1 ENS Live Breaking News

రాష్ట్ర ప్రగతికి దోహదపడనున్న పారిశ్రామిక సదస్సు

విశాఖపట్నం లో వచ్చేనెల 3, 4  తేదీలలో విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు రాష్ట్ర ప్రగతిని మరింత ముందుకు తీసుకు వెళ్లబోతుందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు.  మంగళవారం విశాఖలోని నోవాటెల్ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పారిశ్రామిక అవకాశాలు, సహజ వనరులు, మౌలిక సదుపాయాలు, రాష్ట్రంలోని పరిశ్రమల ప్రగతిని సదస్సులో పారిశ్రామికవేత్తలకు విస్తారంగా చాటి చెప్పనున్నామని తెలిపారు. దేశంలోనే ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో 974 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉందని దీనిని పూర్తిస్థాయిలో వినియోగించుకోబోతున్నామని ఆయన తెలియజేశారు.  మారీటైం బోర్డు ద్వారా 15 వేల కోట్ల రూపాయలతో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. ఇప్పుడున్న పోర్టులకు అదనంగా నాలుగు కొత్త పోర్టులు,  ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేయనున్నామన్నారు. 

ఈ ఏడాది డిసెంబర్ నాటికి రామాయపట్నం పోర్టుకు తొలి వెసెల్ రాబోతుందని అమర్నాథ్ చెప్పారు. త్వరలోనే మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన చేస్తామని, భావనపాడు పోటు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ప్రతి పోర్టుకు ఆనుకుని ఐదు నుంచి పదివేల ఎకరాల భూమిని పరిశ్రమల కోసం కేటాయిస్తున్నామని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు మంచి డిమాండ్ ఉందని వెల్లడించారు. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తున్నాయని అని చెప్పారు. ఇది ఇలా ఉండగా రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడును రాబట్టేందుకు అవకాశాలు ఉన్నాయని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు.  దీనికోసం రాష్ట్రంలో 29 ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. అదేవిధంగా 646 చదరపు కిలోమీటర్ల పరిధిలో పిసిపిఐఆర్ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించామని అని చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్లో ఉన్న హెచ్పీసీఎల్, ఐఓసీ, ఎన్.టి.పి.సి తదితర కర్మాగారాలను ప్రపంచ స్థాయిలో ఫోకస్ చేయనున్నామని ఆయన చెప్పారు. కాగా 2021- 22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి 1,44,000 కోట్ల రూపాయల ఎగుమతులు చేశామని చెప్పారు. ఎగుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎనిమిదో స్థానంలో ఉందని ఆయన చెప్పారు. మూడు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని మంత్రి అమర్నాథ్ చెప్పారు. అలాగే రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రదేశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 2 వేల ఎకరాలలో  బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నమని ఇందులో సుమారు 40,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. 70 శాతం వర్కింగ్ ఏజ్ గ్రూప్ కలిగిన ఆంధ్రప్రదేశ్  జి ఎస్ డి పి లో  ప్రథమ స్థానంలో నిలిచిందని అని చెప్పారు.

హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని అని చెప్పారు. ఈరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ రంగంలో విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం ప్రాంతాలను మేజర్ కాన్సెప్ట్ సిటీలుగా  రూపుదిద్దుతున్నమని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు ఆనుకుని 100 ఎకరాలలో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి సెకనుకు ఒక సెల్ ఫోన్ తయారవుతోందని మంత్రి అమర్నాథ్ చెప్పారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో స్కిల్  హబ్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఇదిలా ఉండగా 2023-28 సంవత్సరానికి గాను కొత్త పారిశ్రామిక విధానాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నామని అని చెప్పారు. పెద్ద ఎత్తున పరిశ్రమలను రాబట్టేందుకు అనువుగా ఈ పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నామని మంత్రి వివరించారు.

 ఈ సమ్మిట్ లో ఎంఓయూలు చేసుకున్న కంపెనీలు ఆరు నెలల్లో పరిశ్రమ స్థాపించేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం నుంచి అడిషనల్ సపోర్ట్ ఉంటుందని అమర్నాథ్ చెప్పారు. కాగా మూడో తేదీ ఉదయం సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని మంత్రి అమర్నాథ్ చెప్పారు. సదస్సు జరిగే ప్రదేశంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని, రాష్ట్రంలోని ఉన్న పరిశ్రమల ప్రగతిని ఎగ్జిబిషన్ ద్వారా అతిథులకు తెలియజేస్తామనిచెప్పారు. తర్వాత సెషన్స్ ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. సదస్సుకు 25 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని 14 మంది అంబాసిడర్లు రానున్నారని , వివిధ దేశాలకు చెందిన కార్యదర్శులు, యూరోపియన్ యూనియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొనబోతున్నారని ఆయన చెప్పారు. నాలుగవ తేదీన పలు ఎంవోయూలు జరుగుతాయని తెలియజేశారు.

