1 ENS Live Breaking News

అందుబాటులోకి తుపాను కంట్రోల్ రూమ్..

 యాస్ తుఫాను నేప‌థ్యంలో త‌గిన స‌మాచారం, స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేసేందుకు క‌లెక్ట‌ర్ ఆదేశాల మేర‌కు జిల్లాలోని ప‌లు చోట్ల కంట్రోల్ రూమ్‌ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గ‌ణ‌ప‌తిరావు తెలిపారు. ఈ మేర‌కు క‌లెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జిల్లా క‌మాండ్ కంట్రోల్ రూమ్‌ను ఆయ‌న సోమ‌వారం ప్రారంభించి సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో పాటు విజ‌య‌న‌గ‌రం ఆర్డీవో కార్యాల‌యంలో, మ‌త్స్య‌శాఖ విభాగంలో, పార్వ‌తీపురం స‌బ్ క‌లెక్ట‌ర్ రం కార్యాలయంలో డివిజ‌న్ స్థాయి కంట్రోల్ రూమ్‌ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నారు. అలాగే తీర ప్రాంత మండ‌లాలైన భోగాపురం, పూస‌పాటిరేగ త‌హిసీల్దార్ కార్యాల‌యాల్లో కూడా కంట్రోల్ రూమ్‌ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని ఆయ‌న వివ‌రించారు. తుఫానుకు సంబంధించిన‌ సమాచారం కావాల్సిన వారు.. స‌హాయ స‌హ‌కారాలు అవ‌స‌ర‌మైన వారు ఈ కింద పేర్కొన్ననెంబ‌ర్ల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని సూచిస్తూ కంట్రోల్ రూమ్‌ల నెంబ‌ర్ల‌ను వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌రేట్ ఏవో దేవ్ ప్ర‌సాద్‌, డి-సెక్ష‌న్ సూప‌రింటెండెంట్ శ్రీ‌కాంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

కంట్రోల్ రూమ్ నెంబ‌ర్లు ః 

జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం                       ః  08922 236947
విజ‌య‌న‌గ‌రం, ఆర్డీవో కార్యాల‌యం       ః  98853 67237
పార్వ‌తీపురం, స‌బ్ కలెక్ట‌ర్ కార్యాల‌యం ః 08963 222236
విజ‌య‌న‌గ‌రం, మ‌త్స్య‌శాఖ కార్యాల‌యం ః 08922 273812
భోగాపురం, త‌హసీల్దార్ కార్యాల‌యం        ః 80744 00947
పూసపాటిరేగ‌, త‌హ‌సీల్దార్ కార్యాల‌యం    ః 70367 63036

Vizianagaram

2021-05-24 08:17:29

అర్హులందరికీ జగనన్న తోడు..

 అర్హులంద‌రికీ జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం ద్వారా ల‌బ్ది చేకూర్చాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశించారు. వైఎస్ఆర్ బీమా న‌మోదును వేగ‌వంతం చేయ‌డం ద్వారా, పేద‌ల జీవితాల‌కు భ‌రోసా క‌ల్పించాల‌ని కోరారు. జ‌గ‌న‌న్న తోడు, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ చేయూత‌, వైఎస్ఆర్ పింఛ‌న్ కానుక ప‌థ‌కాల‌పై టెలీకాన్ఫ‌రెన్స్ ద్వారా సోమ‌వారం క‌లెక్ట‌ర్ స‌మీక్షించారు. అర్హులైన ప్ర‌తీఒక్క‌రికి జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం క్రింద రుణాల‌ను మంజూరు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. దీనికోసం వాలంటీర్ల ద్వారా ద‌ర‌ఖాస్త‌ల‌ను సేక‌రించాల‌న్నారు. అలాగే  గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో తిర‌స్క‌ర‌ణ‌కు గురైన ద‌ర‌ఖాస్తుల‌ను పునఃప‌రిశీలించాల‌ని, ల‌బ్దిదారుల అభిప్రాయం తెలుసుకొని, వారి అంగీకారం మేర‌కు రుణాన్ని మంజూరు చేయాల‌ని సూచించారు. ప్ర‌స్తుత క‌రోనా క‌ష్ట‌కాలంలో తోడు ప‌థ‌కం చిరువ్యాపారుల‌కు ఎంత‌గానో ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంద‌ని అన్నారు. వైఎస్ఆర్ పెన్ష‌న్ కానుక కు వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించి, అర్హుల‌కు పింఛ‌న్ మంజూరుకు సిఫార్సు చేయాల‌ని ఆదేశించారు. దీనిపై మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపిడిఓలు ప్ర‌త్యేక శ్ర‌ద్ద చూపాల‌ని సూచించారు.

