1 ENS Live Breaking News

దాతలూ కరోనాలో మీ సహాయం చాలా అవసరం..

కరోనా వైరస్ రెండవ దశ వేగంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో కరోనా బాధితులకు ప్రతి ఒక్కరూ తమ చేత నైన సహాయం చేయడానికి ముందుకు రావాలని జిల్లా క లెక్టర్  పోల భాస్కర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద కరోనా వైరస్ బాధితులకు మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ గ్యాస్ సిలెండర్లను జిల్లా కలెక్టరుకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ మొదటి దశ కంటే రెండవ దశ వేగంగా విస్తరిస్తుందని ఆయన చెప్పారు. జిల్లాలో కోవిడ్ రోగులకు ప్రభుత్వ,
పై#్రవేట్ హాస్పిటల్ ద్వారా ఆక్సిజన్ కొరత లేకుండా నిరంతరం సరఫరా చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఆక్సిజన్ నిల్వలపై జిల్లా స్థాయిలో జిల్లా సంయుక్త కలెక్టరును, పరిశ్రమల శాఖ జి.ఎమ్.ను, వైద్య ఆరోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను కమిటీగా పర్యవేక్షించడానికి నియమించడం జరిగిందన్నారు. ఈ కమిటి ప్రతిరోజు గంటల వారిగా ఏయే ఆసుపత్రులకు ఎంతమేర ఆక్సిజన్ వెళ్తుంది అనే విషయాలను పరిశీలిస్తుందని ఆయన
తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రవేటు ఆసుపత్రులకు ప్రతిరోజు 30 టన్నుల మేర ఆక్సిజన్ సరఫరా చేయాల్సి వుండగా ప్రస్తుత ం 24 వేల టన్నులు ప్రతిరోజు సరఫరా జరుగుతుందని ఆయన తెలియజేశారు. జిల్లాలో రోగులకు ఇబ ్బంది లేకుండా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామన్నారు. మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులకు ఆక్సిజన్ అందించడానికి 108 ఆక్సిజన్ సిలిండర్లను ఇవ్వడానికి ముందుకు వచ్చిన ట్రస్ట్ వారిని జిల్లా కలెక్టర్ అభినందించారు. అలాగే ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో100 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక, పర్యావరణ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రూ. 50 లక్షలతో ఏర్పాటు చేశారన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆక్సిజన్ గ్యాస్
సిలిండర్ల వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డి.ఎమ్.హెచ్.ఓ. డాక్టర్ రత్నావళి, డి.సి.హెచ్.ఎస్. డాక్టర్ ఉషారాణి, మాగుంట చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

PRAKASAM DISTRICT

2021-05-17 15:30:43

కోరోనా కట్టడికి ప్రభుత్వం సత్వర చర్యలు..

రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర  విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ వెల్లడించారు. సోమవారం స్థానిక మార్కాపురం జిల్లా వైద్య శాలలో 60 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  ఆది మూలపు సురేష్ ,జిల్లా కలెక్టర్  పోల భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ మార్కాపురం డివిజన్ కేంద్రంలోని జిల్లా వైద్యశాలలో అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మార్కాపురం జిల్లా వైద్య శాలలో ప్రస్తుతం70 ఆక్సిజన్ బెడ్స్ మరియు50 నాన్ ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయన్నారు. మార్కాపురం జిల్లా వైద్య శాలలో1.70 కోట్ల రూపాయలతో  ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. త్వరలో మార్కాపురం జిల్లా వైధశాలను పూర్తి స్థాయిలో ఆక్సిజన్ బెడ్స్ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతామని మంత్రి చెప్పారు. భవిష్యత్తు లో జిల్లా హాస్పిటల్ కు ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.కోవిడ్ నియంత్రణకు ప్రజలందరూ మాస్క్ లు ధరించి సామాజిక దూరంగా పాటించాలన్నారు.ఒంగోలు పార్లమెంట్ సభ్యులు  మాగుంట శ్రీనివాస రెడ్డి సహకారంతో జిల్లా వైదశాలలో 60 బెడ్స్ కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్నీ పేద ప్రజలు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్  పోల భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ మొదటి దశ కంటే రెండవ దశ వేగంగా వ్యాప్తి చెందుతుoదన్నారు.జిల్లాలో కోవిడ్ కట్టడికి టాస్క్ ఫోర్స్ కమిటీ ని నియమించడము జరిగిందన్నారు.జిల్లాలో గ్రామ స్థాయిలో ప్రజలకు  కోవిడ్ పరీక్షలు నిర్వహించడానికి  ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.కోవిడ్ పాజిటివ్ ఉన్నవారికి ప్రభుత్వ హాస్పిటల్స్ కు పంపడం జరుగుతుందన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని హోమ్ ఐసోలేషన్ లో ఉండే విధంగా నోటీసులు ఇవ్వాడము జరుగుతుందన్నారు.మార్కాపురం జిల్లా వైద్య శాలలో ఆక్సిజన్ కొరత లేకుండా1.7 కోట్ల రూపాయలతో ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో జిల్లా వైద్య శాలలో ఆక్సిజన్ కొరత ఉండదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే  కుందురు నాగార్జున రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే  అన్నా రాంబాబు, వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినెటర్ ఉషా, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.శేషి రెడ్డి, మార్కాపురం జిల్లా వైద్య శాల నోడల్ ఆఫీసర్ సరళ వందనం,మున్సిపల్ కమిషనర్ నహీమ్ అహమ్మద్, తహసీల్దార్ విద్యాసాగరుడు,ఎంపీడీఓ హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.

Markapuram

2021-05-17 15:27:33

ఫీవర్ సర్వేచేయని వలంటీర్లను తొలగించండి..

