1 ENS Live Breaking News

అప్పన్న 2వ విడత చందనం అరగదీత ప్రారంభం..

విశాఖలోని సింహాలచంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న)కు ఈనెల26న రెవండో విడత చందనం సమర్పణ జరుగుతుందని దేవస్థానం ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, వైశాఖి పౌర్ణమి రోజున చందనం సమర్పిస్తారని చెప్పారు. స్వామివారికి సమర్పించే చందనం అగరదిత కార్యక్రమంలో దేవస్థాన ప్రత్యేక ఆహ్వానితులు గంట్లశ్రీనుబాబు పాల్గొని చందనం అరగదీశారని వివరించారు. స్వామివారికి కేజీ చందనం సమర్పించినవారికి (రూ.20,116) శేష వస్త్రం ఇస్తున్నామని చెప్పారు.  చందన సమర్పణ, గోత్ర నామాల పూజలు  మూడు, నాలుగో దఫాలుగా చందన సమర్పణలు కూడా కొనసాగుతాయన్నారు. దాతలు ఎంతైనా స్వామివారికి చందనం సమర్పించుకోవచ్చుని చెప్పారు.  ఆన్ లైన్ పూజలు, అర్చనల్లో  భాగస్వాములు కావాలనుకునే భక్తులు  దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-19 13:37:55

నిర్ణీత సమయంలోనే వైద్యసేవలు అందాలి..

కరోనా సమయంలో ఆసుపత్రిలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది టైమ్ ప్రకారం విధులు నిర్వహించాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం భీమిలీ ఆసుపత్రిలో మంత్రి ఆకస్మికంగా పర్యటించి అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ, ప్రజలకు కరోనా కష్ట కాలంలో  మెరుగైన సేవలు అందించాలని, ప్రజలకు అవసరమైన బెడ్ల విషయంలో గానీ, ఆక్సిజన్ విషయంలో గానీ, అంబులెన్స్ విషయంలో గానీ వైద్యులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, భీమిలి ఐఎన్ఎస్ కళింగ లో 60 బెడ్లు, ప్రభుత్వ ఆసుపత్రి లో 10 బెడ్లు, అదేవిధంగా పద్మనాభం మండలంలో 50 బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.  ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు  ధరించవలసిందిగా మంత్రి కోరారు. అదేవిధంగా మందులు, సిబ్బంది వివరాలను కూడా మంత్రి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.

Bheemili

2021-05-18 14:38:23

అక్షయ పాత్రలు సేవలు స్లాఘనీయం..

కరోనా వికృత రూపంతో విలయ తాండవం చేస్తున్న గడ్డు కాలంలో నగరం లోని పేదలు, వలస కూలీల ఆకలి తీర్చెందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ తో జివియంసీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. నగరం లోని వేలాది మంది అన్నార్తులకు  నిత్యం  ఆహారం అందించే ప్రక్రియను నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధి యదు దాస ప్రభు మంగళవారం ఆరిలోవలో ప్రారంభించారు. దాతల సహకారంతో అక్షయ పాత్ర చేస్తున్న ఆహార పంపిణీ యజ్ఞానికి జివియంసి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు మేయర్ పేర్కొన్నారు. పనులు లేక, పరిస్థితులు బాగాలేక, ఆస్పత్రుల అవసరార్థం నగరానికి వచ్చి భోజనం కోసం ఇక్కట్లు పడే వారికి ఊరట కల్పించటానికి ఆహార పంపిణీ ఎంత గానో ప్రయోజనంగా వుంటుందని మేయర్ హరి వెంకట కుమారి అన్నారు. సుమారు 5వేల మందికి నగర నలుమూలలకు వెళ్లి భోజనం ప్యాకెట్లు పంపిణీ వేగవంతం చేస్తున్నామని ఆమె తెలిపారు. నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులైన    కెజిహెచ్, ఛాతీ, ఇయన్ టి, రైల్వే ఆసుపత్రి, జివియంసి నైట్ షెల్టర్లతో పాటు నగరం లోని పేదలు, కూలీలు ఎక్కువగా వుండే ప్రాంతాల్లో  నిత్యం భోజనం ప్యాకెట్లు సరఫరా జరుగుతుందని మేయర్ అన్నారు. అక్షయ పాత్ర సేవలు నగరానికి ఎంతగానో అత్సవసరంగా ఉపయోగపడుతున్నాయి అని మేయర్ ప్రశంసించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు ఇంత పెద్ద యెత్తున ఆహార పంపిణీ కార్యక్రమానికి రూప కల్పన చేసిన అక్షయ పాత్ర ఫౌండేషన్ వైజాగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ భక్తదాస్ మరియు సభ్యులుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు చాలా ఉపయోగపడుతుందని అలాగే అక్షయ పాత్ర ఫౌండేషన్ వలె మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పేద ప్రజలకు ఆదుకోవాలని నగర మేయర్ పిలుపునిచ్చారు. జివిఎంసి సంపూర్ణ సహకారంతో నిత్యం 5వేల మందికి ఆహార పొట్లాలు అందిస్తున్నామని ప్రెసిడెంట్ డాక్టర్  భక్తదాస్  అన్నారు.  ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ సీనియర్ నాయకులు గొలగాని శ్రీనివాస్, అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-05-18 14:31:40

