1 ENS Live Breaking News

బ్యాంకుల్లో కోవిడ్ నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో కోవిడ్ నిబంధ‌న‌ల‌ను ఖ‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశించారు. డిఆర్‌డిఏ, ఎల్‌డిఎం, ఇత‌ర అధికారుల‌తో మంగ‌ళ‌వారం జూమ్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. బ్యాంకుల్లో కోవిడ్ నిబంధ‌న‌ల అమ‌లు, వైఎస్ఆర్ బీమా న‌మోదుపై స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, క‌ర్ఫ్యూ కార‌ణంగా బ్యాంకులు ర‌ద్దీగా ఉంటున్నాయ‌ని, అందువ‌ల్ల త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయాల‌ని స్పష్టం చేశారు. వినియోగ‌దారులు భౌతిక దూరాన్ని పాటించేలా చూడాల‌ని, ప్ర‌తీ బ్యాంకు ప్ర‌వేశ‌ద్వారం వ‌ద్ద త‌ప్ప‌నిస‌రిగా శానిటైజ‌ర్‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. మాస్కుల‌ను ధ‌రించిన వారిని మాత్ర‌మే బ్యాంకుల్లోకి అనుమ‌తించాల‌ని స్ప‌ష్టం చేశారు. అదేవిధంగా ఎటిఎంల వ‌ద్ద కూడా శానిటైజ‌ర్‌ను, టిష్యూ పేప‌ర్‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. అలాగే బ్యాంకు ప‌నివేళ‌లు కుదించినందువ‌ల్ల‌, ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌కుండా, ఏటిఎంల‌లో త‌గినంత న‌గ‌దు నిల్వ‌లు ఉండేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు.

                 వైఎస్ఆర్ బీమా న‌మోదు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు. ఈ నెలాఖ‌రు లోగా శ‌త‌శాతం ల‌క్ష్యాల‌ను పూర్తి చేయాల‌న్నారు. గ‌తేడాది సుమారు 81 శాతం బీమా న‌మోదుతో మ‌న జిల్లా రాష్ట్రంలోనే మొద‌టి స్థానంలో నిలిచింద‌ని, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా త‌మ ల‌క్ష్యాల‌ను పూర్తి చేయాల‌ని ఆదేశించారు. క‌రోనా వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్నందున‌, బీమా లేనివ్య‌క్తులు ఎవ‌రైనా చ‌నిపోతే, ఆ కుటుంబం తీవ్రంగా న‌ష్ట‌పోతుంద‌ని, అందువ‌ల్ల ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ నెలాఖ‌రు నాటికి వైఎస్ఆర్ బీమా రెన్యువ‌ల్‌తో బాటు, కొత్త‌గా న‌మోదును కూడా పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తిరోజూ బ్యాంకు కార్య‌క‌లాపాలు ముగిసిన త‌రువాత 12 గంట‌లు నుంచి  2 గంట‌లు వ‌ర‌కూ, వైఎస్ఆర్ బీమా న‌మోదుకు కేటాయించాల‌న్నారు. డిఆర్‌డిఏ సిబ్బంది ఈ వేళ‌ల్లోనే బ్యాంకులకు వెళ్లి, బీమా రెన్యువ‌ల్‌, న‌మోదు పూర్తి అయ్యేలా చూడాల‌న్నారు.

               డిఆర్‌డిఏ పిడి కె.సుబ్బారావు మాట్లాడుతూ, జూన్ 1 నుంచి కొత్త పాల‌సీ అమ‌ల్లోకి వ‌స్తుంద‌న్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని, జిల్లాలో వైఎస్ఆర్ బీమా న‌మోదు, రెన్యువ‌ల్ ప్ర‌క్రియ‌ల‌ను ఏప్రెల్ 16 నుంచే మొద‌లు పెట్టామ‌ని చెప్పారు. కోవిడ్ కార‌ణంగా కొంత జాప్యం జ‌రుగుతోంద‌ని, ఈ నెలాఖ‌రు నాటికి పూర్తి చేస్తామ‌ని చెప్పారు. దీనికోసం ప్ర‌తీ బ్యాంకుకు ఒక డిఆర్‌డిఏ సిబ్బందిని పాయింట్ ప‌ర్స‌న్‌గా నియ‌మించామ‌న్నారు. వీరు ప్ర‌తీరోజూ సంబంధిత స‌చివాల‌యాల‌కు వెల్లి, వెల్ఫేర్ అసిస్టెంట్‌వ‌ద్ద ఎన్‌రోల్‌మెంట్ జాబితాల‌ను తీసుకొని, బ్యాంకుల‌కు వెళ్లి ఆన్‌లైన్‌ చేయిస్తున్నార‌ని చెప్పారు.

               ఎల్‌డిఎం కె.శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, జిల్లా క‌లెక్ట‌ర్ ఇచ్చిన ఆదేశాల‌ను త‌క్ష‌ణ‌మే బ్యాంకుల్లో అమ‌లు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. బీమా న‌మోదు కోసం ఉద‌యం 12 గంట‌లు నుంచి 2 గంట‌లు వ‌ర‌కూ స‌మ‌యాన్ని కేటాయించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. ఐఓబి, ఎస్‌బిఐ, గ్రామీణ బ్యాంకుల్లో కొన్ని సాంకేతిక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, వాటి ప‌రిష్కారానికి సంబంధిత అధికారుల‌తో మాట్లాడ‌టం జ‌రిగింద‌న్నారు. బ్యాంకు ఉద్యోగుల్లో ధైర్యాన్ని నింపి, 45 ఏళ్లు పైబ‌డిన వారంద‌రికీ టీకా వేయించ‌డానికి ఎంత‌గానో స‌హ‌క‌రించిన జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఈ సంద‌ర్భంగా ఎల్‌డిఎం కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Vizianagaram Collectorate

2021-05-18 12:41:22

104 కాల్స్‌కు స‌త్వ‌ర ప‌రిష్కారం..