గ్రామ స్థాయిలో వాలంటీర్లు చేపట్టిన కోవిడ్ సర్వే వివరాలను కంప్యూటర్లో అప్‌లోడ్ చేయని వారిని విధుల నుంచి తొలగించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉలవపాడు మండలం పెదపట్టపుపాలెం గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో కరోనా వైరస్ కట్టడికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. పెదపట్టపుపాలెం గ్రామంలో 1,304 గృహాలు వున్నాయని, గృహాలు వారిగా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు.
గ్రామంలో ప్రజలందరికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి కోవిడ్ లక్షణాలు వున్నవారిని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపాలన్నారు. కోవిడ్ లక్షణాలు వున్నవారిని హోం ఐసోలేషన్‌లో వుండే విధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నోటీసులు జారీచేయాలని ఆయన చెప్పారు. గ్రామాల్లో మండల
స్థాయి అధికారులు కోవిడ్ వ్యాప్తి గురించి తరచుగా తనిఖీలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉలవపాడు ఎమ్.పి.డి.ఓ. టి . రవి కుమార్, తహసిల్దార్ సంజీవ రావు, మెడికల్ ఆఫీసర్ రాజ్యలక్ష్మి, సచివాలయ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.

Ulavapadu

2021-05-17 15:24:15

ఇసుక సరఫరా అందుబాటులో ఉంచాలి..

తూర్పుగోదావరి జిల్లాలో మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్ త‌దిత‌ర విభాగాల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ కొత్త ఇసుక విధాన ప‌టిష్ట అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. సోమ‌వారం రాత్రి విజ‌య‌వాడ నుంచి ప్ర‌భుత్వ చీఫ్ సెక్ర‌ట‌రీ ఆదిత్య‌నాథ్ దాస్, డీజీపీ గౌతం స‌వాంగ్‌, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది.. ఇసుక విధానం అమ‌లుపై అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్‌పీలు, జాయింట్ క‌లెక్ట‌ర్లు, మైనింగ్ శాఖ అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ మైనింగ్ కాంట్రాక్టు  సంస్థ ద్వారా జిల్లా వ్యాప్తంగా అన్ని ఇసుక రీచ్‌ల ద్వారా ఇసుక స‌ర‌ఫ‌రా స‌జావుగా జ‌రిగేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు. రీచ్‌ల సామ‌ర్థ్యం మేర‌కు మైనింగ్ జ‌రిగి, వినియోగ‌దారుల‌కు స‌క్ర‌మంగా ఇసుక‌ను అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌తి లావాదేవీ పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో జ‌రిగేలా చూస్తామ‌న్నారు. క్షేత్ర‌స్థాయిలో అక్ర‌మాల‌కు తావులేకుండా స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకెళ్తామ‌న్నారు. నిఘా వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేయ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. గ‌తంలో జిల్లాలో ఇసుక త‌వ్వ‌కాల‌కు సంబంధించి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన ముగ్గురు కాంట్రాక్ట‌ర్లు, ఓ ఏజెన్సీకి జిల్లా క‌లెక్ట‌ర్ నేతృత్వంలోని జిల్లా ఇసుక ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటీ దాదాపు రూ.22 కోట్ల మేర జ‌రిమానా విధించిన అంశాన్ని రాష్ట్ర స్థాయి అధికారులు వీసీ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. ఇలాంటి చ‌ర్య‌లు విధానాల ప‌టిష్ట అమ‌లుకు దోహ‌దం చేస్తాయ‌ని పేర్కొన్నారు. 

Kakinada

2021-05-17 14:52:28

ఆక్సిజన్ సరఫరాను పటిష్టం చేయాలి..

తూర్పు నేవ‌ల్ డాక్‌యార్డ్ (విశాఖ‌ప‌ట్నం) లెఫ్టినెంట్ క‌మాండ‌ర్ సాహిల్ త్యాగి సోమ‌వారం సాయంత్రం కాకినాడ‌లోని క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డిని క‌లిశారు. జిల్లాలోని కోవిడ్ ఆసుప‌త్రుల్లో మెడిక‌ల్ ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌లను మ‌రింత ప‌టిష్టం చేసేందుకు ప‌లు సూచ‌న‌లు అందించారు. కాకినాడ జీజీహెచ్‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జిల్లా ఆసుప‌త్రి, జీఎస్ఎల్ ఆసుప‌త్రుల్లో మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ట్యాంక్‌లు, వాటి నుంచి పైపుల ద్వారా స‌ర‌ఫ‌రా ప్ర‌క్రియ‌ల ప్ర‌త్య‌క్ష ప‌రిశీల‌న ఆధారంగా సెంట్ర‌ల్ ఆక్సిజ‌న్ సిస్ట‌మ్‌ల ప‌టిష్ట‌తకు సంబంధించి ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు అందించారు. మెడిక‌ల్ ఆక్సిజ‌న్ పైప్‌లైన్ వ్య‌వ‌స్థ‌లో స‌మ‌స్య‌లు ఎదురుకాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, పైప్‌లైన్ వ్య‌వ‌స్థ భ‌ద్ర‌త త‌దిత‌ర అంశాల‌పై క‌లెక్ట‌ర్‌, లెఫ్టినెంట్ క‌మాండ‌ర్ చ‌ర్చించారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రుల్లో కోవిడ్ బాధితుల‌కు అవ‌స‌రం మేర‌కు మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను అందించే ప్ర‌క్రియ మొత్తం బాగున్న‌ప్ప‌టికీ, భ‌విష్య‌త్తులో ఎలాంటి పొర‌పాటు జ‌ర‌క్కుండా ఉండేందుకు అమ‌లుచేయాల్సిన ప్ర‌ణాళిక‌పై ఈ భేటీ జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఏపీ మెడిక‌ల్ స‌ర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఏపీఎంఎస్ఐడీసీ) ఈఈ కె.సీతారామ‌రాజు పాల్గొన్నారు.

Kakinada

2021-05-17 14:09:27

మాతృ మరణాలు జరిగితే ఉపేక్షించను..

