1 ENS Live Breaking News

కోవిడ్ బాధితులకు యోగాలో శిక్షణ..

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ బాధితులకు యోగ, వ్యాయామాలు ఆస్పత్రుల్లో ప్రవేశపెడుతున్నారు. జిల్లా కోవిడ్ ఆసుపత్రి జెమ్స్ లో యోగ ఇప్పటికే ప్రవేశపెట్టి కోవిడ్ బాధితులకు సాధారణ వ్యాయామాలను బోధిస్తున్నారు. వ్యాయామ, యోగా నిపుణులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ హేమంత్ మంగళవారం తెలిపారు. ఆసుపత్రిలో ఫిజియోథెరాఫీతో పాటు యోగ, వ్యాయామ శిక్షణ ఏర్పాటు చేస్తున్నామని తద్వారా కోవిడ్ బాధితుల్లో మానసిక ధైర్యం ఏర్పడుతుందని అన్నారు. యోగాలో సాధారణ ఆసనాలు, ప్రాణాయామాలు చేయడం ద్వారా వారిలో శ్వాస కోస వ్యాయామాలు చేయించడం జరుగుతుందని తద్వారా మంచి మార్పు వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫిజియోథెరాఫీ, యోగాతో త్వరగా కోలుకుంటున్నారని హేమంత్ పేర్కొన్నారు. కోవిడ్ బాధితులు త్వరగా కొలుకుని ఇంటికి చేరాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకు ఆత్మవిశ్వాసం, ధైర్యం అవసరమని అటువంటి వారు త్వరగా కొలుకుంటున్నారని అందుకు యోగా సహాయ పడగలదని ఆయన వివరించారు.

Srikakulam

2021-05-18 10:02:57

కోవాక్సిన్ రెండో డోసు పంపిణీకి ఏర్పాట్లు..

కోవాక్సీన్ రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రణాళికాబధ్ధంగా అందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్,  కాకినాడ నగర పాలక  సంస్ధ పరధిలోని పైండా సత్తిరాజు నగర పాలక సంస్ధ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ వేక్సీనేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనాభారీత్యా ఎక్కవ సాంద్రత కల్గిన తూర్పు గోదావరి జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి సజావుగా అందించే విధంగా జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసిందన్నారు. ఇందులో భాగంగా కోవిడ్ వ్యాక్సీన్ వేసేందుకు ప్రత్యేక కేంద్రాలు గుర్తించడం జరిగిందన్నారు. ఈ కేంద్రాల్లో ప్రతి మంగళవారం, శుక్రవారాలలో వ్యాక్సీన్ వేస్తారన్నారు. మొదటి  డోస్ వ్యాక్సీన్ వేయించుకున్న వారికి వారు వేయించుకొన్న తేదీలకు అనుగుణంగా వాలంటీర్లు వారి ఇంటికి వెళ్ళి కూపన్లు ఆందజేస్తారన్నారు. కూపన్లు పొందిన వారు గుర్తించిన వ్యాక్సీన్ కేంద్రానికి చేరుకొని వ్యాక్సీన్ పొందాలన్నారు. మొదటి డోసు వేసుకొన్నవారు రెండవ డోస్ కోసం తగిన రశీదు చూపిస్తే రెండవ డోసు కు అవకాశం వుంటుందన్నారు. మొదటి డోసు వేసుకొని తగిన ఆధారాలు లేకపోతే తనకు రెండవ డోస్ కావాలని కోరితే అలాంటి వారికి వ్యాక్సిన్ వేసి రెండవ డోసుగా గుర్తించే విధంగా వ్యాక్సీనేషన్ కేంద్రాలకు సూచనలు చేయడం జరిగిందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో మొదటి డోస్ వేయించుకొన్న వారికి రెండవ డోస్ వేయడం జరుగుతుందన్నారు. మే 31 వరకు ప్రతి మంగళ, శుక్రవారాల్లో రెండో డోస్ వేయడం జరుగుతుందనీ, జూన్ నెల నుండి మొదటి డోస్ వేయడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పైండా సత్తిరాజు బాలికోన్న పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సీన్ కేంద్రంల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను నగర పాలక సంస్ధ అధికారులతో కలిసి పరిశీలించారు.

Kakinada

2021-05-18 09:59:20

ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు..

ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం సేకరించి తక్షణం స్పందించే విధంగా పని చేస్తునట్లు జాయింట్ కలెక్టర్ డా. జి.లక్ష్మిశ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా పౌరసరఫరాల విభాగంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కంట్రోల్ కేంద్రాన్ని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్  ఇ.లక్ష్మీరెడ్డి, డిఎస్ఓ ప్రసాదరావులతో కలిసి జాయింట్ కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జేసి కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించి, క్షేత్రస్ధాయి నుండి వచ్చే ఫోన్ కాల్స్ ఏ విధంగా స్పందిస్తున్నారో పరిశీలించారు. క్షేత్ర స్ధాయిలో ఏ రైతు ఆయినా ధాన్యం కొనుగోలు చేయలేది ఫిర్యాదు చేస్తే తక్షణం ఆ ప్రాంత రైస్ మిల్లర్లతో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేసే విధంగా కంట్రోల్ రూమ్ అధికారులు పని చేయాలన్నారు. క్షేత్ర స్ధాయిలో ఉన్న విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ కు కంట్రోల్ రూమ్ కు వచ్చిన సమాచారం తెలియజేసి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ అధికారులకు జేసి లక్ష్మిశ పలు సూచనలు చేశారు. 