                వైఎస్ఆర్ బీమా న‌మోదును వేగ‌వంతం చేయాల‌న్నారు. గ‌త ఏడాది జాబితాల‌ను రెన్యువ‌ల్ చేయ‌డంతోపాటుగా, ఈ ఏడాది కొత్త‌గా అర్హుల‌ను గుర్తించి, వారికి ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేయాల‌న్నారు. గ‌తేడాది ప‌థ‌కం న‌మోదులో విజ‌య‌న‌గ‌రం జిల్లా రాష్ట్రంలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించిన విష‌యాన్ని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ప‌నిచేసి, ఈ ఏడాది కూడా న‌మోదు ప్ర‌క్రియ‌ను ఈ నెలాఖ‌రులోగా పూర్తి చేయాల‌న్నారు. ఎస్‌బిఐ, ఎపిజివిబి, ఐఓబి బ్యాంకుల్లో త‌లెత్తిన సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌న్నారు. బీమా న‌మోదుకు ప్ర‌తిరోజూ ఉద‌యం 12 నుంచి 2 గంట‌లు వ‌ర‌కూ బ్యాంకులు స‌మ‌యాన్ని కేటాయించాయ‌ని, ఆ స‌మ‌యాన్ని వెలుగు సిబ్బంది వినియోగించుకోవాల‌ని సూచించారు. వైఎస్ఆర్ చేయూత క్రింద, ల‌బ్దిదారుల చేత‌ స్వ‌యం ఉపాధి యూనిట్ల‌ను త్వ‌ర‌గా ప్రారంభింప‌జేయాల‌ని కోరారు. ఎంపిడిఓలు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు జ‌గ‌న‌న్న కాల‌నీల్లో ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

               అంత‌కుముందు డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ కె.సుబ్బారావు మాట్లాడుతూ, జిల్లాలో ఈ ప‌థ‌కాల ప్ర‌స్తుత ప‌రిస్థితిని వివ‌రించారు. జిల్లాలో సుమారు 7,17,854 మంది తెల్ల‌కార్డుదారులు ఉన్నార‌ని, వీరిలో ఇప్ప‌టివ‌ర‌కు 6,15,482 కార్డుల స‌ర్వే పూర్త‌య్యింద‌ని చెప్పారు. వీరిలో 4,17,851 మంది పేర్ల‌ను న‌మోదు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కానికి సంబంధించి గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో 16,146 ద‌ర‌ఖాస్తుల‌ను తిర‌స్క‌రించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. వీటిని పునఃప‌రిశీలించి, వారి అంగీకారం మేర‌కు రుణాలు మంజూరు చేస్తామ‌న్నారు. చేయూత ల‌బ్దిదారుల‌చేత యూనిట్ల స్థాప‌న‌కు కృషి చేయ‌డం జ‌రుగుతోంద‌ని వివ‌రించారు.

                ఈ టెలీకాన్ఫ‌రెన్స్ లో జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, ఎల్‌డిఎం కె.శ్రీ‌నివాస‌రావు, ప‌శుసంవ‌ర్థ‌క‌శాఖ జెడి వైవి ర‌మ‌ణ‌, వివిధ బ్యాంకుల అధికారులు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపిడిఓలు, డిఆర్‌డిఏ, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-24 07:17:04

కరోనాలో మంచి మనసుల సహాయం..

