1 ENS Live Breaking News

కోవిడ్ వైద్యసేవల్లో నిర్లక్ష్యంపై కఠిన చర్యలు..

ఆసుపత్రులలో కోవిడ్ రోగులకు వైద్యం అందించడములో  అలసత్వాన్ని సహించేది లేదని జిల్లా కలెక్టరు వి.వినయ్  చంద్ వైద్యాధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టరు ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి మరియు ఇతర అధికారులతో కోవిడ్ వ్యాధి చికిత్స, ఆసుపత్రులలో బెడ్స్, ఆక్సిజన్ సరఫరా, వైద్య సిబ్బంది, వెంటిలేటర్లు మొదలగు విషయాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఆసుపత్రులలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఎల్లప్పుడు వార్డులలో తిరుగుతూ పేషెంట్లకు వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థతిని నిరంతరం పరిశీలిస్తూ వుండాలన్నారు. ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడు పర్యవేక్షిస్తూ వుండాలని ఆదేశించారు. ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి, ఇ.ఎన్.టి., ఆర్.ఇ.హెచ్, సైకియాట్రి మొదలగు టీచింగ్ ఆసుపత్రులలో సమస్యలపై చర్చించారు. ఛాతీ ఆసుపత్రి, ఇ.ఎన్.టి. ఆసుపత్రులకు  అవసరమైన స్టాఫ్ నర్సులు, నర్సులను నియమించాలని ఎ.ఎం.సి. ప్రిన్సిపాల్ డా.పి.వి.సుధాకర్ కు సూచించారు.  ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలండర్స్ విషయంపై చర్చించారు. ఆక్సిజన్ పూర్తిగా అయిపోయినప్పుడు కాకుండ తగు స్థాయిలో వుండగానే మేల్కొని తెలియజేయాలని, ఈ విషయంలో ఆప్రమత్తంగా వుండాలన్నారు.
ఆక్సిజన్ స్థాయి 90-94 వరకు వున్న పేషెంట్లను టీచింగ్ ఆసుపత్రులలో తప్పని సరిగా ఎడ్మిట్ చేసుకొని వైద్య సేవలు అందించాలన్నారు.  ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిని ఈ నాలుగు ఆసుపత్రులను పరిశీలించాలన్నారు. కేవలం  కోమార్పిడిటీస్ తో బాధపడుతున్న సీరియస్ కేసులను మాత్రమే కె.జి.హెచ్. విమ్స్ లకు పంపించాలన్నారు. అనస్థీషియా, టెక్నీషియన్ల నియమాకినికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. వెంటిలేటర్లు అన్నింటినీ  ఒకే చోటకు తీసుకువచ్చి  సాంకేతిక నిపుణులతో అవసరమైన మరమ్మత్తులు గావించి ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. బ్లాక్ ఫంగస్ కేసులకు కే.జి.హెచ్. లోనే ట్రీట్మెంట్ గావించాలన్నారు. కమిటీ పర్యవేక్షణలో వీరికి వైద్య సేవలు అందించాలన్నారు.  
ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీలు
  జిల్లాలో 57 ప్రైవేటు ఆసుపత్రులలో పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవలు, బెడ్స్, తదితర విషయాలపై నిరంతరం తనిఖీలు నిర్వహించాలని కలెక్టరు ఆదేశించారు. జాయింట్ కలెక్టరు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, ఆర్.డి.ఒ.లు తనిఖీలు నిర్వహించాలన్నారు.
ఆసుపత్రులలో బెడ్స్ విషయమై ఇప్పటికే సూచించిన విధముగా సాఫ్ట్ వేరు ను త్వరగా తయారు గావించాలని ఎ.డి.(సర్వే) మనీషా త్రిపాఠి ను అదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టరులు యం.వేణుగోపాల్ రెడ్డి, పి.అరుణ్ బాబు, ఐ.టి.డి.ఎ.ప్రాజెక్ట్  అధికారి ఎస్.వెంకటేశ్వర్, ఎ.ఎమ్.సి. ప్రిన్సిపాల్ డా. సుధాకర్, కె.జి.హెచ్ సూపరింటెండెంట్  డా. మైథిలీ, డి.ఎం.హెచ్.ఒ. డా.సూర్యనారాయణ, ఆర్.సి.హెచ్, ఆర్.ఇ హెచ్., ఇ.ఎన్.టి, సైకియాట్రి ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఎ.డి (డ్రగ్స్)రజిత, జి.ఎం.డి.ఐ.సి.రామలింగరాజు, ఎపి.ఎం.ఎస్ ఐ.డి.సి, ఇ.ఇ, డి.ఎ.నాయుడు, తదితర అధికారులు హాజరయ్యారు.

Collector Office

2021-05-21 13:05:01

ఎస్ఆర్ పీకి అన్ని వర్గాలు మద్దు అవసరం..

