1 ENS Live Breaking News

ప్రజల సహకారంతోనే కరోనా నియంత్రణ..

కోవిడ్ తో పోరాటానికి  కొత్త వ్యూహాలు, పరిష్కారాలు అవసరమని  ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ  పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేసు లు తగ్గుతున్నప్పటికి  గ్రామాలను కరోనా రహితంగా ఉంచడం కోసం కోవిడ్ నిర్దిష్ట ప్రవర్తనను అనుసరించేలా అవగాహన కల్పించాలన్నారు.   గురువారం ఉదయం న్యూ ఢిల్లీ నుండి కోవిడ్ కట్టడి చర్యల పై  రాష్త్రాల ముఖ్యమంత్రులు , జిల్లా కలెక్టర్లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాలకు చెందిన జిల్లా  కలెక్టర్లతో మాట్లాడి కోవిడ్ పరీక్షలు, వాక్సినేషన్, కోవిడ్ కేర్  కేంద్రాల పై  ఆరా తీసారు.  కేసులను తగ్గించడానికి ఆయా జిల్లాల్లో చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కు మాట్లాడే  అవకాశం రాగా అక్కడ చేపడుతున్న చర్యల పై ఆయన వివరించారు.  అనంతరం ప్రధాని  మాట్లాడుతూ  కోవిడ్ కట్టడికి నూతన విధానాలను కనిపెట్టి  అమలు చేసేలా చూడాలన్నారు.  స్థానిక పరిస్థితులను దృష్టి లో పెట్టుకొని  అక్కడి సవాళ్ళకు తగ్గట్టుగా కార్యాచరణ చేపట్టాలన్నారు.  ప్రజల నుండి కూడా అభి ప్రాయాన్ని సేకరించి వారి ఆలోచనలను కూడా ఆచరణ లో పెట్టడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చన్నారు.  నిరంతరం నూతన పద్ధతులను అన్వేషిస్తూ,  ఎప్పటికప్పుడు  అప్ డేట్ కావాలని,  ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల ద్వారా వారిలో విశ్వాసాన్ని నింపాలని అన్నారు.  వాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలనీ, వాక్సిన్ వృధా ను అరికట్టాలని, వాక్సినేషన్ వద్ద గుంపులుగా ఉండకుండా నియమానుసారం జరిగేలా చూడాలన్నారు.
          అంతకు ముందు కేంద్ర కుటుంభ సంక్షేమ శాఖ కార్యదర్శి దేశంలోని కోవిడ్ పరిస్థితుల ను  పవర్ పాయింట్  ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. దేశం లో జరుపుతున్న పరీక్షలు,  పోజిటివిటి  శాతం, మరణాలు, ఆసుపత్రులు, పడకలు, ఆక్సిజన్ నిల్వలు, భవిష్యత్ ప్రణాళికలు తదితర అంశాల పై వివరించారు.  పలు  రాష్ట్రాల్లో కోవిడ్ కట్టడి లో   అమలు చేస్తున్న ఉత్తమ అభ్యాసాలను వివరించారు. దేశం లో పోజిటివిటి  రేట్ 16.9 శాతం గా ఉందని పేర్కొన్నారు.  రెండు డోస్ లలో కలిపి  మొత్తంగా ఇంతవరకు 18.70 కోట్ల మందికి వాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. కోవిడ్ నిరోధం పై విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.  24/7 పని చేసేలా ప్రతి జిల్లాలోను కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
గ్రామ స్థాయి లో విశ్లేషించాలి:   జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్  
            వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ మాట్లాడుతూ గ్రామ, వార్డ్ స్థాయి లో పోజిటివ్ కేసు లను, మరణాలను విశ్లేషించాలని  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రమణ కుమారికి సూచించారు.  గ్రామాల వారీగా జాబితాలను సిద్ధం చేయాలనీ, వాటిని సమీక్షించి, భవిష్యత్ ప్రణాళికలను వేయడం జరుగుతుందని అన్నారు.  గ్రామాల్లో అవగాహన కల్పించడానికి  గ్రామ స్థాయి బృందాలను కూడా ఏర్పాటు చేయాలనీ ఆదేశించారు.  వెంటనే డేటా ను తాయారు చేసి సమర్పించాలన్నారు. అందుకు తగ్గట్టుగా కొత్త వ్యూహాలను తాయారు చేస్తామన్నారు.

Vizianagaram

2021-05-20 11:59:44

గ్రామాల్లోనే ఐసోలేష‌న్ కేంద్రాలు..

