1 ENS Live Breaking News

విశాఖ చేరుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులు

విశాఖపట్నం -విజయనగరం-శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలు -2023 పోలింగ్ అనంతరం ఆరు జిల్లాల నుండి అన్ని బ్యాలట్ బాక్సులు స్వర్ణ భారతి ఇన్డోర్ స్టేడియంకు చేరుకున్నాయి . బ్యాలెట్ బాక్సులను జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున , ఎన్నికల పరిశీలకులు సిద్దార్ధ్ జైన్ , ఆరు జిల్లాల డిఆర్వోలు , అభ్యర్థుల సమక్షంలో ఆరు స్ట్రాంగ్ రూములలో భద్రపరచి సీల్ వేశారు. ప్రత్యేక బందో బస్తు కూడా ఏర్పాటు చేశారు. వీటిని మళ్లీ కౌంటింగ్ రోజున అధికారుల సమక్షంలోనే సీల్ విప్పి బయటకు తీస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని రాత్రి పదిగంటల వరకూ ఎన్నిక జరగడంతో బ్యాలెట్ బాక్సులు రావడం ఆలస్యం అయ్యింది. కట్టుదిట్టమైన భద్రత మధ్యవీటిని విశాఖ తీసుకు వచ్చారు. జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ , డి సి పి సుమిత్ సునిల్ గరుడ్ , డిఆర్వో శ్రీనివాస మూర్తి , ఎలక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2023-03-14 06:46:53

జర్నలిస్టులు పని ఒత్తిడికి లోనుకాకండి..గంట్ల

విధినిర్వహణలో జర్నలిస్టులు పని ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాలని విజెఎఫ్ అధ్యక్షుడు, సింహాచల దేవస్థానం ట్రస్టుబోర్డు ప్రత్యేకఆహ్వానితు లు,జాతీ య జర్నలి స్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు సూచించారు. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవలే మెట్రోటివి వీడియో జర్నలిస్టు చిన్నా అకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందిన విషయాన్ని ప్రతీజర్నలిస్టూ గుర్తించుకోవాలన్నారు. విధినిర్వహణ ఏ ప్రాంతంలోఉన్నా సమయానికి మితంగా నైనా ఆహా రాన్ని తీసుకోవ డంలో అశ్రద్ధ చూపకూడదన్నారు. జర్నలిస్టులందరూ ఖచ్చితంగా ఇన్స్యూరెన్స్, జర్నలిస్టు హెల్త్ కార్డుల్లో పొందాలన్నారు. మనపై నే కుటుంబాలు ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని ప్రతీ జర్నలిస్టూ అనుక్షణం మననం చేసుకోవాలన్నారు. జర్నలిస్టు ఆరోగ్యంగా ఉంటేనే తాజావార్తలు ప్రజలకు, ప్రభుత్వానికి అందించడానికి వీలుపడుతుం దని, మనం ఆరోగ్యంగా ఉంటేనే సమస్త సమాచారాన్ని తెలియజేయడానికి ఆస్కారం వుంటుందన్నారు గంట్ల..!

Visakhapatnam

2023-03-11 05:22:52

ఏపీప్రభుత్వ సలహాదారులకు 1వ తేదీనే గౌరవ వేతనాలు

దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం జీతాలు చాలా ఆలస్యంగా జమచేయడం ఇక్కడే చూస్తున్నామని బిజేపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. గురువారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్క సలహా కూడా ప్రభుత్వానికి ఇవ్వని అంతమంది సలహా దారులకు 1వతేదీ నే గౌరవ వేతనం ఇచ్చే ప్రభుత్వం ఉద్యోగులకు మాత్రం 10న, 18న ఇవ్వడం తొలిసారిగా చూస్తున్నామన్నారు. ఉద్యోగులు ప్రజలకు సేవలు చేస్తారు తప్పితే అధికార పార్టీ కి కాదని, పక్కా ప్లాన్ ప్రకారమే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగులను తీవ్ర మనోవేధకు గురి చేస్తుందన్నారు. ఈ ప్రభుత్వంలో డిఏలు తీసుకోవడం మరిచిపోయిన ఉద్యోగు లు..ఆఖరికి నెలకు జీతం సమయానికి వస్తే చాలు అనేవిధంగా తయారు చేశారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు మంచిరోజులు వస్తాయ న్నారు. ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం రాజకీయపార్టీల సంఘాలుగా చూస్తుండటం సరికాదన్నారు.

