1 ENS Live Breaking News

ఫలించిన జివిఎంసీ కమిషనర్ వ్యూహం..

విశాఖలో కరోనా వైరస్ కేసులు అధికమవుతున్నవేళ ఆ వ్యాప్తిని తగ్గించేందుకు మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ డా.స్రిజన రచించిన ప్రత్యేక వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చింది. ఆదివారం మాంసం దుఖాణాలు నిషేధించడంతో అత్యధికశాతం మంది రోడ్లపైకి రావడం బాగా తగ్గింది. అధిక జనాబా కేవలం మాంసం, చేపలు, రొయ్యలు, దుఖాణాల వద్దే గుమిగుడటంతో వైరస్ వ్యాప్తి అధికంగా వుందనే కారణంతో కమిషనర్ తీసుకున్న నిర్ణయం పక్కాగా అమలై జనసాంద్రత  తగ్గింది. అంతేకాకుండా కర్ఫ్యూ లో విషయంలో నిబంధనలు పక్కాగా అమలు చేయడంతో జనం రోడ్లపైకి రావడానికి భయపడుతున్నారు. ఇలాంటి మాంసం నిషేధం కరోనా ప్రభావం వున్నంత కాలం విధిస్తే చాలా వరకూ కేసులు తగ్గొచ్చుననే వాదన వినిపించడం విశేషం.. భౌతిక దూరం పాటించడం, మాస్కుధారణ విశాఖనగరంలో బాగా కనిపిస్తోంది. ఇదే పద్దతి కొనసాగితే త్వరలోనే కరోనా వైరస్ కేసులు మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలో తగ్గుముఖం పట్టే అవకాశముంది. అంతేకాకుండా రైతు బజార్ల వద్ద కూడా భౌతిక దూరం, మాస్కు ధారణ ఉంటే తప్పా ప్రవేశం లేదనే నియమ నిబంధనలు కూడా పెట్టాలనే నగరవాసులు కోరుతున్నారు. వ్యాపారులకు ఈ విధానాలు కష్టంగా ప్రజలకి మాత్రం కరోనా వైరస్ నుంచి మాత్రం కాస్త ప్రభావం తగ్గినట్టు కనిపించింది. అన్నిరకాల మీడియా, ప్రసార మాద్యమాల ద్వారా ఇలాంటి ఆదేశాలు ప్రజల్లోకి తీసుకెళ్లగాలిగితే విశాఖలో కరోనా వైరస్ కేసులు త్వరలోనే తగ్గుముఖం పట్టడానికి ఆస్కారం వుంది..

GVMC office

2021-05-23 12:01:46

యాస్ తుపాను కోసం ప్రత్యేక కాల్ సెంటర్..

యాస్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో  సాగర, స్వదేశీ మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని.. ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ రక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని విజయనగరం మత్స్యశాఖ ఉపసంచాలకులు ఎన్.నిర్మలకుమారి కోరారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె మీడియాకి ప్రకటన జారీ చేశారు.  యాస్ తుపాను హెచ్చరికల సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.హరిజవర్ లాల్ ఆదేశాల మేరకు 24గంటలు పనిచేసే కాల్ సెంటర్ జిల్లా కార్యాలయంలో 08922-273812 అనే నెంబరుతో ఏర్పాటు చేసినట్టు ఆమె పేర్కొన్నారు. 9440814722లో మత్స్యశాఖ ఉపసంచాలకులు, 9490835709 లో మత్స్యశాఖ సహాయ సంచాలకులు, 8247586549లో మత్స్యశాఖ అభివ్రుద్ధి అధికారి అందుబాటులో ఉంటామని వివరించారు. ముందస్తు చర్యగా గజఈతగాళ్లను, రిలీఫ్ బోట్లను సిద్దం చేసినట్టు కూడా తెలియజేశారు. సాగర మిత్రాల ద్వారా తుపాను హెచ్చరికలు జారీచేయడంతోపాటు దండోరాలు కూడా వేయించి మత్స్యాకారులకు తాజా పరిస్తితిని తెలియజేశామన్నారు. తీర ప్రాంతాల్లో బోట్లు, వేట సామాన్లు తుపాను తాకిడి పాడైపోకుండా, ఇస్తి నష్టం జరగకుండా జాగ్రత్త చేసుకోవాలని కూడా సమాచారం అందించినట్టు చెప్పారు. తుపాను తీవ్రత తగ్గేవరకూ అధికారులు, సిబ్బందికి ఎటువంటి సెలవులు ఇచ్చేది లేదని పేర్కొన్నారు. మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కాల్ సెంటర్ కి సమాచారం అందించాలని, లేదంటే సాగర మిత్రాలను సంప్రదించి సహాయం పొందాలని మత్స్యశాఖ ఉపసంచాలకులు ఎన్.నిర్మలకుమారి ఆ ప్రకటనలో కోరారు