తూర్పుగోదావరి జిల్లాలో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి మార్గ‌నిర్దేశ‌నం మేర‌కు జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) జి.రాజ‌కుమారి నేతృత్వంలో ఏర్పాటైన ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ ద్వారా 104 కాల్స్‌కు త్వ‌రిత‌గతిన ప‌రిష్కారం ల‌భిస్తోంద‌ని, బ్యాక్‌లాగ్ కాల్స్ అనే మాట‌కు తావులేకుండా ఈ వ్య‌వ‌స్థ ప‌నిచేస్తోంద‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి, కాకినాడ అర్బ‌న్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, డీసీసీబీ ఛైర్మ‌న్ అనంత ఉద‌య్‌భాస్క‌ర్‌, జేసీ (డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి త‌దిత‌రుల‌తో క‌లిసి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ క‌లెక్ట‌రేట్‌లోని వికాస కార్యాల‌యం వ‌ద్ద‌గ‌ల బెనెడ్ క్ల‌బ్‌లో ఏర్పాటుచేసిన 104 కాల్‌సెంట‌ర్ విభాగాన్ని సంద‌ర్శించారు. విభాగం ప‌నితీరును పరిశీలించి, సిబ్బంది నుంచి వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. హోం ఐసోలేష‌న్ కిట్ల రూప‌క‌ల్ప‌న ప‌నులను ప‌రిశీలించారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ 104 కాల్స్ ప‌రిష్కారం కోసం స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్న 40 మంది సిబ్బంది, అధికారుల బృందం మొత్తాన్ని అభినందిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి బాధితునికి ప్ర‌త్యేకంగా ట్రాక్‌షీట్ రూపొందించి, నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ద్వారా అవ‌స‌ర‌మైన సేవ‌లు అందించేందుకు ఈ వ్య‌వ‌స్థ కృషిచేస్తోంద‌న్నారు. డివిజ‌న్ స్థాయిలోనూ కాల్‌సెంట‌ర్లు సేవ‌లందిస్తున్నాయ‌న్నారు. కోవిడ్ బారిన‌ప‌డినవారు ఆందోళ‌న చెంద‌కుండా, ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వైద్య స‌హాయం పొందాల‌ని, ఈ విధంగా చేస్తే త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చ‌న్నారు. కొన్ని ప్రైవేటు ఆసుప‌త్రులు అధిక ఫీజులు వ‌సూలు చేయ‌డం వ‌ల్ల అన్ని ఆసుప‌త్రుల‌కు చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని, ప్రైవేటు ఆసుప‌త్రులు ఇది సంపాద‌నకు కాకుండా స‌హాయం చేయాల్సిన స‌మ‌యంగా భావించి సేవ‌లందించాల‌ని సూచించారు. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించే వారిపై చ‌ట్ట ప‌రంగా చ‌ర్య‌లు ఉంటాయ‌ని స్పష్టం చేశారు. కోవిడ్ క‌ట్ట‌డికి ప్ర‌భుత్వ యంత్రాంగం తీసుకుంటున్న చ‌ర్య‌లు హ‌ర్ష‌ణీయంగా ఉన్నాయ‌ని, బాధితుల‌కు సేవ‌లందించే క్ర‌మంలో ప్ర‌భుత్వ ఉద్యోగులు కూడా వైర‌స్ బారిన‌ప‌డుతున్నార‌ని తెలిపారు. ఒకరు చేసిన త‌ప్పిదం వంద‌మందిని న‌ష్ట‌ప‌రుస్తుంద‌ని.. అందువ‌ల్ల ప్ర‌జ‌లంద‌రూ స్వీయ క్ర‌మ‌శిక్ష‌ణ‌తో జాగ్ర‌త్త‌లు పాటిస్తూ కోవిడ్ క‌ట్ట‌డిలో భాగ‌స్వాములు కావాల‌ని మంత్రి వేణుగోపాల‌కృష్ణ పిలుపునిచ్చారు. 
             క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ కేర్ కేంద్రాల్లో (సీసీసీ)నూ ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందుబాటులో ఉంచుతున్నామ‌ని, ఈ ఏర్పాటు వ‌ల్ల కోవిడ్ ఆసుప‌త్రుల‌పై ఒత్తిడి బాగా త‌గ్గుతోంద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం జిల్లాలోని సీసీసీల్లో దాదాపు 2000 మంది ఉన్నార‌ని తెలిపారు. గిరిజ‌న ప్రాంతాల‌కూ ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను స‌మ‌కూర్చ‌నున్న‌ట్లు వెల్లడించారు. కార్పొరేట్‌, వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌లు కూడా సామాజిక బాధ్య‌త‌గా ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, మొబైల్ వెంటిలేట‌ర్లు వంటివి అందిస్తున్నాయ‌న్నారు. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారికి ఔష‌ధాల‌తో ప్ర‌త్యేక కిట్ల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపారు. మందుల నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించే విష‌యంలో మెడిక‌ల్ దుకాణాల‌పైనా నిఘా పెట్టామ‌ని, ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు తేలితే చ‌ట్ట‌ప‌రంగా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని క‌లెక్ట‌ర్ హెచ్చ‌రించారు. కార్య‌క్ర‌మంలో వికాస పీడీ కె.ల‌చ్చారావు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Kakinada

2021-05-18 12:39:39

జాగ్రత్తలు పాటించకపోతే తిష్ట వేస్తుంది..