Visakhapatnam

2023-02-28 13:49:55

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల అనుమ‌తుల‌న్నీ ఒకేచోట

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో శాస‌న‌మండ‌లి ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగే ఎన్నిక‌లు స్వేచ్ఛ‌గా, నిష్ప‌క్ష‌పాతంగా, పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగేలా ఎన్నిక‌ల నోడ‌ల్ అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు సిద్ధార్ధ్ జైన్ ఆదేశించారు. ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా అభ్య‌ర్ధులంద‌రికీ అనుమ‌తుల విష‌యంలో స‌మాన అవ‌కాశాలు క‌ల్పించాల‌ని, అభ్య‌ర్ధులంద‌రినీ ఒకేలా ప‌రిగ‌ణించాల‌ని సూచించారు. ఎన్నిక‌ల ప్ర‌చారానికి అవ‌స‌ర‌మైన అన్ని అనుమ‌తులు ఒకేచోట‌ ఇచ్చేందుకు సింగిల్‌విండో ప‌ద్ధ‌తిని అనుస‌రించాల‌న్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నోడ‌ల్ అధికారుల‌తో ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు సిద్ధార్ధ్ జైన్ మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో స‌మావేశ‌మై ఎన్నిక‌ల ఏర్పాట్ల‌పై చ‌ర్చించారు. ఎన్నిక‌ల ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించేందుకు ప‌క‌డ్బందీ వ్య‌వ‌స్థ ఏర్పాటు చేయాల‌ని, ప్ర‌తి ఫిర్యాదుపై త్వ‌ర‌గా విచార‌ణ జ‌రిపి జాప్యం లేకుండా నివేదిక‌లు ఇవ్వాల‌న్నారు. 

బ్యాలెట్ ప‌త్రాలు, బాక్సుల స‌ర‌ఫ‌రాపై విశాఖ‌లోని రిట‌ర్నింగ్ అధికారి కార్యాల‌యంలో స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి త‌గిన ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఎన్నిక‌ల సంఘం పేర్కొన్న మేర‌కు ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి అమ‌లు జ‌రిగేలా అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. ముఖ్యంగా స‌రిహ‌ద్దున ఒడిశా నుంచి అక్ర‌మ మ‌ద్యం స‌ర‌ఫ‌రాకు తావులేకుండా త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన వాహ‌నాల‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని, పోలింగ్ ను వెబ్ కాస్టింగ్ చేసేందుకు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. శాస‌న‌స‌మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గ‌ ఎన్నిక‌ల‌కు 37 మంది  అభ్య‌ర్ధులు బ‌రిలో వున‌వ్నార‌ని అందువ‌ల్ల పెద్ద సైజు బ్యాలెట్ వ‌చ్చే అవ‌కాశం వున్నందున ఆ మేర‌కు త‌గిన సైజుగ‌ల బ్యాలెట్ బాక్సులు సిద్దం చేయాల‌న్నారు. స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-02-28 13:33:18

జి-20 సదస్సును విజయవంతం చేయాలి

ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2023 ను అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున అధికారులను ఆదేశించారు.  సోమవారం సాయంత్రం విఎంఆర్డిఎ ఎరీనా  సమావేశ మందిరంలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2023  ఏర్పాట్లు, అధికారులు చేపట్టవలసిన పనులపై పరిశ్రమల శాఖ కమిషనర్ డాక్టర్ జి. సృజన,సచివాలయల డైరెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ కెయస్ విశ్వనాథన్ తో కలసి లైజనింగ్ అధికారులు , నోడల్ అధికారులతో కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మార్చి 3, 4 తేదీలలో నిర్వహిస్తున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2023 (గ్లోబల్  ఇన్ వెస్టర్స్ సదస్సు-2023) కు నియమించిన నోడల్ అధికారులందరూ బాధ్యత యుతంగా పని చేసి విజయవంతం చేయాలన్నారు. 

ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, అంబాసిడర్లు రానున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. అతిధులు బస చేయు హోటల్స్ వద్ద, విమానాశ్రయం వద్ద,  ఎయు గ్రౌండ్ లోనూ  వైద్య ఆరోగ్య శాఖ నుండి మెడికల్ టీంలు, ఆంబులెన్స్, మందులు అందుబాటులో పక్కాగా ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రతినిధులు బస చేయు హోటల్స్ వద్ద సహాయ కేంద్రాలు ఏర్పాటు గావించాలని చెప్పారు.  ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పరిశ్రమల శాఖ కమిషనర్ డాక్టర్ జి. సృజన మాట్లాడుతూ గ్లోబల్  ఇన్ వెస్టర్స్ సదస్సు-2023కు ముఖేష్ అంబానీ, నవీన్ మిట్టల్, అదానీ తదితర ప్రముఖ వ్యాపార వేత్తలు, అంబాసిడర్లు, పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నట్లు చెప్పారు. అధికారులకు అప్పగించిన విధులను బాధ్యతతో నిర్వహించి సమ్మిట్ ను విజయవంతం చేయాలని తెలిపారు. 

సమ్మిట్ కు వచ్చే పారిశ్రామిక వేత్తలను విమానాశ్రయంలో రిసీవ్ చేసుకోవాలని, వారికి అవసరమైన వాహనాలు ఏర్పాట్లు గావించాలన్నారు. ముఖ్య అతిధుల సమాచారం ముందుగా తెలుసుకొని పూర్తి సన్నద్ధతతో ఉండాలన్నారు. అధికారులందరూ ప్రధాన వేదిక యొక్క పూర్తి సమాచారం ముందుగా తెలుసుకోవాలని అన్నారు.  జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ సదస్సు కు విచ్చేయు ముఖ్య అతిధుల విధులకు కేటాయించిన లైజనింగ్ అధికారులు , నోడల్ అధికారులు చేయవలసిన పనులను సూక్మ స్థాయిలో అధికారులకు వివరించారు.  ఈ సమావేశంలో సమ్మిట్ లో పాల్గొను  నోడల్ అధికారులు , లైజనింగ్ అధికారులు , జిల్లా అధికారులు , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.   

Visakhapatnam

2023-02-28 13:03:29

ఏయు వీసీపై జరిగిన విచారణ నివేదిక బయటపెట్టాలి

ఏయూ వైస్ చాన్సలర్‌(వీసీ) పీవీజీడీ ప్రసాదరెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఎన్నికల కమిషన్‌కు అందిన ఫిర్యాదులపై జిల్లా అధికార యంత్రాంగం జరిపిన విచారణ నివేదికను జిల్లా కలక్టర్‌ ఎ.మల్లికార్జున తక్షణం బహిర్గతం చేయాలని పబ్లిక్‌ ఫోరం రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ కాండ్రేగుల వెంకటరమణ డిమాండ్‌ చేశారు. ఫిర్యాదుని ఈ మేరకు ఈ మెయిల్‌ ద్వారా జిల్లా కలక్టర్‌కు వినతిపత్రం పంపామన్నారు. ఆర్టీఐ చట్టం సెక్షన్‌ 4(1) (సి) ప్రకారం ప్రజలపై ప్రభావం చూపించే నిర్ణయాలు ప్రకటించినపుడు వాటికి సంబంధించిన అన్ని వాస్తవాలను బయటపెట్టాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్ధికి మద్దతుగా విశాఖపట్నంలోని ఒక హోటల్‌లో ప్రైవేటు కళాశాలల యాజమాన్య ప్రతినిధులతో ఏయు వీసీ ఇటీవల సమావేశం కావడంపై అందిన ఫిర్యాదుల నేపధ్యంలో జరిగిన విచారణ నివేదికను గోప్యంగా ఉంచడం సిగ్గుచేటన్నారు. 

Anakapalle

2023-02-28 12:53:35

ఎమ్మెల్సీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత

ఆంధ్రప్రదేశ్  శాసనమండలి విశాఖపట్నం-విజయనగరం- శ్రీకాకుళం పట్టభద్రుల నియోజకవర్గ  ఎన్నికల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఎన్నికల పరిశీలకులు సిద్ధార్థ జైన్ అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున , సీపీ సీహెచ్ శ్రీకాంత్ తో కలిసి ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల తో  ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ , ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికల కంటే చాలా భిన్నమైనవని, బ్యాలెట్ పద్దతిలో జరుగు ఈ ఎన్నికలకు పూర్తి సన్నద్ధతతో   ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థుల జాబితా ఖరారు అయినందున ఇకపై పోలింగ్ ఏర్పాట్ల పనులు పూర్తి స్థాయిలో ఎటువంటి సమస్యలు లేకుండా చేయాలని అన్నారు. ఎన్నికల కోడ్ నిభందనలు అభ్యర్థులు అందరూ పాటించేటట్లు అవగాహన కల్పించాలని తెలిపారు.