పాడేరు ఐటిడిఏ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో కరోనాతో గర్భవతులు మృతి చేందితే ఉపేక్షించనని సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల సిడిపి ఓలను  హెచ్చరించారు. సోమవారం వైద్యాధికారులు, ఎంపిడిలోలు ,తాహశీల్దార్లు, సహాయ గిరిజన సంక్షేమాధికారులు సిడిపి ఓలతో కోవిడ్ సేవలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ, అంగన్వాడీలను సూపర్‌వైజర్లు పర్యవేక్షణ లోపిస్తోందన్నారు. అంగన్వాడీ సరుకులు పక్కదారి పడితే సంబంధిత సిబ్బంది, సూపర్‌వైజర్‌లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గర్భవతులను పరిరక్షించాల్సిన బాధ్యత అంగన్వాడీలపైనే ఉందన్నారు. అనకాపల్లి , కె జి హెచ్‌లలో గర్భవతులకు ప్రత్యేక కోవిడ్ వార్డులు ఏర్పాటు చేసారని చెప్పారు. గర్భవతులకు పోజిటివ్ వస్తే వైద్యాధికారులు వెంటనే రిఫర్ చేయాలని సూచించారు.  ఏజెన్సీలో సుమారు ఐదు వందల పడకలతో మూడు కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసామని అన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లకు సంబంధిత మండలానికి చెందిన సహాయ గిరిజన సంక్షేమాధికారులను నోడల్ అధికారులుగా నియమించామని చెప్పారు. సమస్యలుంటే ఎటిడబ్యూ ఓలను సంప్రదించాలన్నారు. అరకు కోవిడ్ కేర్ సెంటర్‌కు సంబంధించి ఎటిడబ్యూ ఓ మల్లిఖార్జున రావు 94415 86116, 86392 82540, పాడేరు కోవిడ్ కేర్ సెంటర్‌కు ఎటిడబ్ల్యూ ఓ ఎల్. రజని8309 34 6709, చింతపల్లికి ఎటిడబ్యూ ఓ చంద్ర శేఖర్ 94933 99494 మొబైల్ నంబర్లలో సంప్రదించాలన్నారు. కొత్తాగా ఎన్నికైన పంచాయతీ సర్పంచులతో పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి, పి ఆర్ కమీషనర్ ఈనెల 19వ తేదీన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని దానికి అవసరమైన ఏర్పాట్లు ఎంపిడి ఓలు చేయాలన్నారు. మండలంలో మూడుచోట్ల ల్యాప్‌టాప్‌ల ద్వారా జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించాలన్నారు.  ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు జి.విజయకుమార్, అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ లీలా ప్రసాద్, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా. కృష్ణారావు, సహాయ గిరిజన సంక్షేమాధికారులు,11 మండలాల వైద్యాధికారులు ,రెవెన్యూ అధికారులు, ఎంపిడి ఓలు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2021-05-17 13:46:57

జాబితాలో ఉంటేనే కోవిడ్ వేక్సిన్..

జాబితాలో ఉన్న వారికే వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ స్పష్టం చేశారు. సోమవారం ఉదయం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టడం జరుగుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలతో వ్యాక్సిన్ కు ఏ వ్యక్తులు రావాలి అని ముందుగానే సమాచారం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ముందుగా సమాచారం అందించిన వ్యక్తులు మాత్రమే వ్యాక్సినేషన్ కు రావాలని, వారి జాబితా మాత్రమే వ్యాక్సినేషన్ కేంద్రంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జాబితాలో లేని వారికి ఆ రోజు వాక్సినేషన్ వేయడం జరగదని తెలిపారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని గుర్తించాలని అయితే వారికి ఇచ్చిన తేదీలలో మాత్రమే వాక్సినేషన్ జరుగుతుందని, ఆ రోజున రావాలని  కలెక్టర్ చెప్పారు.  ఫీవర్ సర్వే, కరోనా లక్షణాలతో ఉన్న వారిని గూర్చి మాట్లాడుతూ ఫీవర్ సర్వే పక్క జరగాలని అన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని తక్షణం గుర్తించి వారి నమూనాలు సేకరించాలని ఆయన ఆదేశించారు. ఇంటివద్ద ఐసోలేషన్ సౌకర్యాలు లేని వారు కోవిడ్ కేర్ కేంద్రాల్లో వచ్చి ఉండవచ్చని కలెక్టర్ తెలిపారు. కోవిడ్ కేర్ కేంద్రాల్లో మంచి వైద్య సేవలు, వసతి సౌకర్యం, భోజన సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పాత్రునివలస, సంతబొమ్మాలి కేంద్రాల్లో అనేక బెడ్లు ఖాళీగా ఉన్నాయని ఆయన అన్నారు. ఇంటి వద్ద ఉంటూ మందులు సకాలంలో తీసుకోక పోవడం వలన వ్యాధి తీవ్రత పెంచుకుంటున్నారని, అటువంటి అవకాశం వారికి ఇవ్వకుండా వారిని కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. మండలాల్లో ఎక్కువ నమూనాలు తీయాలని ఆయన ఆదేశించారు.  గత 15 రోజులుగా ఏ ప్రాంతం నుండి తక్కువ నమూనాలు సేకరించినది గుర్తించాలని, అటువంటి మండల సర్వేలియన్స్ అధికారులు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నమూనాలు తీసిన వెంటనే వాటిని పరీక్షలకు పంపించాలని, అందుకు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. 24 గంటల లోపుగా ఫలితాలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. 
      ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే .శ్రీనివాసులు, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడ, రెవిన్యూ డివిజనల్ అధికారులు ఐ.కిషోర్, టి వి ఎస్ జి కుమార్, ప్రత్యేక అధికారులు, వైద్య అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-17 13:40:47

ప్ర‌జల స‌హ‌కారంతోనే కోవిడ్ నియంత్ర‌ణ‌..