Kakinada

2021-05-18 09:56:42

కోవిడ్ ఆస్పత్రుల్లో కంట్రోల్ రూమ్ లు..

శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఆయా ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న బాధితుల బంధువులు కంట్రోల్ రూమ్ ఇన్ ఛార్జ్ లకు ఫోన్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆసుపత్రులు, ఇన్ ఛార్జ్ ల పేర్లు, ఫోన్ నెంబర్లను తెలిపారు. 1. జెమ్స్ ఆస్పత్రి   డాక్టర్ హేమంత్  9133212546,  2. రిమ్స్ ఆసుపత్రి   డాక్టర్ చలమయ్య  9849300520 , 3. డాక్టర్ గొలివి ఆస్పత్రి   డాక్టర్ రవీంద్ర  986620986, 
4. కిమ్స్ ఆసుపత్రి   డాక్టర్ రాజేష్   8088096238, 5. మెడీకవర్ ఆసుపత్రి   సాగరిక   9154704550, 6. బగ్గు సరోజినీ ఆసుపత్రి  మీనా కుమారి 8639505601, 
7. లైఫ్ ఆస్పత్రి   డాక్టర్ చంద్రశేఖర్   9966946111, 8. పివీఎస్ రామ్మోహన్ ఆస్పత్రి  డాక్టర్ రామ్మోహన్  9292007123, 9.అమృత ఆస్పత్రి   డాక్టర్ రవి ప్రసాద్        9966552555,  10. కమల ఆసుపత్రి   డాక్టర్ రామకృష్ణ       9441160803, 11. జిల్లా ఆసుపత్రి, టెక్కలి   డాక్టర్ ప్రవీణ్     7673905486, 
12. ఏరియా ఆసుపత్రి, పాలకొండ  డాక్టర్ రవీంద్ర   9440334604, 13. సూర్య ముఖి ఆస్పత్రి   డాక్టర్ సత్య స్వరూప్   7671900496, 
14. సన్ రైజ్ ఆస్పత్రి  డాక్టర్ సురేష్    9985717118, 15. ఏరియా ఆసుపత్రి, రాజాం  డాక్టర్ షణ్ముక్      9700498097, 16. జిఎంఆర్ కేర్ ఆస్పత్రి   కృష్ణ కిషోర్  9849989821, 17. ట్రస్ట్ ఆసుపత్రి  డాక్టర్ అన్నాజీరావు  9985065818, 18. ఏ1 ఆస్పత్రి   డాక్టర్ వెంకట్ రావు 9492034950, 
19.  యూనిక్ ఆసుపత్రి డాక్టర్ సిహెచ్.భాస్కరరావు  9490595666, 20. సింధూర ఆస్పత్రి  డాక్టర్ పి.బి.కామేశ్వరరావు  9440196677

Srikakulam

2021-05-18 09:53:07

కోవిడ్ నియంత్రణలో అన్నిశాఖలూ భాగస్వామ్యం కావాలి..

కోవిడ్ క‌ట్డ‌డికి క్షేత్ర‌స్థాయిలో ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న బృందాల‌కు, అద‌నంగా ఇత‌ర శాఖ‌ల సిబ్బందిని కేటాయించి, నియంత్ర‌ణా చ‌ర్య‌ల‌ను విస్తృతం చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్ ఆదేశించారు. దీనికోసం వివిధ ప్ర‌భుత్వ విభాగాల‌తో త‌న ఛాంబ‌ర్‌లో మంగ‌ళ‌వారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. మండ‌లాల వారీగా క్షేత్ర‌స్థాయి సిబ్బంది జాబితాల‌ను రూపొందించి, ఆయా వైద్య బృందాల‌కు మ్యాపింగ్ చేయాల‌ని సూచించారు. వెంట‌నే వీరంతా ప‌నుల‌ను ప్రారంభించాల్సిన అవస‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.  బుధ‌వారం నాటికి జాబితాలు సిద్దం చేసి, మ్యాపింగ్‌ను పూర్తి చేస్తే, వారు క్షేత్ర‌స్థాయిలో చేయాల్సిన విధుల‌పై జూమ్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హిస్తామ‌ని జెసి అన్నారు. స‌మావేశంలో జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వ‌రి, డిఆర్‌డిఏ, డ్వామా, స‌మ‌గ్ర శిక్ష‌, విద్యాశాఖ‌,  పంచాయితీ త‌దిత‌ర శాఖ‌ల‌ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-18 09:47:42

మరో 200 ఆక్సిజన్ పడకలు ఏర్పాటు..

విజ‌య‌న‌గ‌రంజిల్లాలో మ‌రో 200 వ‌ర‌కూ ఆక్సీజ‌న్ ప‌డ‌క‌ల‌ను ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్ చెప్పారు. ప్ర‌స్తుతం ఉన్న ఆక్సీజ‌న్ ప‌డ‌క‌ల‌కు సుమారుగా 8.7 మెట్రిక్ ట‌న్నుల ఆక్సీజ‌న్ అవ‌స‌రం ఉంద‌ని, వాడ‌కానికి  స‌రిప‌డినంత ఆక్సీజ‌న్  స‌ర‌ఫ‌రా జ‌రుగుతోంద‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. జిల్లాలో ప్ర‌స్తుతం సుమారు 700 ఆక్సీజ‌న్ ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని, వీటిలో జిల్లా కేంద్రాసుప‌త్రిలోనే సుమారు 200 ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని చెప్పారు.  వీటిలో చాలా వాటికి పైప్‌లైన్ల ద్వారా లిక్విడ్ ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌న్నారు. ఇంత‌కుముందు జిల్లా కేంద్రాసుప‌త్రిలో ఒక కిలోలీట‌ర్ సామ‌ర్ధ్య‌మున్న రెండు ఆక్సీజ‌న్ ట్యాంకులు ఉండేవ‌ని, కొత్త‌గా 10 కెఎల్ కెపాసిటీ ట్యాంకును ఇటీవ‌లే ప్రారంభించామ‌ని చెప్పారు. ఈ ట్యాంకును ఒక‌సారి నింపితే, సుమారు 48 గంట‌ల‌పాటు స‌రిప‌డుతుంద‌న్నారు. అందువ‌ల్ల ఈ ట్యాంకును రోజు విడిచి రోజు నింపేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు.
           
