్కనపాలెంలో 800 పడకలతో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లో చేరవచ్చునని, INS కళింగ, భీమిలి ప్రభుత్వ హాస్పిటల్, పద్మనాభం కేంద్రీయ విద్యాలయాల్లో ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందవద్దని హోమ్ ఐసోలేషన్ చికిత్స పొందుతున్న వారు పూర్తిగా నయమయ్యేంత వరకు అక్కడే వుండొచ్చన్నారు.  మంత్రి ముందుగా అధికారులను ప్రస్తుత కరోనా పరిస్థితిని గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  పి.హెచ్.సి. డాక్టర్లు,  సచివాలయ సిబ్బందితో విడివిడిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
స్థానిక నాయకుల విజ్ఞప్తి మేరకు భీమిలి హాస్పిటల్లో వ్యాక్సిన్ ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు.  కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని,  మార్కెట్లో సామాజిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని భీమిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ ని ఆదేశించారు. భీమిలి లో నాలుగు వార్డుల్లో పూర్తి స్థాయిలో శానిటేషన్ జరగాలని భీమిలి జోనల్ కమిషనర్ ని ఆదేశించారు. త్వరలో ప్రతి వార్డులో పర్యటిస్తానని తెలిపారు. యాష్ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని రెవెన్యూ పోలీసు అధికారులు మత్స్యకారులను వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్నారు. సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కె.పెంచల కిషోర్, భీమిలి ఎంపిడీవో, జోనల్ కమిషనర్, భీమిలి నియోజకవర్గ ఇంచార్జి ముత్తంశెట్టి మహేష్, ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Bheemili

2021-05-24 13:13:30

తుఫాన్ ఎదుర్కోవడానికి జివిఎంసి సన్నద్దం..

తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన  “యాస్” తుఫాను తీవ్రతను ఎదుర్కోవడానికి జివిఎంసి అన్ని విధాలా సన్నద్ధంగా వుందని కమిషనర్ డా.జి.స్రిజన పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సంభిత విభాగాలతో సమీక్ష నిర్వహించారు. తుఫాను వలన అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా కాలువలు, గెడ్డలు  పొంగకుండా చూడాలని అవసరమైన చోట్ల, ముంపు ప్రాంతాలలో మోటార్లను ఉపయోగించాలని సూచించారు.  చెట్లు, కొమ్మలు తో పాటు ఎలక్ట్రికల్ పోల్స్ విరిగి రోడ్లపై పడిన వెంటనే వాటిని తొలగించుటకు అవసరమైన  రంపములను, వాహనములను సిద్ధంగా ఉంచుకోవాలని మొక్కల విభాగం,ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.  పాత భవనాలలో నివసిస్తున్న వారిని శిధిలమైన గోడల ప్రక్కన నివసిస్తున్న వారిని అక్కడ నుంచి అనువైన  షెల్టర్ లోకి వెళ్ళే విధంగా చూడాలని ఆదేశించారు. నిరాశ్రయులను వెంటనే కోవిడ్ నిబంధనల ప్రకారం కమ్మ్యునిటీ హాల్స్, కళ్యాణ మండపంలు లాంటి షెల్టర్లకు తరలించి వారికి భోజనం, మంచినీటి సదుపాయాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని యుసిడి అధికారులకు సూచించారు. ప్రతీ సచివాలయ పరిధిలో ఉన్న  నివాసితుల ను అప్రమత్తంగా ఉండే విధంగా జోనల్ కమిషనర్లు సచివాలయంలో ఉన్న అందరు కార్యదర్శులను సిద్ధం చేయాలని ఆదేశించారు.  అత్యవసర పరిస్థితుల్లో ప్రజల రక్షణార్ధం అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తుఫాను వలన చెట్లు కొమ్మలు విరిగిపడ్డ,  గెడ్డలు పొంగి రహదారులపైకి, ఇండ్లలోనికి వరదనీరు చేరి ఇబ్బందులు తలెత్తితే కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 4250 0009 లేదా 0891-2869100కి సమాచారం అందజేయాలని కమిషనర్ నగర వాసులను కోరారు.

GVMC office

2021-05-24 12:57:03

తీరప్రాంత వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి..