Vizianagaram

2021-05-23 08:32:09

జిల్లాకి చేరుకున్న బ్లాక్ ఫంగస్ మందులు..

కోవిడ్ చికిత్స పొందిన వారిలో ఇటీవ‌లి కాలంలో వ్యాపిస్తున్న బ్లాక్ ఫంగ‌స్‌(మ్యుక‌రో మైక‌సిస్‌) వ్యాధి చికిత్సకోసం అవ‌స‌ర‌మైన ఔష‌ధాలు జిల్లాలో అందుబాటులోకి వ‌చ్చాయ‌ని జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. ఈ వ్యాధిగ్రస్తుల చికిత్సకు అవ‌స‌ర‌మైన ఇంజెక్షన్లు, మాత్రలు జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు చేరిన‌ట్టు వెల్లడించారు. టొసిలిజుమాబ్ 80 మిల్లీ గ్రాముల‌ ఇంజ‌క్షన్లు- 140, ఏంపోటెర్సిన్‌-బి 50 మిల్లీగ్రాముల ఇంజెక్షన్లు- 30, పొస‌కొన‌జోల్ 300 మి.గ్రా. ఇంజ‌క్షన్లు- 30, పొస‌కొన‌జోల్‌- 100 మి.గ్రా. ప‌రిమాణం గ‌ల మాత్రలు -1000 వంతున రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక స‌దుపాయాల సంస్థ‌ కేంద్ర కార్యాల‌యం నుంచి జిల్లాకు స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు తెలిపారు. జిల్లాలోని బ్లాక్ ఫంగ‌స్‌(మ్యుక‌రో మైక‌సిస్) వ్యాధి సోకిన‌ట్లుగా గుర్తించిన వారికి ఈ మందులు అంద‌జేసి చికిత్స చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ వ్యాధి ల‌క్షణాలు క‌నిపించిన‌ట్లయితే జిల్లా కేంద్ర ఆసుప‌త్రిలోని బ్లాక్ ఫంగ‌స్ కేసుల కోసం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక విభాగంలో సంప్రదించాలని సూచించారు.

Vizianagaram

2021-05-23 06:49:21

సింహాద్రి నాధుడికి స్వర్ణ పుష్పార్చన..

విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)కి ఆదివారం స్వర్ణపుష్పాలతో ఘనంగా అర్చన నిర్వహించారు. శాస్త్రోక్తంగా స్వామివారికి నిర్వహించిన ఈ పూజలో భక్తులు అధిక సంఖ్యలో ఆన్ లైన్ లో పాల్గొన్నారు. ఆన్ లైన్ లో స్వామి పూజలు, అర్చనలు, కళ్యాణాలు టిక్కెట్లు తీసుకున్నవారికి లైవ్ గా జరిగిన స్వామివారి యూట్యూబ్ లింక్ పంపినట్టు దేవస్థాన ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. స్వామివారి ఆన్ లైన్ పూజల్లో పాల్గొన దలచిన వారు దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-23 06:47:16

రేపు అప్పన్న ఆలయంలో ధన్వంతరీ హోమం..