 ఓటర్లు అందరూ ఓటు వేసేందుకు మంచి వాతావరణం కల్పించాలని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి వచ్చు ఫిర్యాదులను వెను వెంటనే పరిష్కరించాలని అన్నారు. అభ్యర్థుల ప్రచారం కొరకు పొందు అనుమతుల సేవలు అన్ని ఒక్క చోటే ఏర్పాటు చేసి సత్వరమే మంజూరు చేయాలని ఆదేశించారు.  ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థులు ఖరారు అయినందున పోలింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని అన్నారు . ఓటర్లకు ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో  జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి , ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ , ఎలక్షన్ సిబ్బంది  పాల్గొన్నారు. 

Visakhapatnam

2023-02-27 17:13:55

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 37 మంది

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విశాఖపట్నం-విజయనగరం- శ్రీకాకుళం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు  సంబంధించి నామినేషన్ల ఉపసం హరణ  నాటికి  మొత్తం 3అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని , 37 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున పేర్కొన్నారు. సోమవారం  జిల్లా కలెక్టరేట్ లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీలతో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబం ధించి ఎన్నికల పరిశీలకులు సిద్ధార్థ జైన్ తో  కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ను పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి అభ్యర్థి మోడల్ కోడ్  నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాల న్నారు. ఎమ్మెల్సీ బరిలో పాల్గొను అభ్యర్థులు ఎటువంటి ప్రభుత్వ  ప్రారంభోత్సవాలు , శంఖుస్తాపనలు కార్యక్రమాలలో పాల్గొనరాదని తెలిపా రు. ఎన్నికలకు   సంబంధించిన నియమ నిబంధనలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ అభ్యర్థులకు  వివరించారు. ఎన్నిక లకు సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నట్లయితే రాత  పూర్వకంగా తెలపాలని అన్నారు . ఎన్నికల ప్రచారంలో భాగంగా వ్యక్తిగత వాహనాలు , ర్యాలీలు,  లౌడ్ స్పీకర్లు  కొరకు అభ్యర్థులు ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో  జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి , ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ , ఎలక్షన్ సిబ్బంది , పోటీ అభ్యర్థులు , వారి ఏజెంట్లు ఉన్నారు. 

Visakhapatnam

2023-02-27 17:03:14

స్థానిక సంస్థలఎమ్మెల్సీగా కుడిపూడి ఎన్నిక

తూర్పుగోదావరి స్థానిక సంస్థల నియోజక వర్గం నుండి శాసన మండలి సభ్యుని ఎన్నిక నిర్వహణ ప్రక్రియలో సోమవారం మద్యాహ్నం 3-00 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.  గడువు ముగిసే సమయానికి ఈ ఎన్నికల పోటీలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కుడుపూ డి సూర్యనారాయణ రావు ఏకైక అభ్యర్థిగా నిలవడంతో,  రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా ఆయన ఎన్నికైనట్లుగా రిటర్నింగ్ అధికారి, జాయిం ట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ప్రకటించి, ఆయనకు సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్ అందజేశారు.  ఎమ్మెల్సీగా ఎన్నికైన కుడుపూడి సూర్యనా రా యణరా వుకు  కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు వంగా గీత,  మార్గాని భరత్ రామ్, కాకినాడ సిటీ శాససన సభ్యులు ద్వారం పూడి చం ద్రశేఖర రెడ్డి అభినందనలు తెలియజేశారు.  అనంతరం నూతనంగా ఎమ్మెల్సీ గా ఎన్నికైన కుడుపూడి సూర్యనారాయణరావు  జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లాను మర్యాద పూర్వకంగా కలిసారు.