కరోనా వైరజ్ విజ్రుంభిస్తున్న సమయంలో మనసున్న దాతలు వారి కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు చేసే ఖర్చులను అనాదలు, ఆపన్నుల ఆకలి తీర్చడానికే వినియోగిస్తున్నారు. నా అనుకునేవారికి దూరమై ఆశ్రమాల్లో ఉంటున్నవారికి చిరు సహాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే విశాఖలోని మర్రిపాలెంకు చెందిన హరిహరన్ కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా సింహాచలం శ్రీనివాస నగర్ లోవున్న శ్రీ బంగారుతల్లి వ్రుద్ధాశ్రమంలోని వ్రుద్ధులకు పండ్లు పౌష్టిక ఆహారాన్ని అందించారు. ఈ ప్రాంతంలో సేవాకార్యక్రమాలు నిర్వహించే సామాజిక వేత్తర విజినిగిరి బాలభానుమూర్తి ఆధ్వర్యంలో ఈ వితరణ కార్యక్రమం చేపట్టారు దాతలు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సమయంలో దాతలు చేసే సహాయం తమ పరిధిలో ఇలాంటి ఆనాధలకు చేయడం ద్వారా వ్రుద్ధులకు మేలు చేసినవారవుతారని అన్నారు.  ఈ కార్యక్రమంలో తంగుడు పవన్ కుమార్, ఎల్.గణేష్, పుష్పలత, నదీమ్ తదితరు పాల్గొన్నారు.

Simhachalam

2021-05-23 14:28:30

ఘనంగా హస్తా నక్షత్రేష్టి మహాయాగం..

ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం, కరోనా వ్యాధిని మానవాళికి దూరం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి నిర్వహిస్తున్న వైదిక, ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం తిరుమల ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠంలో హస్తా నక్షత్రేష్టి మహాయాగం నిర్వహించారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన హస్తా నక్షత్రేష్టి మహాయాగంలో విశేషమైన హోమం చేపట్టి అధిష్టాన దేవతను ప్రార్థించారు.  మే 9న ప్రారంభమైన నక్షత్రసత్ర మహాయాగం జూన్ 15వ తేదీ వరకు జరుగనుంది. కృత్తికా నక్షత్రం నుంచి భరణి నక్షత్రం వరకు అభిజిత్ నక్షత్రం సహా 28 నక్షత్రాల అధిష్టాన దేవతలకు  శ్రౌతయాగాలు నిర్వహిస్తున్నారు.  ఆ తరువాత చంద్రుడు, అహోరాత్రములు, ఉషఃకాలం, నక్షత్ర సామాన్యము‌, సూర్య భగవానుడు, దేవమాత అయిన అదితి, యజ్ఞ స్వరూపుడైన విష్ణువుకు శ్రౌతయాగాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోని ప్రజలందరూ 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో జన్మించి ఉంటారు. ఈ యాగాల ద్వారా ఆయా అధిష్టాన దేవతలు తృప్తి చెంది విశేషమైన ఫలితాలను అనుగ్రహిస్తారని పండితులు తెలిపారు.  ఈ కార్యక్రమంలో పీఠం ప్రిన్సిపాల్  కెఎస్ఎస్ అవధాని ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగంలో టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు.

Tirupati

2021-05-23 12:53:56

ఏకాంతంగా అప్పన్న వైశాఖ పౌర్ణమి..

విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)కి ఈ నెల 26 వైశాఖ పౌర్ణమిని ఏకాంతంగా నిర్వహిస్తున్నట్టు దేవస్థాన ఈఓ ఎంవీ సూర్య కళ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం దేవస్థానం తరపున మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాలు, కోవిడ్ నిబంధనలు, అర్చకుల విన్నపం మేరకు వైశాఖ పౌర్ణమిని ఏకాతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతేకాకుండా అదే రోజు శ్రీ స్వామివారికి రెండో విడత చందనం కూడా సమర్పిస్తారని చెప్పారు. స్వామికి జరిగే ఈ కార్యక్రమాలకు భక్తులకు 26న  సింహగిరిపైకి అనుమతి లేదని పేర్కొన్నారు. వైశాఖ పౌర్ణమికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశముండటంతో కిందినుంచే గేట్లు కూడా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. కరోనావైరస్ ప్రభావం తగ్గేవరకూ  శ్రీవారి ఆరాధనాది కార్యక్రమములన్ని ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఆరోజు స్వామి కళ్యాణం జరపని కారణంగా భక్తులు కోనేరు వైపు కూడా వెళ్లకూడదని ఈఓ భక్తులను కోరారు. ప్రస్తుత పరిస్థితులను ద్రుష్టిలో ఉంచుకొని భక్తుల దేవస్థాన అధికారులకు సహరించాలన్నారు.