ప్రపంచాన్ని వనికిస్తున్న కరోనా, బ్లాక్ ఫంగస్ లాంటి వ్యాధుల నుంచి ప్రజలను రక్షించాలని కాంక్షిస్తూ.. విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)కి సోమవారం ధన్వంతరీ హోమం నిర్వహిస్తున్నట్టు దేవస్థాన ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాకు ఆదివారం ఒక ప్రకటనల విడుదల చేశారు. ప్రజలు అనారోగ్యం, వైరస్ లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ఆ సింహాద్రినాథుని చల్లని చూపులు ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా అవసరమన్నారు. ప్రజలకు చక్కటి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేడుకుంటూ..  శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామికి   ధన్వంతరి హోమం నిర్వహించాలని ఆలయ ధర్మకర్త సంచయిత గజపతి, అర్చకులతో కలిసి నిర్ణయించినట్టు పేర్కొన్నారు.  24న స్వామి వారి ఆవిర్భావ తార స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని సుదర్శన హోమం కూడా చేపడుతున్నామన్నారు.  ఈ హోమంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేని కారణంగా ఆన్ లైన్ ద్వారా  రూ.2,500 రుసుము చెల్లించి భక్తులు పాల్గొనే అవకాశం కల్పించామని చెప్పారు. దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-23 06:18:13

యాష్ తుపానుపట్ల అప్రమత్తంగా ఉండాలి..

ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24వ తేదీ నాటికి తుఫానుగా మారి వాయువ్య దిశలో పయనించి 26వ తేదీన ఒడిశా-పశ్చిమ బెంగాల్ మద్య తీరాన్ని తాకనుందని, దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లో గణనీయమైన వర్షపాతం కురియవచ్చని భారత వాతావరణ శాఖ సూచన జారీ చేసిందని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి తెలిపారు.  “యాష్”  గా నామకరణం చేసిన ఈ తుఫాను హెచ్చరిక నేపద్యంలో జిల్లాలోని మత్స్యకారులు ఈ నెల 27వ తేదీ వరకూ తూర్పు, ఉత్తర బంగాళాఖాతంలోకి, ఒడిశా-బెంగాల్ తీరాల వైపు సముద్రంలోకి వెళ్లవద్దని, లోతైన సముద్ర వేటలో ఉన్న వారు వెంటనే తిరిగి తీరానికి చేరుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా మత్స్సకారులందరికీ సమాచారం అందించి, సముద్ర వేటలో ఉన్నవారిని వెనుకకు రప్పించాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. అలాగే తుఫాను కారణంగా ఎక్కవ వర్షపాతం నమోదైయ్యే సూచన దృష్ట్యా జిల్లాలోని రైతులను అప్రమత్తం చేసి, ధాన్యం, పంటలకు నష్టం కలుగకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.  డివిజనల్, మండల అధికారులు తమ కార్యాలయాల్లో కంట్రోలు రూమ్ లు ఏర్పాటు చేసి ముందస్తు జాగ్రత చర్యలను చేపట్టాలని తెలిపారు. సముద్ర తీర మండలాల్లోని అన్ని గ్రామాల్లో దండోరా, వలంటీర్ల ద్వారా ప్రజలకు తుఫాను సమాచారం తెలిపి అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైతే తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్దం చేయాలని, ఏవిధమైన ప్రాణ, ఆస్తి, పంట నష్టం కలుగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 

Kakinada

2021-05-23 04:33:09

సింహాద్రి నాధుడికి స్వర్ణ పుష్పార్చన..

విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)కి ఆదివారం స్వర్ణపుష్పాలతో అర్చన నిర్వహించారు. శాస్త్రోక్తంగా స్వామివారికి నిర్వహించిన ఈ పూజలో భక్తులు అధిక సంఖ్యలో ఆన్ లైన్ లో పాల్గొన్నారు. ఆన్ లైన్ లో స్వామి పూజలు, అర్చనలు, కళ్యాణాలు టిక్కెట్లు తీసుకున్నవారికి లైవ్ గా జరిగిన స్వామివారి యూట్యూబ్ లింక్ పంపినట్టు దేవస్థాన ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. స్వామివారి ఆన్ లైన్ పూజల్లో పాల్గొన దలచిన వారు దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-23 04:30:15

Simhachalam

2021-05-23 04:22:46

డబుల్ లేయర్ మాస్కుల ధారణ శ్రేయస్కరం..

కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న తరుణంలో ప్రజలంతా రెండు లేయర్లు ఉన్న నాణ్యమైన మాస్కులు ధరించడం ద్వారా కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడానికి అవకాశం వుంటుందనే ప్రభుత్వ సూచనను పాటించాలని మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకుమారి సూచిస్తున్నారు. ఆదివారం ఈ మేరకు విజయనగరంలో ఆమె మీడియాకి ప్రకటన విడుదల చేశారు. సాధారణ మాస్కుల కంటే రెండింతలు పటిష్టంగా ఉండే మాస్కు ధరించడం ద్వారా వైరస్ దరిచేరే అవకాశం తక్కువగా వుంటుందనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటించాలన్నారు. బౌతిక దూరం పాటిస్తూ, ఎల్లప్పుడూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఏ పనిచేసినా చేతులను సబ్బుతో కడుక్కోవడంతోపాటు, నాణ్యమైన శానిటైజర్లను వినియోగించడం ద్వారా చేతులకు తెలియకుండా అంటే వైరస్ ను నాశనం చేయడానికి అవకాశం వుంటుందన్నారు. అదేవిధంగా మత్స్యకారులెవరూ బయటకు రావొద్దని, ఏ అవసరం వున్నా మత్స్యకార మిత్రాలను సంప్రదించాలన్నారు. కరోనా కేసులు అధికంగా పెరుగుతున్నందున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా మత్స్యకారులు గుంపులు గుంపులుగా చేరకూడదన్నారు. ప్రజలు ప్రభుత్వానికి స్వచ్చందంగా సహకరిస్తే అనుకున్న సమయం కంటే ముందుగానే కరోనా వైరస్ ను నియంత్రించడానికి ఆస్కారం వుంటుందని నిర్మలకుమారి సూచిస్తున్నారు. అవసరం వుంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని, నిత్యం వేడి నీరు తీసుకుంటూ, బలవర్ధక ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చునన్నారు. అదే విధంగా యోగా ప్రాణాయామం చేయడం ద్వారా ఆక్సిజన్ లెవల్స్ ను పెంచుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. 

Vizianagaram

2021-05-23 03:41:40

ప్రైవేటు సంస్థ ఉద్యోగులకూ కోవిడ్ టీకా..

ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల్లో పనిచేసే 45 సంవత్సరాలు దాటిన ఉద్యోగులకు ఈ నెల 24, 25, 26 తేదీలలో డివిజన్  కేంద్రాలో మొదటి డోస్ కోవిషీల్డ్ టీకాల పంపిణీ నిర్వహించనున్నామని జిల్లా కలక్టర్ డి.మురళీధరరెడ్డి తెలియజేశారు. శనివారం రాత్రి జిల్లాకలెక్టర్ మురళీధరరెడ్డి జిల్లా, డివిజనల్ అధికారులతో  టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల ఉద్యోగులకు తొలి విడత కోవిడ్ వాక్సిన్ నిర్వహణ గురించి ఆదేశాలు జారీ చేసారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే సోమ, మంగ్ల, బుధ వారాలలో ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలలో పనిచేస్తున్న 45 ఏళ్లుదాటిన ఉద్యోగులకు కోవిడ్ తొలివిడత టీకాలు వేసేందుకు అన్ని డివిజన్ కేంద్రాలలో మూడు రోజుల పాటు ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలు నిర్వహించాలని డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లను కోరారు. ఈ కేంద్రాలలో కేవలం 45 ఏళ్లు దాటిన ఉద్యోగులకు మాత్రమే టికాలు పంపిణీ చేయాలని, వారి కుటుంబ సబ్యులకు జూన్ మొదటి వారంలో మరో విడత పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు.  ఇందుకు అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల అధికారులు, అధిపతులు ఆదివారం ఉదయం 10 గం.లలోపు అర్హులైన ఉద్యోగుల వివరాలను vaccinationeg@gmail.com  మెయిల్ ఐడికి , లేదా హార్డు కాపీ కలెక్టరేట్ లోని కోవిడ్ విభాగానికి తప్పని సరిగా అందజేయాలని తెలిపారు.  ఆదివారం సాయంత్రం 6 గం.లలోపు శాఖలు, సంస్థలకు రెడ్ కలర్ కూపన్లు అందజేయడం జరుగుతుందని, శాఖాధికారుల ద్వారా కూపన్లు పొందిన ఉద్యోగులు తమ శాఖాపరమైన ఫొటో ఐడి కార్డు, ఆధార్ కార్డు లతో ఆయా డివిజన్ కేంద్రాల్లోని వ్యాక్సినేషన్ కేంద్రాలలో టికాలు పొందాలని తెలిపారు. కార్యాలయ పనులకు విఘాతం లేకుండా మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పంపిణీకి ఒక్కక్క రోజన ఆయా శాఖల నుండి మూడో వంతు ఉద్యోగులను మాత్రమే హాజర్యేట్లు చూడాలని సూచించారు.   హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ సర్వీస్ లకు సంబంధించి 45 ఏళ్లు లోపు ఉద్యోగులు కూడా ఈ ప్రత్యేక పంపిణీకి హాజరు కావచ్చనని తెలిపారు.  ఏ కారణం చేతననై  ఈ మూడు రోజుల్లో హాజరు కాలేక పోయిన వారు ఆందోళన చెందనవసరం లేదని, అటువంటి వారు తమ రెడ్ కూపన్లతో రిగ్యులర్ గా మంగళ, శుక్రవారాల్లో జరిగే పంపిణీలో టీకా వేయించుకోవచ్చుని తెలిపారు. ఈ ప్రత్యేక టీకాల పంపిణీకి అర్హులైన ఉద్యోగులను మాత్రమే ప్రతిపాదించాలని, ఆయా డివిజనల్ కేంద్రాల వద్ద ప్రతి శాఖ నుండి ఒక సమన్వయ అధికారిని మూడురోజుల పాటు నియమించాలని ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  తక్కవ వయసు వారు, ఉద్యోగులు కాని వారు వంటి  అనర్హులైన వారెవరైనా ఈ టీకాల పంపిణీకి హాజరైతే సంబంధిత అధికారులపై చర్య చేపడతామని స్పష్టం చేశారు.  ప్రభుత్వ శాఖలతో పాటు పోస్టల్, రైల్వేస్, ఎఫ్సిఐ, బ్యాంకులు, ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థలు, షాపులు, మాల్స్, మెడికల్ షాపులు, హొటళ్లు, రెస్టారెంట్లు, మేరేజి ఫంక్షన్ హాళ్ల తదితర సంస్థల ఉద్యోగులకు కూడా ఈ కేంద్రాలలో టీకాలు వేస్తారన్నారు.  అర్హులైన ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులు అందరూ ఈ ప్రత్యేక పంపిణీ సద్వినియోగం చేసుకునేలా చూడాలని అయా శాఖల, సంస్థల అధికారులను జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆర్) జి.లక్ష్మిశ, జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ (డబ్ల్యూ)  జి.రాజకుమారి, సబ్ కలెక్టర్లు, ఆర్డ్ఓలు, మున్సిపల్ కమీషనర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-22 15:39:17

యాష్ తుపాన్ ను ఎదుర్కోవడాని సన్నద్దం..

విజయనగరం జిల్లాలో యాష్ తుపాన్ ప్రభావం ఎదుర్కోవడానికి సన్నద్దంగా ఉన్నామని మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి చెప్పారు. తుపానుపై ముందస్తు చర్యలల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ తో వీడియో కాన్ఫరెన్సు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలో ఉన్న సముద్రతీర ప్రాంతాల్లోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని మత్స్యకారులను అప్రమత్తం చేయడానికి అన్ని మండలాల ఎఫ్ డీఓలకు సమాచారం అందించామన్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న గజఈతగాళ్ల సమాచారం కూడా సేకరించాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా మరబోట్లను కూడా సిద్ధం చేయాలని తమ క్రిందిస్థాయి సిబ్బందికి సూచించామన్నారు.  ఆస్తి, ప్రాణ నష్టం జగకుండా ఉండేలా మత్స్యకార సంఘాల ప్రతినిధులకు హెచ్చరికలు జారీచేశామన్నారు. గ్రామాల్లోని మత్స్యకార మిత్రల ద్వారా మత్స్యకారులకు కూడా తుఫాను పై అప్రమత్తంగా ఉండేలా చేయాలని సూచించామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీడియా ద్వారా ప్రజలకు చేరవేస్తున్నామన్నారు. జిల్లా, మండల కేంద్రాల్లోని కంట్రోల్ రూమ్ లకు అత్యవసర పరిస్థితుల సమాచారం అందించే విధంగా మత్స్యకారులను చైతన్యం చేస్తున్నామన్నారు.