తూర్పు మధ్య బంగాళాఖాతం లో ఏర్పడిన అల్ప పీడనం తీవ్ర తుఫాన్ గా మారనున్న దృష్ట్యా తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని  జిల్లా కలెక్టర్ ఎం. హరి జవాహర్ లాల్ తెలిపారు.  సోమవారం  పూసపాటి రేగ  మండలం కోనాడ గ్రామం  సముద్ర తీరం వరకు నడుచుకుంటూ  వెళ్ళి అక్కడి ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడి గ్రామస్తులతో మాట్లాడుతూ   ఎవ్వరూ సముద్రం లోనికి వెళ్లరాదని, తుఫాన్ తీరం దాటే  సమయం లో  గాలులు, భారీ వర్షాలు ఉంటాయని,  తుఫాన్ తీరం దాటే వరకు జాగ్రత్తగా ఉండాలని, సముద్రపు అలలు పెరిగిన, గాలులు వీచినా, ఏదైనా విపత్తు జరిగినా వెంటనే తెలియజేయాలని అన్నారు.  అధికారులు కూడా తీరం దాటే  వరకు తీర ప్రాంతాల్లోనే ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని తమ దృష్టి లోకి తేవాలని ఆదేశించారు. అనంతరం  సమీపాన ఉన్న తుఫాన్ షెల్టర్ ను సందర్శించారు.  తుఫాన్ సమయం లో నిత్యవసరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా షెల్టర్ లో నిల్వలు ఉంచాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు. యాస్ తుఫాన్  ప్రభావిత ప్రాంతాల్లో  ఆస్తి , ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు  జాగ్రత్తలను తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందవద్దని తెలిపారు.  ఈ పర్యటనలో సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్, రెవెన్యూ డివిజినల్ అధికారి భవాని శంకర్ , ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Pusapatirega

2021-05-24 12:45:47

కోవిడ్ ఖైదీ బెయిల్ పై విడుదల..

కోవిడ్ బారిన ప‌డ్డ ఒక ఖైదీని, జిల్లా జైలు అధికారులు బెయిలుపై విడుద‌ల చేశారు. జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశాల మేర‌కు, విజ‌య‌న‌గ‌రం స‌బ్‌జైలులోని అండ‌ర్ ట్ర‌యిల్‌ ఖైదీలు, సిబ్బందికి ఈ నెల 21న కోవిడ్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. మొత్తం 28 మంది ఖైదీలు, 10 మంది సిబ్బందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, వీరిలో ఒక్క ఖైదీకి మాత్ర‌మే పాజిటివ్ రిజల్ట్ వ‌చ్చింది. ఆ ఖైదీని బెయిలుపై విడుద‌ల చేసి, హోమ్ ఐసోలేష‌న్‌కు పంపించిన‌ట్లు జైలు సూప‌రింటిండెంట్ దుర్గారావు తెలిపారు.

Vizianagaram

2021-05-24 12:43:27

యాస్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలి..

యాస్ తుపాను పట్ల  చాలా అప్రమత్తంగా ఉండాలని మత్స్యశాఖ ఉపసంచాలకులు ఎన్.నిర్మలకుమారి మత్స్యకారులకు సూచించారు. సోమవారం పూసపాటిరేగ మండలంలోని సముద్ర తీర ప్రాంతాలైన చింతపల్లి, పతివాడ బుర్రిపేట, తిప్పలవలస, ముఖం, పెద్దకొండరాజుపాలెంలోని  ఆమె స్వయంగా పర్యటించి మత్స్యకారులకు తుపాను వచ్చినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ అవగాహన కల్పించారు.  అదేసమయంలో గజఈతగాళ్లంతా సిద్దంగా ఉండాలని, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. మత్స్యకార ప్రాంతాల్లో ముందస్తు ఏర్పాట్లను కూడా ఆమె పరిశీలించారు. తుపానును ఎదుర్కోవడానికి  ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు  పేర్కొన్నారు. మత్స్యశాఖ కార్యాలయంతోపాటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారని, ఎప్పుడు ఏ అత్యవసర సమయం వచ్చినా ఆ నెంబర్లుకు ఫోన్లు చేసి సమాచారం అందించాలన్నారు. అదేవిధంగా మత్స్యకారులంతా వేటకు వెళ్లే బోట్లను తీర ప్రాంతానికి తీసుకొచ్చి భద్రపరుచుకోవాలన్నారు. మత్స్యకారులకు రక్షణ కల్పించేందుకు తుపాను రక్షిత ప్రాంతాలను కూడా సిద్ధం చేశామన్నారు. తుఫాను హెచ్చరికలు వాతావరణ కేంద్రం సూచించిన నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. మత్స్యకారులు ఎవరూ ఈ సమయంలో వేటకు వేళ్లకూడదని హెచ్చరించారు. గ్రామాల్లోని సాగర మిత్రాల ద్వారా సమాచారం  కాల్ సెంటర్లకు చేరవేయడం ద్వారా సత్వరమే సహాయక చర్యలు అందించడానికి వీలుపడుతుందని సూచించారు.  ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Pusapatirega

2021-05-24 12:37:18

ఆక్సిజన్ మిషన్లు వితరణ చేసిన యువత..