Kakinada

2023-02-27 16:31:38

జిల్లాలో రబీసీజన్ లో సాగునీటి ఎద్దడి రాకూడదు

రబీ సీజన్లో సాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. 
సోమవారం కాకినాడ కలెక్టరు కార్యాలయంలో రబీ సాగునీరు పంపిణీపై జిల్లా కలెక్టరు కృతికా శుక్లా.. జాయింట్ కలెక్టరు ఎస్.ఇలక్కియ, వ్యవ సాయ, నీటిపారుదల, ఎలక్ట్రిసిటీ శాఖల అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కృతికా శుక్లా మాట్లాడుతూ  రబీలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సాగునీరు అందించాలన్నారు. రబీ సీజన్ కు సంబంధించి రానున్న నెల రోజులు అత్యంత కీలకంకా నున్న నేపథ్యంలో సాగునీరు పంపిణీపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. ఇందుకు వ్యవసా యం, నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు.. క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ శివారు భూములకు సైతం పూర్తిస్థాయి లో సాగునీరు అందించేందుకు కృషి చేయాలన్నారు.

 సాగునీరు పంపిణీ, వంతులు వారి విధానంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టరు తెలిపారు. అనుమతులు ఉన్నచోట క్రాస్ బండ్లు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా ఆయిల్ ఇంజిన్స్, కాలువల్లో పేరుకుపోయిన పూడికలు, గుర్రపు డెక్క తొలగింపు వంటి పనులకు వెంటనే పనులు ప్రారంభించాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాపై కెనాల్స్ టీమ్స్ ఏర్పాటు చేసుకుని నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. తాల్లరేవు, కరప, కాకినాడ గ్రామీణం, పిఠాపురం, సామర్లకోట ఇతర మండలాల అధికారులతో కలెక్టరు ఈ సందర్భంగా చర్చించి సాగునీటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. విజయ్ కుమార్, రామచంద్రాపురం ఇరిగేషన్ ఈఈ విజయ గోపాల్, డ్రైన్స్ ఈఈ కె.సుబ్బయ్య, ఏపీఈపీడీసీఎల్ ఈఈ ప్రసాద్ వివిధ మండలాల తహసీల్దార్లు, వ్యవసాయ అధికారి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2023-02-27 16:26:16

ఈ-క్రాప్ నమోదు చేయించుకున్నవారి నుంచే కొనుగోలు

విజయనగరం జిల్లాలో రబీ 2022-23 లో మినుములు,పెసలు పండించిన రైతుల నుండి ప్రభుత్వ మద్ధతు ధర (మినుములు  Rs.6600/-, పెసలు Rs.7755/-) క్వింటాకు కొనుగోలు చేయుటకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చిందని మార్కుఫెడ్ జిల్లా మేనేజర్ విమల తెలిపారు. ఈ-క్రాప్,  సీఎం యాప్ నందు నమోదు చేయించుకున్న వారి నుంచి మాత్రమే కొనుగోలు చేస్తామని తెలియజేశారు. కొనుగోలు కింద్రాలు గంట్యాడ మండలంలో వసాది ఆర్.బి.కే నందు నందు  27.02.2023 తేదీన సోమవారం  అధికారులు కోనుగోలు ప్రక్రియను ప్రారంభించారు.  అలాగే జిల్లాలో అన్నీ మండలాల్లో ఆర్.బి.కే ల నందు ప్రారంభించడం జరిగిందని ఆమె తెలిపారు. రైతులు వారి  పంటను జల్లించుకుని కొనుగోలు కింద్రాల వద్ధకు నిర్దేశిక ప్రమాణాలు ఉండే విధంగా తీసుకురావాలని తెలిపారు. కావున ప్రతి  రైతు ఈ అవకాశమును సద్వినియోగపరుచుకోవాలని అన్నారు.

Vizianagaram

2023-02-27 16:21:51

ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో భద్రతపై సదస్సు

ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో సోమవారం సాయంత్రం విద్యార్థుల భద్రతపై అవగాహన సదస్సు జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సెట్విన్ సీఈఓ మురళీకృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వల్ల నష్టాలు, సైబర్ క్రైమ్, ఈవ్ టీజింగ్, దిశా చట్టం తదితర అంశాల గురించి తెలియజేశారు. విద్యార్థులు మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా ఉండాలని, సైబర్ క్రైమ్ మోసాలు, ముందు జాగ్రత్తలను ఉదాహర ణలతో సహా వివరించారు.  దిశ పోలీస్  కె.స్వాతి మాట్లాడుతూ అంతర్జాలం ద్వారా జరుగుతున్న మోసాల వల్ల యువత తమ బంగారు భవిష్య త్తును నాశనం చేసుకుంటున్నారని, స్మార్ట్ ఫోన్ జాగ్రత్తగా ఎలా వాడాలి అనే విషయాలను తెలియజేశారు. మరో పోలీస్  ఆశ మాట్లాడుతూ ఈవ్ టీజింగ్ వల్ల జరిగే దుష్పరిణామాలు, విధించే శిక్షలను తెలియజేశారు. సామాజిక మాధ్యమాల్లో కొత్త వ్యక్తులు తారసపడితే ఆచితూచి పరిచ యం చేసుకోవాలన్నారు. దిశా యాప్ ను విద్యార్థినులందరూ డౌన్లోడ్ చేసుకొని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాలని, యాప్ ను వాడే విధానాన్ని తెలియజేశారు.