vizag

2023-03-09 09:42:43

ఉత్తరాంధ్రాతోపాటు మరో2 ఎమ్మెల్సీ స్థానాలు మావే

ఉత్తరాంధ్రాతోపాటు మరో2 ఎమ్మెల్సీ స్థానాల్లో బిజెపీ అభ్యర్ధులే గెలుస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జోస్యం చెప్పారు. గురువారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.విష్ణు కుమార్ రాజు, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ఎం.రవీంద్ర, అనకాపల్లి ఇంఛార్జి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేంద్రలతో కలిసి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం 2024 ఎన్నికల్లో్ ఖచ్చితంగా కనిపిస్తుందన్నారు. బీజేపీ ఒక్కపార్టీయే లక్ష ఎమ్మెల్సీ ఓట్లు రిజిస్ట్రేషన్లు చేయించిందన్నారు. ప్రజలకు బిజెపీ పార్టీపై అపారమైన నమ్మకం ఉందని, అదే సమయంలో అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగ, వ్యతిరేక విధానాలను కూడా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎవరు ఏం చేసినా గెలుపు మాత్రం బిజెపీ అభ్యర్ధులదేనన్న ఆయన జనసే కూడా ఈ ఎన్నికల్లో సహాయం చేస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.

undefined

2023-03-09 09:29:35

డెలిగేట్ కెట్లు పంపిణీ కౌంటర్ ను పీకి పందిరేశారు

విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో డెలిగేట్ రిజిస్ట్రేషన్లపై నిర్వాహకులు కిట్లు పంపిణీ చేసే విషయంలో తీవ్ర ఆగ్రహం చూపించారు. దీనితోరిజిస్ట్రేషన్లు చేయించు కున్నచోట కిట్లు ఇవ్వకపోవడం, డెలిగేట్స్ పై నోటికొచ్చినట్లు మాట్లాడి చిరాకు పడటంతో చిర్రెత్తుకొచ్చిన డెలిగేట్లు ఏకంగా అక్కడ కౌంటరను పీకి పాకం పట్టారు. పోలీసులు వచ్చేలోపే ఆకౌంటర్ నేలమట్టం అయ్యింది. దీనితో చేతులెత్తేసిన నిర్వాహకు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. అంతా అయిపోయిన తరువాత పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అక్కడున్నవారంతా తెల్లమొహం వేశారు. ఉదయం నుంచి డెలిగేట్ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నవారికి చాలా ఆలస్యంగా కిట్లు పంపిణి చేశారు. దీనితో చాలా మంది స్టాళ్లను సందర్శించడానికి వెళ్లకుండా అయిపోయిందని డెలిగేట్లు ఆరోపించారు.