                  జిల్లాలో సుమారు 70శాతం ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా డి టైప్ సిలండ‌ర్ల మీద‌నే ఆధార‌ప‌డి ఉంద‌న్నారు. ఒక్కో సిలండ‌ర్‌లో 7 మెట్రిక్ క్యూబిక్కుల ఆక్సీజ‌న్ ప‌డుతుంద‌ని, వీటి ద్వారానే దాదాపు 500 ప‌డ‌క‌ల‌కు ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా జ‌రుగుతోంద‌ని చెప్పారు. బొబ్బిలిలో ఉన్న రెండు ప్ర‌యివేటు రీఫిల్లింగ్ కేంద్రాల‌ ద్వారా వీటిలో ఆక్సీజ‌న్‌ను నింపుతున్నామ‌ని చెప్పారు. రోజుకు 450 నుంచి 500 సిలండ‌ర్లు వీటిలో రీఫిల్లింగ్ జ‌రుగుతోంద‌న్నారు. జిల్లాలో జాడ తెలియ‌కుండా పోయిన సుమారు 250 సిలండ‌ర్ల‌ను కనుగొనే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. మిమ్స్‌లో దాదాపు వంద వ‌ర‌కూ సిలండ‌ర్ మేనిఫోల్డ్స్ వృధాగా ప‌డిఉన్నాయ‌ని, నేవీ స‌హ‌కారంతో వాటిని పున‌ర్ వినియోగించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. ఒక్కో మేనిఫోల్డ్ ద్వారా నాలుగైదు ప‌డ‌క‌ల‌కు ఆక్సీజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేయ‌వ‌చ్చ‌ని చెప్పారు. వీటితోపాటు, మరికొన్ని డి టైప్ సిలండ‌ర్లు కూడా అందుబాటులోకి వ‌స్తే, జెర్మ‌న్ హేంగ‌ర్ విధానంలో షెడ్స్ వేసి, అద‌నంగా దాదాపు 200 ఆక్సీజ‌న్ ప‌డ‌క‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని జెసి మ‌హేష్ వివ‌రించారు.

Vizianagaram

2021-05-18 09:45:15

కరోనా రోగులు త్వరగా కోలుకునేలా వైద్యం అందాలి..