పారిశుధ్యంపై ప్రత్యేక ద్రుష్టి పెట్టాలి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించాలని  కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగలశారం శానిటేషన్ పై అదనపు కమిషనర్  డా. వి. సన్యాసి రావు, ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ఎ.ఎం.ఒ.హెచ్. లతో   వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని రోడ్లు, కాలువలు శుభ్రంగా ఉండాలని, ఎప్పటికప్పుడు చెత్తను డంపింగు యార్డుకు తరలించాలని ఆదేశించారు. డోర్ టు డోర్ వెళ్లి చెత్తను ఏ విధంగా నిర్వహిస్తున్నది, తడి-పొడి చెత్త సేకరణ అమలు తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తడి-పొడి చెత్త వేరు వేరుగా ఇవ్వాలని ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఖాళీ ప్రదేశాలలో పిచ్చి మొక్కలు లేకుండా చూడాలని, దుకాణాల వద్ద మూడు చెత్త డబ్బాలు ఉండేలా చూడాలని, అలా లేని దుకాణాలకు అపరాధ రుసుం వసూలు చేయాలని సూచించారు. క్లాప్ (CLAP) పధకం విజయవంతం అయ్యేందుకు సచివాలయాల  స్థాయిలో పారిశుధ్య కార్మికులను ఏర్పాటుకు ప్రణాళికా బద్ధంగా నిర్వహించేలా శానిటరి ఇన్స్పెక్టర్లకు, వార్డు శానిటరి కార్యదర్శులకు సూచించాలని ఆదేశించారు. పెద్ద పెద్ద కాలువలలో పూడిక తీత పనులపై కమిషనర్ ఆరా తీసారు. డంపర్ బిన్ల తొలగింపు వంటి కార్యక్రమం, పారిశుధ్య కార్మికులకు పనులు కేటాయింపు చేసి ప్రణాళిక వివరాలను ఎ.ఎం.ఒ.హెచ్. లను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య నిర్వహణ, స్వచ్ఛ సర్వేక్షన్ ఐ.ఇ.సి. కార్యకలాపాలు మొదలైన పనులను అదనపు కమిషనర్లు అడిగితెలుసుకున్నారు. కరోనా వ్యాప్తి, దాని నివారణ చర్యలపై ప్రధాన వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. నగరంలో ప్రతీ వార్డులో రద్దీ ప్రాంతాలలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని, బ్లీచింగు ను చల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన వైద్యాధికారి    డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ఎ.ఎం.ఒ.హెచ్. లు తదితరులు పాల్గొన్నారు.  

GVMC office

2021-05-18 14:29:00

రూ.8.5 లక్షల ఆక్సిజన్ ఎక్విప్ మెంట్ వితరణ..

విశాఖజిల్లాలోని అచ్చుతాపురంలోని ఏసియన్ పేయింట్స్ ప్రభుత్వానికి రూ.8.5లక్షల విలువైన ఆక్సిజన్ ఎక్సిప్ మెంట్ వితరణ చేశారు. వీటిని ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా.సుధాకర్ కి అందజేశారు. వీటిలో ఆక్సిజన్ మాస్కులు, సర్క్యూట్ లు, రీఏజెంట్లు తదితర ఎక్విప్ మెంట్ ను అందించారు. కరోనా సమయంలో దాతలు ముందుకి వచ్చి ఇతోదికంగా సహాయం చేయడం శుభపరిణామని ఏఎంసీ ప్రిన్సిపల్ కొనియాడారు. ఇదే స్పూర్తితో మరింత మంది దాతలు ముందుకి వస్తే కరోనా రోగుల ప్రాణాలు కాపాడిన వారవుతారని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏసియన్ పేయింట్స్ జనరల్ మేనేజర్, ఏఎంసీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు..