ప్ర‌జ‌ల స‌హ‌కారంతోనే కోవిడ్‌ను నియంత్రించ‌గ‌ల‌మని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ స్ప‌ష్టం చేశారు. ఈ మ‌హ‌మ్మారిని జిల్లా నుంచి త‌రిమికొట్ట‌డంలో, మున్సిప‌ల్ అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ‌వంతు పాత్ర పోషించాల‌ని కోరారు. ప‌ట్ట‌ణాల అభివృద్దికి పంచ‌సూత్రాల‌ను అమ‌లు చేయాల‌ని కోరారు. మేయ‌ర్‌, మున్సిప‌ల్ ఛైర్మ‌న్లు, వైస్ ఛైర్మ‌న్లు, కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్లు, మున్సిప‌ల్ అధికారుల‌తో క‌లెక్ట‌ర్ సోమ‌వారం టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.    ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, జిల్లాలో క‌రోనా నియంత్ర‌ణ‌కు నివార‌ణ‌, చికిత్స‌, కార్యాచ‌ర‌ణ అనే మూడంచెల వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. కోవిడ్ నివార‌ణకు ప్ర‌తీఒక్క‌రూ మాస్కుల‌ను ధ‌రించ‌డం, భౌతిక దూరాన్ని పాటించ‌డం, త‌ర‌చూ చేతుల‌ను శుభ్రం చేసుకోవ‌డం అనే అంశాల‌ని ప్ర‌తీఒక్క‌రూ పాటించాల‌ని కోరారు. మ‌రోవైపు వేక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను కూడా కొన‌సాగిస్తున్నామ‌ని చెప్పారు. వ్యాధి సోకిన‌వారికి అత్యుత్త‌మ చికిత్స‌ను అందించ‌డం ద్వారా న‌యం చేస్తున్నామ‌న్నారు. కోవిడ్ ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉన్న‌వారిని హోం ఐసోలేష‌న్‌లో ఉంచి, వారికి కోవిడ్ కిట్ల‌ను అంద‌జేసి చికిత్స‌ను అందించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ఇళ్ల‌లో ఏకాంతంగా ఉండే అవ‌కాశం లేనివారిని కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌కు పంపించి చికిత్స చేస్తున్నామ‌న్నారు. అవ‌స‌ర‌మైన వారిని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించి, చికిత్స చేయ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. వ్యాధిని ముందే గుర్తించేందుకు వీలుగా, ప్ర‌స్తుతం జిల్లా వ్యాప్తంగా ఫీవ‌ర్ స‌ర్వే జ‌రుగుతోంద‌ని, ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి కోవిడ్ ప‌రీక్ష‌ల‌ను కూడా చేస్తున్నార‌ని చెప్పారు. గ్రామాల్లో వ్యాధి నియంత్ర‌ణ‌కు క‌మిటీల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ఇంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితిలో కూడా కొంత‌మంది బాధ్య‌తార‌హితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని క‌లెక్ట‌ర్ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. మాస్కుల‌ను పెట్టుకోక‌పోవ‌డం, మార్కెట్ల‌లో, షాపుల‌వ‌ద్దా భౌతిక దూరాన్ని పాటించ‌క‌పోవ‌డం త‌దిత‌ర చ‌ర్య‌ల‌ను నివారించేందుకు ప్ర‌జాప్ర‌తినిధులు కృషి చేయాల‌ని, ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచాల‌ని సూచించారు.

             మున్సిప‌ల్ ప్రాంతాల అభివృద్దికి క‌లెక్ట‌ర్ పంచ‌సూత్రాల‌ను ప్ర‌క‌టించారు. టిఏటిఏఎస్ (టేంక్స్ క్లీనింగ్‌, ఎమిలిటీస్‌, ట్రీ ప్లాంటేష‌న్, అవేర్‌నెస్‌, శానిటేష‌న్) ఈ ఐదూ ప‌ట్ట‌ణాల అభివృద్దికి కీల‌క‌మ‌న్నారు. వ‌ర్షాలు ప్రారంభం కాక‌ముందే ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని చెరువుల‌ను శుద్ది చేయాల‌ని, పేరుకుపోయిన చెత్తా, పూడిక‌, ప్లాస్టిక్ తొల‌గించాల‌ని, చెరువులోకి వ‌ర్ష‌పునీరు వెళ్లేవిధంగా కాలువ‌లు సిద్దం చేయాల‌ని, గ‌ట్ల‌ను ప‌టిష్టం చేసి, మొక్క‌ల‌ను నాటేందుకు అనువుగా తీర్చిదిద్దాల‌ని సూచించారు. ప‌ట్ట‌ణాల్లో త్రాగునీరు, రోడ్లు, కాలువ‌లు, వీధి దీపాలు త‌దిత‌ర మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించ‌డంపై దృష్టి పెట్టాల‌న్నారు. ట్రీ ప్లాంటేష‌న్‌లో భాగంగా, అవ‌కాశం ఉన్న ప్ర‌తీ ప్రాంతంలో మొక్క‌ల‌ను నాటాల‌ని, ప‌రిశ‌రాల‌ను ప‌చ్చ‌ద‌నంతో నింపాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల విధులు, బాధ్య‌త‌లు, ప‌రిశ‌రాల ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌ద‌నం ప్రాధాన్య‌త‌ల‌ను వివ‌రిస్తూ బోర్డుల‌ను ఏర్పాటు చేసి, ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించాల‌న్నారు. పారిశుధ్యానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త‌నివ్వాల‌ని, రానున్న వ‌ర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.

               విజ‌య‌న‌గ‌రం నుంచి కార్పొరేట‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణి, పార్వ‌తీపురం మున్సిప‌ల్ ఛైర్‌ప‌ర్స‌న్ బోని గౌరీశ్వ‌రి, నెల్లిమ‌ర్ల నుంచి కౌన్సిల‌ర్ సంధ్య క‌లెక్ట‌ర్‌తో మాట్లాడి, ప‌లు స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు.  ఈ టెలీకాన్ఫ‌రెన్స్‌లో విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, ఇత‌ర మున్సిపాల్టీల క‌మిష‌నర్లు, మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి, ఛైర్‌ప‌ర్స‌న్లు, వైఎస్ ఛైర్మ‌న్లు, కార్పొరేటర్లు, కౌన్సిల‌ర్లు పెద్ద‌సంఖ్య‌లో పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-17 13:38:13

క‌లెక్ట‌ర్‌గా మూడేళ్ల ప‌ద‌వీకాలనికి ప్రశంసలు..

విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ గొప్ప పాల‌నాద‌క్షులే కాకుండా, ఉన్న‌త వ్య‌క్తిత్వం క‌ల‌వార‌ని ప‌లువురు అధికారులు కొనియాడారు. ఆయ‌న నాయ‌క‌త్వ ప‌ఠిమ కార‌ణంగా జిల్లా ఖ్యాతి ఇనుమ‌డించింద‌ని, ప‌లు జాతీయ‌, రాష్ట్ర‌స్థాయి అవార్డులు వ‌రించాయ‌ని ప్ర‌శంసించారు. జిల్లా క‌లెక్ట‌ర్ గా మూడేళ్ల ప‌ద‌వీకాలం పూర్త‌యిన సంద‌ర్భంగా, ప‌లువురు ఉన్న‌తాధికారులు, జిల్లా అధికారులు, నాయ‌కులు, సోమ‌వారం ఏర్పాటు చేసిన జూమ్ కాన్ఫ‌రెన్స్‌లో క‌లెక్ట‌ర్‌ను అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు.
           జిల్లా క‌లెక్ట‌ర్‌గా ఈ మూడేళ్లూ అంద‌రినీ క‌లుపుకొని, జిల్లాను అభివృద్ది ప‌థాన న‌డిపార‌ని అన్నారు. అంత‌ర్జాతీయ స్థాయిలో సైతం జిల్లా పేరు మారుమ్రోగిందంటే, దానికి క‌లెక్ట‌ర్ కృషే కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. జిల్లాపై ఆయ‌న చెర‌గ‌ని ముద్ర వేశార‌ని, జిల్లా చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోతార‌ని అన్నారు. ఆయ‌న మాట‌తీరు, న‌డ‌వ‌డిక‌, వ్య‌వ‌హార శైలి, మృదు స్వ‌భావం త‌మ‌కు స్ఫూర్తిదాయ‌క‌మ‌ని అన్నారు. హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ హ‌యాంలో ప‌నిచేయ‌డం త‌మ అధృష్ట‌మ‌ని ప‌లువురు అధికారులు పేర్కొన్నారు. ప‌నులు ఎలా పూర్తి చేయాలో, ప్ర‌ణాళిక‌ల‌ను ఎలా త‌యారు చేయాలో, తాము క‌లెక్ట‌ర్‌ను చూసి నేర్చుకున్నామ‌న్నారు. చెర‌గ‌ని చిరున‌వ్వుతో, క‌లుపుగోలుత‌నంతో, ఎనాడూ ఎవ‌రికీ ఎటువంటి హానీ చేయ‌ని గొప్ప సంస్కారం క‌లెక్ట‌ర్ సొంత‌మ‌ని కొనియాడారు.
         జాయింట్ క‌లెక్ట‌ర్‌(రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్(అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, స‌బ్ క‌లెక్ట‌ర్ విదేహ్ ఖ‌రే, ఐటిడిఏ ఆర్‌.కూర్మ‌నాధ్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, వివిధ శాఖ‌ల జిల్లా అధికారులు, తాశీల్దార్లు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, మండ‌ల అధికారులు, ఉద్యోగ సంఘాల నాయ‌కులు,  క‌లెక్ట‌ర్ కు జూమ్ కాన్ఫ‌రెన్స్‌లో అభినందన‌లు తెలిపారు.

స‌మిష్టి కృషే విజ‌యాల‌కు కార‌ణం ః డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, జిల్లా క‌లెక్ట‌ర్‌
         జిల్లా క‌లెక్ట‌ర్‌గా తాను సాధించిన విజ‌యాల‌కు స‌మిష్టి కృషి, ప్ర‌జాప్ర‌తినిధుల స‌హ‌కార‌మే కార‌ణ‌మ‌ని క‌లెక్ట‌ర్ అన్నారు. మూడేళ్ల‌పాటు క‌లెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌హించే అరుదైన‌ అవ‌కాశాన్ని త‌న‌కు ఇచ్చినందుకు ముఖ్య‌మంత్రికి ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ మూడేళ్ల‌లో సాధించిన విజ‌యాల‌ను మ‌రోసారి గుర్తుకు తెచ్చుకున్నారు. వివిధ ర‌కాల ఎన్నిక‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించామ‌ని, ప్ర‌కృతి విప‌త్తుల‌ను ఎదుర్కొన్నామ‌ని, క‌రోనాను మొద‌టి ద‌శ‌లో విజ‌య‌వంతంగా క‌ట్ట‌డి చేశామ‌ని చెప్పారు. ప్ర‌స్తుత రెండోద‌శ‌ను కూడా ఇదే ప‌ద్ద‌తిలో నియంత్రించి, జూన్ 17 నాటికి పూర్తిగా అదుపు చేయాల‌న్న ల‌క్ష్యంతో ప్ర‌ణాళిక‌ను రూపొందించామ‌ని చెప్పారు.
         ఒక్కోసారి మ‌నం ఎంతో క‌ష్ట‌ప‌డినా, నింద‌లు, అప‌వాదులు వ‌స్తుంటాయ‌ని, వాటికి కృంగిపోకుండా, లోపాల‌ను అధిగ‌మించి, ముందుకు పోవాల‌ని కోరారు. సానుకూల దృక్ఫ‌థంతో ముందుకు వెళ్లాల‌ని సూచించారు. త‌న కుటుంబ నేప‌థ్యం, వైద్య విద్య‌, ఇంత‌కుముందు చేసిన ఉద్యోగాల అనుభ‌వాన్ని దృష్టిలో ఉంచుకొని, జిల్లాలో విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయ రంగాల‌కు అధిక ప్రాధాన్య‌త‌నివ్వ‌డం జ‌రిగింద‌న్నారు. శ‌తాయుష్షుకు విజ‌య‌న‌గ‌రం జిల్లా చిరునామాగా మారాల‌ని, దానికోసం ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌ద‌నం, ప‌రిపూర్ణ ఆరోగ్యానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు.

Vizianagaram

2021-05-17 13:36:31

రైతులూ దళారులను నమ్మి మోసపోవద్దు..