Simhachalam

2021-05-23 12:34:59

యాస్ తుపాను కంట్రోల్ రూమ్ ఏర్పాటు..

శ్రీకాకుళం జిల్లాలో అన్ని మండలాల్లో  తహసిల్దార్ కార్యాలయాలలో తక్షణం 24 గంటలు పనిచేసే యాస్ తుపాన్ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్  జె.నివాస్ అధికారులను ఆదేశించారు.  రెవిన్యూ, విద్యుత్, గ్రామీణ నీటి పారుదల, తదితర శాఖల ఉద్యోగులతో షిప్ట్ లు వారీగా విధులు నిర్వహించాలని అన్నారు. అత్యవసర సహాయం కొరకు కలెక్టర్ కార్యాలయ కంట్రోల్ రూమ్ నెం 08942-240557 నంబరుకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. (e-mail id : cosklmsupdtd@gmail.com) ప్రదానమైన నీటి సరఫరా పథకాల వద్ద జనరేటర్ లు ఏర్పాటు చేసి నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా  చర్యలు తీసుకోవాలని ఆర్.డబ్ల్యు.ఎస్ పర్యవేక్షక ఇంజినీర్ టి.శ్రీనివాసరావు ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అవసరమైతే మంచినీటి కులాయిలు, బోర్ వెల్స్ మరమ్మతులు చేయించుటకు విడి పనిముట్లు సిద్దంగా ఉంచాలని పేర్కొన్నారు. విద్యుత్తు వ్యవస్థకు తీవ్ర విఘాతం కలుగుతుందని అందుకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని పేర్కొన్నారు. విద్యుత్తు స్తంభాలను వెంటనే పునరుద్ధరణ చేయుటకు అవసరమైన రవాణా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. తుఫాన్ ప్రభావంగల ఇచ్చాపురం, మందస, కవిటి, సోంపేట, వజ్రపు కొత్తూరు,  సంతబొమ్మాలి,  పోలాకి,  గార,  శ్రీకాకుళం,  ఎచ్చెర్ల, రణస్థలం మండలాలలో అవసరానికి అనుగుణముగా వైద్య శిబిరాలు నిర్వహించుటకు కావలసిన అన్ని  మందులు, బావులు, బొర్ లను క్లోరినేషన్ చేయుటకు క్లోరిన్ టాబ్లెట్స్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో అత్యవసర సేవలకు ఆటంకం కలుగ కుండా జనరేటర్ లు , విద్యుత్ ప్రత్యమ్నాయాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.

తుఫాన్ ప్రభావిత గ్రామాలలో పారిశుధ్యం, బావులు, బోర్లు మొదలగు వాటిలో క్లోరినేషన్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను తక్షణం కోసి భద్రపరచు కోవడం లేదా కోయకుండా ఉండటం చేయాలని అన్నారు. గ్రామాలలో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు తగు సూచనలు చేయాలని ఆదేశించారు. జీడి, మామిడి, కొబ్బరి పంటలకు నష్టం కలుగుటకు అవకాశం వున్నందున రైతులకు తగు సలహాలు అందించారలని చెప్పారు. 

నేటి నుండి 9వ విడత ఫీవర్ సర్వే : కోవిడ్ ను గూర్చి మాట్లాడుతూ సోమవారం నుంచి 9వ విడత ఫీవర్ సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ఉపాధి హామీ పనులు కల్పించరాదని ఆయన ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు  సుమిత్ కుమార్, డాక్టర్ కె. శ్రీనివాసులు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్,  మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు పి.వి.శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్ మశిలామని, రెవిన్యూ డివిజనల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-23 12:25:35

యాస్ తుపాను పై యంత్రాంగం అప్రమత్తం..