Visakhapatnam

2023-03-03 14:12:36

GVMC సిబ్బంది కేబుల్ వైర్లు కట్ చేసేది అందుకేనా

మహావిశాఖనగర పాలక సంస్థ పరిధిలోని పలు లోకల్ టీవిలు, ఎంఎస్ఓలకు చెందిన ఓఎఫ్సీ కేబుళ్లను జివిఎంసి సిబ్బంది ఎలాంటి ముంద స్తు నోటీసు లేకుండా తెంపేస్తున్నారు. పనిగట్టుకొని మరీ వెతికి వెతికి కట్ చేసేస్తున్నారు. నగరంలోని పలు ఎంఎస్ఓలు సుమారు పదేళ్లుగా జివిఎంసీకి కట్టాల్సిన పోల్ టేక్సులు కట్టలేదని సమాచారం. దీనితో కొత్తగా వచ్చిన జివిఎంసీ కమిషనర్ ఎంఎస్ఓలపై కొరడా ఝులిపి స్తున్నా రు. నేరుగా ఓఎఫ్సీ కేబుళ్లు కట్ చేస్తున్న విషయాన్ని కొందరు అకారణంగా కేబుల్ వైర్లు కట్ చేసేస్తున్నారని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో పెట్టడంతో విషయం తెలుసుకున్న సిబ్బంది అన్ని జోన్ల పరిధిలోనూ వైర్లు కట్ చేసే కార్యక్రమానికి పూనుకున్నారు. మరోపక్క ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్లు అటు పదేళ్లుగా పోస్టల్ లైసెన్సులు కూడా రెవిన్యువల్ చేయలేదని పోస్టల్ అధికారులు కూడా చెబుతున్నారు.  విశాఖలో జి-20 సదస్సు జరుగుతున్నవేళ ఈ వైర్లు తెంపుడు కార్యక్రమం చర్చనీయాంశం అవుతోంది.

Visakhapatnam

2023-03-02 06:20:36

జిఎన్ వై. జిల్లా అధికారిగా కె.వెంకట్ ఉజ్వల్

విజయనగరం జిల్లా నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిగా కె. వెంకట్ ఉజ్వల్ అదనపు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్బంగా కార్యాలయ గణాంక అధికారి, కార్యక్రమ సహాయకులు వి పృథ్వి, ఎన్. వై. లు యువజన సంఘాల ప్రతినిధులు అభినందించారు. తదనంతరం జిల్లా కలెక్టరు ఎ.సూర్యకుమారిని మర్యాద పూర్వకంగా కలిశారు. విధుల్లోకి చేరిన అంశాన్ని తెలియజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా నెహ్రూ యువ కేంద్రం ద్వారా  యువజన ప్రభుత్వ కార్యక్రమాల అమలు పూర్తిస్థాయిలో చేపట్టాలని సూచించారు.

Vizianagaram

2023-03-01 14:27:31

ప్రభుత్వ పథకాలు అభివ్రుద్ధి వేగం పెంచాలి

ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించినందుకు ఆ శాఖ అధికారులను అభినందించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు.కొన్ని ప్రాంతాల్లో ఆడవారిలో ఉన్న రక్తహీనత, స్పందన దరఖాస్తులు, జలజీవన్ మిషన్, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, గ్రామ వార్డు సెక్రటేరియట్ల పనితీరుపై సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలలో జిల్లాని ముందు స్థానంలో ఉంచాలన్నారు. 

మండలంలోని సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్పందన కార్యక్రమంలో ఎక్కువగా పారిశుధ్యం, విద్యుచ్చక్తి, సచివాలయాల పనితీరుపై ఫిర్యాదులు వస్తున్నందున వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పనులు వేగవంతం చేస్తే మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి, ఆర్డీవోలు చిన్ని కృష్ణ, జయరామ్, పిడి డిఆర్డిఏ లక్ష్మీపతి, జి.ఎస్.వి.ఎస్. ప్రత్యేక అధికారి మంజులవాణి, ఎస్డీసీ రమామణి, ఉద్యానవన శాఖ అధికారి ప్రభాకర్ రావు, వ్యవసాయ అధికారి మోహన్ రావు మత్స్య శాఖాధికారి లక్ష్మణరావు, ఆర్ అండ్ బి ఈఈ రమేష్, వివిధ మండలాల ప్రత్యేక అధికారులు తాసిల్దారులు ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-03-01 14:22:30