కరోనా సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే  వైరస్ ఊపిరితీత్తుల్లో తిష్ట వేస్తుందని రాష్ట్ర రవాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.  మొదట్లో వైరస్ సోకిన 3,  5 రోజుల్లో లక్షణాలు కనిపించేవనీ, ఇప్పుడు అనేక కేసులలో ముదిరిన తర్వాతే కనిపిస్తున్నాయిని హెచ్చరించారు.  మంగళవారం  తన కార్యాలయంకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. మచిలీపట్నంకు చెందిన ఎం ఎస్ ప్రకాశరావు మంత్రి వద్ద తన సమస్యను చెప్పుకొన్నారు. తమ బంధువు ఒకరు కరోన సోకి ఆ సమస్యతో బాధపడుతున్నారని దీంతో ఆక్సిజన్ స్థాయి క్రమేపి తగ్గిపోతుందని ప్రభుత్వాసుపత్రిలో ఒక ఆక్సిజన్ బెడ్ ఇప్పించాలని కోరారు. ఈ విషయమై స్పందించిన మంత్రి , ప్రకాశరావు గారి  బంధువు పేరు వివరాలు ఫోన్ నెంబర్  వెంటనే తీసుకోవాలని తన వ్యక్తిగత కార్యదర్శి రఘురాంకు సూచించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, కోవిడ్-19 వైరస్ మానవ ఊపిరితీత్తుల్లోకి వెళ్లి..తన సామ్రాజ్యాన్ని నానాటికి  విస్తరించుకుంటుందన్నారు. తర్వాత అది ఊపిరితీత్తులు ఆక్సిజన్ గ్రహించే శక్తిని అడ్డుకుంటుందన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తిని అడ్డుకోవడమే కాకుండా.. ఊపిరితీత్తులకు రక్తాన్ని అందించే నాళాలను గడ్డకట్టిస్తుందన్నారు. ఫలితంగా శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్ సరఫరా కాదని దీంతో సమస్య తీవ్రమై రోగిని న్యుమోనియా వైపుకు దారి తీస్తుందని తెలిపారు. ఫలితంగా రక్తంలోనూ ఆక్సిజన్ శాతం తగ్గుతుందని అన్నారు. ఆక్సిమీటర్ ద్వారా ఈ మార్పును గుర్తించవచ్చని వివరించారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో, బాధితుడు తిరిగి తనంతట తానే ఊపిరి పీల్చుకొనే వరకు ఆక్సిజన్ అవసరమవుతుంది. కాబట్టి కరోనా వ్యాధి వచ్చినవారు శరీరంలో ఆక్సిజన్ శాతం మీద నిఘా పెట్టాలని అది ఎప్పుడు తగ్గుతున్నట్లు అనిపిస్తే తక్షణమే వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని మంత్రి పేర్ని నాని సూచించారు. .
       అలాగే , కరోనా టెస్టుల్లో నెగటివ్ వచ్చినవారు తమలో వైరస్ లేదని భావించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం లేదని ఫలితంగా వైరస్ నెమ్మదిగా ఊపిరితీత్తుల్లో విస్తరించి అకస్మాత్తుగా దాడి చేస్తోందని అన్నారు. సాధారణంగా మానవులు సరైన నిమిషానికి 7 లేదా 8 లీటర్ల గాలిని పీల్చి వదులుతారని  అంటే రోజుకు సుమారు 11 వేల లీటర్ల గాలిని శ్వాసిస్తారని ఇలా పీల్చేగాలిలో కేవలం 20 శాతం మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. ఇందులో ఊపిరితీత్తులు నిమిషానికి కేవలం 5 లేదా 6 మిల్లీ లీటర్ల ఆక్సిజన్ మాత్రమే దేహానికి  ఉపయోగించుకుంతుందని చెప్పారు. ఒక వేళ ఊపిరితీత్తులు పాడైతే..సాధారణం కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆక్సిజన్ గ్రహిస్తాయిని మంత్రి పేర్ని నాని చెప్పారు.  
    ఆక్సిజన్ శాతం 94 నుంచి 90 మధ్యన చూపిస్తుంటే శరీరానికి అదనంగా ఆక్సిజన్ అవసరమని, ఆ సమయంలో శరీరానికి ఎంత ఆక్సిజన్ అవసరమనేది కేవలం వైద్యులకు మాత్రమే తెలుస్తుందని కాబట్టి ఆస్పత్రిలో వైద్యుల సమక్షంలోనే ఆక్సిజన్ తీసుకోవాలని,లేకపోతే వైద్యపరంగా కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని మంత్రి అన్నారు. 
  స్థానిక చింతగుంట పాలెంకు చెందిన మాజీ కౌన్సిలర్ మిరియాల బాపనయ్య మంత్రిని కలిసి శారదానగర్, శివగంగ , ఖాలేఖాన్ పేట ప్రాంతంలో పారిశుధ్య పనులు సరిగా జరగడం లేదని చెప్పారు. ఈ విషయమై స్పందించిన మంత్రి మంత్రి పేర్ని నాని మునిసిపల్ కమీషనర్ కు ఫోన్ చేసి మాట్లాడి  ఈ సమస్యపై దృష్టి కేంద్రీకరించి ఆ ప్రాంతాలలో శానిటేషన్  మెరుగుపరచాలని ఆదేశించారు. 
   తాను ఏకాకినని, తనను చూసేవారు ఎవరూ లేరని వృద్ధాశ్రమంలో చేర్పించాలని మచిలీపట్నంకు చెందిన చల్లా బేబీ మంత్రిని ప్రాధేయపడింది. స్పందించిన ఆయన, అమ్మ మిమ్ములను అక్కడ చేర్పిస్తా.. అయితే, మీకు ముందు అనాధ సర్టిఫికేట్ , కోవిడ్ (ఆర్ టి పి సి ఆర్) పరీక్షలు చేయించిన తర్వాత వృద్ధాశ్రమంలో తప్పకుండ చేరవచ్చని అవి నేను మీకు చేయిస్తా అని మంత్రి పేర్ని నాని చెప్పారు.   

Machilipatnam

2021-05-18 12:34:32

మత్స్యకారుల్లో భరోసా వెలుగులు..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మ‌త్స్య‌కార భ‌రోసా ప‌థ‌కంలో భాగంగా జిల్లాలో 2953 కుటుంబాల‌కు రూ.2.953 కోట్ల ఆర్థిక సాయం వారి ఖాతాల్లో జ‌మ అయ్యింది. వేట నిషేధ‌కాలంలో మ‌త్స్యకారుల సంక్షేమార్థం ప్ర‌వేశ‌పెట్టిన ఈ ప‌థ‌కం మూడో విడ‌త సాయాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం త‌న క్యాంపు కార్యాల‌యం నుంచి మీట నొక్క‌డం ద్వారా విడుద‌ల చేశారు. వ‌రుసగా మూడో ఏడాది అన‌గా 2021-22 కాలానికి గాను ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున రైతుల ఖాతాల‌కు జ‌మ చేశారు. రాష్ట్రంలో మ‌త్స్యకార సోద‌రుల సంక్షేమార్థం చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మాన్ని మంత్రులు, ల‌బ్ధిదారుల స‌మ‌క్షంలో ముఖ్య‌మంత్రి ప్రారంభించారు. రాష్ట్రం నుంచి ప‌లువురు ల‌బ్ధిదారులు మాట్లాడిన త‌ర్వాత సంబంధిత చెక్కును ముఖ్య‌మంత్రి చేతుల మీదుగా విడుద‌ల చేశారు. అనంత‌రం జిల్లాకు సంబంధించిన చెక్కును ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, క‌లెక్ట‌ర్‌, జేసీ ల‌బ్ధిదారుల‌కు అంద‌జేశారు.  ఈ సంద‌ర్భంగా జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జిల్లా నుంచి క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్‌, విజ‌య‌న‌గ‌రం ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, జేసీ కిశోర్ కుమార్‌, మ‌త్స్య‌శాఖ ఉప సంచాల‌కులు నిర్మ‌లాకుమారి, జిల్లా మ‌త్స్యకార సంఘం ప్రెసిడెంట్ బ‌ర్రె చిన‌ప్ప‌న్న‌, మ‌త్స్య‌కార నాయకులు మైల‌ప‌ల్లి న‌ర్శింహులు, ల‌బ్ధిదారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-18 11:15:31

సీఎం వైఎస్ జగన్ దృఢ సంక‌ల్పంతో ప‌నిచేస్తున్నారు..

వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో ద్రుఢ సంకల్పంతో పనిచేస్తున్నారని  నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు అన్నారు. సీఎం వీడీయో కాన్ఫరెన్సు అనంతరం జిల్లా కలెక్టర్ డా.హరిజహర్ లాల్, మత్స్యశాఖ ఉప సంచాలకుడు ఎన్.నిర్మలకుమారిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.  మ‌త్స్యకార సోద‌రుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. మ‌త్స్య‌కార భ‌రోసా ప‌థ‌కం వ‌ల్ల జిల్లాలో 2953 కుటుంబాలు ల‌బ్ధి పొందుతున్నాయ‌ని పేర్కొన్నారు. వేట నిషేధ కాలంలో గ‌త ప్ర‌భుత్వాలు అందించిన సాయంతో పోలిస్తే ఇప్పుడు అందిస్తున్న రూ.10వేలు చాలా ఎక్కువ‌ని ఉద్ధాటించారు. మ‌త్స్యకారుల‌కు నాడు వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి, ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎన్నో మంచి ప‌నులు చేశార‌ని గుర్తు చేశారు. భోగాపురం, పూస‌పాటిరేగ మండ‌లాల ప‌రిధిలోని మ‌త్స్యకారుల‌కు ఈ ఆర్థిక తోడ్పాడు ఎంతో ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంద‌ని పేర్కొన్నారు. పూస‌పాటిరేగ ప్రాంతంలో ఫిషింగ్ హార్బ‌ర్ ఏర్పాటుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. త్వ‌ర‌లోనే అది అందుబాటులోకి వ‌స్తుంద‌ని ఆకాంక్షిస్తున్నాన‌ని అన్నారు. మ‌త్స్యకారుల జీవ‌నోపాధి పెంపుద‌ల‌కు ఈ ప్ర‌భుత్వం తీవ్ర కృషి చేస్తోంద‌ని పేర్కొన్నారు. వేట నిమిత్తం దారి త‌ప్పిపోయిన మ‌త్స్య‌కారులను బంగ్లాదేశ్‌, పాకిస్థాన్ నుంచి విడిపించి తీసుకొచ్చిన ఘ‌న‌త జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌న్నారు. అలాగే జిల్లాలో ప్ర‌స్తుతం కోవిడ్ క‌ట్ట‌డికి అధికారులు చేప‌డుతున్న చ‌ర్య‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని ఎమ్మెల్యే అన్నారు. విభిన్న పద్ధ‌తులు ఆచ‌రిస్తూ కోవిడ్ సేవ‌లందిస్తున్నార‌ని కితాబిచ్చారు. మ‌రిన్నిసేవ‌లందించి ఈ మ‌హ‌మ్మారిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఈ సంద‌ర్భంగా సూచించారు. విజ‌య‌న‌గ‌రం ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, జేసీ కిశోర్ కుమార్‌,  జిల్లా మ‌త్స్యకార సంఘం ప్రెసిడెంట్ బ‌ర్రె చిన‌ప్ప‌న్న‌, మ‌త్స్య‌కార నాయకులు మైల‌ప‌ల్లి న‌ర్శింహులు, ల‌బ్ధిదారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Collectorate

2021-05-18 11:13:37

అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు..

రాష్ట్రంలో అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైయస్సార్ మత్స్యకార భరోసా మూడో ఏడాది ఆర్ధిక సహాయ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు మత్స్యకారులకు వేట నిషేధ కాలమని, ఆ సమయంలో ప్రతి ఏటా పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో 1,19,875 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.119.88 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. సముద్రంపై చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు గతంలో కేవలం నాలుగు వేల రూపాయలు మాత్రమే అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద అర్హులైన మర పడవలు, యాంత్రిక పడవలతో పాటు సముద్రంలో సాంప్రదాయ పడవలపై వేట జరిపే మత్స్యకారులకు భృతి చెల్లిస్తున్నట్లు ఆయన వివరించారు. 2019 నుండి ఇప్పటి వరకు రూ. 332 కోట్లను భరోసాగా అందించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. డీజిల్ ఆయిల్ పై లీటర్ కు సబ్సిడీ రూ.6.03 నుండి రూ.9 పెంచుతూ,  ఆయిల్ పోయించుకుని సమయంలోనే రేటు తగ్గించి పోసే ఏర్పాటు చేశామని చెప్పారు. వేట చేస్తూ మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంపుదల చేసినట్లు ఆయన చెప్పారు. దాదాపు రూ.1,510 కోట్ల వ్యయంతో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్నంలలో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ప్రారంభించడం జరిగిందని,  రెండో దశలో శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖజిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప,  ప్రకాశం జిల్లా కొత్తపట్నంలలో రూ.1365.35 కోట్లతో నాలుగు ఫిషింగ్ హార్బర్ ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ హార్బర్ల ద్వారా దాదాపు 85 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఈ ఏడాది రూ.780 కోట్ల వ్యయంతో 53,550 మంది ఆక్వా రైతులకు ఇప్పటివరకు రూ.1,560 కోట్లతో లబ్ది కలిగేలా యూనిట్ కరెంటు కేవలం రూ.1.50 లకే సరఫరా  సిగేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.50.30 కోట్ల వ్యయంతో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్ లను ఏర్పాటుతో నాణ్యమైన ఉత్పత్తులు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన చేపలు, రొయ్యలు అందుబాటులోకి తీసుకువచ్చి వినియోగం పెంచడం, పౌష్టికాహార భద్రత కల్పించడంతో పాటు జనతా బజార్లకు అనుసంధానం చేసి ఆక్వా రైతులకు, మత్స్యకారుల కూడా గిట్టుబాటు ధర కల్పించాలని రూ.332.9 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో అవసరమైన అన్ని నియోజకవర్గాల్లో ఆక్వా హబ్ లు, వాటికి అనుసంధానంగా రిటైల్ దుకాణాలు ఏర్పాటు దిశగా అడుగులు వేయడం జరుగుతుందన్నారు. మొదటి విడతగా 25 ఆక్వా హబ్ లకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. 2019 నుండి ఇప్పటివరకు మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.2030.87 కోట్ల రూపాయలను 2,12,535 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సహాయంగా అందించడం జరిగిందని ఆయన చెప్పారు. మత్స్య, ఆక్వా రైతులకు సేవలు అందించేందుకు వీలుగా వెబ్ అప్లికేషన్ eMatsyakar  ప్రారంభించామని, సహాయం, ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 155251 నెంబర్ కు ఫోన్ చేయవచ్చని ఆయన తెలిపారు.