యాస్ తుఫాను పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రతి నిత్యం  అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసున్నారు. ఆదివారం కూడా యాస్ తుపాన్ పై సంబంధిత అధికారులతో  జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టెక్కలి డివిజన్ మండలాలు అధికంగా తుఫానుకు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. తాగునీటి సరఫరా, విద్యుత్ పునరుద్ధరణ, వైద్య శిబిరాలు ఏర్పాటు తదితర అంశాలపై  పూర్తి సంసిద్ధత ఉండాలని ఆయన ఆదేశించారు. పంటల భద్రత గూర్చి రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు జారీ చేయాలని ఆయన ఆదేశించారు. శాఖల వారీగా అధికారులు చేపట్టాల్సిన అంశాలపై ఆదేశాలు ఇచ్చారు. ప్రతి మండలంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని, పునరావాస కేంద్రాలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని ఆయన స్పష్టం చేసారు. తుఫాన్ ప్రభావిత గ్రామాలలో దండోరా వేయించాలని ఆయన ఆదేశించారు. గ్రామాలలో తీవ్రమైన గాలులు వీచే అవకాశం వున్నందున, తప్పనిసరి పరిస్థితులలో గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించుటకు రవాణా సౌకర్యాలు సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు. తుఫాను రక్షిత భవనములలో నీరు, విధ్యుత్ జనరటర్ మొదలగు సదుపాయాలను సిద్ధం చేయాలని అన్నారు. ఎం.ఎల్.ఎస్ పాయింట్స్, చౌక ధరల దుకాణాలలో ఉన్న నిత్యావసర సరుకులను పునరావాస కేంద్రాలకు అనుసంధానం చేయాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. పునరావాస కేంద్రాలు ఆహార పదార్థాలు తయారు చేయుటకు అంగన్వాడి వర్కర్స్ ను సంసిద్ధం చేయాలని, పునరావాస కేంద్రాలలలో చిన్న పిల్లలకు టెట్రా ప్యాక్ పాలు అందించు ఏర్పాటు చేయాలని సూచించారు. తుఫాను ఒడిసా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటనుందని దాని ప్రభావం టెక్కలి డివిజన్ మండలాలు -  ఇచ్చాపురం, సోంపేట, కంచిలి, మందస, వజ్రపు కొత్తూరు, సంతబొమ్మాలి వరకు గల మండలాలలో ఉంటుందని అన్నారు. వాటితో పాటు తీర ప్రాంత మండలాలు - శ్రీకాకుళం, గార, రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, పోలాకి మండలాల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో  టెలి కమ్యూనికేషన్స్ సంబంధిత టవర్స్ వద్ద జనరేటర్ లు, సరిపడ డిజిల్ నిల్వలు ఉండేటట్లుగా సంబంధిత నెట్వర్క్ ఏజెన్సీ లతో మాట్లాడి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో చెట్లు కూలితే వెంటనే రోడ్ క్లియరెన్స్ చేయుటకు అవసరమగు జె.సి.బిలను, విద్యుత్ రంపాలను సిద్ధం చేయాలని అన్నారు. ట్రాక్టర్ లు, డిజిల్ సిద్ధం చేయాలని పేర్కొన్నారు.  పూరి గుడిసెలలో నివాసం ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తుఫాన్ అనంతరం వరదలకు అవకాశం ఉంటుందని, నది పరివాహక మండలాలు,  గ్రామాలలో వి.ఆర్.ఓలు, వి. ఆర్.ఎ లు పోలీస్ లతో సమన్వయం ప్రజలు నదులు, వాగులు, వంకలు దాటకుండా చూడాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు  సుమిత్ కుమార్, డాక్టర్ కె. శ్రీనివాసులు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్,  మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు పి.వి.శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్ మశిలామని, రెవిన్యూ డివిజనల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-23 12:15:56

ఫలించిన జివిఎంసీ కమిషనర్ వ్యూహం..