Vizianagaram

2021-05-22 15:17:19

యాష్ తుఫానుపై అప్ర‌మ‌త్తంగా ఉండండి..

యాష్ తుఫానుపై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ‌ప్రాతిప‌దిక‌న‌ ముందస్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా త‌గిన జాగ్ర‌త్తలు వ‌హించాల‌ని సూచించారు. ప్రధానంగా లోత‌ట్టు, తీర ప్రాంతాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని చెప్పారు. యాష్ తుఫాను నేప‌థ్యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, వివిధ విభాగాలు చేపట్టాల్సిన చ‌ర్య‌లపై మార్గ‌నిర్దేశం చేసేందుకు శ‌నివారం సాయంత్రం ఆయ‌న జిల్లా స్థాయి అధికారుల‌తో జూమ్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ విభాగాల వారీగా తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై మార్గ‌నిర్దేశం చేశారు. 23వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు తుఫాను ప్ర‌భావం ఉంటుంద‌ని ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉండాల‌ని పేర్కొన్నారు. ముందుగా తీర ప్రాంతాల గ్రామ ప్ర‌జ‌ల‌ను, లోత‌ట్టు ప్రాంతాల్లో నివశించే వారిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌రలించాల‌ని రెవెన్యూ అధికారుల‌ను ఆదేశించారు. తుఫాను షెల్ట‌ర్‌ల ప‌రిస్థితిని స‌మీక్షించాల‌న్నారు. అలాగే గ‌జ ఈత‌గాళ్ల‌ను, మోటార్ బోట్ల‌ను అందుబాటులో ఉంచుకోవాల‌ని ఫిష‌రీస్ ఉప సంచాల‌కుల‌ను ఆదేశించారు. స్థానికంగా మండ‌ల కేంద్రాల్లో స‌హాయక కేంద్రాలను ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. అన్ని విభాగాధిపతులు ఆయా విభాగాల సిబ్బందిని అప్ర‌మ‌త్తం చేయాల‌ని ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. 

ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌చారం చేయ‌టం ద్వారా అప్ర‌మ‌త్తం చేయాల‌ని సూచించారు. న‌ష్టాల వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు జిల్లా కంట్రోల్ రూమ్‌కు తెలియ‌జేయాల‌ని, రైన్ ఫాల్ వివ‌రాల‌ను ముందుగా అంద‌జేయాల‌ని సీపీవో విజ‌య‌ల‌క్ష్మిని ఆదేశించారు. ఒడిశా ప్రాంత రైన్ ఫాల్ కూడా అంద‌జేయాల‌ని, దీని ద్వారా నాగావ‌ళి న‌ది ఉద్ధృతిని అంచనా వేసి ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చ‌ని పేర్కొన్నారు. పార్వ‌తీపురం స‌బ్ క‌లెక్ట‌ర్ నాగావ‌ళి ఉద్ధృతిని అంచ‌నా వేస్తూ త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. చెరువులు, ట్యాంకుల‌ను ముందుగా పరిశీలించి ఎలాంటి న‌ష్టం జ‌ర‌గకుండా జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని డ్వామా, సాగునీటి పారుద‌ల శాఖ అధికారుల‌ను ఆదేశించారు. అలాగే తుఫాను ప్ర‌భావం ఉండే ఈ నాలుగు రోజుల్లో నిత్య‌వ‌స‌ర స‌ర‌కుల పంపిణీకి ఇబ్బంది రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీఎస్‌వో పాపారావుకు చెప్పారు. 24 గంట‌ల్లో గ్రామీణ ప్రాంతాల‌కు స‌ర‌కుల‌ను త‌ర‌లించేయాల‌ని ఆదేశించారు. వైద్య ప‌ర‌మైన స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ముందుగానే అవ‌స‌ర‌మైన మందుల‌ను అందుబాటులో ఉంచుకోవాల‌ని, సిబ్బందిని స్థానికంగా ఉండేలా చూడాల‌ని డీఎం & హెచ్‌వో ర‌మ‌ణ కుమారిని ఆదేశించారు. ఆరోగ్య ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వ‌కుండా మున్సిపాలిటీ, డీపీవో, పంచాయ‌తీ రాజ్ అధికారులు త‌గిన శానిటేష‌న్ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని చెప్పారు. విద్యుత్ ప‌ర‌మైన స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ముందస్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఈపీడీసీఎల్ ఎస్ఈని ఆదేశించారు. పంట న‌ష్టం జ‌ర‌గ‌కుండా స్థానిక ఆర్బీకేల ద్వారా రైతుల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని, పంట‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించుకొనేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వ్య‌వ‌సాయ శాఖ జేడీకి సూచించారు. తాగునీటికి ఇబ్బందులు రాకుండా గ్రామీణ తాగునీటి పారుద‌ల అధికారులు త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. హామ్ రేడియోల‌ను సిద్ధం చేయాల‌ని డీపీఎంకి సూచించారు. ఆర్టీసీ, అగ్నిమాప‌క త‌దిత‌ర శాఖ‌లు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఆస్తి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని చెప్పారు. త‌హిశీల్దార్ల ఆధ్వ‌ర్యంలో మండ‌లాల వారీగా న‌ష్టాల వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు జిల్లా కేంద్రానికి అంద‌జేయాల‌ని సూచించారు. అనంతరం ఒక్కో విభాగ అధికారి వారు తీసుకొనే చ‌ర్య‌ల‌ను వివ‌రించారు.