          జిల్లా కలెక్టర్ జె నివాస్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ జిల్లాలో  4,698 అర్హమైన బోట్లకు సంబంధించి 16,630 మంది మత్స్యకారులకు వైయస్సార్ మత్స్యకార భరోసా క్రింద లబ్ధి చేకూరుతుందన్నారు. ఇందులో భాగంగా రణస్థలం మండలంలో 801 బొట్లకు సంబంధించి 2424 మంది, ఎచ్చెర్ల మండలంలో 537 బోట్లు,  1937 మంది లబ్ధిదారులు.,  శ్రీకాకుళంలో 339 బోట్లు,  1074 మంది., గారలో 551 బోట్లు, 2054 మంది., పొలాకిలో 375 బోట్లు, 1504 మంది.,  సంతబొమ్మాలిలో 323 బోట్లు 1310 మంది.,  మందస మండలంలో 67 బోట్లు 230 మంది.,  వజ్రపుకొత్తూరులో 515 బోట్లు 1881 మంది.,  సోంపేటలో 434 బోట్లు 1610 మంది,  కవిటి లో 638 బోట్లు 2163 మంది, ఇచ్చాపురంలో 118 బోట్లు 443 మంది లబ్ధిదారులు ఉన్నారని ఆయన చెప్పారు.

          ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మందస మండలం నేల గంగువాడకు చెందిన పొట్టి ధర్మారావు మాట్లాడుతూ వివిధ పథకాల క్రింద ఆర్ధిక సహాయం అందిందన్నారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు చూస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి లాంఛనంగా చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి.వి. శ్రీనివాసరావు, మత్స్యకార సహకార సంఘం అధ్యక్షులు కోనాడ నర్సింగరావు, నెయ్యిల సంఘ ప్రెసిడెంట్ పాండ్రంకి మురళీకృష్ణ, మత్స్యకార నాయకులు మైలపల్లి పోలీస్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-18 10:39:54

బుడగట్ల పాలెంలో ఫిష్షింగ్ హార్బర్..

మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే  లక్ష్యంగా ఈ ఏడాదే ఎచ్చెర్ల మండలం బుడగట్ల పాలెంలో ఫిషింగ్ హార్బర్ పనులు మొదలు పెడతామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వేట నిషేధంతో ఉపాధి కోల్పోతున్న గంగపుత్రులకు భృతి కల్పించేందుకు మత్స్యకార భరోసా పథకం కింద రూ.10 వేలు సీఎం జగన్ అమరావతి నుంచి ప్రారంభించిన కార్యక్రమానికి ఆయన శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుంచి హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ మత్స్యకార భరోసా పథకం కింద వారి ఖాతాల్లోనే సొమ్ములు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ఒకవైపు కరోనా, మరోవైపు వేట నిషేధంతో ఇళ్లకే పరిమితమైన మత్స్య కారులకు ప్రభుత్వసాయం ఉపశమనం కలిగిస్తుందని అన్నారు.  జిల్లాలో 11 తీర ప్రాంత మండలాలలోని 16630 మంది గంగపుత్రులకు రూ.16కోట్ల 63 లక్షలు విడుదల చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో 193 కి. మీ. మేర సువిశాల తీరప్రాంతం ఉందని వేలాది మంది వేట పైనే ఆధారపడి జీవిస్తున్నారని, మత్స్యకారులు సొంతగా పడవలు సమ కూర్చుకుంటే వారికి ప్రయోజనం సమకూరుతుందని వివరించారు. వజ్రపుకొత్తూరు లో జెట్టీ నిర్మాణం త్వరలోనే పూర్తి అవుతుందని అన్నారు. భవనపడులో గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు వివరించారు. పశ్చిమ గోదావరిలో మత్స్యకార  యూనివర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ  కార్యక్రమంలో  కలెక్టర్ జె నివాస్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఫిషరీస్ జె.డి టీవీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-18 10:38:06

24 నుంచి అప్నన్న హుండీ లెక్కంపు..

విశాఖలోని సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవస్థానం హుండీ లెక్కింపు ఈనెల 24వ తేది నుంచి 26 వరకూ మూడు రోజులు చేపట్టున్నట్టు ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. మంగళవారం ఆమె దేవస్థానంలో మీడియాతో మాట్లాడారు.  స్వామివారి హుండీ లెక్కింపు బుధవారం ఉదయం 7.30గంలకు ప్రారంభమవుతుందన్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కోవిడ్ నియమ నిబంధనలు పూర్తి స్థాయిలో పాటిస్తూ సింహగిరిపైన బేడామండపంలో  హుండీల లెక్కింపు జరుగుతందన్నారు. ఈ మేరకు బేడా మండపాన్ని ముందుగానే సోడియం హైపోక్లోరైడ్ ద్రవాణంతో శుద్ధి చేపట్టనున్నట్టు కూడా చెప్పారు. 

Simhachalam

2021-05-18 10:14:54

కోవిడ్ బాధితులకు యోగాలో శిక్షణ..

