తూర్పు సెంట్రల్ డెల్టాలో రబీ సాగుకు సంబంధించి సాగునీటి ఎద్దడి సమస్యలు పరిష్కారం కొరకు సీలేరు నుండి అదనపు జలాలను విడుదల చేయాలని, డెల్టా ప్రాంతం లో కాలువలలో పూడికతీతకు నిధులు కేటాయించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డిని కోరారు. గురువారం అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ 26 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో నిర్వహించి ప్రభుత్వ పథకాల అమలు తీరు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ఆరోగ్యం స్త్రీ శిశు సంక్షే మం, పాఠశాల విద్య, గ్రామ వార్డు సచివాలయాల స్పందన గ్రీవెన్స్ పరిష్కారం ఇత్యాది అంశాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో రబీ సాగుకు సాగునీటి ఎద్దడి సమస్యలు ఉత్పన్నం కాకుండా అదనంగా సీలేరు నుండి జలాలను విడుదల చేయాలని కాలువల్లో పూడుకు పోయిన తూడును తొలగించేందుకు నిధులు కేటాయించాలని కోరామ న్నారు.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు శాఖల వారీగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల యాప్ లో నమోదు చేసి పోషకాహార లోపాలు, రక్తహీనత తదితర అంశాలలో లక్షిత వర్గాల వారికి పోషకాహార పథకాలను వర్తింపజేస్తూ ఎప్పటికప్పుడు యాప్ ద్వారా ఫాలో అప్ చేయాలని ఆదేశించారు. 8 పారామీటర్లను రక్తహీనత, పోషకాహార లోపాలను సరిదిద్దేందుకు సంబంధిత శాఖలు పూర్తి సమన్వయంతో జవాబుదారీ తనంతో పనిచేయాలన్నారు. బాలా మృతం వైయస్సార్ సంపూర్ణ పోష ణ, గోరుముద్ద ,పోషకాహార కిట్లు టేకు హోం రేషన్ ప్రక్రియల ద్వారా పోషకాహార లోపాలను శాఖల సమ న్వయంతో సరిదిద్దేందుకు పటిష్ట మైన చర్యలు గైకొని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఏఎన్ఎం, వసతి గృహ సంక్షేమ అధికారులు, పాఠశాల ప్రధానోపా ధ్యాయులు పోషకాహారం లోపా లను గుర్తించి ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ లేదా పీహెచ్సీ వైద్యులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖల సహకారంతో తక్కువ బరువు ,వయసుకు తగ్గ ఎత్తు తదితర అంశాలలో వృద్ధిరే టును మానిటరింగ్ చేస్తూ ఆరోగ్య కర సమాజ స్థాపన దిశగా ముంద డుగు వేయాలన్నారు.
కిషోర బాలి కల పోషకార లోపాలు, టీనేజ్ ప్రె గ్నెన్సీ నివారణ అంశాలపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టాలన్నారు. ఆయు ష్మాన్ భారత్ హెల్త్ కార్డులు ఇకేవైసీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమాల ద్వారా బాలల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాలన్నారు. కమ్యూన కబుల్ వ్యాధులు, నాన్ కమ్యూనక బుల్ వ్యాధులు నియం త్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నా రు కంటి వెలుగు కార్య క్రమాన్ని జూలైలోపు పూర్తి చేయాలన్నారు గర్భిణీల ప్రసవ ప్రణాళిక ,కాన్పు ప్రమాదకరమని భావించిన గర్భిణీల ప్రసవాల పట్ల అప్రమత్తంగా వ్యవ హరించాలన్నారు. బడిబయటి పిల్లలు లేకుండా విద్యాశాఖ అధి కారులు ప్రత్యేక దృష్టి సారించాల న్నారు. సచివాలయాలలో స్పందన గ్రీవెన్స్ ను సకాలంలో పరిష్కరించి సచివాల వ్యవస్థ పనితీరు పట్ల విశ్వసనీయతను అర్జీదారులలో పెంపొందించాలన్నారు. సచివాల యాల్లో ఖాళీలు భర్తీకి ఆదాయ ధ్రువపత్రాలు జారికి వివిధ సంక్షేమ పథకాల అమలుకు వివక్షతకు తావు లేకుండా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు..
సాగునీటి ఎద్దటి సమస్యలు పరిష్కారానికి ఇప్పటికే వివిధ డ్రైనేజీలపై 42 క్రాస్ బండ్లు నిర్మించి మోటార్లు, ఆయిల్ ఇంజన్ ద్వారా నీటి ఎద్దడి ఉన్న సాగు క్షేత్రాలకు సాగు నీటిని సరఫరా చేయడం జరుగుతోందన్నారు. అర్బన్ హెల్త్ మిషన్ గ్రామీణ హెల్త్ మిషన్ ద్వారా ఇంటింటిని ఏఎన్ఎంలు సంద ర్శించి రోగాల బారిన పడిన వారి ఆరోగ్య పరిరక్షణకై దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామా జిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య చికిత్సలు అందిస్తూ త్వరగా కోలుకునే విధంగా పాటుపడాల న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ర బాబు సిపిఓ వెంకటేశ్వర్లు డిఎంహె చ్వో ఎం దుర్గారావు దొర, ఐసిడిఎస్ పిడి జీవి సత్య వాణి ,గ్రామ వార్డు సచివాలయం నోడల్ అధికారి భీమేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్. ఇ సిహెచ్ ఎన్వి కృష్ణారెడ్డి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నా రు.