తూర్పు గోదావరిజిల్లా క‌లెక్ట‌రేట్‌లోని వికాస (శిక్ష‌ణ‌, ప్లేస్‌మెంట్ సేవ‌లు) విభాగం ద్వారా వివిధ సంస్థ‌ల్లో ఉద్యోగాలు పొందిన యువ‌త కోవిడ్ స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు త‌మ వంతు సాయం అందించే ఉద్దేశంతో రెండు ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను స‌మ‌కూర్చింది. ఈ మేర‌కు సోమ‌వారం వికాస ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్‌, సిబ్బంది దాదాపు రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల విలువ‌చేసే 9 లీట‌ర్ల సామ‌ర్థ్యంగ‌ల రెండు ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి, జేసీ (డీ) కీర్తి చేకూరి త‌దిత‌రులకు అంద‌జేశారు. వికాస నిర్వ‌హించిన జాబ్‌మేళాల ద్వారా రిటైల్, ర‌వాణా, మార్కెటింగ్‌, ఐటీ త‌దిత‌ర సంస్థ‌ల్లో ఉపాధి అవ‌కాశాలు పొందిన యువ‌తీయువ‌కులు రోగులకు ప్రాణ వాయువును అందించే కాన్సంట్రేట‌ర్ల‌ను అందించ‌డం గొప్ప విష‌య‌మ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ గీతాంజ‌లి శ‌ర్మ‌, జీజీహెచ్ కోవిడ్ నోడ‌ల్ అధికారి సూర్య‌ప్ర‌వీణ్‌చాంద్‌, వికాస పీడీ కె.ల‌చ్చారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-24 08:37:21

హేచరీస్ అసోసియేషన్ సహాయం రూ.50లక్షలు

 కోవిడ్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌తో పాటు రోగుల‌కు వైద్య‌, ఇత‌ర సేవ‌లు అందించేందుకు జిల్లా యంత్రాంగం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలకు త‌మ వంతు సాయం అందించేందుకు తూర్పుగోదావ‌రి జిల్లా రొయ్య‌ల హేచ‌రీల అసోషియేష‌న్ ముందుకొచ్చింది. సోమ‌వారం కోవిడ్ స‌హాయ నిధికి జిల్లా రొయ్య‌ల హేచ‌రీల అసోషియేష‌న్ అధ్య‌క్షులు ఎస్‌.వీర్రెడ్డి, అఖిల భార‌త రొయ్య‌ల హేచ‌రీల అసోషియేష‌న్ కార్య‌ద‌ర్శి మ‌ధుసూధ‌న్‌రెడ్డి.. కాకినాడ అర్బ‌న్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి స‌మ‌క్షంలో రూ.50 ల‌క్ష‌ల చెక్కును క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డికి అంద‌జేశారు. రెండోద‌శలో కోవిడ్ ఉద్ధృతి నేప‌థ్యంలో సామాజిక బాధ్య‌త‌గా కోవిడ్ స‌హాయ నిధికి విరాళం అందించిన జిల్లా రొయ్య‌ల హేచ‌రీల అసోషియేష‌న్‌కు క‌లెక్ట‌ర్ అభినంద‌న‌లు తెలిపారు. జిల్లా ప్ర‌జ‌ల త‌ర‌ఫున అసోసియేష‌న్‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

కాకినాడ అర్బ‌న్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి మాట్లాడుతూ విప‌త్తు స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఆప‌న్న‌హ‌స్తం అందించేందుకు ముందుకొచ్చి, విరాళం అందించిన తూర్పుగోదావ‌రి జిల్లా రొయ్య‌ల హేచ‌రీల అసోషియేష‌న్‌కు జిల్లా ప్ర‌జ‌ల త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. సాయ‌మందించేందుకు ఇప్ప‌టికే ప‌లు కార్పొరేట్‌, వాణిజ్య‌, వ్యాపార సంస్థ‌లు విరాళాలు, ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, వైద్య ప‌రిక‌రాలు వంటివి అందించాయ‌ని, మ‌రింత మంది దాత‌లు ముందుకొచ్చి కోవిడ్ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగ‌స్వాములు కావాల‌ని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో జిల్లా మ‌త్స్య‌శాఖ జేడీ పీవీ స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-24 08:31:45

యాస్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలి..

 తూర్పు మధ్య బంగాళాఖాతం లో ఏర్పడిన అల్ప పీడనం   తీవ్ర తుఫాన్ గా మారనున్న దృష్ట్యా  జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని  జిల్లా ఇంచార్జ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు  జిల్లా కలెక్టర్ కు సూచించారు.  యాస్ తుఫాన్ పై  జిల్లా కలెక్టర్ ఏం. హరి జవాహర్ లాల్ తో  మంత్రి ఫోన్ ద్వారా మాట్లాడుతూ జిల్లాలో తీసుకోవలసిన  జాగ్రత్తల పై పలు సూచనలు జారీ చేశారు.  తుఫాన్  ప్రభావిత ప్రాంతాల్లో  ఆస్థి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు  జాగ్రత్తలను తీసుకోవాలని అన్నారు.  అదేవిధంగా చెరువులకు గండ్లు పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.  ఎలాంటి పరిస్థితి నైనా ఎదుర్కొడానికి యంత్రాంగాన్ని సిద్ధం చేయాలన్నారు.   తుఫాన్ నష్టాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రభావిత ప్రాంతాల, తీరప్రాంతాల ప్రజలను పురనరావాస కేంద్రాలకు  తరలించాలని అన్నారు. 

యాస్ తుఫాన్ సోమవారం  సాయంత్రానికల్లా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని,  దీని దిశ ను  ఎప్పుడైనా   మార్చుకోవచ్చునని,  ముందస్తుగా సర్వం సిద్ధం కావాలని ఆదేశించారు. 

Vizianagaram

2021-05-24 08:21:10