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ బాధితులకు యోగ, వ్యాయామాలు ఆస్పత్రుల్లో ప్రవేశపెడుతున్నారు. జిల్లా కోవిడ్ ఆసుపత్రి జెమ్స్ లో యోగ ఇప్పటికే ప్రవేశపెట్టి కోవిడ్ బాధితులకు సాధారణ వ్యాయామాలను బోధిస్తున్నారు. వ్యాయామ, యోగా నిపుణులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ హేమంత్ మంగళవారం తెలిపారు. ఆసుపత్రిలో ఫిజియోథెరాఫీతో పాటు యోగ, వ్యాయామ శిక్షణ ఏర్పాటు చేస్తున్నామని తద్వారా కోవిడ్ బాధితుల్లో మానసిక ధైర్యం ఏర్పడుతుందని అన్నారు. యోగాలో సాధారణ ఆసనాలు, ప్రాణాయామాలు చేయడం ద్వారా వారిలో శ్వాస కోస వ్యాయామాలు చేయించడం జరుగుతుందని తద్వారా మంచి మార్పు వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫిజియోథెరాఫీ, యోగాతో త్వరగా కోలుకుంటున్నారని హేమంత్ పేర్కొన్నారు. కోవిడ్ బాధితులు త్వరగా కొలుకుని ఇంటికి చేరాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకు ఆత్మవిశ్వాసం, ధైర్యం అవసరమని అటువంటి వారు త్వరగా కొలుకుంటున్నారని అందుకు యోగా సహాయ పడగలదని ఆయన వివరించారు.

Srikakulam

2021-05-18 10:02:57

కోవాక్సిన్ రెండో డోసు పంపిణీకి ఏర్పాట్లు..

కోవాక్సీన్ రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రణాళికాబధ్ధంగా అందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్,  కాకినాడ నగర పాలక  సంస్ధ పరధిలోని పైండా సత్తిరాజు నగర పాలక సంస్ధ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ వేక్సీనేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనాభారీత్యా ఎక్కవ సాంద్రత కల్గిన తూర్పు గోదావరి జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి సజావుగా అందించే విధంగా జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసిందన్నారు. ఇందులో భాగంగా కోవిడ్ వ్యాక్సీన్ వేసేందుకు ప్రత్యేక కేంద్రాలు గుర్తించడం జరిగిందన్నారు. ఈ కేంద్రాల్లో ప్రతి మంగళవారం, శుక్రవారాలలో వ్యాక్సీన్ వేస్తారన్నారు. మొదటి  డోస్ వ్యాక్సీన్ వేయించుకున్న వారికి వారు వేయించుకొన్న తేదీలకు అనుగుణంగా వాలంటీర్లు వారి ఇంటికి వెళ్ళి కూపన్లు ఆందజేస్తారన్నారు. కూపన్లు పొందిన వారు గుర్తించిన వ్యాక్సీన్ కేంద్రానికి చేరుకొని వ్యాక్సీన్ పొందాలన్నారు. మొదటి డోసు వేసుకొన్నవారు రెండవ డోస్ కోసం తగిన రశీదు చూపిస్తే రెండవ డోసు కు అవకాశం వుంటుందన్నారు. మొదటి డోసు వేసుకొని తగిన ఆధారాలు లేకపోతే తనకు రెండవ డోస్ కావాలని కోరితే అలాంటి వారికి వ్యాక్సిన్ వేసి రెండవ డోసుగా గుర్తించే విధంగా వ్యాక్సీనేషన్ కేంద్రాలకు సూచనలు చేయడం జరిగిందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో మొదటి డోస్ వేయించుకొన్న వారికి రెండవ డోస్ వేయడం జరుగుతుందన్నారు. మే 31 వరకు ప్రతి మంగళ, శుక్రవారాల్లో రెండో డోస్ వేయడం జరుగుతుందనీ, జూన్ నెల నుండి మొదటి డోస్ వేయడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పైండా సత్తిరాజు బాలికోన్న పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సీన్ కేంద్రంల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను నగర పాలక సంస్ధ అధికారులతో కలిసి పరిశీలించారు.

Kakinada

2021-05-18 09:59:20

ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు..

ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం సేకరించి తక్షణం స్పందించే విధంగా పని చేస్తునట్లు జాయింట్ కలెక్టర్ డా. జి.లక్ష్మిశ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా పౌరసరఫరాల విభాగంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కంట్రోల్ కేంద్రాన్ని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్  ఇ.లక్ష్మీరెడ్డి, డిఎస్ఓ ప్రసాదరావులతో కలిసి జాయింట్ కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జేసి కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించి, క్షేత్రస్ధాయి నుండి వచ్చే ఫోన్ కాల్స్ ఏ విధంగా స్పందిస్తున్నారో పరిశీలించారు. క్షేత్ర స్ధాయిలో ఏ రైతు ఆయినా ధాన్యం కొనుగోలు చేయలేది ఫిర్యాదు చేస్తే తక్షణం ఆ ప్రాంత రైస్ మిల్లర్లతో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేసే విధంగా కంట్రోల్ రూమ్ అధికారులు పని చేయాలన్నారు. క్షేత్ర స్ధాయిలో ఉన్న విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ కు కంట్రోల్ రూమ్ కు వచ్చిన సమాచారం తెలియజేసి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ అధికారులకు జేసి లక్ష్మిశ పలు సూచనలు చేశారు. 

Kakinada

2021-05-18 09:56:42

కోవిడ్ ఆస్పత్రుల్లో కంట్రోల్ రూమ్ లు..

శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఆయా ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న బాధితుల బంధువులు కంట్రోల్ రూమ్ ఇన్ ఛార్జ్ లకు ఫోన్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆసుపత్రులు, ఇన్ ఛార్జ్ ల పేర్లు, ఫోన్ నెంబర్లను తెలిపారు. 1. జెమ్స్ ఆస్పత్రి   డాక్టర్ హేమంత్  9133212546,  2. రిమ్స్ ఆసుపత్రి   డాక్టర్ చలమయ్య  9849300520 , 3. డాక్టర్ గొలివి ఆస్పత్రి   డాక్టర్ రవీంద్ర  986620986, 
4. కిమ్స్ ఆసుపత్రి   డాక్టర్ రాజేష్   8088096238, 5. మెడీకవర్ ఆసుపత్రి   సాగరిక   9154704550, 6. బగ్గు సరోజినీ ఆసుపత్రి  మీనా కుమారి 8639505601, 
7. లైఫ్ ఆస్పత్రి   డాక్టర్ చంద్రశేఖర్   9966946111, 8. పివీఎస్ రామ్మోహన్ ఆస్పత్రి  డాక్టర్ రామ్మోహన్  9292007123, 9.అమృత ఆస్పత్రి   డాక్టర్ రవి ప్రసాద్        9966552555,  10. కమల ఆసుపత్రి   డాక్టర్ రామకృష్ణ       9441160803, 11. జిల్లా ఆసుపత్రి, టెక్కలి   డాక్టర్ ప్రవీణ్     7673905486, 
12. ఏరియా ఆసుపత్రి, పాలకొండ  డాక్టర్ రవీంద్ర   9440334604, 13. సూర్య ముఖి ఆస్పత్రి   డాక్టర్ సత్య స్వరూప్   7671900496, 
14. సన్ రైజ్ ఆస్పత్రి  డాక్టర్ సురేష్    9985717118, 15. ఏరియా ఆసుపత్రి, రాజాం  డాక్టర్ షణ్ముక్      9700498097, 16. జిఎంఆర్ కేర్ ఆస్పత్రి   కృష్ణ కిషోర్  9849989821, 17. ట్రస్ట్ ఆసుపత్రి  డాక్టర్ అన్నాజీరావు  9985065818, 18. ఏ1 ఆస్పత్రి   డాక్టర్ వెంకట్ రావు 9492034950, 
19.  యూనిక్ ఆసుపత్రి డాక్టర్ సిహెచ్.భాస్కరరావు  9490595666, 20. సింధూర ఆస్పత్రి  డాక్టర్ పి.బి.కామేశ్వరరావు  9440196677