రైతులు రబీ సీజనలో పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని, రైతు భరోసా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాలను సంప్రతించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు పొందాలని జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ కోరారు. సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రెస్ మీట్ నిర్వహించి రైతుల రబీ ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు చేపట్టిన చర్యలను మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని తక్కవ ధరలకు దళారులు అమ్మి నష్టపోకుండా మద్దతు ధర పొందేందుకు జిల్లా వ్యాప్తంగా 885 రైతు భరోసా కేంద్రాలు, 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.  2020-21 రబీ సీజనుకు రైతులు పండించిన  ఏ గ్రేడు ధాన్యానికి క్వింటాలుకు 1888 రూపాయలు (75 కేజీల బస్తాకు 1416 రూపాయలు), సాధారణ రకానికి క్వింటాలుకు 1868 రూపాయలు ( 75 కేజీల బస్తాకు 1401 రూపాయలు) చొప్పున ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించిందని, జిల్లాలో ఇప్పటి వరకూ 355 ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా 2 లక్షల 14 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లాలోని 885 రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం తేమ శాతం కొలిచే యంత్రాలను అందుబాటులో ఉంచామని, రైతులు తమ ధాన్యంలో తేమ శాతాన్ని సమీప ఆర్ బి కే లలో ఉచితంగా తెలుసుకోవచ్చనన్నారు.  తమధాన్యానికి  17 శాతం లోపు తేమ, 3 శాతం లోపు వ్యర్థాలు ఉండేలా చూసుకుని, ఆర్ బి కె లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంప్రతించి కూపన్లు పొంది, 24 గంటలలో మద్దతు ధరకు విక్రయించుకోవచ్చనని తెలియజేశారు. మండల వ్యవసాయ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, విఆర్ఓలు, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది, పిపిసి కేంద్రాల సిబ్బంది రైతులకు మద్దతు ధరలు గురించి వివరించి, దళారుల బారిన పడకుండా చర్యలు చేపడుతున్నారన్నారు.  జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల ధాన్యం తడవకుండా కప్పి కాపాడుకోవాలని, దళారుల మాటలు నమ్మి ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దని ఆయన తెలిపారు.  ధాన్యం సేకరణకు సంబంధించి రైతులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా తక్షణమే పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో 8886613611 నెంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.  ప్రభుత్వ కనీస మద్దతు ధర పొందడంలో దళారులు, ఇతరుల నుండి సమస్యలు వస్తే ఈ కంట్రోల్ రూమ్ నెంబరుకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చునని జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ రైతులకు తెలియజేశారు. 

Kakinada

2021-05-17 13:15:28

దాతల సహాయం కోవిడ్ ప్రాణులకు భరోసా..

కరోనా సమయంలో దాతలు చేసే సహాయం కోవిడ్ రోగుల ప్రాణాలకు భరోసా కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ డి.మురళీ ధరరెడ్డి పేర్కొన్నారు. సోమ‌వారం కాకినాడ‌ క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ను కలిసి డార్విన్ ఫార్మా (విజ‌య‌వాడ‌) సంస్థ ప్ర‌తినిధి ఎస్‌సీవీ ర‌త్నారెడ్డి.. అయిదు స్ట్రాట‌స్ ఫైవ్ ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించారు. కోవిడ్ బాధితులకు అవ‌స‌ర‌మైన ప్రాణ వాయువును అందించేందుకు ఉప‌యోగ‌ప‌డే 10 ఎల్‌పీఎం సామ‌ర్థంగ‌ల ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు వితరణ చేశారు. డార్విన్ ఫార్మాకు క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్భంగా అభినంద‌న‌లు తెలియ‌జేశారు. కోవిడ్ విప‌త్తు స‌మ‌యంలో బాధితుల‌కు అండ‌గా ఉండాల‌నే ఉద్దేశంతో డార్విన్ ఫార్మాకు చెందిన డా. వి.ర‌వికుమార్‌, డా. ఎన్‌.ముర‌ళిలు యూఎస్ ఇండియా ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఫౌండేష‌న్‌, వెస్ట్ టెక్సాస్ ఇండియ‌న్ డాక్ట‌ర్స్ గ్రూప్ స‌హ‌కారంతో ఒక్కోటి రూ.లక్షా ప‌దివేలు విలువైన అయిదు ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించిన‌ట్లు ర‌త్నారెడ్డి తెలిపారు. రెండు వెంటిలేట‌ర్ల‌ను కూడా స‌మ‌కూర్చిన‌ట్లు వెల్ల‌డించారు. కోవిడ్ బాధితుల‌కు ఉప‌యోగ‌ప‌డే స్ట్రాట‌స్ ఫైవ్ ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు అందించిన డార్విన్ ఫార్మా సంస్థ‌కు జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) జి.రాజ‌కుమారి అభినంద‌న‌లు తెలియజేశారు.

Kakinada

2021-05-17 13:10:50

కోవిడ్ సమయంలో దాతల సహాయం మరువలేనిది..

కోవిడ్ ప్ర‌భావం అధికంగా ఉన్న నేప‌థ్యంలో సామాజిక బాధ్య‌త‌తో కార్పొరేట్‌, వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌లు స‌హాయం చేసేందుకు ముందుకు వ‌స్తుండ‌టం అభినంద‌నీయ‌మ‌ని, ఇదే స్ఫూర్తితో విప‌త్తును ఎదుర్కోవ‌డంలో మ‌రిన్ని సంస్థ‌లు భాగ‌స్వామ్యం కావాల‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగ సంస్థ గ్రీన్‌కో ఆధ్వ‌ర్యంలోని  గ్రీన్‌కో ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డికి దాదాపు రూ.15 లక్ష‌ల విలువైన 20 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, ఎనిమిది ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను అందించారు. కాకినాడ అర్బ‌న్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి స‌మక్షంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ విప‌త్తు స‌మ‌యంలో త‌మ వంతు స‌హాయం అందించేందుకు ముందుకొచ్చిన గ్రీన్‌కో ఫౌండేష‌న్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. కోవిడ్ వైర‌స్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఈ ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు ఉప‌యోగ‌ప‌డతాయ‌ని, అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల్లో వీటి పాత్ర కీల‌క‌మ‌ని క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. కోవిడ్ బాధితుల‌కు ఉప‌యోగ‌ప‌డే ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు అందించిన గ్రీన్‌కో ఫౌండేష‌న్‌కు జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) జి.రాజ‌కుమారి అభినంద‌న‌లు తెలియజేశారు.
 
