1 ENS Live Breaking News

ఇంజనీరింగ్ పనులు నాణ్యతతో చేపట్టాలి..

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధి చేపట్టిన ఇంజనీరింగ్ పనులను నాణ్యతలో రాజీలేకుండా చేపట్టాలని కమిషనర్ డా.స్రిజన అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని రెండవ జోన్ లోని 7వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మిదిలాపురి ఉడా కోలనీ లో రూ. 78.00 లక్షల తో నూతనంగా నిర్మించదలచిన డ్రైనేజి పనులను కూడా పరిశీలించి వాటికి అంగీకారం తెలిపారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేసి నివేదికలు సమర్పించాలన్నారు. ఆ తరువాత స్థానిక ప్రజలతో మాట్లాడారు.  రోడ్లను, కాలువలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పారిశుధ్య సిబ్బందికి తడి – పొడి చెత్తను వేరు వేరుగాచేసి ఇవ్వాన్న కమిషనర్ కాలువలలో చెత్త వేయరాదని సూచించారు. ఈ పర్యటనలో పర్యవేక్షక ఇంజినీరు శ్యాంసన్ రాజు, రెండవ జోన్ జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, 7వ వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ, కార్యనిర్వాహక ఇంజినీరు శంకర్, సహాయక ఇంజినీరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.      

విశాఖ సిటీ

2021-05-22 13:23:17

రేపు విశాఖలో మాంసం అమ్మకాలు నిషేధం..

కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్న ద్రుష్ట్యా  మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఆదివారం మాంసం, చేపలు, రొయ్యలు  అమ్మకాలు నిషేధిస్తున్నాట్టు జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ప్రకటించారు. అధికంగా మాంసం దుకాణాల దగ్గర జనం అత్యధికంగా గుమిగూడుతున్నట్టు తమ ద్రుష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.  కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం  కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించినప్పటికీ ప్రజలు గుంపులు గుంపులుగా దుకాణాల వద్ద చేరడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. ఇకపై కర్ఫ్యూ సమయంలో ఎవరు బయట తిరిగినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ప్రజల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకొని, కోరనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు కమిషనర్ వివరించారు.

విశాఖసిటీ

2021-05-22 13:21:38

వేక్సిన్ లేదనే మాట రావడానికి వీల్లేదు..

మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని అర్భన్ పీహెచ్సీల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందరికీ కోవిడ్ వేక్సినేషన్ చేయాలని జివిఎంసీ కమిషనర్ డా.స్రిజన, మేయర్ గొలగాని హరి వెంకట కుమారిలు స్పష్టం చేశారు. శనివారం నగరంలోని 8వ జోన్ పరిధిలో 95, 96వ వార్డుల్లోని అర్బన్  ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాక్సినేషన్ వేయించుకొనుటకు వచ్చిన ప్రతీ ఒక్కరికి రెండవ డోస్ వేయాలని సూచించారు. వ్యాక్సిన్ లేదని తిరిగి వెళ్ళ కూడదన్న వారు కొవీషీల్డ్ 84 రోజుల పైబడిన వారికి, కోవేక్షిన్ 28 రోజుల పైబడిన వారికి వేయాలని సూచించారు. వ్యాక్సినేషన్ ఉదయం 7.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు శనివారం నుంచి   తేది.25.05.2021వ తేది వరకు నగరంలో ప్రతి అర్బన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వేక్సినేషన్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ప్రస్తుతం రెండవ డోస్ మాత్రమె వేస్తున్నామన్న వీరు జూన్ మొదటి వారంలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ మొదలు పెడతామని చెప్పారు.  మొదటి డోస్ ఏ వ్యాక్సినేషన్ కేంద్రాలలో ఇవ్వడం లేదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. వ్యాక్సినేషన్ సెంటర్లు రద్దీ దృష్ట్యా భౌతిక దూరం పాటిస్తూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, మాస్కులు ధరించాలని, చేతులను శుభ్రంగా కడుగుకోవాలని సూచించారు. గోపాలపట్నం అర్బన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని, ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయించాలని ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రిని ఆదేశించారు. ఈ పర్యటనలో8వ జోనల్ కమిషనర్ చక్రవర్తి, ఎఎంఒహెచ్ లక్ష్మి తులసి, వై.సి.పి. నాయకులు బెహర భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.        

విశాఖ సిటీ

2021-05-22 13:19:06

కరోనా నియంత్రణకు మూడంచెల విధానం..

విజయనగరం జిల్లాలో క‌రోనా క‌ట్ట‌డి చేసే ల‌క్ష్యంతో,  వ్యాధి నివార‌ణ‌, చికిత్స‌, నియంత్ర‌ణా కార్య‌క్ర‌మాల‌కు వేర్వేరుగా వ్యూహాల‌ను రూపొందించి అమ‌లు చేస్తున్నామ‌ని జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ అన్నారు. శనివారం ఈ మేరకు జిల్లా అధికారులు, మీడియాతో జూమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వ్యాధి సోక‌కుండా నివారించుకోవ‌డ‌మే అత్యుత్త‌మ‌ మార్గ‌మ‌ని, దీనికోసం ప్ర‌జ‌ల్లో విస్తృత‌మైన అవ‌గాహ‌న క‌ల్పించే చ‌ర్య‌ల‌ను చేప‌ట్టామ‌న్నారు. మాస్కుల‌ను త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించ‌డం, భౌతిక దూరాన్ని పాటించ‌డం, త‌రచూ చేతుల‌ను శుభ్రం చేసుకోవ‌డం ద్వారా వ్యాధి సోక‌కుండా అడ్డుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు. అవ‌గాహ‌న పెంపొందించ‌డంతోపాటుగా, మ‌రోవైపు వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ముమ్మరం చేసిన‌ట్లు చెప్పారు. జిల్లాలో 63 కేంద్రాల్లో వేక్సినేష‌న్ జ‌రుగుతోంద‌ని, జిల్లా అవ‌స‌రాల‌కు త‌గినంత వేక్సిన్ కూడా స్టాకు ఉంద‌ని తెలిపారు.  