విశాఖలో కరోనా వైరస్ కేసులు అధికమవుతున్నవేళ ఆ వ్యాప్తిని తగ్గించేందుకు మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ డా.స్రిజన రచించిన ప్రత్యేక వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చింది. ఆదివారం మాంసం దుఖాణాలు నిషేధించడంతో అత్యధికశాతం మంది రోడ్లపైకి రావడం బాగా తగ్గింది. అధిక జనాబా కేవలం మాంసం, చేపలు, రొయ్యలు, దుఖాణాల వద్దే గుమిగుడటంతో వైరస్ వ్యాప్తి అధికంగా వుందనే కారణంతో కమిషనర్ తీసుకున్న నిర్ణయం పక్కాగా అమలై జనసాంద్రత  తగ్గింది. అంతేకాకుండా కర్ఫ్యూ లో విషయంలో నిబంధనలు పక్కాగా అమలు చేయడంతో జనం రోడ్లపైకి రావడానికి భయపడుతున్నారు. ఇలాంటి మాంసం నిషేధం కరోనా ప్రభావం వున్నంత కాలం విధిస్తే చాలా వరకూ కేసులు తగ్గొచ్చుననే వాదన వినిపించడం విశేషం.. భౌతిక దూరం పాటించడం, మాస్కుధారణ విశాఖనగరంలో బాగా కనిపిస్తోంది. ఇదే పద్దతి కొనసాగితే త్వరలోనే కరోనా వైరస్ కేసులు మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలో తగ్గుముఖం పట్టే అవకాశముంది. అంతేకాకుండా రైతు బజార్ల వద్ద కూడా భౌతిక దూరం, మాస్కు ధారణ ఉంటే తప్పా ప్రవేశం లేదనే నియమ నిబంధనలు కూడా పెట్టాలనే నగరవాసులు కోరుతున్నారు. వ్యాపారులకు ఈ విధానాలు కష్టంగా ప్రజలకి మాత్రం కరోనా వైరస్ నుంచి మాత్రం కాస్త ప్రభావం తగ్గినట్టు కనిపించింది. అన్నిరకాల మీడియా, ప్రసార మాద్యమాల ద్వారా ఇలాంటి ఆదేశాలు ప్రజల్లోకి తీసుకెళ్లగాలిగితే విశాఖలో కరోనా వైరస్ కేసులు త్వరలోనే తగ్గుముఖం పట్టడానికి ఆస్కారం వుంది..

GVMC office

2021-05-23 12:01:46

యాస్ తుపాను కోసం ప్రత్యేక కాల్ సెంటర్..

యాస్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో  సాగర, స్వదేశీ మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని.. ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ రక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని విజయనగరం మత్స్యశాఖ ఉపసంచాలకులు ఎన్.నిర్మలకుమారి కోరారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె మీడియాకి ప్రకటన జారీ చేశారు.  యాస్ తుపాను హెచ్చరికల సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.హరిజవర్ లాల్ ఆదేశాల మేరకు 24గంటలు పనిచేసే కాల్ సెంటర్ జిల్లా కార్యాలయంలో 08922-273812 అనే నెంబరుతో ఏర్పాటు చేసినట్టు ఆమె పేర్కొన్నారు. 9440814722లో మత్స్యశాఖ ఉపసంచాలకులు, 9490835709 లో మత్స్యశాఖ సహాయ సంచాలకులు, 8247586549లో మత్స్యశాఖ అభివ్రుద్ధి అధికారి అందుబాటులో ఉంటామని వివరించారు. ముందస్తు చర్యగా గజఈతగాళ్లను, రిలీఫ్ బోట్లను సిద్దం చేసినట్టు కూడా తెలియజేశారు. సాగర మిత్రాల ద్వారా తుపాను హెచ్చరికలు జారీచేయడంతోపాటు దండోరాలు కూడా వేయించి మత్స్యాకారులకు తాజా పరిస్తితిని తెలియజేశామన్నారు. తీర ప్రాంతాల్లో బోట్లు, వేట సామాన్లు తుపాను తాకిడి పాడైపోకుండా, ఇస్తి నష్టం జరగకుండా జాగ్రత్త చేసుకోవాలని కూడా సమాచారం అందించినట్టు చెప్పారు. తుపాను తీవ్రత తగ్గేవరకూ అధికారులు, సిబ్బందికి ఎటువంటి సెలవులు ఇచ్చేది లేదని పేర్కొన్నారు. మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కాల్ సెంటర్ కి సమాచారం అందించాలని, లేదంటే సాగర మిత్రాలను సంప్రదించి సహాయం పొందాలని మత్స్యశాఖ ఉపసంచాలకులు ఎన్.నిర్మలకుమారి ఆ ప్రకటనలో కోరారు