గ్రామ‌స్థాయిలో ఐసోలేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేశామ‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్ చెప్పారు. వీటి నిర్వ‌హ‌ణ‌కు స్వ‌చ్ఛంద సంస్థ‌లు ముందుకు రావాల‌ని కోరారు.  వివిధ స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌హేష్ కుమార్ త‌న ఛాంబ‌ర్‌లో గురువారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. కొన్నిచోట్ల గ్రామ‌స్తులు, తాము కోవిడ్ తో బాధ ప‌డుతున్న‌ప్ప‌టికీ, వివిధ కార‌ణాల‌తో కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌కు వెళ్ల‌డానికి విముఖ‌త చూపిస్తున్నార‌ని చెప్పారు. ఇలాంటి చోట వారు హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్న‌ప్ప‌టికీ, త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల‌, వారినుంచి ఇత‌రుల‌కు వ్యాధి వ్యాపిస్తున్న‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌న్నారు. అందువ‌ల్ల‌  25 శాతం పాజిటివిటీ ఉన్నగ్రామాల్లో, స్థానికంగానే ఐసోలేష‌న్ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. త‌మ గ్రామంలోనే ఉండటానికి గ్రామ‌స్తులు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుండ‌టం వ‌ల్ల‌, వారిని స్థానిక ఐసోలేష‌న్ కేంద్రానికి త‌ర‌లిస్తామ‌న్నారు.  గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల లేదా ఇత‌ర ప్ర‌భుత్వ భ‌వ‌నంలో 20 నుంచి 40 ప‌డ‌క‌ల‌తో ఐసోలేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. అన్ని వ‌స‌తుల‌ను ప్ర‌భుత్వ‌మే క‌ల్పిస్తుంద‌ని, నిర్వ‌హ‌ణా బాధ్య‌త‌ల‌ను మాత్రం ఎన్‌జిఓలు చూడాల్సి ఉంటుంద‌న్నారు. దీనికోసం ఒక్కో మండ‌లానికీ ఒక్కో స్వ‌చ్చంద సంస్థ‌ను నోడ‌ల్ ఎన్‌జిఓగా ఎంపిక చేస్తామ‌న్నారు.
                    ప‌డ‌క‌లు, మందులు, వైద్య స‌హాయాన్ని తామే అందిస్తామ‌ని, భోజ‌నం, పారిశుధ్యం, నిర్వ‌హ‌ణ మాత్ర‌మే ఎన్‌జిఓలు చూడాల్సి ఉంటుంద‌న్నారు.  అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ఆక్సీజ‌న్‌, అంబులెన్సుల‌ను కూడా పంపిస్తామ‌న్నారు. ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని విధాలా స‌హ‌కారం అందిస్తామ‌న్నారు. మండ‌ల స్థాయి అధికారులైన తాశీల్దార్లు, ఎంపిడిఓలు, వైద్యాధికారులు, స్థానికంగా గ్రామ స‌ర్పంచ్‌లు, ఇత‌ర ప్ర‌భుత్వ‌సిబ్బందిని స‌మ‌న్వయం చేసుకొని, ఈ కేంద్రాల‌ను నిర్వ‌హించాల్సి ఉంటుంద‌న్నారు. స్వ‌చ్ఛంద సంస్థ‌లు త‌మ‌కు అనుకూల‌మైన మండ‌లాల‌ను, ఎంపిక చేసుకొని, శుక్ర‌వారం నాటికి జాబితాల‌ను అంద‌జేయాల‌ని జెసి మ‌హేష్‌ కోరారు. ఈ స‌మావేశంలో జిల్లా యూత్ కో-ఆర్డినేట‌ర్ విక్ర‌మాధిత్య‌, బొబ్బిలి రోట‌రీ క్ల‌బ్‌, నా ఊరు-విజ‌య‌న‌గ‌రం, స్పార్క్ సొసైటీ, మార్వాడీ యువ మంచ్‌, ఐఆర్‌పిడ‌బ్ల్యూఎఫ్‌, క్యాంప‌స్ ఛాలెంజ్ త‌దిత‌ర స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2021-05-20 11:57:41

అప్పన్నకు సమకూరిన చందనం 31 కిలోలు..

విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)కు గురువారం 31 కిలోలు చందన అరగదీత ద్వారా సమకూరినట్టు దేవస్థానం ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె దేవస్థానంలో మీడియాతో మాట్లాడుతూ, స్వామివారికి 26వ తేదీన రెండవ విడత చందనాన్ని సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు వివరించారు. అరగదీసిన చందనంతోపాటు, సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేశామన్నారు. స్వామికి ఎవరైనా భక్తులు చందనం సమర్పించాలనుకుంటే దేవస్థాన అధికారులను సందప్రదించాలన్నారు.  చందన సమర్పణ, గోత్ర నామాల పూజలు  మూడు, నాలుగో దఫాలుగా చందన సమర్పణలు కూడా కొనసాగుతాయన్నారు. దాతలు ఎంతైనా స్వామివారికి చందనం సమర్పించుకోవచ్చుని చెప్పారు.  ఆన్ లైన్ పూజలు, అర్చనల్లో  భాగస్వాములు కావాలనుకునే భక్తులు  దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-20 11:55:31

ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలని  కమిషనర్ డా. జి.సృజన అధికారులను ఆదేశించారు. బుధవారం సర్వేను ఆమె స్వయంగా 28వ వార్డులో రాం నగర్ లో  పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,  కోవిడ్-19 నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జివిఎంసి పరిధిలో అన్ని వార్డులలో ఫీవర్ సర్వే జరుగుతుందన్నారు.రు. నాలుగవ జోన్ పరిధిలో 28వ వార్డు నందు జరుగుచున్న ఫీవర్ సర్వేలో పాల్గొన్న కమిషనర్ మాట్లాడుతూ ఈ సర్వే ద్వారా కరోనా లక్షణాలు గల వ్యక్తులను తొందరగా గుర్తించి వారి ఆరోగ్యం కాపాడటంతో పాటు వైరస్ ఇతరులకు సోకకుండా అరికట్టవచ్చునని తెలిపారు. ఆశా వర్కరులు, వాలంటీర్లు, ఎఎన్ఎం లు కలసి ఈ సర్వే లో పాల్గొంటారని, కోవిడ్ లక్షణాలు కల్గిన వ్యక్తిని గుర్తించి మెడికల్ ఆఫీసర్లు సిఫార్సు చేస్తామని, వారు వెంటనే రోగిని పరీక్షించి హోమ్ ఐసోలేషణ్ కిట్స్ ఇస్తారని, వారిని పరిస్థితులను బట్టి హోమ్ ఐసోలేశాన్లో ఉంచాలా లేదా క్వారంటైన్ కు పంపించాలా లేదా ఆసుపత్రికి రిఫర్ చేయాలా నిర్ణయంచడం జరుగుతుందని తెలిపారు. కావున, జివిఎంసి పరిధిలో ఉన్న ప్రజలకు మీ ఇంటికి వచ్చే వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎం లకు సహకరించాలని మీ కుటుంబ సభ్యులలో ఎవ్వరికైనా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు, ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు ఉంటే ఎటువంటి సంకోచం లేకుండా ఫీవర్ సర్వే బృందానికి సహకరించాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ పర్యటనలో నాలుగవ జోనల్ కమిషనర్ ఫణిరాం, 28వ వార్డు ఇంచార్జ్ పల్లా దుర్గా రావు, శానిటరి ఇన్స్పెక్టరు, వార్డు వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.       

28th ward

2021-05-19 16:01:49

ఆదాయ వనురులపై ద్రుష్టిపెట్టండి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఆదాయ వనరులను పెంపొందించడానికి  దృష్టి చారించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన సంబంధిత అధికారులను “జూమ్” యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. బుధవారం ఆమె ఛాంబరు నుండి జివిఎంసి ఉన్నతాధికారులతొను, జోనల్ కమిషనర్లతోను, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆస్తి పన్ను, ఖాళీ జాగా పన్ను, కార్పోరేషన్ ఆస్తులు, షాపింగ్ కాంప్లెక్స్లు, మార్కెట్లు మొదలైన్ వాటి నుండి రావలసిన బకాయిలను వెంటనే వసూలుకు కృషి చేయాలని, ఇంకా మదించవలసిన ఆస్తి పన్ను, ఖాళీ జాగా పన్ను, త్వరితగతిన చేపట్టాలన్నారు. యజమనుదారులు తమ ఆస్తులను నివాస యోగ్యము నుండి వాణిజ్య వినియోగానికి మార్చి వినియోగిస్తున్న వాటిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.  నీటి చార్జీలు పై మరింత దృష్టి సారించాలని బల్క్, సెమి బల్క్ వినియోగదారు నుండి రావలసిన బకాయిలను రాబట్ట్టాలని, అనుమతి లేకుండా గృహాలకు వాడు చున్న కుళాయిలను గుర్తించి వాటిని క్రమబద్దీకరించాలని, గృహ, వాణిజ్య భవనములు, అపార్ట్మెంట్లు మొదలైన వాటిని సర్వే చేసి వాటికి నూతనంగా కొళాయి కనక్షన్లు మంజూరు చేసి చార్జీలు సూలు చేయాలన్నారు. పట్టణ ప్రణాళికా విభాగపు ఆదాయ వనరులు మరింతగా పెంచాలని, మొత్తం పాత భవనములు ఎన్ని ఉన్నాయి, కన్స్ట్రక్షన్ భవనములు ఎన్ని ఉన్నాయి, కొత్త భవనములు ఎన్ని ఉన్నాయి, ఖాళీ జాగాలు ఎన్ని ఉన్నాయో సర్వే చేయాలని ప్రతీ సచివాలయ పరిధిలో వీటిని క్షేత్ర స్థాయి పరిశీలన చేసి వాటి వివరాలను నమోదు చేయాలని, వాటిపై రీ- సర్వే జరపాలని అధికారులను ఆదేశించారు. జూన్ 30వ తేది నాటికి వార్డు ప్లానింగు కార్యదర్శులచే వీటిని సిద్ధం చేయాలని సూచించారు. 
సచివాలయ హాజరు పట్టి సరిగా నిర్వహించడం లేదని వార్డు అడ్మిన్ కార్యదర్శులు ఈ బాధ్యతా తీసుకొని హాజరు వేయాలని, మూమెంట్ రిజిస్టర్, డైరీ విధిగా వ్రాయాలని సూచించారు. వీటిపై జోనల్ కమిషనర్ల పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. కోవిడ్ దృష్ట్యా ప్రతీ సచివాలయంలో ఒక డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేసి ఆర్జీలను అందులో వేయించాలన్నారు. ఆర్జీలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇ.ఆర్.పి.లు పెండింగు ఉండకూడదని ఎవ్వరి వద్ద పెండింగు కనిపిస్తున్నాయో వారికి చార్జి మెమో ఇవ్వడం జరుగుతుందని కమిషనర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందని ప్రజలకు సేవ చేసే అవకాసం మనకు కలిగిందని, ప్రతి ఒక్కరూ, కోవిడ్ నిబంధనలు పాటించి విధులు నిర్వహించాలని సూచించారు.    
 వీడియో కాన్ఫరెన్స్ లో జివిఎంసి అదనపు కమిషనర్ ఆశాజ్యోతి, పర్యవేక్షక ఇంజినీరు(వాటర్ సప్ప్లై) కె.వి.ఎన్.రవి, డి.సి.ఆర్. ఎ.రమేష్ కుమార్, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.      