ఆక్సీజ‌న్ త‌ర‌లింపులో ఇబ్బంది రానివ్వ‌కండి

క‌రోనా రోగుల‌కు ఆక్సీజ‌న్ను త‌ర‌లిస్తున్న వాహనాల రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు రాకుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఎక్క‌డైనా చెట్లు కూలి లేదా ఇత‌ర కారణాల వ‌ల్ల ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డినా.. రాక‌పోక‌లు నిలిచిపోయినా స్థానిక పోలీసు, ఇత‌ర విభాగాల అధికారుల సాయంతో ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల‌ని చెప్పారు. స్థానికంగా రెవెన్యూ అధికారుల ప‌రిధిలో జేసీబీల‌ను, ఇత‌ర స‌హాయక సామ‌గ్రిని అందుబాటులో ఉంచుకోవాల‌ని సూచించారు. ఫైర్ విభాగ అధికారులు రోప్‌ల‌ను, సిబ్బందిని అందుబాటులో ఉంచాల‌ని చెప్పారు.

పున‌రావాస కేంద్రాల్లో ఏర్పాట్లు చేయండి

తుఫాను ప్ర‌భావం అయిన గ్రామాల ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌క్ష‌ణ‌మే త‌ర‌లించేందుకు త‌గిన విధంగా ముందుగానే సిద్దంగా ఉండాల‌ని చెప్పారు. స్థానికంగా ఉండే స‌చివాల‌య సిబ్బందిని వినియోగించుకోవాల‌ని ఆయా విభాగాల అధికారుల‌కు సూచించారు. పాఠ‌శాల‌లు, ఇత‌ర భ‌వనాల‌ను పున‌రావాస కేంద్రాలుగా సిద్ధం చేయాల‌న్నారు. అలాగే వ‌స‌తుల‌ను స‌మ‌కూర్చాల‌ని సూచించారు. ఆహారం, తాగునీరు త‌దిత‌ర స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని ఆదేశించారు. 


స‌మావేశంలో జేసీలు కిశోర్ కుమార్‌, మ‌హేష్ కుమార్‌, వెంక‌ట‌రావు, పార్వ‌తీపురం స‌బ్‌క‌లెక్ట‌ర్ విధేహ్ ఖ‌రే, పీవో కూర్మ‌నాథ్‌, డీఆర్వో గ‌ణ‌ప‌తిరావు, ఆర్డీవో భవానీ శంక‌ర్‌, సీపీవో విజ‌య‌ల‌క్ష్మి, ఈపీడీసీఎల్ ఎస్ఈ విష్ణు, ఆర్‌.డ‌బ్ల్యూ.ఎస్‌. ఎస్ఈ ర‌వికుమార్‌, ఫిష‌రీస్ డీడీ నిర్మలా కుమారి, వ్య‌వ‌సాయ శాఖ జేడీ ఆశాదేవి, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ వ‌ర్మ‌, డీఎస్‌వో పాపారావు, హార్టిక‌ల్చ‌ర్ డీడీ శ్రీ‌నివాస‌రావు, త‌హిశీల్దార్లు, ఇత‌ర అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-05-22 14:47:55

కలెక్టరేట్ లో తుపాన్ కంట్రోల్ రూమ్..