Vizianagaram

2021-05-23 08:32:09

జిల్లాకి చేరుకున్న బ్లాక్ ఫంగస్ మందులు..

కోవిడ్ చికిత్స పొందిన వారిలో ఇటీవ‌లి కాలంలో వ్యాపిస్తున్న బ్లాక్ ఫంగ‌స్‌(మ్యుక‌రో మైక‌సిస్‌) వ్యాధి చికిత్సకోసం అవ‌స‌ర‌మైన ఔష‌ధాలు జిల్లాలో అందుబాటులోకి వ‌చ్చాయ‌ని జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. ఈ వ్యాధిగ్రస్తుల చికిత్సకు అవ‌స‌ర‌మైన ఇంజెక్షన్లు, మాత్రలు జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు చేరిన‌ట్టు వెల్లడించారు. టొసిలిజుమాబ్ 80 మిల్లీ గ్రాముల‌ ఇంజ‌క్షన్లు- 140, ఏంపోటెర్సిన్‌-బి 50 మిల్లీగ్రాముల ఇంజెక్షన్లు- 30, పొస‌కొన‌జోల్ 300 మి.గ్రా. ఇంజ‌క్షన్లు- 30, పొస‌కొన‌జోల్‌- 100 మి.గ్రా. ప‌రిమాణం గ‌ల మాత్రలు -1000 వంతున రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక స‌దుపాయాల సంస్థ‌ కేంద్ర కార్యాల‌యం నుంచి జిల్లాకు స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు తెలిపారు. జిల్లాలోని బ్లాక్ ఫంగ‌స్‌(మ్యుక‌రో మైక‌సిస్) వ్యాధి సోకిన‌ట్లుగా గుర్తించిన వారికి ఈ మందులు అంద‌జేసి చికిత్స చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ వ్యాధి ల‌క్షణాలు క‌నిపించిన‌ట్లయితే జిల్లా కేంద్ర ఆసుప‌త్రిలోని బ్లాక్ ఫంగ‌స్ కేసుల కోసం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక విభాగంలో సంప్రదించాలని సూచించారు.

Vizianagaram

2021-05-23 06:49:21

సింహాద్రి నాధుడికి స్వర్ణ పుష్పార్చన..

విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)కి ఆదివారం స్వర్ణపుష్పాలతో ఘనంగా అర్చన నిర్వహించారు. శాస్త్రోక్తంగా స్వామివారికి నిర్వహించిన ఈ పూజలో భక్తులు అధిక సంఖ్యలో ఆన్ లైన్ లో పాల్గొన్నారు. ఆన్ లైన్ లో స్వామి పూజలు, అర్చనలు, కళ్యాణాలు టిక్కెట్లు తీసుకున్నవారికి లైవ్ గా జరిగిన స్వామివారి యూట్యూబ్ లింక్ పంపినట్టు దేవస్థాన ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. స్వామివారి ఆన్ లైన్ పూజల్లో పాల్గొన దలచిన వారు దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-23 06:47:16

రేపు అప్పన్న ఆలయంలో ధన్వంతరీ హోమం..