GVMC office

2021-05-19 15:59:59

పరిశ్రమల్లో వేక్సినేషన్ కి అనుమతులివ్వండి..

విశాఖ జిల్లాలోని పరిశ్రమలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల ఏర్పాటుకు తగు చర్యలు తీసు కోవాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి డా.జీవన్ రాణిని ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమలలో ఆసుపత్రులు వుంటే వాటికి ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ క్రింద  కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్, ఆసుపత్రి లేని పరిశ్రమలలో ఇండస్ట్రియల్ వర్క్ ప్లేస్ వద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటరు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలన్నారు. సదరు పరిశ్రమల యాజమాన్యాలు వ్యాక్సిన్ ను మాన్యూఫ్యాక్చరర్స్ నుండి పొందవలసి వుందన్నారు. సదరు కేంద్రాలలో ఆడ్వర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏర్పాట్లు వుండాలన్నారు.

కలెక్టర్ ఆఫీస్

2021-05-19 15:39:31

ఫీవర్ సర్వే సత్వరమే పూర్తి చేయాలి..

శ్రీకాకుళం జిల్లాలో ఫీవర్ సర్వే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ లో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆమదాలవలస, పోలాకి, పాతపట్నం, రేగిడి ఆమదాలవలస, రాజాం, నరసన్నపేట, సరుబుజ్జిలి, రణస్థలం తదితర 18 మండలాలు ఫీవర్ సర్వే పూర్తి చేయడంలో వెనుకబడి ఉన్నాయని తక్షణం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఫీవర్ సర్వే లో కరోనా లక్షణాలు కనిపించిన వారి నమూనాలు వెంటనే సేకరించాలని ఆయన అన్నారు. కొంత మంది వాలంటీర్లు వ్యక్తుల నమూనా సేకరించి మరల 14 రోజుల లోపు అదే వ్యక్తుల నమూనాలు సేకరిస్తున్నారని ఆయన అన్నారు. 14 రోజుల లోపు నమూనాలు సేకరించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేస్తూ అటువంటి వాలంటీర్లను తొలగించాలని ఆయన ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. సర్వే పక్కాగా నిర్వహించాలని, కరోనా లక్షణాలు ఉన్న వారిని మాత్రమే గుర్తించి నమూనాలు సేకరించాలని ఆయన అన్నారు. కొత్తగా గుర్తించిన వ్యక్తులకు మాత్రమే నమూనాలు తీసి యాప్ లో అప్ లోడ్ చేయాలని ఆయన స్పష్టం చేశారు. సేకరించిన నమూనాలను వెంటనే పరీక్ష కేంద్రాలు పంపించాలని ఆయన ఆదేశించారు. మండలాలకు అవసరమైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, పిపిఇ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు ఇప్పటికే సరఫరా చేసామని ఆయన చెప్పారు. మండలాల్లో అవసరమగు సదుపాయాల కోసం నివేదికలు సమర్పించాలని తదనుగుణంగా సమకూరుస్తామని కలెక్టర్ తెలిపారు. మండలాల్లో పరిస్థితులను మండల తహశీల్దార్ లు పరిశీలించాలని ఆయన ఆదేశించారు. మండల సర్వేలియన్స్ అధికారులు పాజిటివ్ కేసులను గుర్తిస్తున్న తీరును పరిశీలించాలని, అవసరమైన మేరకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. పాజిటివ్ గా నిర్ధారణ చెందిన వ్యక్తులు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని, వారితో పాటు ప్రాథమిక కాంట్రాక్టులు కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడా, రెవిన్యూ డివిజనల్ అధికారులు ఐ.కిషోర్, టి.వి.ఎస్.జి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-19 15:34:19

నిరు పేదలకి మెరుగైన వైద్యం..

రాష్ట్రంలో  పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం శ్రీకాకుళం, కడప , నెల్లూరు, ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రులలో సిటి స్కాన్, ఎన్ఆర్ఐ మెషిన్లను వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదవాడికి మెరుగైన వైద్యం అందాలని అన్నారు. ఇందు కోసం ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 బోధన ఆసుపత్రులు ఉన్నాయని, మరో 16 బోధనా ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు. ఈ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ పరిధి క్రిందకు తీసుకొని రావడం జరుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు, సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ కే. కృష్ణమూర్తి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.కృష్ణవేణి, సి ఎస్ ఆర్ఎమ్ఓ డాక్టర్ ఆర్ .అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-19 15:28:06

జిజిహెచ్ లో అందుబాటులో సిటి స్కాన్..

శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అందుబాటులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. బుధవారం నెల్లూరు, శ్రీకాకుళం, కడప, ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రులలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ మిషన్ లను ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ  సిటి స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో ఏర్పాటు చేయడం ముదావహం అన్నారు. ఇది జిల్లా ప్రజలకు ప్రభుత్వం కల్పించిన వరంగా అభివర్ణించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో ఏర్పాటు చేయడం వలన ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని అన్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల రీత్యా సిటీ స్కాన్ అవసరం ఎంతో ఉందని ఆయన పేర్కొంటూ అత్యవసర సమయంలో దీన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఏపీఎస్ఎమ్ఐడిసి నిర్వహణ బాధ్యతలు చూస్తుందని,  సంబంధిత కంపెనీ ఏడు సంవత్సరాలపాటు గ్యారంటీ ఇచ్చిందని ఆయన తెలిపారు.