      ఈ కార్యక్రమంలో ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, అధ్యాపకులు డాక్టర్ సుందరం, డాక్టర్ వెంకటశివుడు, డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ గోపాలకృష్ణయ్య, దిశా పోలీసులు  రేవతి, స్వప్న ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tirupati

2023-02-27 14:35:13

21వ వార్డులో ఫోటో ఓటర్ల జాబితా ప్రదర్శన

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని 21వ వార్డు ఫోటో ఓటర్ల జాబితా సిద్ధం చేశామని జివిఎంసి కమిషనర్ పి రాజాబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జివిఎంసీలోని 3వ జోన్ పరిధిలోని 21వ వార్డుకు సంబంధించిన ఫోటో ఓటర్ల జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో 3వ జోన్ కార్యాలయం, ఆర్డిఓ కార్యాలయం,తహసిల్దార్ కార్యా లయం, పోస్ట్ ఆఫీసులలో ప్రజల పరిశీలన కొరకు నోటీస్ బోర్డులో ఉంచామన్నారు. అలాగే రాజ కీయ పార్టీలకు వార్డు ఫోటో ఓటర్ల జాబితా కాపీని పంపించినట్టు పేర్కొన్నారు.

Visakhapatnam

2023-02-27 14:28:49

మన్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

పట్టభద్రుల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ అన్నారు. విశాఖప ట్నం - విజయనగరం - శ్రీకాకుళం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు మరియు రాష్ట్ర సర్వే కమీషనర్ సిద్ధార్థ్ జైన్ సోమ వారం విశాఖపట్నం నుంచి సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరుగుతుందని అన్నారు. పోలింగ్ సిబ్బందిని గుర్తించామని, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సూక్ష్మ పరిశీలకులుగా కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులను నియమించి ఒక దశ శిక్షణ పూర్తి చేశామని చెప్పారు. ప్రతి విభాగానికి ఒక నోడల్ అధికారిని నియమించామని ఆయన అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు బృందాలను నియమించామని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ బాక్స్ లను ఇప్పటికే ఒకసారి పరిశీలన జరిగిందని ఆయన పేర్కొన్నారు. 12వ తేదిన ఎన్నికల సామగ్రి పంపిణీ, ఎన్నికల అనంతరం సామగ్రి స్వీకరణ (రిసెప్షన్) జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. 

పోలీసు సూపరింటెండెంట్ వి. విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలో 8 పోలింగ్ కేంద్రాలు సున్నితమైన కేంద్రాలుగా పరిగణిస్తున్నా మన్నారు.  ఎన్నికల పరిశీలకులు సిద్ధార్థ్ జైన్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరుగుటకు అందరూ చక్కటి సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి పట్టభద్రుడు ఓటు వేయాలని ఆయన పేర్కొన్నారు. అవసరమగు పోలీస్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని ఆయన సూచించారు. 37 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, బ్యాలెట్ పత్రం తయారీ, రవాణా, ఓటింగ్ తదితర అంశాలపై జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. పొలింగకు 48 గంటల ముందు నుండి మద్యం విక్రయాలు ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, అదనపు పోలీసు సూపరింటెండెంట్ డా. ఓ. దిలీప్ కిరణ్, , ఎన్నికల నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఐదు రూట్లుగా విభజించి బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. నాలుగు స్టాటిక్ బృందాలు నియమించామని అన్నారు.