మూడు ర‌కాలుగా చికిత్స‌
            వ్యాధి సోకిన‌వారికి చికిత్స‌ను అందించేందుకు మూడు ప‌ద్ద‌తుల‌ను పాటిస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. అత్య‌ధిక శాతం మంది హోమ్ ఐసోలేష‌న్‌లోనే ఉండి చికిత్స పొందుతూ, సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా మారుతున్నార‌ని అన్నారు. ప్ర‌స్తుతం జిల్లాలో 8,659 ఏక్టివ్ కేసులు ఉండ‌గా, వీరిలో 7,270 మంది హోమ్ ఐసోలేష‌న్‌లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నార‌ని చెప్పారు. వీరంద‌రికీ కోవిడ్ కిట్ల‌ను అంద‌జేస్తున్నామ‌ని, 96శాతం మందికి కిట్ల‌ను పంపిణీ చేయ‌డం ద్వారా, రాష్ట్రంలోనే ప్ర‌థ‌మ స్థానంలో నిలిచామ‌ని చెప్పారు. ఇళ్ల‌లో విడిగా, ఏకాంతంగా ఉండ‌టానికి అవ‌కాశం లేని వారికోసం, జిల్లాలో ఏడు చోట్ల కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. వీటిల్లో మంచి భోజ‌న వ‌స‌తుల‌తోపాటు, ఆక్సీజ‌న్ స‌దుపాయాన్ని కూడా క‌ల్పించామ‌ని, మొత్తం 3,700 ప‌డ‌క‌ల‌కు గానూ, ప్ర‌స్తుతం 375 మంది చికిత్స పొందుతున్నార‌ని చెప్పారు. అలాగే కోవిడ్ వ్యాధిగ్ర‌స్తుల‌కు చికిత్స‌ను అందించేందుకు జిల్లా వ్యాప్తంగా 27 కోవిడ్ ఆసుపత్రుల‌ను ఏర్పాటు చేశామ‌ని, వీటిల్లో 2001 ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని తెలిపారు. ఈ ప‌డ‌క‌ల్లో 208 వెంటిలేట‌ర్లు, 496 ప‌డ‌క‌ల‌కు ఆక్సీజ‌న్ స‌దుపాయం ఉంద‌న్నారు. వ్యాధిగ్ర‌స్తుల‌కు చికిత్స‌ను అందించేందుకు కావాల్సిన‌ మౌలిక వ‌స‌తుల‌ను ఏర్పాటు చేయ‌డంతోపాటు, 1014 మంది వైద్యులు, స‌రిపడినంత మంది న‌ర్సులు, సాంకేతిక సిబ్బందిని కూడా నియ‌మించామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం జిల్లాలో సుమారు 2017 రెమిడిసివిర్ ఇంజ‌క్ష‌న్లు, అవ‌స‌రాల‌కు స‌రిప‌డా పిపిఇ కిట్లు, మందులు, మాస్కులు, శానిటైజ‌ర్లు కూడా ఉన్నాయ‌ని చెప్పారు. అర్హులైన‌వారంద‌రికీ ఆరోగ్య‌శ్రీ ద్వారా కోవిడ్‌కు ఉచిత‌ వైద్యాన్ని అందిస్తున్నామ‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 77 శాతం మంది ఆరోగ్య‌శ్రీ‌ని వినియోగించుకున్నార‌ని, ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేయ‌డంలో కూడా మ‌న జిల్లా రాష్ట్రంలో మొద‌టి స్థానంలో ఉంద‌ని చెప్పారు.