కరోనా మహమ్మారి నుంచి కోవిడ్ బాధితులు పుర్తిగా కొలుకునేలా వైద్యులు కృషి చేయాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఏవిధమైన సహాయం కావాలన్నా అందించేలా  చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు. అవసరమైతే వ్యక్తిగతంగా ఎలాంటి సాయం చేయడానికైనా తాను కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. జిల్లాలో కోవిడ్ బాధితులకు చికిత్సలో కీలకంగా ఉన్న ఒంగోలు రిమ్స్ వైద్యులు, అధికారులతో ఆదివారం కలెక్టరేట్ లోని స్పందన హాలులో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి చికిత్స అందుతున్న తీరు, ఈ క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులు చర్చించి, డాక్టర్ల అభిప్రాయాలు, సూచనలను ఆయన తెలుసుకున్నారు. 
             ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత కరోనా కష్టకాలంలో కోవిడ్ బాధితులు వైద్యులను దేవుళ్లుగా భావిస్తున్నారని, వారి  ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా మరింత సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలని డాక్టర్లకు సూచించారు. రిమ్స్ కు వస్తున్న వాళ్ళు పేదవారు కనుక వారికి మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులతోపాటు  అధికార యంత్రాంగం అందరిపైనా ఉందన్నారు. ఈ రెండు నెలలు తాను ఇక్కడే ఉంటానని, సహాయం కోసం వచ్చే కోవిడ్ బాధితులకు అందుబాటులో ఉంటానని, ఈ విషయంలో శక్తి మేరకు కృషి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. డాక్టర్లకు కూడా తాను అండగా ఉంటానని, డాక్టర్లు కూడా రోగులకు అండగా ఉండి చికిత్స అందించాలని ఆయన సూచించారు. 
             రిమ్స్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ వల్ల బెడ్స్ కోసం ఎక్కువసేపు వేచిచూడాల్సిన పరిస్థితి తొలగిందని వైద్యులు చెప్పారని, అలాగే ప్రతి పీహెచ్సీలో కూడా బెడ్లు పెంచితే రిమ్స్ పై ఒత్తిడి తగ్గుతుందని వైద్యులు చేసిన సూచనను పరిగణనలోకి తీసుకుంటున్నానని మంత్రి చెప్పారు. ఈ విషయంపై ఎమ్మెల్యేలందరితో మాట్లాడి, పీహెచ్సీల్లో బెడ్లు పెంచేలా చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. కోవిడ్ బాధితులు పెరుగుతున్నందున మెడికల్ స్టాఫ్ ను కూడా పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఈ సందర్భంగా ఆయన మార్గనిర్దేశం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా సర్వీసులోకి రావడానికి భయపడుతున్నారని, అవసరమైతే ఎక్కువ జీతం  ఇచ్చే విషయాన్ని కూడా ఆలోచించాలని జాయింట్ కలెక్టర్ టి.ఎస్.చేతన్ (సచివాలయాలు మరియు అభివృద్ధి)కు సూచించారు. కరోనా కష్టకాలంలో ప్రైవేటు ఆసుపత్రులు కూడా లాభాపేక్ష కాకుండా సేవా దృక్పథంతో బాధితులకు చికిత్స చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 
    రిమ్స్ లో హెడ్ నర్సుగా పని చేస్తూ కరోనా వల్ల మృతి చెందిన రోజ్ మేరీ కుటుంబానికి వ్యక్తిగతంగా రూ.2లక్షల పరిహారాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. కరోనాతో మరణించిన ఇతర వైద్యుల కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబాలకు సైతం దూరంగా ఉంటూ బాధితులకు సేవ చేస్తున్నారని వైద్యులను మంత్రి అభినందించారు. సర్వీసు చేయడానికి మెడికల్ స్టూడెంట్స్ స్వచ్చందంగా ముందుకు వస్తే వారికి పేమెంట్ కూడా ఇస్తామని మంత్రి చెప్పారు.  డాక్టర్లకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. రేమిడిసివర్ మందు తగిన మోతాదులో అందుబాటులో ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు. 
             జాయింట్ కలెక్టర్ టి.ఎస్.చేతన్ (సచివాలయాలు మరియు అభివృద్ధి)  మాట్లాడుతూ రిమ్స్ తో పాటు కోవిడ్ కేర్ సెంటర్లలో అందుతున్న సేవలు, ఈ దిశగా చేపట్టిన చర్యలు, పేషేంట్ ఆడిటింగ్, ఆక్సిజన్ ఆడిటింగ్ జరుగుతున్న తీరును వివరించారు. రిమ్స్ కు నోడల్ ఆఫీసరుగా ఉన్న జాయింట్ కలెక్టర్ కృష్ణ వేణి (ఆసరా మరియు సంక్షేమం) మాట్లాడుతూ కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యంతో పాటు మానసిక ధైర్యం కూడా కల్పించాలని వైద్యులకు సూచించారు. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ఒంగోలును కరోనా రహిత నగరంగా  మార్చేలా కృషి చేయాలని వైద్యులను కోరారు. 
            ఈ సమావేశంలో ముందుగా కోవిడ్ తో మరణించిన ముగ్గురు వైద్య సిబ్బందికి సంతాపంగా మూడు నిమిషాలు మౌనం పాటించారు. 
           ఈ కార్యక్రమంలో ఒంగోలు డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, రిమ్స్ సూపరింటెండెంట్ శ్రీరాములు, డిప్యూటీ సూపరింటెండెంట్ మురళీకృష్ణారెడ్డి, ఆర్.ఎమ్.వో. వేణుగోపాల్ రెడ్డి, డీఎంహెచ్వో రత్నావళి, పలువురు వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.  అనంతరం పి.వి.ఆర్. బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న కోవిడ్ నివారణ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. 

Prakasam

2021-05-17 15:44:41

దాతలూ కరోనాలో మీ సహాయం చాలా అవసరం..

కరోనా వైరస్ రెండవ దశ వేగంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో కరోనా బాధితులకు ప్రతి ఒక్కరూ తమ చేత నైన సహాయం చేయడానికి ముందుకు రావాలని జిల్లా క లెక్టర్  పోల భాస్కర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద కరోనా వైరస్ బాధితులకు మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ గ్యాస్ సిలెండర్లను జిల్లా కలెక్టరుకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ మొదటి దశ కంటే రెండవ దశ వేగంగా విస్తరిస్తుందని ఆయన చెప్పారు. జిల్లాలో కోవిడ్ రోగులకు ప్రభుత్వ,
పై#్రవేట్ హాస్పిటల్ ద్వారా ఆక్సిజన్ కొరత లేకుండా నిరంతరం సరఫరా చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఆక్సిజన్ నిల్వలపై జిల్లా స్థాయిలో జిల్లా సంయుక్త కలెక్టరును, పరిశ్రమల శాఖ జి.ఎమ్.ను, వైద్య ఆరోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను కమిటీగా పర్యవేక్షించడానికి నియమించడం జరిగిందన్నారు. ఈ కమిటి ప్రతిరోజు గంటల వారిగా ఏయే ఆసుపత్రులకు ఎంతమేర ఆక్సిజన్ వెళ్తుంది అనే విషయాలను పరిశీలిస్తుందని ఆయన
తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రవేటు ఆసుపత్రులకు ప్రతిరోజు 30 టన్నుల మేర ఆక్సిజన్ సరఫరా చేయాల్సి వుండగా ప్రస్తుత ం 24 వేల టన్నులు ప్రతిరోజు సరఫరా జరుగుతుందని ఆయన తెలియజేశారు. జిల్లాలో రోగులకు ఇబ ్బంది లేకుండా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామన్నారు. మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులకు ఆక్సిజన్ అందించడానికి 108 ఆక్సిజన్ సిలిండర్లను ఇవ్వడానికి ముందుకు వచ్చిన ట్రస్ట్ వారిని జిల్లా కలెక్టర్ అభినందించారు. అలాగే ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో100 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక, పర్యావరణ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రూ. 50 లక్షలతో ఏర్పాటు చేశారన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆక్సిజన్ గ్యాస్
సిలిండర్ల వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డి.ఎమ్.హెచ్.ఓ. డాక్టర్ రత్నావళి, డి.సి.హెచ్.ఎస్. డాక్టర్ ఉషారాణి, మాగుంట చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

PRAKASAM DISTRICT

2021-05-17 15:30:43

కోరోనా కట్టడికి ప్రభుత్వం సత్వర చర్యలు..

రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర  విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ వెల్లడించారు. సోమవారం స్థానిక మార్కాపురం జిల్లా వైద్య శాలలో 60 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  ఆది మూలపు సురేష్ ,జిల్లా కలెక్టర్  పోల భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ మార్కాపురం డివిజన్ కేంద్రంలోని జిల్లా వైద్యశాలలో అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మార్కాపురం జిల్లా వైద్య శాలలో ప్రస్తుతం70 ఆక్సిజన్ బెడ్స్ మరియు50 నాన్ ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయన్నారు. మార్కాపురం జిల్లా వైద్య శాలలో1.70 కోట్ల రూపాయలతో  ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. త్వరలో మార్కాపురం జిల్లా వైధశాలను పూర్తి స్థాయిలో ఆక్సిజన్ బెడ్స్ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతామని మంత్రి చెప్పారు. భవిష్యత్తు లో జిల్లా హాస్పిటల్ కు ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.కోవిడ్ నియంత్రణకు ప్రజలందరూ మాస్క్ లు ధరించి సామాజిక దూరంగా పాటించాలన్నారు.ఒంగోలు పార్లమెంట్ సభ్యులు  మాగుంట శ్రీనివాస రెడ్డి సహకారంతో జిల్లా వైదశాలలో 60 బెడ్స్ కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్నీ పేద ప్రజలు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్  పోల భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ మొదటి దశ కంటే రెండవ దశ వేగంగా వ్యాప్తి చెందుతుoదన్నారు.జిల్లాలో కోవిడ్ కట్టడికి టాస్క్ ఫోర్స్ కమిటీ ని నియమించడము జరిగిందన్నారు.జిల్లాలో గ్రామ స్థాయిలో ప్రజలకు  కోవిడ్ పరీక్షలు నిర్వహించడానికి  ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.కోవిడ్ పాజిటివ్ ఉన్నవారికి ప్రభుత్వ హాస్పిటల్స్ కు పంపడం జరుగుతుందన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని హోమ్ ఐసోలేషన్ లో ఉండే విధంగా నోటీసులు ఇవ్వాడము జరుగుతుందన్నారు.మార్కాపురం జిల్లా వైద్య శాలలో ఆక్సిజన్ కొరత లేకుండా1.7 కోట్ల రూపాయలతో ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో జిల్లా వైద్య శాలలో ఆక్సిజన్ కొరత ఉండదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే  కుందురు నాగార్జున రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే  అన్నా రాంబాబు, వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినెటర్ ఉషా, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.శేషి రెడ్డి, మార్కాపురం జిల్లా వైద్య శాల నోడల్ ఆఫీసర్ సరళ వందనం,మున్సిపల్ కమిషనర్ నహీమ్ అహమ్మద్, తహసీల్దార్ విద్యాసాగరుడు,ఎంపీడీఓ హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.

Markapuram

2021-05-17 15:27:33

ఫీవర్ సర్వేచేయని వలంటీర్లను తొలగించండి..

గ్రామ స్థాయిలో వాలంటీర్లు చేపట్టిన కోవిడ్ సర్వే వివరాలను కంప్యూటర్లో అప్‌లోడ్ చేయని వారిని విధుల నుంచి తొలగించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉలవపాడు మండలం పెదపట్టపుపాలెం గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో కరోనా వైరస్ కట్టడికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. పెదపట్టపుపాలెం గ్రామంలో 1,304 గృహాలు వున్నాయని, గృహాలు వారిగా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు.
గ్రామంలో ప్రజలందరికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి కోవిడ్ లక్షణాలు వున్నవారిని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపాలన్నారు. కోవిడ్ లక్షణాలు వున్నవారిని హోం ఐసోలేషన్‌లో వుండే విధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నోటీసులు జారీచేయాలని ఆయన చెప్పారు. గ్రామాల్లో మండల
స్థాయి అధికారులు కోవిడ్ వ్యాప్తి గురించి తరచుగా తనిఖీలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉలవపాడు ఎమ్.పి.డి.ఓ. టి . రవి కుమార్, తహసిల్దార్ సంజీవ రావు, మెడికల్ ఆఫీసర్ రాజ్యలక్ష్మి, సచివాలయ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.

Ulavapadu

2021-05-17 15:24:15

ఇసుక సరఫరా అందుబాటులో ఉంచాలి..