జివిఎంసీ అమలు చేస్తున్న ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, భారత ప్రభుత్వం (UNDP-GoI)ప్రాజెక్టులో భాగంగా కమిషనర్ డా. జి. సృజన సుస్థిరత మరియు స్థితిస్థాపకత (Sustainability and Resilience Programme(SRP))ను శుక్రవారం ప్రారభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ ఎస్ఆర్పీ కార్యక్రమానికి నోడల్ అధికారులుగా జివిఎంసి అదనపు కమిషనర్లు ఆషా జ్యోతి, డా. వి. సన్యాసి రావు, వ్యవహరిస్తారని కమిషనర్ తెలిపారు. ఇందులో జివిఎంసి పరిధిలో అందరు ఉన్నతాధికారులు, మేయర్,  కార్పొరేటర్లు ముఖ్య పాత్ర పోషిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం దీర్ఘకాలిక సుస్థిరత సాధించడానికి సంస్థాగత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. పరిపాలన వివిధ అభివృద్ధి కార్యకాలాపాలలో నగరానికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. ఈ సస్టైనబిలిటీ , రెసిలిఎన్స్ యూనిట్ (SRU) కార్యక్రమాన్ని , దాని రాబోయే సెల్ఫ్ ఎన్విరాన్మెంట్ సెల్, క్లైమేట్ సెల్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, హ్యూమన్ రీసోర్సు డెవలప్మెంట్ సెల్ ద్వారా అమలు చేస్తుందని కమిషనర్ తెలిపారు. మేయర్, కార్పొరేటర్లను ప్రస్తుత, భవిష్యత్ అత్యవసర పరిస్థితులను మెరుగైన రీతిలో ఎదుర్కోవడానికి సస్టైనబిలిటీ మరియు రెసిలిఎన్స్ ప్రోగ్రాం బృందానికి మద్దతు ఇవ్వాలని కోరారు.  అంతేకాకుండా కోవిడ్-19 సెకండ్ వేవ్ , భవిష్యత్ సవాళ్ళను దృష్టిలో ఉంచుకొని విపత్తుల ప్రమాదాన్ని తగ్గించడంలో కార్యకలాపాలను వార్డు స్థాయిలో సంబంధిత కార్పొరేటర్లు చేపట్టడానికి అవకాశం వుంటుందన్నారు. వార్డు సచివాలయాలు, ప్రజలు , ఇతర లబ్దిదారులు పాల్గొనేలా ప్రణాళికలు రూపొందిస్తుందని వివరించారు. వ్యర్ధ పదార్ధాల నిర్వహణ, అవగాహన ,  అత్యవసర స్పందన  సామర్ధ్యం పెంపొందించడం మొదలైన కార్యక్రమాలు ఇందులో ఉంటాయని కమిషనర్ చెప్పారు.

GVMC office

2021-05-21 12:39:01

అప్పన్న ఆలయంలో ధన్వంతరీ హోమం..

విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)వారి దేవస్థానంలో  24న లోకకల్యాణార్ధం, ప్రజారోగ్యం కోసం ధన్వంతరి హోమం - సుదర్శన హోమం చేపడుతున్నట్టు ఈఓ ఎంవీసూర్య కళ చెప్పారు. శుక్రవారం ఈఓ దేవస్థానంలో మీడియాతో మాట్లాడుతూ, సమస్త ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో స్వామికి ఈ హోమాలు చేయడం ద్వారా ఆయన కరుణా కటాక్షాలు ప్రజలకు చేరతాయనే నమ్మకంతో అనాదిగా ఈ హోమాలు చేస్తూ వస్తున్నారని చెప్పారు. దీనికోసం ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. లోక కళ్యాణార్ధం నిర్వహించే ఈ హోమంలో భక్తులు భాగస్వాములు కావచ్చునని చెప్పారు. దానికోసం భక్తులు దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-21 12:23:43

మరింతగా దాతలు ముందుకి రావాలి..

కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ఎంతో ముఖ్యమైనవని, ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను అందజేయడం ఎంతో గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కరోనా నేపథ్యంలో 10 ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను హైదరాబాద్ కు చెందిన గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ మేనేజర్ ప్రభాకర్, జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, తదితరులు జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా లాంటి పరిస్థితుల్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కోసం ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒక్కో ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్ 1 లక్ష 50 వేల రూపాయల విలువ చేస్తాయన్నారు. కరోనాలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో పాజిటివ్ వచ్చిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు కోసం ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్లను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏయూపి సూర్య మోహన్, సీనియర్ మేనేజర్ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2021-05-21 12:06:02

బ్లాక్ ఫంగస్ పై ఆందోళన వద్దు..