స‌రిప‌డినంత‌గా ఆక్సీజ‌న్
          మొద‌టి ద‌శ‌తో పోలిస్తే, క‌రోనా రెండోద‌శ తీవ్రంగా ఉంద‌న్నారు.  ఎక్కువ‌మంది యువ‌కులు కూడా ఈ వ్యాధి బారిన ప‌డుతున్నార‌ని చెప్పారు. చికిత్స‌లో ఆక్సీజ‌న్ అవ‌స‌రం కూడా ఎక్కువ‌య్యింద‌న్నారు.  జిల్లాలో ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు త‌గినంత ఆక్సీజ‌న్ కూడా అందుబాటులో ఉంద‌న్నారు. జిల్లాలో రోజుకు సుమారుగా 8.7 మెట్రిక్ ట‌న్నుల ఆక్సీజ‌న్‌ను వినియోగిస్తున్నామ‌న్నారు. దీనిని విశాఖ‌ప‌ట్నం, శ్రీ‌కాకుళం జిల్లాల‌నుంచి తెప్పిస్తున్నామ‌ని, నిల్వ చేసేందుకు ఇటీవ‌లే జిల్లా కేంద్రాసుప‌త్రిలో 10 కిలోలీట‌ర్ల ఆక్సీజ‌న్ ట్యాంకును ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. పార్వ‌తీపురం ఏరియా ఆసుప‌త్రిలో కూడా 6 కెఎల్ ట్యాంకును ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. ఇటీవ‌లే బొబ్బిలి ఆసుప‌త్రిలో ఆక్సీజ‌న్ ప‌డ‌క‌ల‌ను 6 నుంచి 10కి పెంచామ‌న్నారు. అవ‌స‌ర‌మైన చోట ఆక్సీజ‌న్ కాన్‌సెంటేట‌ర్ల‌ను అందిస్తున్నామ‌న్నారు. త్వ‌ర‌లో జిల్లాలో ఆక్సీజ‌న్ ప‌డ‌క‌ల సంఖ్య‌ను గ‌ణ‌నీయంగా పెంచేందుకు కృషి చేస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. కోవిడ్ చికిత్స‌కు నిధులుకు కూడా కొర‌త లేద‌ని, ప్ర‌భుత్వం జిల్లాకు సుమారు రూ.14.65కోట్లు కేటాయించ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు రూ.4.5కోట్లు వ‌ర‌కూ ఖ‌ర్చు చేశామ‌న్నారు. త్వ‌ర‌లో జిల్లా కేంద్రాసుప‌త్రిలో జ‌ర్మ‌న్ హేంగ‌ర్ ప‌ద్ద‌తిలో 100 ప‌డ‌క‌ల‌తో ట్ర‌యాజ్‌ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు.

కంటైన్‌మెంట్ స్ట్రాట‌జీ
            కోవిడ్ వ్యాధి ఒక‌రినుంచి మ‌రొక‌రికి వ్యాప్తి చెంద‌కుండా, క‌ట్టుధిట్ట‌మైన నియంత్ర‌ణా చ‌ర్య‌ల‌ను చేప‌ట్టామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. వ్యాధి ఎక్కువ‌గా ఉన్న‌చోట కంటైన్‌మెంట్ జోన్ల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. క‌రోనా క‌ట్ట‌డికి ఆయా గ్రామ స‌ర్పంచ్‌ల ఆధ్వ‌ర్యంలో గ్రామ స్థాయి క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 778 స‌చివాల‌యాలు ఉన్నాయ‌ని, ప్ర‌స్తుతం 25 స‌చివాల‌యాల ప‌రిధిలోని 143  గ్రామాలు, ఒక్క కోవిడ్ కేసు కూడా లేకుండా గ్రీన్‌జోన్‌లో ఉన్నాయ‌న్నారు.  వీటిని అలాగే ఉంచేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని చెప్పారు. ఆరెంజ్ జోన్‌లో,  1 నుంచి 10 కేసులు మ‌ధ్య న‌మోదైన స‌చివాల‌యాలు 426, 11-20 కేసులు న‌మోదైన స‌చివాల‌యాలు 199 ఉన్నాయ‌ని, ఈ గ్రామాల‌ను 21 రోజుల్లో గ్రీన్‌జోన్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. రెడ్ జోన్‌లో ఉన్న స‌చివాల‌యాల్లో 31 నుంచి 40 మ‌ధ్య కేసులు ఉన్న‌వి 220, 41-50 మ‌ధ్య కేసులు ఉన్న‌వి 12, 51-100 కేసులు ఉన్న‌వి 11, వంద‌కు పైబ‌డి కేసులు ఉన్న స‌చివాల‌యం ఒక‌టి ఉన్న‌ద‌ని క‌లెక్ట‌ర్ వివ‌రించారు. రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌కు, ఆరెంజ్ నుంచి గ్రీన్ జోన్‌కు మార్చేందుకు అవ‌స‌ర‌మైన స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ను రూపొందించిన‌ట్లు చెప్పారు.

ధైర్యంతో ఎదుర్కోవాలి
            వ్యాధి సోకిన‌ప్పుడు ధైర్యంగా ఉంటే, త్వ‌ర‌గా కోలుకొనే అవ‌కాశం ఉంద‌న్నారు. జిల్లాలో మ‌ర‌ణాలు రేటు మొద‌టి ద‌శ‌తో పోలిస్తే, స్వ‌ల్పంగా పెరిగిన‌ప్ప‌టికీ, త‌క్కువ‌గానే ఉంద‌ని చెప్పారు. తొలిద‌శ‌లో 0.7శాతం మ‌ర‌ణాలు న‌మోద‌వ్వ‌గా, రెండో విడ‌త 1.02శాతం ఉన్నాయ‌ని అన్నారు. వైద్యులు చెప్పిన జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తూ, ఇంట్లో ఉండి కూడా వ్యాధినుంచి విముక్తి పొంద‌వ‌చ్చ‌ని  సూచించారు. వ్యాధిని ఎంత త్వ‌ర‌గా గుర్తిస్తే, అంత త్వ‌ర‌గా న‌యం చేయ‌డానికి వీల‌వుతుంద‌న్నారు. దీనికోసమే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఫీవ‌ర్ స‌ర్వే నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. ఎవ‌రికైనా జ్వ‌రం ఉంటే, దాయ‌డానికి ప్ర‌య‌త్నించ‌వ‌ద్ద‌ని, దానివ‌ల్ల న‌ష్ట‌మే ఎక్కువ‌గా జ‌రుగుతుంద‌న్నారు. నూన్య‌తాభావాన్ని విడ‌నాడి, స్వ‌చ్ఛందంగా ప‌రీక్ష‌ల‌ను చేయించుకోవాల‌ని,  చికిత్స చేయించుకోవ‌డానికి ధైర్యంగా ముందుకు రావాల‌ని సూచించారు. ప్ర‌యివేటు ఆసుప‌త్రులు అక్ర‌మాల‌కు పాల్ప‌డితే, క‌ఠిన చ‌ర్య‌ల‌ను తీసుకుంటామ‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. దీనికోసం ప‌టిష్ట‌మైన నిఘావ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశామ‌ని,  ఫ్ల‌యింగ్ స్క్వాడ్స్తో పాటు, త‌ర‌చూ విజిలెన్స్ త‌నిఖీలు కూడా జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. ఇటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌తీఒక్క‌రూ సేవాభావంతో వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. జిల్లాలో బ్లాక్ ఫంగ‌స్ కేసులు ఇంత‌వ‌ర‌కూ న‌మోదు కాలేద‌ని, దానికి కూడా అవ‌స‌ర‌మైన మందులు, ప్ర‌త్యేక విభాగాన్ని సిద్దం చేశామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.

ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాలి ః ఎస్‌పి రాజ‌కుమారి
           జిల్లాలో కోవిడ్ నియంత్ర‌ణ‌కు ప్ర‌జ‌లనుం పూర్తి స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని జిల్లా ఎస్‌పి బి.రాజ‌కుమారి అన్నారు. ప్ర‌జ‌ల్లో ఈ వ్యాధి ప‌ట్ల విస్తృత‌మైన అవ‌గాహ‌న క‌ల్పించేందుకు పోలీసు శాఖ త‌ర‌పున 5 ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేశామ‌ని, విజ‌య‌న‌గ‌రంలో రెండు, సాలురు, బొబ్బిలి, పార్వ‌తీపురం ఒక్కొక్క‌టి చొప్పున ప‌నిచేస్తున్నాయ‌ని చెప్పారు. వ్యాధి నియంత్ర‌ణ‌కు 92 కంటైన్‌మెంట్ జోన్ల‌ను ఏర్పాటు చేసి, రాక‌పోక‌ల‌ను నియంత్రించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. అలాగే  జిల్లా వ్యాప్తంగా 12 చెక్‌పోస్టుల‌ను పెట్టామ‌ని, ఉద‌యం 12 గంట‌లు త‌రువాత‌, అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు మాత్ర‌మే అనుమ‌తినిస్తున్నామని చెప్పారు. ఇవి కాకుండా ప్ర‌జ‌లు క‌ర్ఫ్యూ స‌మ‌యంలో విచ్చ‌ల‌విడిగా తిర‌గ‌కుండా 13 చోట్ల వాహ‌న త‌నిఖీ కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. 41 పెట్రోలింగ్ పార్టీల ద్వారా, 24 గంట‌లూ పోలీసు ప‌హారా ఏర్పాటు చేసి, ఇప్ప‌టివ‌ర‌కూ 279 కేసుల‌ను న‌మోదు చేశామ‌న్నారు. క‌ర్ఫ్యూ ఉల్లంఘ‌న‌కు సంబంధించి 2,108 మందికి చ‌లానా వేశామ‌ని, 34 వాహ‌నాల‌ను, 207 షాపుల‌ను సీజ్ చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఇంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా కొంద‌రు మాస్కుల‌ను ధ‌రించ‌క‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు. ఇలాంటి 1,24,488 మందికి జ‌రిమానా విధించిన‌ట్లు తెలిపారు. జిల్లాలో గానీ, ఇత‌ర జిల్లాల‌కు గానీ క‌ర్ఫ్యూ స‌మ‌యంలో ఎవ‌రైనా ప్ర‌యాణం చేయాలంటే, త‌ప్ప‌నిస‌రిగా ఇ-పాస్ పొందాల‌ని సూచించారు.  క‌రోనా వ్యాధిని క‌ట్ట‌డి చేయాంటే, ప్ర‌జ‌లు పూర్తిగా స‌హ‌క‌రించి, ఇళ్ల‌లోనే ఉండాల‌ని ఎస్‌పి రాజ‌కుమారి కోరారు.

             ఈ ప్రెస్‌మీట్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్లు డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌, డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌, జె.వెంక‌ట‌రావు, స‌బ్ క‌లెక్ట‌ర్ విదేహ్ ఖ‌రే, ఐటిడిఏ పిఓ ఆర్‌.కూర్మ‌నాధ్‌, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, స‌మాచార‌, పౌర సంబంధాల‌శాఖ ఎడి డి.ర‌మేష్‌, వివిధ ప‌త్రిక‌లు, ఛాన‌ళ్ల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Vizianagaram Collectorate

2021-05-22 12:49:05

ఇలాగేనా ప్రజలకు సేవలు చేయడం..