తూర్పుగోదావరి జిల్లాలో మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్ త‌దిత‌ర విభాగాల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ కొత్త ఇసుక విధాన ప‌టిష్ట అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. సోమ‌వారం రాత్రి విజ‌య‌వాడ నుంచి ప్ర‌భుత్వ చీఫ్ సెక్ర‌ట‌రీ ఆదిత్య‌నాథ్ దాస్, డీజీపీ గౌతం స‌వాంగ్‌, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది.. ఇసుక విధానం అమ‌లుపై అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్‌పీలు, జాయింట్ క‌లెక్ట‌ర్లు, మైనింగ్ శాఖ అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ మైనింగ్ కాంట్రాక్టు  సంస్థ ద్వారా జిల్లా వ్యాప్తంగా అన్ని ఇసుక రీచ్‌ల ద్వారా ఇసుక స‌ర‌ఫ‌రా స‌జావుగా జ‌రిగేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు. రీచ్‌ల సామ‌ర్థ్యం మేర‌కు మైనింగ్ జ‌రిగి, వినియోగ‌దారుల‌కు స‌క్ర‌మంగా ఇసుక‌ను అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌తి లావాదేవీ పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో జ‌రిగేలా చూస్తామ‌న్నారు. క్షేత్ర‌స్థాయిలో అక్ర‌మాల‌కు తావులేకుండా స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకెళ్తామ‌న్నారు. నిఘా వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేయ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. గ‌తంలో జిల్లాలో ఇసుక త‌వ్వ‌కాల‌కు సంబంధించి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన ముగ్గురు కాంట్రాక్ట‌ర్లు, ఓ ఏజెన్సీకి జిల్లా క‌లెక్ట‌ర్ నేతృత్వంలోని జిల్లా ఇసుక ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటీ దాదాపు రూ.22 కోట్ల మేర జ‌రిమానా విధించిన అంశాన్ని రాష్ట్ర స్థాయి అధికారులు వీసీ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. ఇలాంటి చ‌ర్య‌లు విధానాల ప‌టిష్ట అమ‌లుకు దోహ‌దం చేస్తాయ‌ని పేర్కొన్నారు. 

Kakinada

2021-05-17 14:52:28

ఆక్సిజన్ సరఫరాను పటిష్టం చేయాలి..

తూర్పు నేవ‌ల్ డాక్‌యార్డ్ (విశాఖ‌ప‌ట్నం) లెఫ్టినెంట్ క‌మాండ‌ర్ సాహిల్ త్యాగి సోమ‌వారం సాయంత్రం కాకినాడ‌లోని క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డిని క‌లిశారు. జిల్లాలోని కోవిడ్ ఆసుప‌త్రుల్లో మెడిక‌ల్ ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌లను మ‌రింత ప‌టిష్టం చేసేందుకు ప‌లు సూచ‌న‌లు అందించారు. కాకినాడ జీజీహెచ్‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జిల్లా ఆసుప‌త్రి, జీఎస్ఎల్ ఆసుప‌త్రుల్లో మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ట్యాంక్‌లు, వాటి నుంచి పైపుల ద్వారా స‌ర‌ఫ‌రా ప్ర‌క్రియ‌ల ప్ర‌త్య‌క్ష ప‌రిశీల‌న ఆధారంగా సెంట్ర‌ల్ ఆక్సిజ‌న్ సిస్ట‌మ్‌ల ప‌టిష్ట‌తకు సంబంధించి ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు అందించారు. మెడిక‌ల్ ఆక్సిజ‌న్ పైప్‌లైన్ వ్య‌వ‌స్థ‌లో స‌మ‌స్య‌లు ఎదురుకాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, పైప్‌లైన్ వ్య‌వ‌స్థ భ‌ద్ర‌త త‌దిత‌ర అంశాల‌పై క‌లెక్ట‌ర్‌, లెఫ్టినెంట్ క‌మాండ‌ర్ చ‌ర్చించారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రుల్లో కోవిడ్ బాధితుల‌కు అవ‌స‌రం మేర‌కు మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను అందించే ప్ర‌క్రియ మొత్తం బాగున్న‌ప్ప‌టికీ, భ‌విష్య‌త్తులో ఎలాంటి పొర‌పాటు జ‌ర‌క్కుండా ఉండేందుకు అమ‌లుచేయాల్సిన ప్ర‌ణాళిక‌పై ఈ భేటీ జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఏపీ మెడిక‌ల్ స‌ర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఏపీఎంఎస్ఐడీసీ) ఈఈ కె.సీతారామ‌రాజు పాల్గొన్నారు.

Kakinada

2021-05-17 14:09:27

మాతృ మరణాలు జరిగితే ఉపేక్షించను..