ఆంధ్రామెడికల్ కాలేజి

2021-05-18 13:36:18

500 పడకల ఆసుపత్రికి కార్యాచరణ..

శ్రీకాళహస్తి సమీపంలో ఆక్సిజన్ తో ఐదు వందలు పడకలు గల ఆసుపత్రి ఏర్పాటుకి ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్  అధికారులను ఆదేశించారు.  మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ లో  వివిధ శాఖల అధికారులతో ఆసుపత్రి నిర్మాణం గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆక్సిజన్ ప్లాంట్ సమీపంలో ఆసుపత్రి నిర్మాణం చేపడితే బాధితులకు వేగంగా ఆక్సిజన్ ఇవ్వడానికి వీలవుతుందని అదే విధంగా వారు తొందరగా కూడా కోలుకుంటారని అందుకోసం ఆక్సిజన్ కంపెనీ ప్రతినిధులు ఆక్సిజన్ ను ఎంత వేగంగా 500 పడకలకు వీలయ్యే విధంగా ఎన్ని రోజులలో అమర్చ గలరని అందుకోసం ప్రణాళికలను సిద్ధం చేయాలని వారిని కోరారు. అదేవిధంగా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి జర్మన్ షెడ్ లను ఏర్పాటు చేయాలని ఎన్ని రోజులు ఈ షెడ్యూల్ అను పూర్తి చేయగలరని ఈ ప్రాంగణంలో ఎటువంటి ఏర్పాట్లు ఉండాలని డాక్టర్లు వారి సిబ్బంది ఉండడానికి ఏర్పాట్లు చేయాలని అందుకోసం టాయిలెట్లు తదితర ఏర్పాట్లను నీటి తో సహా ఉండేలా చూడాలని కలెక్టర్ అన్నారు. తాత్కాలికంగా అంతర్గత రోడ్లు ఏర్పాటు చేయాలని మంచి వాతావరణం ఉండేలా చూడాలని ఆయన అన్నారు. బాధితులు ఎవరైతే చికిత్స పొందడానికి రావడం జరుగుతుందో వారికి అన్ని ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణం చేయాలని భావించిన స్థలాన్ని పరిశీలించడం జరిగిందని అయితే ఏ ఏ శాఖ తరపున ఎంత ఖర్చవుతుందో ప్రణాళికలు రెండు రోజుల్లో సిద్ధం చేస్తామని కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) వీరబ్రహ్మం, తిరుపతి ఆర్ డి ఓ కనక నర్సారెడ్డి,జి ఎం డి ఐ సి ప్రతాప రెడ్డి, రోడ్లు భవనాల శాఖ అధికారులు, గ్రామీణ నీటి సరఫరా అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, మెడికల్ హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. 

Collectorate Complex

2021-05-18 13:23:04

మత్స్యకారుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం..