Srikakulam

2021-05-18 09:53:07

కోవిడ్ నియంత్రణలో అన్నిశాఖలూ భాగస్వామ్యం కావాలి..

కోవిడ్ క‌ట్డ‌డికి క్షేత్ర‌స్థాయిలో ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న బృందాల‌కు, అద‌నంగా ఇత‌ర శాఖ‌ల సిబ్బందిని కేటాయించి, నియంత్ర‌ణా చ‌ర్య‌ల‌ను విస్తృతం చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్ ఆదేశించారు. దీనికోసం వివిధ ప్ర‌భుత్వ విభాగాల‌తో త‌న ఛాంబ‌ర్‌లో మంగ‌ళ‌వారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. మండ‌లాల వారీగా క్షేత్ర‌స్థాయి సిబ్బంది జాబితాల‌ను రూపొందించి, ఆయా వైద్య బృందాల‌కు మ్యాపింగ్ చేయాల‌ని సూచించారు. వెంట‌నే వీరంతా ప‌నుల‌ను ప్రారంభించాల్సిన అవస‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.  బుధ‌వారం నాటికి జాబితాలు సిద్దం చేసి, మ్యాపింగ్‌ను పూర్తి చేస్తే, వారు క్షేత్ర‌స్థాయిలో చేయాల్సిన విధుల‌పై జూమ్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హిస్తామ‌ని జెసి అన్నారు. స‌మావేశంలో జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వ‌రి, డిఆర్‌డిఏ, డ్వామా, స‌మ‌గ్ర శిక్ష‌, విద్యాశాఖ‌,  పంచాయితీ త‌దిత‌ర శాఖ‌ల‌ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-18 09:47:42

మరో 200 ఆక్సిజన్ పడకలు ఏర్పాటు..

విజ‌య‌న‌గ‌రంజిల్లాలో మ‌రో 200 వ‌ర‌కూ ఆక్సీజ‌న్ ప‌డ‌క‌ల‌ను ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్ చెప్పారు. ప్ర‌స్తుతం ఉన్న ఆక్సీజ‌న్ ప‌డ‌క‌ల‌కు సుమారుగా 8.7 మెట్రిక్ ట‌న్నుల ఆక్సీజ‌న్ అవ‌స‌రం ఉంద‌ని, వాడ‌కానికి  స‌రిప‌డినంత ఆక్సీజ‌న్  స‌ర‌ఫ‌రా జ‌రుగుతోంద‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. జిల్లాలో ప్ర‌స్తుతం సుమారు 700 ఆక్సీజ‌న్ ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని, వీటిలో జిల్లా కేంద్రాసుప‌త్రిలోనే సుమారు 200 ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని చెప్పారు.  వీటిలో చాలా వాటికి పైప్‌లైన్ల ద్వారా లిక్విడ్ ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌న్నారు. ఇంత‌కుముందు జిల్లా కేంద్రాసుప‌త్రిలో ఒక కిలోలీట‌ర్ సామ‌ర్ధ్య‌మున్న రెండు ఆక్సీజ‌న్ ట్యాంకులు ఉండేవ‌ని, కొత్త‌గా 10 కెఎల్ కెపాసిటీ ట్యాంకును ఇటీవ‌లే ప్రారంభించామ‌ని చెప్పారు. ఈ ట్యాంకును ఒక‌సారి నింపితే, సుమారు 48 గంట‌ల‌పాటు స‌రిప‌డుతుంద‌న్నారు. అందువ‌ల్ల ఈ ట్యాంకును రోజు విడిచి రోజు నింపేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు.
           
                  జిల్లాలో సుమారు 70శాతం ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా డి టైప్ సిలండ‌ర్ల మీద‌నే ఆధార‌ప‌డి ఉంద‌న్నారు. ఒక్కో సిలండ‌ర్‌లో 7 మెట్రిక్ క్యూబిక్కుల ఆక్సీజ‌న్ ప‌డుతుంద‌ని, వీటి ద్వారానే దాదాపు 500 ప‌డ‌క‌ల‌కు ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా జ‌రుగుతోంద‌ని చెప్పారు. బొబ్బిలిలో ఉన్న రెండు ప్ర‌యివేటు రీఫిల్లింగ్ కేంద్రాల‌ ద్వారా వీటిలో ఆక్సీజ‌న్‌ను నింపుతున్నామ‌ని చెప్పారు. రోజుకు 450 నుంచి 500 సిలండ‌ర్లు వీటిలో రీఫిల్లింగ్ జ‌రుగుతోంద‌న్నారు. జిల్లాలో జాడ తెలియ‌కుండా పోయిన సుమారు 250 సిలండ‌ర్ల‌ను కనుగొనే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. మిమ్స్‌లో దాదాపు వంద వ‌ర‌కూ సిలండ‌ర్ మేనిఫోల్డ్స్ వృధాగా ప‌డిఉన్నాయ‌ని, నేవీ స‌హ‌కారంతో వాటిని పున‌ర్ వినియోగించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. ఒక్కో మేనిఫోల్డ్ ద్వారా నాలుగైదు ప‌డ‌క‌ల‌కు ఆక్సీజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేయ‌వ‌చ్చ‌ని చెప్పారు. వీటితోపాటు, మరికొన్ని డి టైప్ సిలండ‌ర్లు కూడా అందుబాటులోకి వ‌స్తే, జెర్మ‌న్ హేంగ‌ర్ విధానంలో షెడ్స్ వేసి, అద‌నంగా దాదాపు 200 ఆక్సీజ‌న్ ప‌డ‌క‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని జెసి మ‌హేష్ వివ‌రించారు.