Srikakulam

2021-05-19 15:25:47

అప్పన్న భక్తులకు చందన ప్రసాదం..

విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి చందనోత్సవానికి ... చందనం సమర్పించిన భక్తులకు దేవస్థానం అధికారులు స్వామివారి చందన ప్రసాదాన్ని పోస్టు ద్వారా పంపిస్తున్నారు.  అర కేజీ అంటే రూ. 10,116 (పదివేల నూటపదహార్లు),కేజీఅంటే రూ. 20,116(ఇరవైవేల నూటపదహార్లు) సమర్పించినవారికి ముందుగా చందనం పంపుతున్నారు.  పదివేల నూటపదహార్లు పంపినవారికి  చందనం ముక్క , 20వేల నూటపదహార్లు పంపినవారికి చందనం ముక్కతోపాటు శేషవస్త్రం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్యాకేజింగ్ ఆలయ ఏఈఓ రాఘవ కుమార్, కప్ప స్తంభం నాయుడు పర్యవేక్షణలో జరుగుతున్నాయి.  ఇప్పటికీ 20,116  అంటే కేజీ చందనం సమర్పించినవారి  రెండు అడ్రస్ లు పూర్తిగా తెలియరాలేదని, అందులో ఒకటి ఆఫ్రికాలోని గినియా దేశం నుంచి వచ్చిందని  గుర్తించినట్టు అధికారులు తెలియజేశారు. మరొకటి చెక్ రూపేణా అడ్రస్ లేకుండా పంపించారని పేర్కొన్నారు. వీరి అడ్రస్ లు కనిపెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇక దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు 3 కేజీల చందనం సమర్పించారు. పలువురు భక్తులు విదేశాల నుంచి విరాళాలు పంపినా... స్వదేశీ అడ్రస్ లనే ఇచ్చారు. కాగా స్వామివారి చందన సమర్పణకు ఏడాదిలో ఎప్పుడైనా విరాళాలు పంపించే అవకాశం భక్తులకు దేవస్థానం కల్పించింది. ఇది ఏడాది పొడవునా జరిగే ప్రక్రియని అధికారులు పేర్కొన్నారు.

Simhachalam

2021-05-19 15:10:25

వైద్యసిబ్బందిని వెంటనే నియమించండి..

విశాఖ జిల్లాలోని ఆసుపత్రులలో వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది నియమకాలను  ప్రభుత్వ ఉతర్వులను అనుసరించి తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్  ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లాలోని కోవిడ్ నియంత్రణ, వైద్య సిబ్బంది నియామకాలు, ఆక్సిజన్  ప్రొక్యుర్ మెంట్, ఆసుపత్రులకు సరఫరా, తదితర విషయాలపై సంబంధిత అధికారులతో కలక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 79 ఆసుపత్రులు వున్నాయని, వీటిలో పేషెంట్లకు ఆక్సిజన్ అవసరాల నిమిత్తం, ఎటువంటి సమస్య తలెత్తకుండా ఆక్సిజన్ ప్రొక్యూర్ మెంట్ మరియు సరఫరా గావించాలన్నారు. ఇందుకు గాను ఆక్సిజన్ సరఫరా చేసే కంపెనీలు,  వారిచే సరఫరా చేయబడుతున్న ఆక్సిజన్ వివరాలపై ఆయన చర్చించారు. ఆక్సిజన్ ట్యాంకర్లు ప్రక్క దారి పట్టకుండా వాటికి సెక్యూరిటీ వాహనాలు ఏర్పాటు గావించాలని ఉప రవాణా కమీషనర్.రాజరత్నంను ఆదేశించారు ఇందుకుగాను అవసరమైన రెవెన్యూ సిబ్బందిని విధులలో నియమించాలని ఆర్.డి.ఒ. పెంచల కిషోర్ ను ఆదేశించారు. ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణా విషయంలో ఆర్.డి.ఒ. సహకారం తీసుకోవాలని ఔషధ నియంత్రణ  సహాయ సంచాలకులు రజితను ఆదేశించారు.  హెల్త్ సిటీలో 48 వరకూ ఆసుపత్రులు వున్నాయని వాటికి ఆక్సిజన్ సరఫరాకు ప్రణాళికతో తగు చర్యలు చేపట్టాలన్నారు.    పడకల విషయమై మాట్లాడుతూ కొన్ని ఆసుపత్రులలో పడకల పెంపుదలను పరిశీలించాలన్నారు. జర్మన్ హాంగర్స్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని  ఆర్.ఎండ్.బి ఎస్.ఇ. సుధాకర్ ను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పి.ఆరుణ్ బాబు, ఎ.ఎం.సి ప్రిన్సిపాల్ డా. పి.వి. సుధాకర్, ఆర్.డి.ఒ. పెంచల కిషోర్, జి.యం.డి.ఐ.సి. రామలింగరాజు, ఔషధ నియంత్రణ శాఖ ఎ.డి.రజిత, ఎ.పి.ఎం .ఎస్.ఐ.డి.సి. ఇ.ఇ.నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Collector Office

2021-05-19 13:52:47

బ్లాక్ ఫంగస్ కోసం 20 పడకలు..