Parvathipuram

2023-02-27 14:02:20

కేంద్ర ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ నాగసాయి సూరి

విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు నిత్యం చదవాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వ ఫిల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్  పరావస్తు నాగసాయి సూరి అన్నారు. పీఎంపీ అసోసియేషన్, రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం చైతన్యపురిలోని సుస్మిత నర్సింగ్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ఎందరో వైద్య సిబ్బంది ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందించారని, అందులో కొందరు చనిపోవడం ఆవేదన కలిగించిందన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా వైద్య, పారామెడికల్ సిబ్బంది ప్రజలకు సేవలు అందిస్తున్నారని ఆయన కొనిడారు.  నారాయణ దంత వైద్యశాల హెచ్ఓడి డాక్టర్ నటరాజన్ కన్నన్ కి ఇటీవల మలేషియా లోని లింకన్ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్, డాక్టరేట్ అందుకున్న శుభసందర్భముగా ఘనంగా సత్కరించారు.  పీఎంపీ గౌరవాధ్యక్షులు అనుముల జయప్రకాష్,తదితరులు పాల్గొన్నారు.

Eluru

2023-02-27 13:58:00

ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి

ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగాలని శాసన మండలి ఎన్నికల పరిశీలకులు సిద్దార్థ్ జైన్ సూక్ష్మ పరిశీలకులకు చెప్పారు.  విఎంఆ ర్డ్ఎ చిల్డ్రన్స్ ఎరీనాలో పట్టబధ్రుల శాసన మండలి నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి సూక్ష్మ పరిశీలకుల శిక్షణలో ఆయన పాల్గొన్నా రు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళి నియమ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు.   48 గంటలు ముందు ప్రచారం ముగించాల్సి ఉంటుందన్నారు.  పోలింగ్ ఎలా జరుగుతోందో పరిశీలించాలని పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బంది పోలింగ్ ఏ విధంగా చేస్తున్నది  సూక్ష్మ పరిశీలకులు పరిశీలించాలన్నారు. వెబ్ కాస్టింగ్, ఫొటోగ్రఫీలను పరిశీలించాలని తెలిపారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్, ఫొటోగ్రఫీ ఉంటుందన్నారు.  సూక్ష్మ పరిశీలకులు చేయాల్సిన విధులపై సూక్ష్మ పరిశీలకులను అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. 

పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సిబ్బంది, పోలింగ్ ఏజంట్లు, ఓటరు మాత్రమే ఉండాలన్నారు. ఓటరు విభిన్న ప్రతిభా వంతులైతే ప్రైసైడింగ్ ఆఫీసర్ అనుమతితోనే  “అటెండెంటు” రావాలని వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ప్రలోభాలు జరుగకుండా చూడాలని తెలిపారు.  పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపల ఎవరు ఉండకుండా ఎన్నికల నియమావళి తప్పక పాటించాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకోవాలని చెప్పారు. పోలింగ్ ముగిసిన సమయానికి ఎంత మంది వరుసలో ఉన్నది చూసుకుని ప్రెసైడింగ్ ఆఫీసర్ టోకెన్లు అందజేస్తారన్నారు. జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున మాట్లాడుతూ సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల నియమావళిని అమలు చేయాలని చెప్పారు. సూక్ష్మ పరిశీలకుల నుండి సందేహాలును ఆయన నివృత్తి చేశారు. పలు సూచనలు తెలియజేశారు. 

Visakhapatnam

2023-02-27 13:29:25

జి-20 సదస్సులతో ఏపీ రూపురేఖలు మారిపోతాయి

విశాఖ వేధికగా మార్చి 3, 4 తేదీల్లో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు అభివ్రుద్ధితో మారిపోనున్నాయ ని ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం విశాఖలోని మద్దెలపాలెం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లా డారు. జి-20 సదస్సుల వలన పెట్టుబడులు రావడంతోపాటు, ఎంఎస్ఎంఈలు మరింతగా అభివ్రుద్ధి చెందుతాయన్నారు. టిడిపి రాజకీయ లబ్దికోసం జి-20 సదస్సులపై బురదచల్లే కార్యక్రమం చేస్తుందని.. కానీ  గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ద్వారా వచ్చే పెట్టుబడులు చూసి అదే పార్టీ నోరెళ్లబెడుతుందన్నారు. అంతేకాకుండా త్వరలోనే సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి విశాఖనుంచే పరిపాలన చేయనున్నారని చెప్పా రు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా ఏపీ ప్రభుత్వం సరికొత్త కార్యాచరణతో ముం దుకి వెళుతుందని చెప్పారు. కార్యక్రమంలో మహిళా నేత పేడాడ రమణికుమారి, వైఎస్సార్సీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-27 13:00:21