రూ.100 కోట్లతో నగర సుందరీకరణ పనులు

అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సును విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ మల్లికార్జున స్పష్టం చేశారు. రు.100 కోట్లతో పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దుతున్నామన్నారు.  ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో చేస్తున్న ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిఐఎస్ సదస్సుకు 26 దేశాల చెందిన 30 ఉన్నత పరిశ్రమల నుండి  8 వేల నుండి 9 వేల వరకు డెలిగేట్స్ హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు వివరించారు. సదస్సు నిర్వహించడానికి 5 హాల్స్ ఏర్పాటు చేశామన్నారు. మెయిన్ హాలు, రెక్టిఫికేషన్ హాలు, రిజిస్ట్రేషన్ హాలు, సీఎంఓకు ప్రత్యేకంగా ఒక హాల్ ఏర్పాటు చేశామన్నారు.

 1వ తేదీ సాయంత్రానికే ఏర్పాట్లు పూర్తి చేసి, రెండో తేదీన విద్యుత్ శాఖ ,రహదారులు భవనాలు, అగ్నిమాపక శాఖ అనుమతులతో డ్రైరన్ నిర్వహిస్తామని చెప్పారు. డెలిగేట్స్ కోసం 400 కార్లు, 500  రూమ్స్ ఏర్పాటు చేశామన్నారు. విశాఖపట్నం విశిష్టత, గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా బ్రోచర్లు ముద్రించామని, పర్యాటక ప్రాంతాల్లో గైడ్స్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎ.యు. ప్రాంగణంలో మూడు హెలిప్యాడ్స్ ఏర్పాటు చేయడమైనదని, సదస్సుకు వచ్చే వారికి విమానాశ్రయంలో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.  ఈ కార్యక్రమంలో సిపి శ్రీకాంత్, జిల్లా జాయింట్ కలెక్టర్ కెయస్ విశ్వనాథన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-03-01 13:05:45

జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి ఈనెల 16 తేదీన జరిగే ఎన్నికలకు జిల్లాలో ప్రతిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలిపారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, బందోబస్త్ ఏర్పాట్లపై బుధవారం జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులతో రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.  జిల్లాలో 49 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వాటిలో 44 రెగ్యులర్ కాగా 5 ఆక్సిలరీ కేంద్రాలని తెలిపారు. 

28 ప్రదేశాల్లో ఏర్పాటు చేశామని 21 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని చెప్పారు. అనకాపల్లి లో గల 194 పీఎస్ లో అత్యధికంగా 1393 మంది ఓటర్లు ఉండగా పరవాడ ఉక్కునగరంలో ఉన్న 203 పీఎస్ అత్యల్పంగా 85 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు.  జిల్లాలో 42,714 ఉన్నారని వీరిలో 28,370 మంది పురుషులు 14, 338 మంది స్త్రీలు కాగా ఇతరులు 6గురు ఉన్నారని వివరించారు. అనకాపల్లి నుండి కలెక్టర్ తో పాటు పాల్గొన్న పోలీస్ సూపరింటెండెంట్ గౌతమి సాలి  మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును గూర్చి తెలిపారు.  సమస్యాత్మక కేంద్రాల పట్ల ప్రత్యేక దృష్టి సారించినట్లు, చేపట్టిన ఇతర ముందస్తు భద్రతా చర్యలను గూర్చి చెప్పారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సహాయ రిటర్నింగ్ అధికారి, డిఆర్ఓ పి. వెంకటరమణ, సిపిఓ జి.రామారావు, జి ఎస్ వి ఎస్ అధికారి మంజులవాణి తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-03-01 12:16:58