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయాల సిబ్బందికి ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలి తప్పితే గైర్హాజరు దోరణితో పనిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ గొలగాని హరివెంకట కుమారి హెచ్చరించారు. శనివారం నగరంలోని నాలుగవ జోన్ పరిధిలో 38, 39వ వార్డులలోని పలు సచివాలయాలను మేయర్  ఆకస్మికంగా తనిఖీ చేసారు. స్థానిక ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మేయర్ వెలంపేట-1, వేలంపేట-3, అంబుస్వరంగా వీధిలోని వార్డు సచివాలయాలను సందర్శించి హాజరు పట్టికను, మూమెంట్ రిజిస్టర్ ను పరిశీలించారు. ప్రజలు పెట్టుకున్న ఆర్జీల రిజిస్టర్ ను తనిఖీ చేసి వాటి నిర్వాహణ సరిగా లేదని, చాల వరకు ఆర్జీలు పెండింగులో ఉన్నాయని వాటిని సరిగా నిర్వహించకపోతే తగు చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు. కొంతమంది వార్డు కార్యదర్శులు విధులకు హాజఋ కాకపోవడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు అన్ని సేవలు అందాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టారని, పేద ప్రజలకు అందవలసిన అన్ని సంక్షేమ పధకాలు వారికి సకాలంలో చేరాలని మేయర్ కార్యదర్సులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాలుగవ జోన్ జోనల్ కమిషనర్ ఫణిరాం, సూపరింటెండెంట్  బాబురావు, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.      

Visakhapatnam

2021-05-22 12:09:30

హౌసింగ్ స్కీమ్ పనులు 90శాతం పూర్తి..

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పేదలందరికీ ఇళ్లు(హౌసింగ్) పథకం పనులను సత్వరమే పూర్తిచేయాలని చీపురుపల్లి మండల ప్రత్యేక అధికారిణి ఎన్.నిర్మలకుమారి  అధికారులను ఆదేశించారు. శనివారం చీపురుపల్లి మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రామక్రిష్ణరాజు , ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విజయనగరం జిల్లాలో చీపురుపల్లి మండలం హౌసింగ్ లో తొలి స్థానంలో నిలిపేందుకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్రుషిచేయాలన్నారు. మండలంలోని 16లేవుట్లలో ప్రతీ లేవుట్ కి రెండు ఇళ్లు చొప్పు 32 మోడల్ ఇళ్లను నెలాఖరు నాటికి ప్రారంభించాలని సూచించారు. 1612 మంది లబ్దిదారులకు సంబంధించిన ఇళ్లు మ్యాపింగ్ నూరుశాతం పూర్తిచేశామన్న ఆమె 1605 ఇళ్లకి జియోట్యాగింగ్ పూర్తికాగా,  1481 జాబ్ కార్డులను పంపిణీ చేసినట్టు వివరించారు.  1596 ఇళ్లకి రిజిస్ట్రేషన్లు కూడా పూర్తిచేశామన్నారు.  165 ఇళ్లకు గ్రౌండింగ్ పూర్తయిందని వివరించారు. త్వరలోనే హౌసింగ్ పనులు ప్రారంభిస్తారని అన్నారు.  లబ్దిదారులను సంప్రదించి మిగిలిఉన్న పనులు పూర్తిచేలని ప్రత్యేక అధికారి ఎన్.నిర్మలకుమారి కోరారు. కార్యక్రమంలో మడలంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Cheepurupalli

2021-05-22 09:40:08

అప్పన్న అన్నధాన పథకానికి భారీ విరాళం..

విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న) వారి దేవస్థానం శాశ్వత అన్నప్రసాద పథకానికి విశాఖ మాధవధారకు చెందిన ధవళ వెంకట రమణ కుటుంబ సభ్యులు రూ.1,11,111 (లక్షా పదకొండు వేల పదకొండు వందల పదకొండు రూపాయలు)  విరాళంగా ఇచ్చారు. ఈ చెక్కును దేవస్థానం అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, స్వామివారి అన్నప్రసాదం ప్రతీ భక్తుడికీ చేరాలనే ఉద్దేశ్యంతో తమవంతుగా ఈ విరాళం సమర్పించినట్టు చెప్పారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

Simhachalam

2021-05-22 08:54:02

ఈరోజు అరగదీత చందనం 32 కిలోలు..

విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)కు శనివారం 32 కిలోలు చందనం అరగదీత ద్వారా సమకూరినట్టు దేవస్థానం ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. ఈ సందర్భంగా  దేవస్థానంలో మీడియాతో మాట్లాడుతూ, స్వామివారికి 26వ తేదీన రెండవ విడత చందనాన్ని సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు వివరించారు. అరగదీసిన చందనంతోపాటు, సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేశామన్నారు. స్వామికి ఎవరైనా భక్తులు చందనం సమర్పించాలనుకుంటే దేవస్థాన అధికారులను సందప్రదించాలన్నారు.  చందన సమర్పణ, గోత్ర నామాల పూజలు  మూడు, నాలుగో దఫాలుగా చందన సమర్పణలు కూడా కొనసాగుతాయన్నారు. దాతలు ఎంతైనా స్వామివారికి చందనం సమర్పించుకోవచ్చుని చెప్పారు.  ఆన్ లైన్ పూజలు, అర్చనల్లో  భాగస్వాములు కావాలనుకునే భక్తులు  దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-22 08:49:44

ఐసోలేషన్ కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి..