విశాఖలోని బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వలన ఏర్పడే తుఫాన్, తీవ్ర గాలులు వీచే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. ఒక ప్రకటనలో తెలియజేశారు. తుపాను వలన జరిగిన నష్టాలను పేర్కొన్న కంట్రోల్్ రూమ్ కి సమాచారం ఇవ్వడం ద్వారా రెవిన్యూ అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవడానికి వీలుపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాల్లోని తహశీల్దార్లను తుపాను ద్రుష్ట్యా అప్రమత్తం చేసినట్టు కలెక్టర ఆ ప్రకటనలో వివరించారు. అత్యవసర సమయంలో ప్రజలు కంట్రోల్ రూం నెంబర్లు 0891-2590102, 0891-2590100 లో సంప్రదించాలన్నారు.

Visakhapatnam

2021-05-22 14:39:18

జీవిఎంసీలో తుపాన్ కాల్ సెంటర్..

విశాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వలన ఏర్పడే తుఫాన్, తీవ్ర గాలులు వీచే అవకాశం ఉన్నందున జివిఎంసి అప్రమత్తం అయిందని జివిఎంసి  మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాన్ వలన చెట్లు, కొమ్మలు విరిగిపడ్డా, గెడ్డలు పొంగి రహదారిపైకి ఇళ్ళలోనికి నీరు చేరి ఇబ్బందులు తలెత్తితే  కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నంబరు 1800 4250 0009 లేదా 0891-2869100 సమాచారాన్ని అందజేయాలని ఆమె కోరారు. జివిఎంసి సిబ్బంది ఎల్ల వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడానికి సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు.  24 గంటలు సమస్యలు తీసుకోవడం కోసం జివిఎంసి ప్రత్యేకంగా కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్టు ఆ ప్రకటనలో వివరించారు..

విశాఖ సిటీ

2021-05-22 14:31:20

కోవిడ్ నియంత్రణ సహాయం రూ.50.5లక్షలు..

కోవిడ్ నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌తో పాటు బాధితుల‌కు వైద్య‌, ఇత‌ర సేవ‌లు అందించేందుకు జిల్లా యంత్రాంగం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు తూర్పుగోదావ‌రి సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్ అసోసియేష‌న్ చేయూత నందించింది. శ‌నివారం అసోసియేష‌న్ ప్ర‌తినిధులు యార్ల‌గ‌డ్డ వీర్రాజు, దాట్ల దిలీప్‌, ద్వారంపూడి వీర‌భ‌ద్ర‌రెడ్డి.. రూ.50,50,000 చెక్కును కాకినాడ అర్బ‌న్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి సమక్షంలో  క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డికి అంద‌జేశారు. రెండో ద‌శ కోవిడ్ ఉద్ధృతి నేప‌థ్యంలో సామాజిక బాధ్య‌త‌గా కోవిడ్ స‌హాయ నిధికి విరాళం అందించిన జిల్లా సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్ అసోసియేష‌న్‌కు క‌లెక్ట‌ర్‌, శాస‌న‌స‌భ్యులు అభినంద‌న‌లు తెలిపారు. జిల్లా ప్ర‌జ‌ల త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. కోవిడ్ విప‌త్తును ఎదుర్కోవ‌డంలో వివిధ కార్పొరేట్‌, వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌లు భాగ‌స్వాములు అవుతున్నాయ‌ని, ఇదే స్ఫూర్తితో మ‌రిన్ని సంస్థ‌లు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో జిల్లా మ‌త్స్యశాఖ జేడీ పీవీ స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-22 14:23:18