బ్లాక్ ఫంగ‌స్ (నాసో ఆర్బిట‌ల్ మెనింగ్ మ్యుక‌ర్ మైకోసిస్‌) వ్యాధిపై ఎవ‌రూ అన‌వ‌స‌ర అందోళ‌న‌కు గురికావొద్ద‌ని.. భ‌య‌ప‌డ వ‌ద్ద‌ని జేసీ డా. ఆర్‌. మహేష్ కుమార్ అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని తెలిపారు. జిల్లా కేంద్రాసుప‌త్రిలో ముందు జాగ్ర‌త్త‌గా 20 ప‌డ‌క‌ల‌తో ప్ర‌త్యేక ఏర్పాటు ఏర్పాటు చేసి సేవ‌లందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. నిరంతరం వైద్య బృందం అందుబాటులో ఉంటుంద‌ని పేర్కొన్నారు. క‌రోనా నుంచి కోలుకున్న ప్ర‌తి ఒక్క‌రికీ ఆ వ్యాధి సోక‌ద‌ని.. కావున అన‌వ‌స‌ర ఆందోళ‌న‌కు గురికావొద్ద‌ని ధైర్యం చెప్పారు. ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని ర‌కాల చ‌ర్యలూ తీసుకుంటున్నామ‌ని, వ్యాధి సోకిన వారికి ప్ర‌భుత్వం ఉచితంగా ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందిస్తుంద‌ని వివ‌రించారు. ఈ మేర‌కు ఆయ‌న‌ జిల్లా కేంద్రాసుప‌త్రి సూపరింటెండెంట్ డా. సీతారామ‌రాజు, మైక్రోబ‌యోలిజిస్టు డా. శ్ర‌వంతిల‌తో శుక్ర‌వారం ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తి చెంద‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. అవ‌స‌ర‌మైన వైద్యుల‌ను, సిబ్బందిని, స‌రిప‌డా మందుల‌ను అందుబాటులో ఉంచుకోవాల‌ని సూచించారు.

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌టప‌డ్డామురా దేవుడా అనుకునే స‌రికి కొత్తగా వ‌చ్చిన బ్లాక్ ఫంగ‌స్ వ్యాధి ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ వ్యాధిని అరిక‌ట్టడానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఇది వ‌ర‌కే కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఖ‌రీదైన చికిత్స కాబ‌ట్టి ఒక వేళ ఎవ‌రికైనా బ్లాక్ ఫంగ‌స్ వ‌స్తే ఆరోగ్య శ్రీ ప‌థకంలో భాగంగా చికిత్స అందించేందుకు నిర్ణ‌యించింది. జిల్లాల్లో త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌జ‌ల  ప్రాణాలు కాపాడాల‌ని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్‌ ఆధ్వ‌ర్యంలో అధికార యంత్రాంగం త‌గిన చ‌ర్య‌లు చేప‌డుతోంది. 20 ప‌డ‌క‌ల‌తో కూడిన‌ ప్ర‌త్యేక వార్డు, అందులో వైద్య నిపుణులు ఉండేలా ఏర్పాట్లు చేసింది. ప్ర‌స్తుతం అందిరిలోనూ భ‌యాందోళ‌న‌లు రేకెత్తిస్తోన్న ఈ బ్లాక్ ఫంగస్ ఎందుకు వ‌స్తుంది. ఎవ‌రికి వ‌స్తుంది. ల‌క్ష‌ణాలు ఏంటి. ఒక వేళ వ‌స్తే చికిత్స ఏంటి.. ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు అధికారులు, వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఓ సారి తెలుసుకుందాం. త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుందాం.

బ్లాక్ ఫంగ‌స్‌ ఎవ‌రికి వ‌చ్చే అవ‌కాశం ఉంది

నాసో ఆర్బిట‌ల్ మెనింగ్‌ మ్యుక‌ర్ మైకోసిస్ లేదా రీనో సెరిబ్ర‌ల్ మ్యుక‌ర్ మైకోసిస్‌గా పిలిచే బ్లాక్ ఫంగ‌స్ వ్యాధి ముదిరితే ప్రాణాపాయం వ‌ర‌కు తీసుకెళుతుంది. ముక్కు నుంచి కంటికి.. కంటి నుంచి మెద‌డుకు చేరుకొని అవ‌యవాల‌ను పాడుచేస్తుంది. నియంత్ర‌ణ లేని మ‌ధుమేహ రోగులకు ఎక్కువ‌గా ఈ ఫంగ‌స్ సోకే ప్ర‌మాద‌ముంద‌ని వైద్య నిపుణులు తేల్చారు. అలాగే సైన‌సైటిస్ ఉన్న వారికి ఎక్కువ‌గా వ‌స్తున్న‌ట్లు వైద్యులు ఇప్ప‌టికే గుర్తించారు. ఐసీయూలో ఎక్కువ కాలం ఉండి చికిత్స పొందిన వారికి ప్ర‌మాద‌ముంది. క‌రోనా సోకి ప‌రిస్థితి తీవ్ర‌మైన వారికి స్టెరాయిడ్స్ వాడ‌టం త‌ప్ప‌నిస‌రి. క‌రోనా త‌గ్గిపోవాల‌నే ఉద్దేశంతో మ‌ధుమేహ రోగుల‌కు విచ‌క్ష‌ణా ర‌హితంగా కొన్ని ఆసుప‌త్రుల్లో స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. స్టెరాయిడ్స్ ప్రాణాధార మందులే అయిన‌ప్ప‌టికీ మితిమీరి వాడ‌టం వల్ల వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంది. ఈ ఫంగ‌స్ గాలి పీల్చుకోవ‌టం ద్వారా ఎక్కువ‌గా ప్ర‌బ‌లే అవ‌కాశం ఉంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే వెంటిలేట‌ర్లు శుభ్రం చేయకుండా ఎక్కువ కాలం వాడ‌టం కూడా వ్యాధి సోక‌డానికి కార‌ణ‌మ‌ని పేర్కొంటున్నారు.

ల‌క్ష‌ణాలు ఏంటి...