గ్రామ స్థాయిలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ మండల అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వసతి సౌకర్యాలు మేరకు పాఠశాలలు, కళాశాలలలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో చిన్న గదుల్లో అందరు కుటుంబ సభ్యులు ఉండటం వలన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నప్పటికీ వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉంటుందని అన్నారు. అటువంటి వారిని గ్రామ ఐసోలేషన్ కేంద్రాల్లో పెట్టాలని ఆయన సూచించారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తులు బహిరంగ మలవిసర్జన వంటి కార్యక్రమాలకు బయటకు వస్తున్నట్లు సమాచారం ఉందని, గ్రామ ఐసోలేషన్ కేంద్రాల్లో పెట్టడం వలన అటువంటి సమస్య పరిష్కారం అవుతుందని ఆయన చెప్పారు. బయట తిరగటం వలన ఇతరులకు కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. గ్రామ స్థాయిలో కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పటిష్టమైన చర్యలు అవసరమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సర్పంచ్ అధ్యక్షతన గల గ్రామ స్థాయి యాజమాన్య కమిటీ అన్ని చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. గ్రామాల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచుగా శుభ్రపరచుకోవడం అనే ప్రాథమిక అంశాలపై ఎక్కువగా అవగాహన ఉండాలని ఆయన వివరించారు. మాస్కు రక్షణ కవచంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. దీనిపై గ్రామస్థాయి కమిటీ పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలని, పలు కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ఎటువంటి రాజీలేని ధోరణిలో వ్యవహరించాలని కలెక్టర్ పేర్కొంటూ పారిశుద్ధ్య కమిటీ నిధులు లభ్యంగా ఉంటాయని ఆయన చెప్పారు. ఉపాధి హామీ పనులకు పాజిటివ్ వ్యక్తులు హాజరు కాకుండా చూడాలని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాలపై తగు దృష్టి కేంద్రీకరించాలని, కరోనా వ్యాప్తి నివారణకు అన్ని పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.   ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే.శ్రీనివాసులు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, జిల్లా అధికారులు, తహశీల్దార్లు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-22 07:11:10

రేపటి నుంచి 2వ డోసు వేక్సినేషన్..

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో కోవేక్షిన్(Covaxin) 15000 సెకండ్ డోస్ లు, 7000 కోవిషీల్డ్ (Covisheild)2వ డోస్ లు వేయించుకోవలసినవారు  మొత్తంగా 23000 మంది ఉన్నారని, ఈ సెకండ్ డోస్ వేయించుకోవలసినవారి కొరకు జివిఎంసి కమీషనర్ డా. జి. సృజన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మే 22 నుంచి 25 వరకు ఉదయం 7 గంటలు నుంచి మధ్యాహ్నం 12 గంటలు వరకు ప్రత్యేకంగా(డ్రైవ్) నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దానికోసం జివిఎంసీ వార్డుల్లోని అర్బన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మ్యాపింగ్ చేసినట్టు వివరించారు. ఈ క్రింది కొవిడ్ వ్యాకినేషన్ కేంద్రలలో కోవిషీల్డ్ 84 రోజులు పైబడిన వారు, కోవేక్షిన్ 28 రోజులు పైబడిన వారు మాత్రమే వ్యాకినేషన్ చేయించుకోవాలన్నారు. మొదటి డోస్ వ్యాకినేషన్  జూన్ మొదటి వారంలో మొదలు అవుతుందని చెప్పారు. ఈ క్రింది పేర్కొన్న వార్డ్స్ లో టోకెన్ల ప్రకారం కేంద్రానికి  వెళ్లి సెకండ్ డోస్ వ్యాకినేషన్ వేయించుకోవాలన్నారు. వ్యాకినేషన్ కేంద్రానికి వెళ్ళినప్పుడు  ఆదార్ కార్డు కానీ మరి ఏ ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డు తో పాటు జివిఎంసీ SMS కూడా చూపించి కోవిడ్ వేక్సిన్ వేయించుకోవాలని కమిషనర్ కోరారు..

GVMC office

2021-05-21 14:51:47

విశాఖలో కోవిడ్ రోగులకు మరో 30 పడకలు..

విశాఖలోని రాణి చంద్రమణిదేవి ఆసుపత్రిలో 30 పడకలతో కోవిడ్ వార్డు ఏర్పాటు చేయాలని నోడల్ అధికారి, ఐటీడీఏ పీఓ డా.వెంకటేశ్వర్ సలిజామల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పెదవాల్తేర్ రాణి చంద్రమణిదేవి ఆసుపత్రిని శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈనెల22 నుంచి కోవిడ్ పేషేంట్లకు ఈ ఆసుపత్రిలో కోవిడ్ పేషేంట్లకు సేవలను అందిస్తామని చెప్పారు. అనంతరం ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశీలించారు. ఆసుపత్రికి అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరగా రెండు అంబులెన్స్ లు  సమకూరుస్తున్నామని పీఓ హామీఇచ్చారు. ఆతరువాత రీజనల్ కంటి ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ కోవిడ్ పేషేంట్లకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో రాణి చంద్ర మణి దేవి ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శ్రీనివాసరావు, ఎపి  మైనారిటీ కార్పొరేషన్ ఈ డి ఆర్ డబ్ల్యూఎస్ ఈ ఈ రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-05-21 14:36:37