Vizianagaram

2021-05-18 09:45:15

కరోనా రోగులు త్వరగా కోలుకునేలా వైద్యం అందాలి..

కరోనా మహమ్మారి నుంచి కోవిడ్ బాధితులు పుర్తిగా కొలుకునేలా వైద్యులు కృషి చేయాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఏవిధమైన సహాయం కావాలన్నా అందించేలా  చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు. అవసరమైతే వ్యక్తిగతంగా ఎలాంటి సాయం చేయడానికైనా తాను కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. జిల్లాలో కోవిడ్ బాధితులకు చికిత్సలో కీలకంగా ఉన్న ఒంగోలు రిమ్స్ వైద్యులు, అధికారులతో ఆదివారం కలెక్టరేట్ లోని స్పందన హాలులో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి చికిత్స అందుతున్న తీరు, ఈ క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులు చర్చించి, డాక్టర్ల అభిప్రాయాలు, సూచనలను ఆయన తెలుసుకున్నారు. 
             ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత కరోనా కష్టకాలంలో కోవిడ్ బాధితులు వైద్యులను దేవుళ్లుగా భావిస్తున్నారని, వారి  ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా మరింత సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలని డాక్టర్లకు సూచించారు. రిమ్స్ కు వస్తున్న వాళ్ళు పేదవారు కనుక వారికి మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులతోపాటు  అధికార యంత్రాంగం అందరిపైనా ఉందన్నారు. ఈ రెండు నెలలు తాను ఇక్కడే ఉంటానని, సహాయం కోసం వచ్చే కోవిడ్ బాధితులకు అందుబాటులో ఉంటానని, ఈ విషయంలో శక్తి మేరకు కృషి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. డాక్టర్లకు కూడా తాను అండగా ఉంటానని, డాక్టర్లు కూడా రోగులకు అండగా ఉండి చికిత్స అందించాలని ఆయన సూచించారు. 
             రిమ్స్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ వల్ల బెడ్స్ కోసం ఎక్కువసేపు వేచిచూడాల్సిన పరిస్థితి తొలగిందని వైద్యులు చెప్పారని, అలాగే ప్రతి పీహెచ్సీలో కూడా బెడ్లు పెంచితే రిమ్స్ పై ఒత్తిడి తగ్గుతుందని వైద్యులు చేసిన సూచనను పరిగణనలోకి తీసుకుంటున్నానని మంత్రి చెప్పారు. ఈ విషయంపై ఎమ్మెల్యేలందరితో మాట్లాడి, పీహెచ్సీల్లో బెడ్లు పెంచేలా చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. కోవిడ్ బాధితులు పెరుగుతున్నందున మెడికల్ స్టాఫ్ ను కూడా పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఈ సందర్భంగా ఆయన మార్గనిర్దేశం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా సర్వీసులోకి రావడానికి భయపడుతున్నారని, అవసరమైతే ఎక్కువ జీతం  ఇచ్చే విషయాన్ని కూడా ఆలోచించాలని జాయింట్ కలెక్టర్ టి.ఎస్.చేతన్ (సచివాలయాలు మరియు అభివృద్ధి)కు సూచించారు. కరోనా కష్టకాలంలో ప్రైవేటు ఆసుపత్రులు కూడా లాభాపేక్ష కాకుండా సేవా దృక్పథంతో బాధితులకు చికిత్స చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 
    రిమ్స్ లో హెడ్ నర్సుగా పని చేస్తూ కరోనా వల్ల మృతి చెందిన రోజ్ మేరీ కుటుంబానికి వ్యక్తిగతంగా రూ.2లక్షల పరిహారాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. కరోనాతో మరణించిన ఇతర వైద్యుల కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబాలకు సైతం దూరంగా ఉంటూ బాధితులకు సేవ చేస్తున్నారని వైద్యులను మంత్రి అభినందించారు. సర్వీసు చేయడానికి మెడికల్ స్టూడెంట్స్ స్వచ్చందంగా ముందుకు వస్తే వారికి పేమెంట్ కూడా ఇస్తామని మంత్రి చెప్పారు.  డాక్టర్లకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. రేమిడిసివర్ మందు తగిన మోతాదులో అందుబాటులో ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు. 
             జాయింట్ కలెక్టర్ టి.ఎస్.చేతన్ (సచివాలయాలు మరియు అభివృద్ధి)  మాట్లాడుతూ రిమ్స్ తో పాటు కోవిడ్ కేర్ సెంటర్లలో అందుతున్న సేవలు, ఈ దిశగా చేపట్టిన చర్యలు, పేషేంట్ ఆడిటింగ్, ఆక్సిజన్ ఆడిటింగ్ జరుగుతున్న తీరును వివరించారు. రిమ్స్ కు నోడల్ ఆఫీసరుగా ఉన్న జాయింట్ కలెక్టర్ కృష్ణ వేణి (ఆసరా మరియు సంక్షేమం) మాట్లాడుతూ కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యంతో పాటు మానసిక ధైర్యం కూడా కల్పించాలని వైద్యులకు సూచించారు. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ఒంగోలును కరోనా రహిత నగరంగా  మార్చేలా కృషి చేయాలని వైద్యులను కోరారు. 
            ఈ సమావేశంలో ముందుగా కోవిడ్ తో మరణించిన ముగ్గురు వైద్య సిబ్బందికి సంతాపంగా మూడు నిమిషాలు మౌనం పాటించారు. 
           ఈ కార్యక్రమంలో ఒంగోలు డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, రిమ్స్ సూపరింటెండెంట్ శ్రీరాములు, డిప్యూటీ సూపరింటెండెంట్ మురళీకృష్ణారెడ్డి, ఆర్.ఎమ్.వో. వేణుగోపాల్ రెడ్డి, డీఎంహెచ్వో రత్నావళి, పలువురు వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.  అనంతరం పి.వి.ఆర్. బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న కోవిడ్ నివారణ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. 

Prakasam

2021-05-17 15:44:41