విశాఖ జిల్లాలో బ్లాక్ ఫంగస్(మ్యూకార్ మైకోసిస్) పేషెంట్లకు చికిత్స నిమిత్తము కె.జి.హెచ్.లోని డెర్మటాలజీ విభాగంలో 20 పడకలు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వెల్లడించారు.  ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో క్లినికల్ మేనేజ్ మెంట్ ప్రోటోకాల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్ నేతృత్వంలో సీనియర్ వైద్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో ప్రభుత్వ ఛాతీ, ENT, ప్రాంతీయ కంటి ఆసుపత్రి  సూపరింటెడెంటట్లు, న్యూరో సర్జరీ,  జనరల్ మెడిసిన్, డెర్మటాలజి మరియు మైక్రోబయాలజీల  విభాగాధిపతులు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ఆసుపత్రులకు వచ్చిన  పేషెంట్లను చేర్చుకొని చికిత్స విధి విధానాలను పరిశీలిస్తారన్నారు.

Collector Office

2021-05-19 13:50:06

పింఛనుదారుల సమాచారం తెలియజేయండి..

కోవిడ్ బారిన  ప్రాణాలు కోల్పోయిన పింఛనుదారుల వారసులు,   కుటుంబ సభ్యులు  సదరు వివరాలను సంబంధిత ఖజానా కార్యాలయంలో సత్వరమే తెలియ వలసినదిగా జిల్లా ట్రజరీ ఉప సంచాలకులు టి.శివరాం ప్రసాద్ ఒక ప్రకటన లో కోరారు. అలాగే పింఛనుబకాయిలు, దహనఖర్చుల కొరకు బ్యాంకు అకౌంట్ తదితర వివరాలు సమర్పించినట్లైతే సంబంధిత ఖాతాల్లో సదరు మొత్తం జమచేయడం జరుగుతుందన్నారు. పింఛనుదారుల వారసులు ఎన్నారైలు అయినట్లైతే  పింఛనుదారుల మృతి సమాచారం తెలియక వారికి సంబంధించిన ఖాతాలలోకి పించను సొమ్ము జమయ్యే అవకాశం వున్నందున  కుటుంబ సభ్యులు, వారసులు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా సత్వరమే పింఛనుదారు మరణించిన తేదీని సూచిస్తూ బాధ్యతాయుత పౌరులుగా సంబంధిత ఖజానా కార్యాలయంలో తెలియజేయాలని కోరారు. ఈవిషయాన్ని జిల్లాలో గల ఉప ఖజానా అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

Collector Office

2021-05-19 13:48:05

కోవిడ్ రోగుల ఆక్సిజన్ కోసం రూ.35 విరాళం..

విశాఖలోని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ  రిఫైనరీ,  జిల్లా లోని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ రోగులకు  ఆక్సిజన్ సరఫరా నిమిత్తము రూ. 35 లక్షలు విరాళంగా అందజేసింది. బుధవారం నాడు స్థానిక కలెక్టరేట్ లో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. రత్నరాజ్ చెక్కు ను జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, హెచ్ పిసిఎల్ జనరల్ మేనేజర్ రాజు, పిఆర్ ఓ ఎం. కాళీ, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రామలింగరాజు పాల్గొన్నారు. కోవిడ్ సమయంలో పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉదారంగా స్పందించడం అభినందనీయమని కలెక్టర్ అభినందించారు.

Collector Office

2021-05-19 13:42:41

కోవిడ్ నియంత్ర‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టండి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో క‌రోనా నియంత్ర‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, ప్ర‌జ‌ల నుంచి చిన్న విమ‌ర్శ కూడా రాకుండా సేవ‌లందించాల‌ని మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, వెల్లంప‌ల్లి శ్రీ‌నివాసు అధికారుల‌ను ఆదేశించారు. ఆసుప‌త్రుల‌పై మ‌రింత ప‌ర్య‌వేక్ష‌ణ పెంచి సేవ‌లు స‌త్వ‌ర‌మే అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఆసుత్రుల్లో అందుతున్న సేవ‌ల‌పై నిరంత‌రం స‌మీక్షిస్తూ త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. ప్ర‌ధానంగా ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో అవ‌స‌ర‌మైన మేర‌కు అద‌న‌పు వైద్య సిబ్బందిని త్వ‌ర‌త‌గ‌తిన నియ‌మించుకోవాల‌ని సూచించారు. 


జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు ఆధ్వ‌ర్యంలో, జిల్లాలో కోవిడ్ నియంత్ర‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌లు, రోగుల‌కు అందిస్తున్న వైద్యం త‌దిత‌ర అంశాల‌పై జిల్లా అధికారుల‌తో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ బుధ‌వారం జూమ్ కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ముందుగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ జిల్లాలోని గ‌త స‌మావేశంలో చ‌ర్చించిన అంశాల‌ను, చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను, జిల్లాలోని తాజా ప‌రిస్థితిని మంత్రుల‌కు వివ‌రించారు. కోవిడ్ మొద‌టి వేవ్‌తో పోలిస్తే, ప్ర‌స్తుతం ఇన్‌ఫెక్ష‌న్ రేటు ఎక్కువ‌గా ఉంద‌ని, రిక‌వ‌రీ రేటు కొంత త‌గ్గింద‌ని చెప్పారు. జిల్లాలోని 27 ఆసుప‌త్రుల్లో ప్ర‌స్తుతం కోవిడ్‌కు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఫీవ‌ర్ స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నామ‌ని, పాజిటివ్ వ‌చ్చిన వారిని హౌం ఐసోలేష‌న్‌లో ఉంచి కోవిడ్ కిట్ల అంద‌జేస్తున్నామ‌ని వివ‌రించారు. గ‌త స‌మావేశంలో మంత్రులు, శాస‌న స‌భ్యులు ప్రస్తావించిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని తెలిపారు. జిల్లా కేంద్రాసుప‌త్రిలో 10 కె.ఎల్‌. సామ‌ర్థ్యం గ‌ల ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని చెప్పారు. దీనికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.20 లక్ష‌ల కేటాయించిన‌ట్లు పేర్కొన్నారు. బొబ్బిలిలో గ‌తంలో నాలుగు ప‌డ‌క‌ల‌కు ఆక్సిజ‌న్ ఉండేద‌ని.. ప్ర‌స్తుతం ప‌ది ప‌డ‌క‌ల‌కు ఆక్సిజ‌న్ స‌దుపాయం క‌ల్పించామ‌ని చెప్పారు. పార్వ‌తీపురం ఏరియా ఆసుప‌త్రిలో ఉన్న 100 ప‌డ‌క‌ల‌ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని వివ‌రించారు. జిల్లాకు కావాల్సిన అద‌న‌పు అంబులెన్స్‌ల‌ను, ఒక మ‌హాప్ర‌స్థానం వాహ‌నాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణ‌యించామ‌న్నారు. బ‌యో మెడిక‌ల్ ఇంజినీర్ నియామ‌కానికి, మిమ్స్ ఆసుప‌త్రిలో 6 కె.ఎల్‌. స‌మార్థ్యం గ‌ల ట్యాంకర్‌ను ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని క‌లెక్ట‌ర్‌ వివ‌రించారు. ప‌రీక్ష‌లు, టీకా ప్ర‌క్రియ స‌జావుగా సాగుతోంద‌ని వెల్లడించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఫస్ట్ డోస్ 2.54 ల‌క్ష‌ల మందికి, రెండో డోస్ 1.05 ల‌క్ష‌ల మందికి వేశామ‌ని తెలిపారు. కోవిడ్ కేర్ సెంట‌ర్ల నిర్వ‌హ‌ణ బాగుంద‌ని అన్ని వ‌స‌తులు స‌మ‌కూర్చామ‌ని, సేవ‌లు బాగా అందుతున్నాయ‌ని వివ‌రించారు. 

జేసీలు కిశోర్ కుమార్‌, మ‌హేష్ కుమార్‌, వెంక‌ట‌రావు పాల్గొని ప‌లు అంశాల‌పై మాట్లాడారు. కోవిడ్ కేర్ సెంట‌ర్ల నిర్వ‌హ‌ణ‌, ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా, వైద్యుల నియామ‌కం, మందుల స‌ర‌ఫ‌రా, ఆరోగ్య శ్రీ సేవ‌లు, ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లో అందుతున్న‌ సేవ‌ల గురించి వివ‌రించారు. మిమ్స్‌లో 6 కె.ఎల్. ఆక్సీజ‌న్ ట్యాంక‌ర్ ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని జేసీ మ‌హేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని ప్ర‌ధాన ఆసుప‌త్రుల‌కు, సీహెచ్‌సీల‌కు, ఏరియా ఆసుప‌త్రుల‌కు అవ‌స‌ర‌మైన మందులు ప‌క్కా అంద‌జేస్తున్నామ‌ని వివ‌రించారు. ఎల్‌.కోట‌లో మ‌రో కోవిడ్ కేర్ సెంట‌ర్‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సూచించ‌గా జేసీ కిశోర్ కుమార్ స్పందిస్తూ ఆ ప్రాంతంలో ఒక సారి ప‌ర్య‌టించి కేంద్ర ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. 

జిల్లా నుంచి ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు మాట్లాడిన త‌ర్వాత జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాసు మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ ప‌థ‌కం ద్వారా అందుతున్న కోవిడ్ సేవ‌ల‌పై నిఘా పెంచాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించుకోవాల‌ని సూచించారు. ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లో సేవ‌లు స‌వ్యంగా అందుతున్నాయో లేదో స‌రిచూసుకోవాల‌ని చెప్పారు. అలాగే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను సజావుగా నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. అధికారులు నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉంటూ కోవిడ్‌ను తరిమి కొట్టేందుకు కృషి చేయాల‌ని చెప్పారు. ప్ర‌జ‌ల్లో విశ్వాసం నింపేలా త‌గిన విధంగా సేవ‌లందించాల‌ని చెప్పారు. ఆక్సీజ‌న్, మందులు స‌వ్యంగా అందేలా రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ని పేర్కొన్నారు. 

రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ మాట్లాడుతూ క‌రోనాను నియంత్రించేందుకు పటిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని చెప్పారు. అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రిస్తూ జిల్లాలో కోవిడ్‌ను క‌ట్ట‌డి చేయాల‌ని తెలిపారు. సేవ‌లు స‌వ్యంగా అందేలా త‌గినంత మంది వైద్య సిబ్బందిని నియ‌మించుకోవాల‌ని జిల్లా అధికారుల‌కు సూచించారు. సంబంధిత ప్ర‌క‌ట‌ను జారీ చేయాల‌ని ఆదేశించారు. బెడ్స్‌, రెమిడెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్లు, ఆక్సీజ‌న్‌ను అవ‌స‌ర‌మైన మేర అందుబాటులో ఉంచుకోవాల‌ని సూచించారు. జిల్లాలోని ఎల్‌.కోట‌, ఎస్‌.కోట‌, వేపాడ‌, జామి ప్రాంతాల్లో కోవిడ్ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నందున అక్క‌డ పరిస్థితిని స‌మీక్షించాల‌ని చెప్పారు. అవ‌సర‌మైతే ఎల్‌.కోట హైస్కూల్‌లో కోవిడ్ కేర్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేయాల‌ని జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. అలాగే జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌లో సేవ‌లు బాగా అందేలా చ‌ర్య‌లు చేపట్టాల‌ని చెప్పారు. మంచి భోజ‌నం, స‌మ‌యానికి మందులు అంద‌జేయాల‌ని ఆదేశించారు.  పార్వ‌తీపురం ఏరియా ఆసుప‌త్రిలో 6 కె.ఎల్. సామ‌ర్థ్యం గ‌ల ఆక్సీజ‌న్ ట్యాంక‌ర్‌ను త్వ‌రిత‌గ‌తిన అందుబాటులోకి తీసుకురావాల‌ని సూచించారు. ఫీవ‌ర్ స‌ర్వే స‌రిగా జ‌రిగేలా చూసుకోవాల‌ని, హోం ఐసోలేష‌న్ కిట్ల పంపిణీ స‌రిగా జ‌రుగుతుందా లేదా అనే విష‌యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు పరిశీలించుకోవాల‌ని చెప్పారు. ప్ర‌జ‌ల నుంచి చిన్న విమ‌ర్శ కూడా రాకుండా కోవిడ్ సేవ‌లందాల‌ని మంత్రి జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లో సేవ‌ల‌ను స‌మీక్షించుకోవాల‌ని సూచించారు. జిల్లాలో ప్ర‌స్తుతం అధికారులు చేప‌డుత‌న్న చ‌ర్య‌లు బాగున్నాయని.. మ‌రింత విస్తృత పరిచి కోవిడ్‌ను నియంత్రించాల‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి పేర్కొన్నారు.


స‌మావేశంలో భాగంగా ముందుగా ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు ప‌లు అంశాల‌పై మాట్లాడారు. త‌మ ప‌రిధిలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్సీ సురేష్ బాబు మాట్లాడుతూ కోవిడ్ ఆసుప‌త్రుల్లో నియ‌మించే అద‌న‌పు సిబ్బందిలో ఎంబీబీఎస్ వాళ్ల‌తో పాటు, బీడీఎస్ వాళ్ల‌ను కూడా తీసుకుంటే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఎస్‌.కోట ఎమ్మెల్యే క‌డుబండి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ ఎస్‌.కోట ప‌రిధిలో ఇప్ప‌టికే మూడు ఆక్సీజ‌న్ కాన్స‌లేట‌ర్స్ ఏర్పాటు చేశామ‌ని, మ‌రో మూడు కాన్స‌లేట‌ర్స్ కావాల‌ని కోరారు. అలాగే స్థానిక ఆసుప‌త్రులకు స్టెరాయిడ్స్ అంద‌జేయాల‌ని చెప్పారు. గ‌జ‌ప‌తిన‌గ‌రం ఎమ్మెల్యే బొత్స అప్ప‌ల‌న‌ర‌సయ్య మాట్లాడుతూ గత వారం స‌మావేశం నిర్వ‌హించి చ‌ర్చించిన చాలా స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌య్యాయ‌ని, జిల్లాలో ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని పేర్కొన్నారు. జిల్లా అధికారులు చేప‌డుతున్న చ‌ర్య‌లు బాగున్నాయ‌ని అన్నారు. పార్వ‌తీపురం ఎమ్మెల్యే అల‌జంగి జోగారావు మాట్లాడుతూ పార్వ‌తీపురం ఏరియా ఆసుప‌త్రికి సంబంధించి గ‌త మీటింగ్‌లో ప్ర‌స్తావించిన స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌య్యాయ‌ని తెలిపారు. ఆర్‌.టి.పి.సి.ఆర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశార‌ని, అద‌నంగా అంబులెన్స్‌ను కేటాయించార‌ని పేర్కొన్నారు. 


స‌మావేశంలో జిల్లా కోవిడ్ స్పెష‌ల్ ఆఫీస‌ర్ స‌త్య‌నారాయ‌ణ‌, గ‌జ‌ప‌తిన‌గ‌రం ఎమ్మెల్యే బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, పార్వ‌తీపురం ఎమ్మెల్యే అల‌జంగి జోగారావు, ఎస్‌.కోట ఎమ్మెల్యే క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, జేసీలు కిశోర్ కుమార్‌, మ‌హేష్ కుమార్‌, వెంక‌ట‌రావు, డీఎం&హెచ్‌వో ర‌మ‌ణ‌కుమారి, డీసీహెచ్ఎస్ నాగ‌భూష‌ణ‌రావు, మ‌హారాజ ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ డా. సీతారామ‌రాజు, మిమ్స్ డైరెక్ట‌ర్ డా. భాస్క‌ర‌రాజు, జడ్పీ సీఈవో వెంక‌టేశ్వ‌రరావు, విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలి, పార్వ‌తీపురం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఇత‌ర అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.  

Vizianagaram

2021-05-19 13:39:56