       కాకినాడ అర్బ‌న్ శాస‌న‌స‌భ్యులు ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి మాట్లాడుతూ గ్రీన్‌కో ఛీఫ్ ఎగ్జిక్యూటివ్‌, మేనేజింగ్ డైరెక్ట‌ర్ అయిన చ‌ల‌మ‌ల‌శెట్టి అనిల్‌కుమార్ జిల్లా వాసి అని, ప్ర‌స్తుత కోవిడ్ విప‌త్తు స‌మ‌యంలో జిల్లా ప్ర‌జ‌ల‌కు ఆప‌న్న‌హ‌స్తం అందించాల‌నే ఉద్దేశంతో ఆక్సిజ‌న్ కాన్సంట్రేటర్లు, సిలిండ‌ర్ల‌ను అందించార‌ని తెలిపారు. ఇంకా స‌హాయం ఏదైనా కావాలంటే అందించేందుకు హైద‌రాబాద్ కేంద్రంగా ప‌నిచేస్తున్న గ్రీన్‌కో ఫౌండేష‌న్ సిద్ధంగా ఉంద‌ని, జిల్లా ప్ర‌జ‌ల త‌ర‌ఫున సంస్థ‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి పేర్కొన్నారు. రెండో వేవ్ ఉద్ధృతి నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, స్వీయ ర‌క్ష‌ణ చ‌ర్య‌లు పాటించాల‌ని ఎమ్మెల్యే సూచించారు. కార్య‌క్ర‌మంలో గ్రీన్‌కో డైరెక్ట‌ర్లు తోట శ్రీధ‌ర్‌, తుమ్మ‌ల మోహ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-17 13:04:18

కోవిడ్ కి ఆరోగ్యశ్రీలో వైద్యం అందించాలి..

ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ క్రింద క్యాష్ లెస్ ట్రీట్ మెంట్లు నిబంధనల ప్రకారం జరగాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.  కలెక్టరేట్ సమావేశ మందిరంలో కోవిడ్ సేవలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పడకలు కేటాయింపు పై సోమవారం ఆయన సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటగిరి ‘ ఎ ’  మరియు కేటగిరి ‘ బి ‘ ఎంప్యానెల్ ఆసుపత్రులలో ఆ మేరకు పడకలు ఖచ్చితముగా కేటాయింపు జంగాలన్నారు.  పడకల వివరాలను ఖచ్చితముగా ఆసుపత్రుల నోడల్ అధికారులు, ఆసుపత్రుల యాజమాన్యాలు డిఆర్డిఎ ప్రాజెక్టు డైరక్టరుకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని పేర్కొన్నారు.  I C U, వెంటిలేటర్ పడకలు, ఆక్సిజన్ పడకలు మొదలగు కేటగిరీల వారీగా పడకలు ఆరోగ్య శ్రీ క్రింద కేటాయింపు గావించి తెలియజేయాలని ఆదేశించారు.   ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఆరోగ్య శ్రీ క్రింద క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ జరగాలి, కాని  పేషెంట్లు సెల్ఫ్ ఫైనాన్స్ తో ట్రీట్మెంట్  పొందుట జరుగుతోందని, ఇది సరికాదన్నారు.  ప్రభుత్వ ఉత్తరువులు  జి.ఒ.నెం.210 ప్రకారము ఆరోగ్యశ్రీ క్రింద పడకలు కేటాయింపును అమలు చేయాలని స్పష్టం చేశారు.                                                       
          నిబంధనల ప్రకారము ఆరోగ్యశ్రీ బెడ్స్ కేటాయింపు చేయాలని, నిబంధనలు పాటించని ప్రవేటు ఆసుపత్రులకు నోటీసులు ఎందుకు జారీ చేయలేదని. (డి.ఎమ్.హెచ్.ఒ., ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ లను ప్రశ్నించారు.   విశాఖపట్నంలో ఆసుపత్రులు, అధికంగా వున్నాయని,  అయినా 104లో టిక్కెట్లు పెండింగు వుండటం శోచనీయమని పేర్కొన్నారు.    జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు ప్రైవేటు ఆసుపత్రులు, ఆరోగ్య శ్రీ బెడ్స్ కేటాయింపు విషయముపై పనిచేయాలన్నారు.  ఆర్.డి.ఒ. విశాఖపట్నం పెంచల కిషోర్ ప్రైవేటు ఆసుపత్రులను రెవెన్యూ యంత్రాంగముతో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.  జిల్లా కలెక్టరు అనుమతి తేకుండా ప్రైవేటు ఆసుపత్రులు కోవడ్ ట్రీట్ మెంటు ఇవ్వరాదని వెల్లడించారు.    ప్రైవేటు ఆసుపత్రుల పైన పూర్తిగా దృష్టి సారించాలని ఎ.డి. సర్వే మనీషా త్రిపాఠిని ఆదేశించారు.   ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలకు  సంబంధించిన వివరాలను ఒక ప్రొఫార్మాలో తక్షణమే అందజేయాలని ఆరోగ్యశ్రీ కోఆర్డినేటరు రాజేష్ ను ఆదేశించారు.    నోటిఫై కాబడిన ప్రైవేటు ఆసుపత్రులు అన్నీ ఆరోగ్యశ్రీ క్రింద బెడ్స్ కేటాయించి కోవిడ్  సేవలు ఖచ్చితముగా అందించాలన్నారు.  ఆసుపత్రుల  నోడల్ అధికారులు ఆసుపత్రుల్లో ఉండి ఆరోగ్యశ్రీ పడకలు,  కేటాయింపు పై దృష్టి సారించి వివరాలు తెలపాలని స్పష్టం చేశారు.   డిఎమ్ హెచ్ ఒ ప్రతిరోజు ఉదయం 5 ఆసుపత్రులు, మధ్యాహ్నం 5 ఆసుపత్రులను తనిఖీలు చేసి నివేదికలను ఎప్పటికప్పుడు అందించాలని ఆదేశించారు.  కోవిడ్  పాజిటివ్ రిపోర్టు లేదని అడ్మిషన్ నిరాకరించరాదని,  కేటగిరి  బి ఆసుపత్రుల ఎంప్యానెల్మెంటు (పర్మనెంటు / తాత్కాలికము) పూర్తి గావించాలని  డి.ఎం .హెచ్.ఒ.ను ఆదేశించారు.
                 ఆసుపత్రులలో పడకల వివరాలు, కేటాయింపు విషయముపై ఒక సాఫ్టవేర్  ఎన్.ఐ.సి. అధికారిచే తయారు చేయించాలని, పడకల  పొజిషన్ నిర్దిష్టంగా ఎప్పటికప్పుడు సాఫ్టవేర్ /యాప్ ద్వారా తెలపాలన్నారు.
 డి.ఎమ్.హెచ్.ఒ., ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటరు ప్రైవేటు ఆసుపత్రులు, బెడ్స్ కేటాయింపు విషయముపై సీరియస్ గా పనిచేయాలని ఆదేశించారు.   డి.ఎం..హెచ్.ఒ.  తే 18.5.2021 దిన కేటగిరి  ఎ ఆసుపత్రులతో వెబినార్  నిర్వహించాలని,  పి.డి. డి.ఆర్.డి.ఎ. వద్ద పెండింగులో వున్న 240 బెడ్స్ ఒక్కరోజులో పూర్తి కావాలన్నారు.  వెంటిలేటర్స్ పై ఆడిట్ నిరహించాలన్నారు.   ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్-2 పి. అరుణ్ బాబు, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, డిఎంహెచ్ ఒ సూర్యనారాయణ, ట్రైనీ కలెక్టర్ అతిథి సింగ్, ఆర్డిఓ పెంచల కిషోర్,  సర్వే శాఖ ఎడి మనీషా త్రిపాఠి, ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ రాజేష్,సిపిఒ శ్రీనివాస్, డా. మురళీ మోహన్, తదితరులు పాల్గొన్నారు.
 