ప్రపంచాన్ని వనికిస్తున్న కరోనా, బ్లాక్ ఫంగస్ లాంటి వ్యాధుల నుంచి ప్రజలను రక్షించాలని కాంక్షిస్తూ.. విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)కి సోమవారం ధన్వంతరీ హోమం నిర్వహిస్తున్నట్టు దేవస్థాన ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాకు ఆదివారం ఒక ప్రకటనల విడుదల చేశారు. ప్రజలు అనారోగ్యం, వైరస్ లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ఆ సింహాద్రినాథుని చల్లని చూపులు ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా అవసరమన్నారు. ప్రజలకు చక్కటి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేడుకుంటూ..  శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామికి   ధన్వంతరి హోమం నిర్వహించాలని ఆలయ ధర్మకర్త సంచయిత గజపతి, అర్చకులతో కలిసి నిర్ణయించినట్టు పేర్కొన్నారు.  24న స్వామి వారి ఆవిర్భావ తార స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని సుదర్శన హోమం కూడా చేపడుతున్నామన్నారు.  ఈ హోమంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేని కారణంగా ఆన్ లైన్ ద్వారా  రూ.2,500 రుసుము చెల్లించి భక్తులు పాల్గొనే అవకాశం కల్పించామని చెప్పారు. దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-23 06:18:13

యాష్ తుపానుపట్ల అప్రమత్తంగా ఉండాలి..

ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24వ తేదీ నాటికి తుఫానుగా మారి వాయువ్య దిశలో పయనించి 26వ తేదీన ఒడిశా-పశ్చిమ బెంగాల్ మద్య తీరాన్ని తాకనుందని, దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లో గణనీయమైన వర్షపాతం కురియవచ్చని భారత వాతావరణ శాఖ సూచన జారీ చేసిందని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి తెలిపారు.  “యాష్”  గా నామకరణం చేసిన ఈ తుఫాను హెచ్చరిక నేపద్యంలో జిల్లాలోని మత్స్యకారులు ఈ నెల 27వ తేదీ వరకూ తూర్పు, ఉత్తర బంగాళాఖాతంలోకి, ఒడిశా-బెంగాల్ తీరాల వైపు సముద్రంలోకి వెళ్లవద్దని, లోతైన సముద్ర వేటలో ఉన్న వారు వెంటనే తిరిగి తీరానికి చేరుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా మత్స్సకారులందరికీ సమాచారం అందించి, సముద్ర వేటలో ఉన్నవారిని వెనుకకు రప్పించాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. అలాగే తుఫాను కారణంగా ఎక్కవ వర్షపాతం నమోదైయ్యే సూచన దృష్ట్యా జిల్లాలోని రైతులను అప్రమత్తం చేసి, ధాన్యం, పంటలకు నష్టం కలుగకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.  డివిజనల్, మండల అధికారులు తమ కార్యాలయాల్లో కంట్రోలు రూమ్ లు ఏర్పాటు చేసి ముందస్తు జాగ్రత చర్యలను చేపట్టాలని తెలిపారు. సముద్ర తీర మండలాల్లోని అన్ని గ్రామాల్లో దండోరా, వలంటీర్ల ద్వారా ప్రజలకు తుఫాను సమాచారం తెలిపి అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైతే తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్దం చేయాలని, ఏవిధమైన ప్రాణ, ఆస్తి, పంట నష్టం కలుగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 

Kakinada

2021-05-23 04:33:09

సింహాద్రి నాధుడికి స్వర్ణ పుష్పార్చన..

విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)కి ఆదివారం స్వర్ణపుష్పాలతో అర్చన నిర్వహించారు. శాస్త్రోక్తంగా స్వామివారికి నిర్వహించిన ఈ పూజలో భక్తులు అధిక సంఖ్యలో ఆన్ లైన్ లో పాల్గొన్నారు. ఆన్ లైన్ లో స్వామి పూజలు, అర్చనలు, కళ్యాణాలు టిక్కెట్లు తీసుకున్నవారికి లైవ్ గా జరిగిన స్వామివారి యూట్యూబ్ లింక్ పంపినట్టు దేవస్థాన ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. స్వామివారి ఆన్ లైన్ పూజల్లో పాల్గొన దలచిన వారు దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-23 04:30:15

Simhachalam

2021-05-23 04:22:46