క‌రోనా బారిన ప‌డి ఎక్కువ కాలం ఐసీయూలో చికిత్స పొందిన వారు స్టెరాయిడ్స్ వినియోగించిన వారిలో ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఉండొచ్చు. క‌రోనా చికిత్స అనంత‌రం 10 నుంచి 15 రోజుల్లోపు ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. అలాగే మొహం వాపు. కింటి గుడ్డు కింద ఎర్ర‌బడి దుర‌ద‌గా ఉండ‌టం. ముక్కులో దుర‌ద వేయ‌టం. ప‌దేప‌దే ముక్కును న‌లిపేయాలి అనిపించ‌టం. ముక్కు నుంచి న‌ల్ల‌టి ద్ర‌వం కార‌టం. క‌ళ్ల‌పైనా లేదా కింద చిన్న బొబ్బ‌లు రావ‌టం. ఉబ్బిన‌ట్లు అనిపించ‌టం. కంటి చూపు త‌గ్గిపోవ‌టం.. మ‌సక మ‌స‌క‌గా క‌నిపించ‌టం. దంతాల్లో నొప్పి, తిమ్మిరి, వాపు వంటితో పాటు మొద్దుబార‌టం కూడా వ్యాధి ల‌క్ష‌ణాలు. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే ఆల‌స్యం చేయ‌కుండా కేంద్రాసుప‌త్రిలో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక వార్డులో ఉన్న వైద్య బృందాన్ని సంప్ర‌దించాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

ఎలాంటి చికిత్స అందిస్తారు...

ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాలో ఒక్క కేసు కూడా న‌మోదు కాలేదు. ఒక వేళ ఎవ‌రికైనా వ్యాధి సోకితే చికిత్స అందించేందుకు వైద్య బృందం సిద్ధంగా ఉంది. 20 కేసుల‌కు స‌రిప‌డా మందుల‌ను అందుబాటులో ఉంచుకున్నారు. వ్యాధి బారి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి 21 రోజుల పాటు చికిత్స అవ‌స‌రమ‌ని డా. శ్ర‌వంతి తెలిపారు. అలాగే 21 రోజుల పాటు ఏంఫోటెరిసిన్ ఇంజెక్ష‌న్ ఇవ్వాల్సి ఉంటుంద‌ని చెప్పారు. చికిత్స అనంత‌రం 45 రోజుల పాటు పోసోకానజోల్ మాత్ర‌లు వేసుకోవాల‌ని అప్ప‌డు వ్యాధి పూర్తిగా న‌య‌మవుతుంద‌ని వివ‌రించారు.  

తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటి..

ముందుగా క‌రోనా సోక‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. మాస్కు ధ‌రించుట‌, సామాజిక దూరం పాటించుట వంటి నియ‌మాలు పాటించాలి. ధూళి ఉన్న ప్ర‌దేశాల్లో, నిర్మాణాలు జ‌రిగే ప్రాంతాల్లో తిర‌గ‌కుండా ఉండాలి. ఒక వేళ క‌రోనా సోకితే.. సాధ్య‌మైనంత వ‌ర‌కు మామ్మూలు మందులతో న‌య‌మైపోయేలా చూసుకోవాలి. శ్వాసకు సంబంధించిన ఎక్స‌ర్‌సైజ్‌లు చేయాలి. మోతాదుకు మించి స్ట‌రాయిడ్స్ వాడ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఇమ్యునో మోడ్యులేటింగ్ డ్ర‌గ్స్‌ను నిలిపివేయటం. ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే నిర్ల‌క్ష్యం వ‌హించ‌కుండా వైద్యుల‌ను సంప్ర‌దించాల‌ని అధికారులు, వైద్య నిపుణులు చెబుతున్నారు. 

జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు

బ్లాక్ ఫంగ‌స్‌గా పిలిచే ఈ వ్యాధి జిల్లాలో ఏవ్వ‌రికీ సోక‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసు కూడా న‌మోద‌వ్వ‌లేదు. రాష్ట్రంలో సుమారుగా 20 కేసులు న‌మోదు కాగా..  ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో మాత్రం చాలా త‌క్కువ‌గా న‌మోద‌య్యాయి. శ్రీ‌కాకుళం నుంచి ఒక‌టి, విశాఖ‌ప‌ట్టణంలో అయిదు కేసులు న‌మోదయ్యాయి.   మ‌న జిల్లాలో ఒక్క కేసు కూడా న‌మోద‌వ్వ‌లేద‌ని డా. సీతారామ‌రాజు పేర్కొన్నారు. 

ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం
ః డా. ఆర్‌. మ‌హేష్ కుమార్‌, సంయుక్త క‌లెక్ట‌ర్‌

ఈ వ్యాధిపై ఇప్ప‌టికీ వైద్య నిపుణుల‌తో చ‌ర్చించాం. కేంద్రాసుప‌త్రి సూప‌రింటెండెంట్ ఆధ్వ‌ర్యంలో మ‌హారాజ ఆసుప‌త్రిలో ప్ర‌త్యేక సెల్ ఏర్పాటు చేశాం. అందులో నిత్యం వైద్యులు అందుబాటులో ఉంటారు. వ్యాధి ల‌క్ష‌ణాలు గుర్తించిన వెంట‌నే మ‌హారాజ ఆసుప‌త్రిలో ఏర్పాటు చేసిన సెల్‌లో సంప్ర‌దిస్తే వెంట‌నే వైద్య‌ప‌ర‌మైన సేవ‌లు అందిస్తాం. జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసు కూడా న‌మోద‌వ్వ‌న‌ప్ప‌టికీ ముందు జాగ్ర‌త్త‌గా అన్ని ర‌కాల వైద్య ప‌రమైన ఏర్పాట్లు చేశాం. వైద్యులు, సిబ్బంది, మందులు అందుబాటులో ఉన్నాయి. దీనిపై ఎలాంటి భ‌యానికీ గురికావొద్ద‌ని ప్ర‌జ‌ల‌ను కోరుతున్నాం. అధికార యంత్రాంగం ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌డుతోంది.

జాగ్ర‌త్త‌లు పాటిస్తే ఏం కాదు...
ః డా. సీతారామ‌రాజు, సూప‌రింటెండెంట్‌, మ‌హారాజ ఆసుప‌త్రి

క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత 10 నుంచి 15 రోజుల్లో వ్యాధి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంది. కావున క‌రోనా నుంచి చికిత్స పొందిన ఇంటికెళ్లిన త‌ర్వాత కూడా జాగ్ర‌త్త‌గా ఉండాలి. దుమ్ము, ధూళి, నిర్మాణ ప్రాంతాల్లో ఎక్క‌వ‌గా తిర‌గ‌కూడ‌దు. రోగ నిరోధ‌క శక్తి త‌క్కువ‌గా ఉన్న‌వారిపైనే దీని ప్ర‌భావం ఉంటుంది. కావున మంచి ఆహారం తీసుకోవాలి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాలి. మాస్కు ధ‌రించుట‌, భౌతిక దూరం పాటించుట చేయాలి. నియ‌మాలు పాటిస్తూ ప‌రిశుభ్ర‌త పాటిస్తే ఈ వ్యాధి ద‌రిచేర‌దు. దీనిపై అన‌వ‌స‌రమైన ఆందోళ‌న చెంద‌వ‌ద్దు. క‌లెక్ట‌ర్‌, జేసీల సూచ‌న‌ల మేర‌కు జిల్లా కేంద్రాసుప‌త్రిలో ముందస్తుగా 20 ప‌డ‌క‌ల‌తో ప్ర‌త్యేక వార్డు ఏర్పాటు చేశాం. అందులో ఇద్ద‌రు వైద్య నిపుణులు, ఇద్ద‌రు ల్యాబ్ టెక్నీషియ‌న్స్‌, ప‌రీక్ష‌లు చేయించేందుకు గాను మైక్రోబ‌యోల‌జిస్టు డా. శ్ర‌వంతి అందుబాటులో ఉంటారు. ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే వీరిలో ఎవ‌రిని సంప్ర‌దించినా వైద్య సేవ‌లు వెంట‌నే అందుతాయి. 

కలెక్టరేట్

2021-05-21 12:03:15

వేరుశనగ విత్తన పంపిణీని సజావుగా జరగాలి..

రైతులకు ఇబ్బందులు కలుగకుండా జిల్లా వ్యాప్తంగా వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శుక్రవారం సింగనమల మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వేరుశెనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విత్తన వేరుశెనగ పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు వేరుశనగ విత్తనం తీసుకునేలా రైతుల చేత రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. రైతులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవగాహన కల్పించేందుకోసం గ్రామాల్లో టాంటాం వేయించాలని వ్యవసాయ శాఖ జెడి, వ్యవసాయ అధికారులకు సూచించారు. రైతులకు నాణ్యమైన కె6 రకం వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఎంతమంది రైతులు విత్తనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎంతమంది రైతులకు విత్తనాన్ని పంపిణీ చేశారు అనే వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, గత ఏడాది కూడా పొలాల్లో విత్తనాలు వేశారా, మీకు ఎన్ని బస్తాల వేరుశనగ ఇస్తున్నారు అనే వివరాలను ఆరా తీశారు.

ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి చిన్నమ్మ మాట్లాడుతూ సింగనమల మండలంలో వేరుశెనగ విత్తన పంపిణీ చేస్తున్నామని, మండలంలో అర్హత కలిగిన రైతులు 3606 మంది ఉండగా, అందులో 427 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారికి వేరుశనగ విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్నారు. సింగనమల మండలానికి 5015 క్వింటాళ్ల వేరుశనగను కేటాయించడం జరిగిందని, మండలంలోని ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు వేరుశనగ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, అనంతపురం ఆర్డీవో గుణ భూషణ్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మీనారాయణ, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Singanamala

2021-05-21 10:24:58

కోవిడ్ రోగులకు తక్షణ వైద్య సహాయం..