ప.గో.జి. శాశ్వత లోక్ అదాలత్ చైర్ పర్శన్ మేరీగ్రేస్

పశ్చిమగోదావరి జిల్లా శాశ్వత లోక్ అదాలత్ చైర్పర్సన్ గా ఈరోజు మేరీ గ్రేస్ కుమారి బాధ్యతలు చేపట్టారు. గతంలో ఫోక్సో కోర్టు న్యాయ మూర్తిగా విశేష సేవలు అందించి, పదవి విరమణ చేసిన మేరీ గ్రేస్ కుమారిని తిరిగి శాశ్వత లోక్ అదాలత్ చైర్ పర్సన్ గా నియమించడం పట్ల పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాధులు ఆమెకు అభినందనలు తెలియజేశారు.   మేరీ గ్రేస్ ఆధ్వర్యంలో శాశ్వత లోక్ అదాలత్ పశ్చిమగోదావరి జిల్లాలో చక్కటి సేవలు అందజేస్తుందని న్యాయవాదులు గుంటూరు బాబు గణేష్, గుంటూరు చంద్రమౌళి ఆశాభావం వ్యక్తం చేశారు. లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ చీఫ్ మునీశ్వరరావు,  డిప్యూటీ చీఫ్ కౌన్సిల్ రామ్మోహన్ రావు, అసిస్టెంట్ కౌన్సిల్ టి మధు లు తదితరులు  పాల్గొన్నారు.

West Godavari

2023-03-01 11:07:17

సమర్ధవంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలి

పట్టభద్ర, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయి శిక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పోలింగ్ / సహాయ పోలింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పట్టభద్ర, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పై నిర్వహించిన మొదటి విడత శిక్షణా తరగతుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పట్టభద్ర, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి చిన్న పొరపాట్లకు తావివ్వకుండా పూర్తిస్థాయి శిక్షణ పొంది సమర్థవంతంగా నిర్వహించాలని పోలింగ్ / సహాయ పోలింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధులు సమర్ధవంతగా నిర్వహించాలన్నారు.

పరీక్షలకు ఎలా సిద్ధం అవుతామో అలానే ఎలక్షన్ సిబ్బంది ఎలక్షన్ నిర్వాహణ పుస్తకాలను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకోవాలన్నారు. కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించాలని, ఎన్నికల విధులను అతిక్రమించవద్దని  పోలింగ్ అధికారులకు సిబ్బందికి సూచించారు. విధుల నిర్వాహణలో అనుమానాలు  ఉన్నట్లయితే శిక్షణ తరగతులలో అడిగి   నివృత్తి చేసుకోవాళ్లన్నారు. ఎన్నికలు యొక్క విధి విధానాలు, ఎన్నికల పత్రాలు నిర్వాహణ, బ్యాలెట్ బాక్స్ ఎలా ఓపెన్ చెయ్యాలి , ఎన్నికల అనంతరం ఎలా సీల్ వెయ్యాలి తదితర అంశాల గురించి గార తెహశీల్దార్ సుధాసాగర పోలింగ్ విధులలో పాల్గొనే సిబ్బందికి స్లయిడ్ షో ద్వారా వివరించారు.

జిల్లాలో పట్టభద్రలకు సంబంధించి 59 పోలింగ్ కేంద్రాలు, స్థానిక సంస్థల సంబంధించి 04 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించి పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అనుమానాలు ఉన్న మాస్టర్ ట్రైనర్లచే సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సీరియస్ గా తీసుకొని బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్, ఇతర పోలింగ్ మెటీరియల్ తో పాటు సదరు పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన పొంది బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శక సూత్రాల అవగాహన  చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. 

పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల అధికారులపై ఎలాంటి ఫిర్యాదు వచ్చిన సంబంధిత అధికారులపై తీవ్ర కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డి ఆర్ ఓ రాజేశ్వరి, కొవ్వాడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళీకృష్ణ,  అధికారులు, పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2023-03-01 10:41:50