చేపలవేట ప్రధాన జీవనోపాధిగా వున్న మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా వుంటుం దని రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి చెప్పారు. వై.ఎస్.ఆర్. మత్స్యకార భరోసా పథకం కింద అర్హుల బ్యాంకు ఖాతాల్లో వరుసగా మూడవ ఏడాది రూ. 10 వేల చొప్పున నగదు జమచేస్తున్న సందర్భంగా మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపల వేట నిషేధం వల న ప్రభావితమయ్యే ప్రతి మత్స్యకార కుటుంబానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఆర్థిక సహాయం చేస్తున్నట్లు చెప్పారు. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నా సాధారణ ప్రజల పరిస్థితిని దృష్టిలో
పెట్టుకొని మాట ఇచ్చిన మేరకు సకాలంలో వారికి ఆర్థిక సహాయం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు మత్స్యకారుల జీవనోపాధి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ దిశగా ఎనిమిది జిల్లాల్లో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుచేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో నిర్మించబోయే హార్బర్ కు ఈ ఏడాదే టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అనంతరం జిల్లానుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక, పర్యావరణ శాఖల మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస రెడ్డి మత్స్యకారులను ఉద్థేశించి వ ూట్లాడుతూ కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం భూమి సిద్ధంగా వుందని చెప్పారు. ఈ హార్బర్ అందుబాటులోకి వస్తే మత్స్యకారుల జీవనోపాధి మరింత మెరుగు పడుతుందన్నారు. తమ కోసం ఒక భవనం కావాలని మత్స్యకారులు కోరారని, ఈ దిశగా కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ భవనం కోసం 16 సెంట్లు భూమిని వారం రోజుల్లోనే సమకూర్చి పెడతామని కలెక్టరు చెప్పినట్లు బాలినేని ప్రకటించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  ఆది మూలపు సురేష్ మాట్లాడుతూ పేద లు, చేతివృత్తులపై ఆధారపడ్డ
వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్థితో పనిచేస్తోందని చెప్పారు. సముద్ర వేట నిషేధ కాల భృతిని గత ప్రభుత్వంలో వున్న రూ. 4 వేల నుంచి 10 వేలకు పెంచడం, మత్స్యకారుల బోట్లకు వాడే డీజిల్‌పై రాయితీని రూ. 6.03 నుంచి రూ. 9 లకు పెంచడం, ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఇస్తున్న నష్టపరిహారాన్ని రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం, ఆక్వా రైతులు వినియోగించే విద్యుత్ ఛార్జీల
యూనిట్ రేటును రూ. 3.86 నుంచి రూ. 1.50 లకు తగ్గించడం, వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక క్రింద మత్సకారుల అర్హత వయస్సును 50 ఏళ్లకు తగ్గించడం, మత్సకారులకు, ఆక్వారైతులకు ప్రభుత్వ సేవలను మరింత చేరువచే సేలా జిల్లాలో 84 మంది గ్రామ మత్స్య సహాయకులను, 65 మంది సాగరమిత్రలను నియమించడం ప్రభుత్వ చిత్తశుద్థికి నిదర్శనమని వివరించారు. జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ మత్స్యకార భరోసా కింద జిల్లాలో ప్రస్తుతం 12 వేల 284 మంది రూ. 12.284 కోట్ల మేరకు లబ్దిపొందుతున్నట్లు చెప్పారు. సముద్ర వేట నిషేధకాల భృతి రూ. 36.334
కోట్లు, మత్సకారులకు డీజిల్‌పై సబ్సిడి రూ. 20.40 కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడి రూ. 210 కోట్లు, వేట చేస్తూ మరణించే మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహా యం రూ. 1.20 కోట్లు, రిజర్వాయర్లు, చెరువుల్లో ఉచితముగా చేప పిల్లల విడుదలకు రూ. 30 లక్షలు కలిపి 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని మత్సకారులకు మొత్తం రూ. 268.234 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. అనంతరం మత్స్యకార
భరోసాకు సంబంధి ంచిన నిధుల చెక్కును మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా మత్స్యకారులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యురాలు శ్రీమతి పోతుల సునీత, చీరాల శాసన సభ్యులు కరణం బలరామక్రిష్ణమూర్తి, జాయింట్ కలెక్టర్ (ఆర్.బి. అండ్. ఆర్) జె. వెంకట మురళి, పి.డి.సి.సి. బ్యాంకు ఛైర్మన్ మాదాసు వెంకయ్య, మత్స్యశాఖ జె.డి. చంద్రశేఖర రెడ్డి, పశు సంవర్థక శాఖ జె.డి. బేబీరాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