పాడేరు ఐటిడిఏ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో కరోనాతో గర్భవతులు మృతి చేందితే ఉపేక్షించనని సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల సిడిపి ఓలను  హెచ్చరించారు. సోమవారం వైద్యాధికారులు, ఎంపిడిలోలు ,తాహశీల్దార్లు, సహాయ గిరిజన సంక్షేమాధికారులు సిడిపి ఓలతో కోవిడ్ సేవలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ, అంగన్వాడీలను సూపర్‌వైజర్లు పర్యవేక్షణ లోపిస్తోందన్నారు. అంగన్వాడీ సరుకులు పక్కదారి పడితే సంబంధిత సిబ్బంది, సూపర్‌వైజర్‌లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గర్భవతులను పరిరక్షించాల్సిన బాధ్యత అంగన్వాడీలపైనే ఉందన్నారు. అనకాపల్లి , కె జి హెచ్‌లలో గర్భవతులకు ప్రత్యేక కోవిడ్ వార్డులు ఏర్పాటు చేసారని చెప్పారు. గర్భవతులకు పోజిటివ్ వస్తే వైద్యాధికారులు వెంటనే రిఫర్ చేయాలని సూచించారు.  ఏజెన్సీలో సుమారు ఐదు వందల పడకలతో మూడు కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసామని అన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లకు సంబంధిత మండలానికి చెందిన సహాయ గిరిజన సంక్షేమాధికారులను నోడల్ అధికారులుగా నియమించామని చెప్పారు. సమస్యలుంటే ఎటిడబ్యూ ఓలను సంప్రదించాలన్నారు. అరకు కోవిడ్ కేర్ సెంటర్‌కు సంబంధించి ఎటిడబ్యూ ఓ మల్లిఖార్జున రావు 94415 86116, 86392 82540, పాడేరు కోవిడ్ కేర్ సెంటర్‌కు ఎటిడబ్ల్యూ ఓ ఎల్. రజని8309 34 6709, చింతపల్లికి ఎటిడబ్యూ ఓ చంద్ర శేఖర్ 94933 99494 మొబైల్ నంబర్లలో సంప్రదించాలన్నారు. కొత్తాగా ఎన్నికైన పంచాయతీ సర్పంచులతో పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి, పి ఆర్ కమీషనర్ ఈనెల 19వ తేదీన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని దానికి అవసరమైన ఏర్పాట్లు ఎంపిడి ఓలు చేయాలన్నారు. మండలంలో మూడుచోట్ల ల్యాప్‌టాప్‌ల ద్వారా జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించాలన్నారు.  ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు జి.విజయకుమార్, అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ లీలా ప్రసాద్, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా. కృష్ణారావు, సహాయ గిరిజన సంక్షేమాధికారులు,11 మండలాల వైద్యాధికారులు ,రెవెన్యూ అధికారులు, ఎంపిడి ఓలు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2021-05-17 13:46:57

జాబితాలో ఉంటేనే కోవిడ్ వేక్సిన్..

జాబితాలో ఉన్న వారికే వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ స్పష్టం చేశారు. సోమవారం ఉదయం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టడం జరుగుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలతో వ్యాక్సిన్ కు ఏ వ్యక్తులు రావాలి అని ముందుగానే సమాచారం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ముందుగా సమాచారం అందించిన వ్యక్తులు మాత్రమే వ్యాక్సినేషన్ కు రావాలని, వారి జాబితా మాత్రమే వ్యాక్సినేషన్ కేంద్రంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జాబితాలో లేని వారికి ఆ రోజు వాక్సినేషన్ వేయడం జరగదని తెలిపారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని గుర్తించాలని అయితే వారికి ఇచ్చిన తేదీలలో మాత్రమే వాక్సినేషన్ జరుగుతుందని, ఆ రోజున రావాలని  కలెక్టర్ చెప్పారు.  ఫీవర్ సర్వే, కరోనా లక్షణాలతో ఉన్న వారిని గూర్చి మాట్లాడుతూ ఫీవర్ సర్వే పక్క జరగాలని అన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని తక్షణం గుర్తించి వారి నమూనాలు సేకరించాలని ఆయన ఆదేశించారు. ఇంటివద్ద ఐసోలేషన్ సౌకర్యాలు లేని వారు కోవిడ్ కేర్ కేంద్రాల్లో వచ్చి ఉండవచ్చని కలెక్టర్ తెలిపారు. కోవిడ్ కేర్ కేంద్రాల్లో మంచి వైద్య సేవలు, వసతి సౌకర్యం, భోజన సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పాత్రునివలస, సంతబొమ్మాలి కేంద్రాల్లో అనేక బెడ్లు ఖాళీగా ఉన్నాయని ఆయన అన్నారు. ఇంటి వద్ద ఉంటూ మందులు సకాలంలో తీసుకోక పోవడం వలన వ్యాధి తీవ్రత పెంచుకుంటున్నారని, అటువంటి అవకాశం వారికి ఇవ్వకుండా వారిని కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. మండలాల్లో ఎక్కువ నమూనాలు తీయాలని ఆయన ఆదేశించారు.  గత 15 రోజులుగా ఏ ప్రాంతం నుండి తక్కువ నమూనాలు సేకరించినది గుర్తించాలని, అటువంటి మండల సర్వేలియన్స్ అధికారులు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నమూనాలు తీసిన వెంటనే వాటిని పరీక్షలకు పంపించాలని, అందుకు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. 24 గంటల లోపుగా ఫలితాలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. 
      ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే .శ్రీనివాసులు, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడ, రెవిన్యూ డివిజనల్ అధికారులు ఐ.కిషోర్, టి వి ఎస్ జి కుమార్, ప్రత్యేక అధికారులు, వైద్య అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-17 13:40:47

ప్ర‌జల స‌హ‌కారంతోనే కోవిడ్ నియంత్ర‌ణ‌..