MLC ఎన్నికలకు 1082 మంది పోలీసు సిబ్బంది

విశాఖపట్నంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 1082 మంది పోలీసు సిబ్బందిని ఎన్నికల విధుల కోసం మోహరించినట్టు పోలీస్ కమిష నర్ శ్రీకాంత్ తెలియజేశారు. బుధవారం ఆయన విశాఖ కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడారు. పోలింగ్ రోజు 840 మందిని  వినియోగిస్తున్నా మన్న ఆయన పోలింగ్ లొకేషన్లు 43 ప్రాంతాలు, 112 పోలింగ్ స్టేషన్లతో పాటు 15 రూట్ మొబైల్ టీమ్ లను కూడా ఏర్పాటు చేశామన్నా రు. ప్రత్యేక దళాలు, జిల్లా స్ట్రైకింగ్ ఫోర్సును కూడా అందుబాటులో ఉంచామన్నారు. ఎన్నికలు పూర్తయిన తరువాత స్ట్రాంగ్ రూమ్ వద్ద సెం ట్రల్ పారామిలటరీ బలగాలను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా కౌంటింగ్ డే రోజు అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు బలగాను  మోహరించనున్నట్టు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలీసు బందో బస్తును ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్టు చేసినట్టు సిటీ పోలీస్ కమిషనర్ వివరించారు.

Visakhapatnam

2023-03-01 10:24:06

గృహ నిర్మాణ లక్ష్యాలను అధికారులు పూర్తిచేయాలి

గృహ నిర్మాణ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. మండల అధికారులతో బుధ జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణ పనులు వేగవంతం కావాలని ఆయన అన్నారు. ఒక దశ నుండి మరో దశకు ప్రగతి త్వరితగతిన ఉండాలని ఆయన ఆదేశించారు. నిర్మాణాలకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇంజినీరింగ్ సహాయకులతో పక్కాగా సమీక్షించాలని ఆయన చెప్పారు. సామగ్రి అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. గృహ నిర్మాణాలలో సంతృప్తి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు గృహ రుణాలు ఇవ్వడం జరుగుతోందని, లక్ష్యాలు పూర్తి కావాలని ఆయన ఆదేశించారు.

 సొంత స్థలాల్లో నిర్మాణాలపై దృష్టి సారించాలని అన్నారు. సొంత స్థలాల్లో అనర్హత లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమోదు చేయరాదని ఆయన స్పష్టం చేశారు. సొంత స్థలాల్లో రిజిస్ట్రేషన్ లకు డిమాండ్ సర్వే చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో రోజుకు కనీసం లక్ష మంది వేతనదారులు పనులు చేయాలన్నారు. మేట్, క్షేత్ర సహాయకులు వేతనదారులను సమాయత్తం చేయాలని ఆయన ఆదేశించారు. పాచిపెంట, గరుగుబిల్లి, పార్వతీపురం మండలాలు లక్ష్యాల సాధనలో మెరుగు పడాలని ఆయన సూచించారు. ప్రధాన మంత్రి జన ఔషది కార్యక్రమంలో నమోదుకు రానున్న మూడు రోజులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సిబ్బంది సహకారాన్ని పొందాలని ఆయన స్పష్టం చేశారు. జన ఔషది కార్యక్రమంలో నమోదుకాని వారికి ఆరోగ్య శ్రీ లో వైద్య సేవలు పొందుటకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు. రీ సర్వేలో భాగంగా సర్వే, సబ్ డివిజన్ విధిగా జరగాలని ఆయన ఆదేశించారు. 

సంయుక్త కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ రీ సర్వే వేగవంతం చేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పంచాయతి రాజ్ ఇంజినీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్. కృష్ణా జి, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, జిల్లా విద్యాశాఖ అధికారి డా.ఎస్.డి.వి.రమణ, జిల్లా గ్రామ పంచాయితీ అధికారి బలివాడ సత్యనారాయణ, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారి జె. శాంతీశ్వర రావు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె. విజయ గౌరి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్ర రావు, ఐటిడిఎ ఏపిఓ సురేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2023-03-01 07:29:11