కోవిడ్ బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు కమ్యునిటీ హెల్త్ సెంటర్ ను కోవిడ్ ఆసుపత్రిగా మర్పు చేసినట్టు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం మంత్రి జిల్లా పర్యటనలో భాగంగా పుంగనూరులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ట్రయేజ్ సెంటర్ ను మంత్రి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్.రెడ్డప్ప, తంబళ్లపల్లి శాసన సభ్యులు పెద్ది రెడ్డి ద్వారకనాధ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ తో కలిసి ప్రారంబించారు. అనంతరం ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన పడకల సామర్ధ్యంను మంత్రి స్వయంగా పరిశీలించారు. వైద్య సేవలు అందించడంలో పూర్తి బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు (అభివృద్ది, సంక్షేమం) వి.వీరబ్రహ్మం, ఎన్.రాజశేఖర్, మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి, మున్సిపల్ ఛైర్మన్ షేక్ ఆలీమ్ బాషా, డి.ఎం.హెచ్.ఓ డా.పెంచలయ్య, డి.సి.హెచ్.ఎస్.(ఇంచార్జ్) డా.అరుణకుమార్, ఎ.పి.ఎం.ఐ.డి.సి దనంజయరెడ్డి, కమ్యునిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ చిరమల, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. 

Punganur

2021-05-21 10:09:08

జైలులో ఖైదీలకు కరోనా పరీక్షలు..

విజయనగరంజిల్లాలో కోవిడ్ నియంత్రణకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలను చేపట్టింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. దీనిలో భాగంగా, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశాల మేరకు, విజయనగరం సబ్ జైలులో శుక్రవారం కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. జైలు లో ఉన్న 28 మంది అండర్ ట్రయిల్ ఖైదీలు, 10 మంది జైలు సిబ్బంది నుంచి స్వాబ్స్ తీసి, మిమ్స్ ఆసుపత్రిలోని ల్యాబ్ కి, పరీక్షల కోసం పంపించారు. జైలు సూపరింటెండెంట్ దుర్గారావు, డి.ఎస్.జె.ఓ మధుబాబు పర్యవేక్షణలో, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ బాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో, ప్రత్యేక వైద్య బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. జైలులో కూడా ప్రతీఒక్కరు మాస్కులను ధరించాలని, ఇతర కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా వైద్యులు కోరారు.

Vizianagaram

2021-05-21 10:00:07

క్షేత్రస్థాయి సిబ్బందికి పిపిఈ కిట్లు..

శ్రీకాకుళం జిల్లాలో క్షేత్రస్థాయి కోవిడ్ నమూనాలు సేకరిస్తున్న ఆరోగ్య సిబ్బందికి పిపిఈ  కిట్లను అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. శుక్రవారం అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ నమూనాలు అధికంగా సేకరించాలని ఆదేశించారు.  నమూనాలు సేకరణలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. గత 14 రోజుల్లో ఆ వ్యక్తి నమూనాలు సేకరించి ఉండరాదని, కొత్త వారికి మాత్రమే సేకరించాలని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే సేకరించిన నమూనాలు తక్షణం ల్యాబ్ కు పంపించాలని ఆదేశించారు. హోం ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తులను సందర్శించి ఆ మేరకు యాప్ లో అప్లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు. కోటబొమ్మాలి, రెంటికోట తదితర పీహెచ్సీల పరిధిలో హోమ్ ఐసోలేషన్ వ్యక్తులను సందర్శించనట్లుగా నివేదికలు సూచిస్తున్నాయని ఆయన పేర్కొంటూ వైద్యాధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెడికల్ కిట్లు వెంటనే అందజేయాలని వాటి వివరాలను సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో కోవిడ్ యాజమాన్య కమిటీల ఏర్పాటుపై సర్పంచుల సమావేశాలను నిర్వహించి గ్రామస్థాయిలో చేపట్టాల్సిన నమూనాల సేకరణ, పాజిటివ్ వ్యక్తులు ఉపాధి హామీ పనులకు రాకుండా చూడటం, పాజిటివ్ వ్యక్తుల సమాచారం అందించడం, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ తదితర కార్యక్రమాలను చేపట్టడంతో పాటు  గ్రామాలను కోవిడ్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుటకు కృషి చేయాల్సిన అవసరాన్ని తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే.శ్రీనివాసులు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, జిల్లా అధికారులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-21 09:36:54

అప్పన్న ఆన్ లైన్ సేవలు మీకోసమే..

విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)ను నేరుగా దర్శించుకోలేని వారు స్వామి సేవలను ఆన్ లైన్ ద్వారా వీక్షించి స్వామి క్రుపకు పాత్రులు కావాలని దేవస్థాయం ఈఓ ఎంవీ సూర్యకళ అన్నారు. శుక్రవారం ఆమె దేవస్థానంలో మీడియాతో మాట్లాడారు. అరగదీసిన చందనంతోపాటు, సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేశామన్నారు. స్వామికి ఎవరైనా భక్తులు చందనం సమర్పించాలనుకుంటే దేవస్థాన అధికారులను సందప్రదించాలన్నారు.  చందన సమర్పణ, గోత్ర నామాల పూజలు రెండు,  మూడు, నాలుగో దఫాలుగా చందన సమర్పణలు కూడా కొనసాగుతాయన్నారు. దాతలు ఎంతైనా స్వామివారికి చందనం సమర్పించుకోవచ్చుని చెప్పారు.  ఆన్ లైన్ పూజలు, అర్చనల్లో  భాగస్వాములు కావాలనుకునే భక్తులు  దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-21 09:18:05

నిజమైన వారధులు జర్నలిస్టులే..