ప్ర‌జ‌ల స‌హ‌కారంతోనే కోవిడ్‌ను నియంత్రించ‌గ‌ల‌మని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ స్ప‌ష్టం చేశారు. ఈ మ‌హ‌మ్మారిని జిల్లా నుంచి త‌రిమికొట్ట‌డంలో, మున్సిప‌ల్ అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ‌వంతు పాత్ర పోషించాల‌ని కోరారు. ప‌ట్ట‌ణాల అభివృద్దికి పంచ‌సూత్రాల‌ను అమ‌లు చేయాల‌ని కోరారు. మేయ‌ర్‌, మున్సిప‌ల్ ఛైర్మ‌న్లు, వైస్ ఛైర్మ‌న్లు, కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్లు, మున్సిప‌ల్ అధికారుల‌తో క‌లెక్ట‌ర్ సోమ‌వారం టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.    ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, జిల్లాలో క‌రోనా నియంత్ర‌ణ‌కు నివార‌ణ‌, చికిత్స‌, కార్యాచ‌ర‌ణ అనే మూడంచెల వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. కోవిడ్ నివార‌ణకు ప్ర‌తీఒక్క‌రూ మాస్కుల‌ను ధ‌రించ‌డం, భౌతిక దూరాన్ని పాటించ‌డం, త‌ర‌చూ చేతుల‌ను శుభ్రం చేసుకోవ‌డం అనే అంశాల‌ని ప్ర‌తీఒక్క‌రూ పాటించాల‌ని కోరారు. మ‌రోవైపు వేక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను కూడా కొన‌సాగిస్తున్నామ‌ని చెప్పారు. వ్యాధి సోకిన‌వారికి అత్యుత్త‌మ చికిత్స‌ను అందించ‌డం ద్వారా న‌యం చేస్తున్నామ‌న్నారు. కోవిడ్ ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉన్న‌వారిని హోం ఐసోలేష‌న్‌లో ఉంచి, వారికి కోవిడ్ కిట్ల‌ను అంద‌జేసి చికిత్స‌ను అందించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ఇళ్ల‌లో ఏకాంతంగా ఉండే అవ‌కాశం లేనివారిని కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌కు పంపించి చికిత్స చేస్తున్నామ‌న్నారు. అవ‌స‌ర‌మైన వారిని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించి, చికిత్స చేయ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. వ్యాధిని ముందే గుర్తించేందుకు వీలుగా, ప్ర‌స్తుతం జిల్లా వ్యాప్తంగా ఫీవ‌ర్ స‌ర్వే జ‌రుగుతోంద‌ని, ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి కోవిడ్ ప‌రీక్ష‌ల‌ను కూడా చేస్తున్నార‌ని చెప్పారు. గ్రామాల్లో వ్యాధి నియంత్ర‌ణ‌కు క‌మిటీల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ఇంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితిలో కూడా కొంత‌మంది బాధ్య‌తార‌హితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని క‌లెక్ట‌ర్ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. మాస్కుల‌ను పెట్టుకోక‌పోవ‌డం, మార్కెట్ల‌లో, షాపుల‌వ‌ద్దా భౌతిక దూరాన్ని పాటించ‌క‌పోవ‌డం త‌దిత‌ర చ‌ర్య‌ల‌ను నివారించేందుకు ప్ర‌జాప్ర‌తినిధులు కృషి చేయాల‌ని, ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచాల‌ని సూచించారు.

             మున్సిప‌ల్ ప్రాంతాల అభివృద్దికి క‌లెక్ట‌ర్ పంచ‌సూత్రాల‌ను ప్ర‌క‌టించారు. టిఏటిఏఎస్ (టేంక్స్ క్లీనింగ్‌, ఎమిలిటీస్‌, ట్రీ ప్లాంటేష‌న్, అవేర్‌నెస్‌, శానిటేష‌న్) ఈ ఐదూ ప‌ట్ట‌ణాల అభివృద్దికి కీల‌క‌మ‌న్నారు. వ‌ర్షాలు ప్రారంభం కాక‌ముందే ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని చెరువుల‌ను శుద్ది చేయాల‌ని, పేరుకుపోయిన చెత్తా, పూడిక‌, ప్లాస్టిక్ తొల‌గించాల‌ని, చెరువులోకి వ‌ర్ష‌పునీరు వెళ్లేవిధంగా కాలువ‌లు సిద్దం చేయాల‌ని, గ‌ట్ల‌ను ప‌టిష్టం చేసి, మొక్క‌ల‌ను నాటేందుకు అనువుగా తీర్చిదిద్దాల‌ని సూచించారు. ప‌ట్ట‌ణాల్లో త్రాగునీరు, రోడ్లు, కాలువ‌లు, వీధి దీపాలు త‌దిత‌ర మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించ‌డంపై దృష్టి పెట్టాల‌న్నారు. ట్రీ ప్లాంటేష‌న్‌లో భాగంగా, అవ‌కాశం ఉన్న ప్ర‌తీ ప్రాంతంలో మొక్క‌ల‌ను నాటాల‌ని, ప‌రిశ‌రాల‌ను ప‌చ్చ‌ద‌నంతో నింపాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల విధులు, బాధ్య‌త‌లు, ప‌రిశ‌రాల ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌ద‌నం ప్రాధాన్య‌త‌ల‌ను వివ‌రిస్తూ బోర్డుల‌ను ఏర్పాటు చేసి, ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించాల‌న్నారు. పారిశుధ్యానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త‌నివ్వాల‌ని, రానున్న వ‌ర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.

               విజ‌య‌న‌గ‌రం నుంచి కార్పొరేట‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణి, పార్వ‌తీపురం మున్సిప‌ల్ ఛైర్‌ప‌ర్స‌న్ బోని గౌరీశ్వ‌రి, నెల్లిమ‌ర్ల నుంచి కౌన్సిల‌ర్ సంధ్య క‌లెక్ట‌ర్‌తో మాట్లాడి, ప‌లు స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు.  ఈ టెలీకాన్ఫ‌రెన్స్‌లో విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, ఇత‌ర మున్సిపాల్టీల క‌మిష‌నర్లు, మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి, ఛైర్‌ప‌ర్స‌న్లు, వైఎస్ ఛైర్మ‌న్లు, కార్పొరేటర్లు, కౌన్సిల‌ర్లు పెద్ద‌సంఖ్య‌లో పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-17 13:38:13