జగనన్నతోడు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జగనన్నతోడు పధకం అమలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. శుక్రవారం జగనన్న తోడు, పిఎం స్వానిధి పై జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్(DCCB) సిఇఒ వర్మ, యుసిడి(ప్రాజెక్ట్ డైరెక్టర్)  వై. శ్రీనివాసరావు, 18 బ్యాంకు బ్రాంచ్ మేనేజర్లు,  యుసిడి సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న తోడు, జూన్ 8వ తేదీన ప్రారంభమవుతుంది. కావున అర్హులైన లబ్ధిదారులకు జూన్ 2వ తేదీలోగా జగనన్న తోడు,  పీఎం కిసాన్ నిధి, క్రింద జీరో అకౌంట్ ఖాతాలను తెరవాలని యుసిడి(పిడి) వై.శ్రీనివాసరావు ఆదేశించారు. జూన్ 2వ తేదీ నాటికి 9381 ఖాతాలు తెరవాలని టార్గెట్ ఇవ్వడం జరిగిందని, అందుకు బ్యాంకులు  సహకరించాలని కమిషనర్ ఆదేశించారు. అర్హులైన పేద ప్రజలకు ఏవిధమైన అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, ఈ పథకం వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎపిడి లు, డిఎంసి లు, వార్డు వెల్ఫేర్ కార్యదర్శులు పనిచేయాలని ఆదేశించారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ  మీకు ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయాలన్నారు. జిల్లా కోపరేట్ సెంట్రల్ బ్యాంకు సిఇఒ వర్మ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ “జీరో” ఎకౌంటుతో ఖాతాలు తెరుస్తారని  అందుకు బ్యాంకులు కూడా సహకరిస్తాయని కమిషనర్ కు తెలిపారు. యుసిడి(పిడి) వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ జూన్ 2వ తేదీ నాటికి  జగనన్న తోడు 5063 ఖాతాలు మరియు పీఎం స్వానిధి 4258 ఖాతాలు మొత్తం 9321 ఖాతాలు టార్గెట్ ఇవ్వడం జరిగిందని, ఇప్పటికే 1036 ఖాతాలు తెరవడం అయిందని, మిగిలినవి జూన్ 2వ తేదీ నాటికి నూరు శాతం పూర్తి చేస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ సిఎఒ వర్మ, యుసిడి(పి.డి)  వై. శ్రీనివాసరావు, ఎపిడిలు, డిఎంసిలు, 18 బ్రాంచ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-05-21 14:30:52

కెజిహెచ్ లో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం..

విశాఖ కె.జి.హెచ్.లో నూతనంగా నిర్మించిన సహజ సిద్దమైన ఆక్సిజన్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ శుక్రవారం ప్రారంభించారు. ప్లాంట్ అంతటిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.  ఆక్సిజన్ తయారీ విధానంగా గూర్చి కలెక్టర్ అడుగగా వాతావరణం నుండి సేకరించిన గాలి నుండి ఆక్సిజన్ నిల్వ, సరఫరా చేయు విధానం గూర్చి ఎలక్ట్రికల్ డి.ఇ. ఫణి కుమార్ వివరించారు.   కేంద్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను కె.జి.హెచ్.లోని నర్సింగ్ కళాశాల వసతి గృహంనకు ప్రక్కనే నిర్మించారు.  కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మిషనరీ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సివిల్ పనులు కలిపి 3.4 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు తెలిపారు.  రోజుకు 400 వందల ఆక్సిజన్ సిలిండర్లు (2 x 1000 LPM ప్లాంట్) ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి ఎస్. వెంకటేశ్వర్, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, కె.జి.హెచ్. సూపరింటెండెంట్ డా. మైథిలి, ఎ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి. ఇ.ఇ. డి.ఎ. నాయుడు, ప్రొఫెసర్ డా. ఎం.విజయ శేఖర్, డా. మనోజ్ పాత్రుని, ఎలక్ట్రికల్ డి.ఇ. ఫణి కుమార్, డి.ఇ.ఇ. సంపత్ రావు, తదితరులు పాల్గొన్నారు.  

King George Hospital

2021-05-21 13:38:01

అధికారులు అప్రమత్తంగా ఉండాలి..

విశాఖజిల్లాలో సైక్లోన్ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులందరూ అప్రమత్తంగా వుండాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆదేశించారు.  కలక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి రెవెన్యూ అధికారులు, సిబ్బందిని విధులలో వుంచాలని డి.ఆర్.ఒ.ను ఆదేశించారు. హాస్పటల్ డిజాస్టర్ ప్రణాళికను సిద్థం చేసుకోవాలని సూచించారు. ఆసుపత్రులలో విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా బ్యాక్ అప్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. తహశీల్దారులకు 10-15 మంది లైన్ మెన్ లను అందుబాటులో వుంచాలన్నారు. విద్యుత్తు శాఖ ఇంజనీర్లతో ఈ విషయాలపై చర్చించి తగు ముందస్తు ఏర్పాట్లు  చేసుకొని తహశీల్దారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Collector Office

2021-05-21 13:33:03

కరోనాలో దాతల సహాయం మరువలేనిది..