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు శ్రమించే నిస్వార్థ సేవకులే జర్నలిస్టులని వైఎస్సార్సీపీ గాజువాక నియోజకవర్గ సమన్వయ కర్త తిప్పల.దేవన్ రెడ్డి, గాజువాక శాంతి భద్రతల విభాగం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.మల్లేశ్వరరావు లు అన్నారు. శుక్రవారం గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  హైస్కూల్ రోడ్డులో ఏర్పాటు చేసిన మినీ కోవిడ్ కేర్ సెంటర్ ను  ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని అన్నారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడకుండా సాటి జర్నలిస్టుల ప్రాణాలను కాపాడేందుకు అసోసియేషన్ ప్రతినిధులు ముందుకు వచ్చి మినీ కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసి  గాజువాక జర్నలిస్టులు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక జర్నలిస్ట్  అసోసియేషన్ ప్రతినిధులు రాము, పితాని ప్రసాద్ ,కొయిలాడ పరశురాం ,గుప్తా,  మూల గిరిబాబు, కృష్ణ శ్రీ ,బాలు ,సురేష్, వసంత్ , మనోజ్ , దాస్,  రాజు, నాగేశ్వరరావు,  మరియు  స్థానిక వైసిపి నాయకులు దర్మాల.శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.

Gajuwaka

2021-05-21 08:49:29

ఈరోజు అరగదీత చందనం 30 కిలోలు..

విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)కు శుక్రవారం 3 కిలోలు చందన అరగదీత ద్వారా సమకూరినట్టు దేవస్థానం ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. ఈ సందర్భంగా  దేవస్థానంలో మీడియాతో మాట్లాడుతూ, స్వామివారికి 26వ తేదీన రెండవ విడత చందనాన్ని సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు వివరించారు. అరగదీసిన చందనంతోపాటు, సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేశామన్నారు. స్వామికి ఎవరైనా భక్తులు చందనం సమర్పించాలనుకుంటే దేవస్థాన అధికారులను సందప్రదించాలన్నారు.  చందన సమర్పణ, గోత్ర నామాల పూజలు  మూడు, నాలుగో దఫాలుగా చందన సమర్పణలు కూడా కొనసాగుతాయన్నారు. దాతలు ఎంతైనా స్వామివారికి చందనం సమర్పించుకోవచ్చుని చెప్పారు.  ఆన్ లైన్ పూజలు, అర్చనల్లో  భాగస్వాములు కావాలనుకునే భక్తులు  దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-21 08:44:26

జిల్లాను నెలరోజుల్లో సాధారణ స్థితికి తెస్తాం..

క‌రోనాపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు రెండు కోవిడ్ ప్ర‌చార ర‌థాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ వ‌ద్ద‌ ప్రారంభించారు. సెట్విజ్ ఆధ్వ‌ర్యంలో, నేచ‌ర్, వ‌ర‌ల్డ్ విజ‌న్ స్వ‌చ్ఛంద సంస్థ‌లు జిల్లాలో ఈ ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నాయి. ప్ర‌చార ర‌థాల ద్వారా ఒక్కో సంస్థా 11 మండ‌లాల్లో క‌రోనా ప‌ట్ల ప్ర‌జ‌ల్లో జాగృతి క‌ల్గించేవిధంగా, ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని సెట్విజ్ రూపొందించింది. కోవిడ్‌పై పోరాటంలో స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌ను కూడా భాగ‌స్వాముల‌ను చేస్తామ‌ని, నెల రోజుల్లో వ్యాధిని గ‌ణ‌నీయంగా క‌ట్ట‌డి చేయ‌డం ద్వారా జిల్లాలో సాధార‌ణ ప‌రిస్థితిని తీసుకువ‌స్తామ‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ అన్నారు. క‌రోనా ప‌ట్ల మ‌రింత విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఇటువంటి ప్ర‌చార‌ ర‌థాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెప్పారు. ఇటువంటి కార్య‌క్రమాల‌కు ముందుకు వ‌చ్చినందుకు స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌ను అభినందించారు. ముఖ్యంగా ఎక్కువ‌గా కోవిడ్ పాజిటివ్ కేసులు న‌మోదవుతున్న మండ‌లాల్లో ఈ ర‌థాల ద్వారా ప్ర‌చారాన్ని నిర్వ‌హించాల‌ని సూచించారు. గ్రామాల్లో క‌రోనా నియంత్ర‌ణ‌కు క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు. గ్రామ‌స్థాయిలోనే ఐసోలేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసి, నిర్వ‌హ‌ణా బాధ్య‌త‌ను స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు అప్ప‌గిస్తామ‌ని అన్నారు. ప‌రిశ్ర‌మ‌లు కూడా బాధితుల‌ను ఆదుకొనేందుకు ముందుకు వ‌స్తుండ‌టం అభినంద‌నీయ‌మ‌న్నారు. బాల‌ల సంర‌క్ష‌ణ‌కోసం జిల్లాలో మ‌రో చైల్డ్ లైన్ ఏర్పాటు చేసేందుకు యునెసెఫ్ ముందుకు వ‌చ్చింద‌ని వెళ్ల‌డించారు.