పోలింగ్ కేంద్రాల్లో మౌళిక వసతులు కల్పించాలి

ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల శాస‌న‌మండ‌లి స్థానం కోసం ఈ నెల 13న జ‌ర‌గ‌నున్నఎన్నికల‌  ప్ర‌క్రియ‌లో భాగంగా, ప‌ట్ట‌ణంలోని పోలింగ్ కేంద్రా ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి బుధ‌వారం సందర్శించారు. జిల్లా ఎస్‌పి దీపికా పాటిల్‌తో క‌లిసి, ఆమె ఏర్పాట్ల‌ను త‌నిఖీ చేశారు. జోన‌ల్‌, పోలింగ్ అధికారుల‌కు ప‌లు ఆదేశాల‌ను జారీ చేశారు. విజ‌య‌న‌గ‌రం కంటోన్మెంటులోని మున్సిప‌ల్ ఉన్న‌త పాఠ‌శాల‌, మ‌హారాజా క‌ళాశాల‌, క‌స్పా మున్సిప‌ల్ ఉన్న‌త పాఠ‌శాల‌, మ‌హారాజా సంస్కృత ఉన్న‌త పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించి, పోలింగ్ కేంద్రాల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, అన్ని పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు త‌దిత‌ర క‌నీస మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని ఆదేశించారు. క్యూలైన్ల ప్ర‌క్క‌నే కుండ‌ల‌తో నీటిని ఉంచాల‌న్నారు. కేంద్రాల్లో లైట్లు, ఫ్యాన్లు అన్నీ ప‌నిచేసేలా చూడాల‌న్నారు. ఎండ తీవ్రంగా ఉండటం వ‌ల్ల‌, నీడ‌కోసం షామియానాలు వేయాల‌న్నారు. 

ఓట‌ర్ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు  క్యూలైన్ల ప్ర‌క్కన న‌మూనా బ్యాలెట్ ప‌త్రాల‌ను అంటించాల‌ని సూచించారు. ప్ర‌తీ పోలింగ్ బూత్‌కు వేర్వేరు క్యూలైన్ల‌ను ఉండాల‌ని, అందుకు త‌గిన‌ట్టుగా బ్యారికేడ్లు ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. ఓట‌ర్లు ఇబ్బంది ప‌డ‌కుండా, ఓటింగ్ ప్ర‌క్రియ వేగంగా జ‌రిగేందుకు అవ‌స‌మైన అన్నిర‌కాల చ‌ర్య‌ల‌నూ తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల‌వ‌ద్ద ప‌టిష్ట‌మైన బందోబ‌స్తును ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఎస్‌పి దీపికా పాటిల్ చెప్పారు.

గ్రాడ్యుయేట్ ఓట‌ర్ల‌కు ఓట‌ర్ స్లిప్పుల పంపిణీ  త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని, బిఎల్ఓల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ప్ర‌తీ పోలింగ్ కేంద్రంలో, ఓట‌ర్ స్లిప్పుల పంపిణీపై బిఎల్ఓల‌ను ఆరా తీశారు. త‌క్కువ స్లిప్పుల‌ను పంపిణీ చేసిన‌వారిపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. పంపిణీ శత‌శాతం జ‌ర‌గాల‌ని, స్వ‌యంగా వెళ్లి స్లిప్పుల‌ను ఓట‌ర్ల‌కు అంద‌జేయాల‌ని సూచించారు. ఓట‌ర్ స్లిప్పుల పంపిణీలో, ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో వ‌లంటీర్ల‌ను ఎట్టిప‌రిస్థితిలోనూ వినియోగించ‌రాద‌ని క‌లెక్ట‌ర్‌ స్ప‌ష్టం చేశారు.  ఈ ప‌ర్య‌ట‌న‌లో  జోన‌ల్ ఎన్నిక‌ల అధికారులు పిఎన్‌వి ల‌క్ష్మీనారాయ‌ణ‌, బి.రాంగోపాల్‌, విజ‌య‌న‌గ‌రం డిఎస్‌పి శ్రీ‌నివాస‌రావు, తాశిల్దార్ బంగార్రాజు, ఇత‌ర రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2023-03-01 07:24:38