తూర్పుగోదావ‌రి జిల్లాలో క‌రోనా క‌ట్ట‌డి, బాధితుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా వైద్య‌, ఇత‌ర సేవ‌లు అందించేందుకు, 104 అభ్య‌ర్థ‌న‌ల పూర్తిస్థాయి ప‌రిష్కారానికి క‌లెక్ట‌ర్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం  ఆద‌ర్శ‌నీయ‌మైన వార్‌రూమ్ కాన్సెప్ట్ ను రూపొందించి, అమ‌లు చేస్తోంద‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ పేర్కొన్నారు. శుక్ర‌వారం ప్ర‌భుత్వ విప్‌, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, క‌లెక్ట‌ర్ డి.మురళీధ‌ర్‌రెడ్డి, జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి త‌దిత‌రుల‌తో క‌లిసి మంత్రి వేణుగోపాల‌కృష్ణ తుని ఏరియా ఆసుప‌త్రిని సంద‌ర్శించారు. అక్క‌డి కోవిడ్ బాధితుల‌తో మాట్లాడి వైద్య‌, ఇత‌ర సేవ‌ల గురించి అడిగి తెలుసుకొని వారిలో ధైర్యం నింపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వేణుగోపాల‌కృష్ణ మాట్లాడుతూ ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు 104 కాల్స్ ప‌రిష్కారానికి అధిక ప్రాధాన్య‌మిస్తూ జిల్లా యంత్రాంగం ప్ర‌త్యేకంగా రోగుల‌కు ట్రాక్‌షీట్లు రూపొందించి, నిరంత‌రం వారి ఆరోగ్య ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు తెలిపారు. పాజిటివ్ నిర్ధార‌ణ అయిన ద‌గ్గ‌రి నుంచి ఆక్సిజ‌న్ స్థాయిలు, ఔష‌ధాల వినియోగం ఇలా ప్ర‌తి అంశాన్నీ ప‌రిశీలిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం జిల్లాలో జేఎన్‌టీయూ, బోడ‌స‌కుర్రు, బొమ్మూరు కోవిడ్ కేర్ కేంద్రాల్లో ఆరువేల వ‌ర‌కు ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని, ఆందోళ‌న చెంద‌కుండా ప్ర‌భుత్వం అందుబాటులో ఉంచిన అన్ని వ‌న‌రుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌జ‌ల‌పై ఉంద‌ని పేర్కొన్నారు. కాకినాడ జీజీహెచ్‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జిల్లా ఆసుప‌త్రి, జీహెచ్ఎల్, కిమ్స్ అమ‌లాపురం త‌దిత‌ర ఆసుప‌త్రుల‌తో పాటు ప్ర‌భుత్వ‌, ప్రైవేటు అనే తేడా లేకుండా ఆక్సిజ‌న్ నిల్వ‌ల‌ను అందుబాటులో ఉంచుతున్న‌ట్లు తెలిపారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కోసం, కోవిడ్ క‌ట్ట‌డికి నిరంత‌రం కృషిచేస్తున్నార‌ని.. జిల్లా యంత్రాంగం 24X7 ప‌నిచేస్తూ బాధితుల‌కు అవ‌స‌ర‌మైన సేవ‌లు అందించేందుకు కృషిచేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. జిల్లాలో రోజుకు దాదాపు ప‌దివేల వ‌ర‌కు ఫోక‌స్డ్‌గా, ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి ప‌రీక్ష‌లు చేయ‌డం వ‌ల్ల అధిక కేసులు న‌మోద‌వుతున్నాయ‌న్న వాస్త‌వాన్ని అర్థం చేసుకోవాల‌ని సూచించారు. అపోహ‌లు, వదంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని.. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితి కుదుట‌ప‌డుతోంద‌ని, ల‌క్ష‌ణాల‌ను వీలైనంత త్వ‌ర‌గా గుర్తించి, వైద్య సిబ్బంది సూచ‌న‌ల మేర‌కు మందులు ఉప‌యోగిస్తే హోం ఐసోలేష‌న్‌లోనే ఉండి కోలుకోవ‌చ్చ‌ని తెలిపారు. తుని ఏరియా ఆసుప‌త్రిలో 100 ఆక్సిజ‌న్ ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని.. కోవిడ్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించాల‌నే ఉద్దేశంతో ప‌ర్య‌ట‌న చేసిన‌ట్లు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ తెలిపారు.

దివీస్‌కు అభినంద‌న‌లు:
సామాజిక బాధ్య‌త‌గా బాధితుల‌కు సేవ‌లందించ‌డంలో త‌మ వంతు భాగ‌స్వామ్యం అందించాల‌నే ఉద్దేశంతో దివీస్ లేబొరేట‌రీస్ లిమిటెడ్ తాజాగా 60 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ‌, ప్ర‌భుత్వ విప్‌, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, క‌లెక్ట‌ర్ డి.మురళీధ‌ర్‌రెడ్డి, జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి చేతుల‌మీదుగా వైద్యాధికారుల‌కు అందించింది. తుని ఏరియా ఆసుప‌త్రికి 50, తొండంగి, కోట‌నందూరు పీహెచ్‌సీల‌కు అయిదు చొప్పున కాన్సంట్రేట‌ర్ల‌ను పంపిణీ చేసింది. ఈ సంద‌ర్భంగా దివీస్ సంస్థ‌ను మంత్రి, ఎమ్మెల్యే, క‌లెక్ట‌ర్, జేసీ (డీ) త‌దిత‌రులు అభినందించారు. జిల్లా ప్ర‌జ‌ల త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. దివీస్ ఇప్ప‌టికే ఈ నెల 19న జిల్లాకు 40 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించింది. కార్య‌క్ర‌మంలో దివీస్ లేబొరేట‌రీస్ లిమిటెడ్ అడ్మిన్ హెడ్ ఆర్‌.సుధాక‌ర్‌, మేనేజ‌ర్ బి.వాసుబాబు, డీసీహెచ్ఎస్ డా. ర‌మేష్‌కిశోర్‌, వైద్య‌, ఆరోగ్య అధికారులు, సిబ్బంది, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Tuni

2021-05-21 13:28:13