               జిల్లాలో క‌రోనా క‌ట్ట‌డికి మూడంచెల విధానాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. నివార‌ణా చ‌ర్య‌ల్లో భాగంగా, మాస్కుల ధార‌ణ‌, భౌతిక దూరం, శానిటైజేష‌న్‌పై విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పిస్తూనే, మ‌రోవైపు వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప‌క‌డ్బంధీగా నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. ఇంత‌వ‌ర‌కు క‌రోనా రాని గ్రామాల్లో భ‌విష్య‌త్తులో కూడా వ్యాధి ప్ర‌వేశించ‌కుండా అడ్డుకోవ‌డం, వ‌చ్చిన గ్రామాల్లో పూర్తిగా నిర్మూలించ‌డం ప్ర‌ధాన ల‌క్ష్యాలుగా కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించిన‌ట్లు చెప్పారు. దీనికి ప్ర‌భుత్వ ఉద్యోగులు, గ్రామ‌, వార్డు క‌మిటీలు, స‌చివాల‌య ఉద్యోగుల‌తోపాటు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల స‌హ‌కారాన్ని కూడా తీసుకుంటామ‌ని అన్నారు. అంద‌రి స‌మిష్టి కృషితో, మ‌రికొద్ది రోజుల్లోనే జిల్లాలో సాధార‌ణ ప‌రిస్థితిని నెల‌కొల్పేందుకు కృషి చేస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ వివ‌రించారు.

                ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్‌(అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు,  సెట్విజ్ ముఖ్య కార్య నిర్వ‌హ‌ణాధికారి వి.విజ‌యకుమార్, నేచ‌ర్ డిస్ట్రిక్ట్ కౌన్సిల‌ర్ జి.కె.దుర్గ‌, కో-ఆర్డినేట‌ర్ మీనా, వ‌ర‌ల్డ్ విజ‌న్ కో-ఆర్డినేట‌ర్లు జి.అంబేద్క‌ర్‌, ఆర్‌.నాగేశ్వ‌ర్రావు, సెట్విజ్ సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-21 07:46:55

సమన్వయంతో విజయవంతంగా కోవిడ్ వేక్సినేషన్..

గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు, వాలంటీర్ వ్య‌వ‌స్థ క్రియాశీల భాగ‌స్వామ్యంతో జిల్లాలో టీకా పంపిణీ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొనసాగుతోంద‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్ర‌వారం ఉద‌యం కాకినాడ ర‌మ‌ణ‌య్య‌పేట‌లోని న‌గ‌ర‌పాల‌క సంస్థ ఉన్న‌త‌పాఠ‌శాల‌లో జ‌రుగుతున్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. కోవిడ్ వైర‌స్ వ్యాప్తి, వేస‌వి నేప‌థ్యంలో కేంద్రంలో చేసిన ప్ర‌త్యేక ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, సంతృప్తి వ్య‌క్తం చేశారు. ల‌బ్ధిదారుల అర్హ‌త వివ‌రాల త‌నిఖీ ప్ర‌క్రియ‌తో పాటు వ్యాక్సినేష‌న్‌, అబ్జ‌ర్వేష‌న్ గ‌దుల‌ను ప‌రిశీలించారు. అక్క‌డి ల‌బ్ధిదారుల‌తో మాట్లాడి, స్లిప్‌లు ఎవ‌రు ఇచ్చారో తెలుసుకున్నారు. మొద‌టి డోసు వేయించుకున్న తేదీని ఆధారంగా చేసుకొని వాలంటీర్లే ఇంటికి వ‌చ్చి రెండో డోసు వేసేందుకు స్లిప్‌లు అందించిన‌ట్లు ల‌బ్ధిదారులు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో ల‌బ్ధిదారుల‌కు ముందే స్లిప్‌లు అందించే విధానం స‌త్ఫ‌లితాలు ఇస్తోంద‌ని, ఈ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా ముందుకు తీసుకెళ్లాల‌ని అధికారులు, సిబ్బందికి సూచించారు. ప్ర‌స్తుతం రెండో డోసు పంపిణీ జ‌రుగుతోంద‌ని, వ‌చ్చే నెల మొద‌టి నుంచి ల‌బ్ధిదారుల‌కు మొద‌టి డోసు పంపిణీ జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. కార్య‌క్ర‌మంలో కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, వ్యాక్సినేష‌న్ కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2021-05-21 07:34:26

కరోనా నిబంధనలతో చందనం అరగదీత..

చందనం అరగదీసే వారు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ ఆదేశించారు. శుక్రవారం దేవస్థానంలో స్వామివారికి  రెండవ విడత సమర్పించ నున్న చందనం అరగదీత కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా ఈఓ మాట్లాడుతూ, చందనం అరగదీసేవారంతా ఖచ్చితంగా మాస్కులను ముక్కూ, మూతీ మూసుకున్న తరువాతే చందనం అరగదీయాలన్నారు. అటు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులను కూడా మాస్కులు పూర్తిగా ధరించి, శానిటైజేషన్ పూర్తి అయిన తరువాతమే లోనికి అనుమతించాలన్నారు. మాస్కులు సక్రమంగా వేసుకోని భక్తులను వెనక్కి పంపాలని ఆమె సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, ఆచార్యులు పాల్గొన్నారు.


Simhachalam

2021-05-21 05:30:34