 

Collector Office

2021-05-17 12:59:15

ఆసుపత్రుల్లో జర్మన్ హాంగర్స్ ఏర్పాటు చేయాలి..

ఆసుపత్రులలో అదనంగా కోవిడ్ పేషెంట్లకు వైద్య సేవలు అందించడానికి గాను ప్రభుత్వ ఆసుపత్రులైన కె.జి.హెచ్., విమ్స్, ఛాతీ ఆసుపత్రులలో  జర్మన్ హాంగర్స్ ను సత్వరమే ఏర్పాటు గావించాలని  ఎస్.ఇ. ఆర్.ఎండ్.బి సుధాకర్ ను జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆదేశించారు. సోమావారం ఈ విషయము పై కలెక్టరు, వైద్యాధికారులు, ఎస్.ఇ. ఆర్.ఎండ్.బి.అధికారులతో కలెక్టరు సమావేశము నిర్వహించారు. ఈ విషయముపై ఎస్.ఇ.,ఆర్.ఎండ్.బి.సుధాకర్ మాట్లాడుతూ ఇందుకు గాను ఇప్పటికే  ఇ.టెండర్లు ఆహ్వనించడమైనదని, 20వ తేదీన  బెడ్స్ తెరచి పనులకు ఉత్తర్వులు మంజూరు గావించడం జరుగుతుందని  వివరించారు. కెజిహెచ్ లో 100 పడకలు, విమ్స్ లో 100 పడకలు,  ఛాతీ ఆసుపత్రిలో 50 పడకలకు ఏర్పాట్లు గావించాలని కలెక్టరు సూచించారు.  పనులు మొదలు పెట్టిన తదుపరి ఒక రోజులో ఏర్పాట్లు పూర్తి గావించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టరు-2,పి.అరుణ్ బాబు, ఎ.ఎమ్.సి. ప్రిన్సిపాల్ డా.సుధాకర్, డి.ఎం .హెచ్.ఒ.డా.సూర్యనారాయణ, ఎస్.ఇ. ఆర్.ఎండ్.బి సుధాకర్ , ఇ.ఇ. ఎస్.ఇ. ఆర్.ఎండ్.బి ప్రశాంత్ పాల్గొన్నారు.

Collector Office

2021-05-17 12:52:57

ప్రకాశం ఇన్చార్జి డిపిఓగా విశ్వనాధశ్రీనివాస్..

గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు మరింతగా అందేలా చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఇన్చార్జి డిపిఓగా నియమితులైన తూతిక విశ్వనాధ శ్రీనివాస్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ పోల బాస్కర్ ఉత్తర్వుల మేరకు ఆయన ఇన్చార్జి డిపీఓగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డిపిఓ నారాయణరెడ్డి కోవిడ్ భారిన పడటంతో ఆ బాధ్యతలను ఈయనకి అప్పగించారు. ఇటీవలే ఎస్సీకార్పోరేషన్ ఈడిగా శ్రీనివాస్ విధుల్లోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం గ్రామస్థాయిలోనే ప్రజలకు సేవలందించడానికి గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటైందని..దాని ద్వారా పూర్తిస్థాయిలో సేవలందితే ప్రజలు జిల్లాకార్యాలయాల వరకూ వచ్చే పరిస్థితి ఉండదన్నారు. సచివాలయాల్లో అందే అన్నిసేవలపైనా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని  వివరించారు. అనంతరం కార్యాల సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి ఇన్చార్జి డీపీఓకి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా విధినిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే ఈయనను జిల్లాకలెక్టర్ గర్తించి డిపీఓ బాధ్యతలు అప్పగించడం విశేషం.

Ongole

2021-05-17 07:32:53