PRAKASAM DISTRICT

2021-05-18 12:55:30

బ్యాంకుల్లో కోవిడ్ నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో కోవిడ్ నిబంధ‌న‌ల‌ను ఖ‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశించారు. డిఆర్‌డిఏ, ఎల్‌డిఎం, ఇత‌ర అధికారుల‌తో మంగ‌ళ‌వారం జూమ్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. బ్యాంకుల్లో కోవిడ్ నిబంధ‌న‌ల అమ‌లు, వైఎస్ఆర్ బీమా న‌మోదుపై స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, క‌ర్ఫ్యూ కార‌ణంగా బ్యాంకులు ర‌ద్దీగా ఉంటున్నాయ‌ని, అందువ‌ల్ల త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయాల‌ని స్పష్టం చేశారు. వినియోగ‌దారులు భౌతిక దూరాన్ని పాటించేలా చూడాల‌ని, ప్ర‌తీ బ్యాంకు ప్ర‌వేశ‌ద్వారం వ‌ద్ద త‌ప్ప‌నిస‌రిగా శానిటైజ‌ర్‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. మాస్కుల‌ను ధ‌రించిన వారిని మాత్ర‌మే బ్యాంకుల్లోకి అనుమ‌తించాల‌ని స్ప‌ష్టం చేశారు. అదేవిధంగా ఎటిఎంల వ‌ద్ద కూడా శానిటైజ‌ర్‌ను, టిష్యూ పేప‌ర్‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. అలాగే బ్యాంకు ప‌నివేళ‌లు కుదించినందువ‌ల్ల‌, ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌కుండా, ఏటిఎంల‌లో త‌గినంత న‌గ‌దు నిల్వ‌లు ఉండేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు.

                 వైఎస్ఆర్ బీమా న‌మోదు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు. ఈ నెలాఖ‌రు లోగా శ‌త‌శాతం ల‌క్ష్యాల‌ను పూర్తి చేయాల‌న్నారు. గ‌తేడాది సుమారు 81 శాతం బీమా న‌మోదుతో మ‌న జిల్లా రాష్ట్రంలోనే మొద‌టి స్థానంలో నిలిచింద‌ని, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా త‌మ ల‌క్ష్యాల‌ను పూర్తి చేయాల‌ని ఆదేశించారు. క‌రోనా వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్నందున‌, బీమా లేనివ్య‌క్తులు ఎవ‌రైనా చ‌నిపోతే, ఆ కుటుంబం తీవ్రంగా న‌ష్ట‌పోతుంద‌ని, అందువ‌ల్ల ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ నెలాఖ‌రు నాటికి వైఎస్ఆర్ బీమా రెన్యువ‌ల్‌తో బాటు, కొత్త‌గా న‌మోదును కూడా పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తిరోజూ బ్యాంకు కార్య‌క‌లాపాలు ముగిసిన త‌రువాత 12 గంట‌లు నుంచి  2 గంట‌లు వ‌ర‌కూ, వైఎస్ఆర్ బీమా న‌మోదుకు కేటాయించాల‌న్నారు. డిఆర్‌డిఏ సిబ్బంది ఈ వేళ‌ల్లోనే బ్యాంకులకు వెళ్లి, బీమా రెన్యువ‌ల్‌, న‌మోదు పూర్తి అయ్యేలా చూడాల‌న్నారు.

               డిఆర్‌డిఏ పిడి కె.సుబ్బారావు మాట్లాడుతూ, జూన్ 1 నుంచి కొత్త పాల‌సీ అమ‌ల్లోకి వ‌స్తుంద‌న్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని, జిల్లాలో వైఎస్ఆర్ బీమా న‌మోదు, రెన్యువ‌ల్ ప్ర‌క్రియ‌ల‌ను ఏప్రెల్ 16 నుంచే మొద‌లు పెట్టామ‌ని చెప్పారు. కోవిడ్ కార‌ణంగా కొంత జాప్యం జ‌రుగుతోంద‌ని, ఈ నెలాఖ‌రు నాటికి పూర్తి చేస్తామ‌ని చెప్పారు. దీనికోసం ప్ర‌తీ బ్యాంకుకు ఒక డిఆర్‌డిఏ సిబ్బందిని పాయింట్ ప‌ర్స‌న్‌గా నియ‌మించామ‌న్నారు. వీరు ప్ర‌తీరోజూ సంబంధిత స‌చివాల‌యాల‌కు వెల్లి, వెల్ఫేర్ అసిస్టెంట్‌వ‌ద్ద ఎన్‌రోల్‌మెంట్ జాబితాల‌ను తీసుకొని, బ్యాంకుల‌కు వెళ్లి ఆన్‌లైన్‌ చేయిస్తున్నార‌ని చెప్పారు.

               ఎల్‌డిఎం కె.శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, జిల్లా క‌లెక్ట‌ర్ ఇచ్చిన ఆదేశాల‌ను త‌క్ష‌ణ‌మే బ్యాంకుల్లో అమ‌లు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. బీమా న‌మోదు కోసం ఉద‌యం 12 గంట‌లు నుంచి 2 గంట‌లు వ‌ర‌కూ స‌మ‌యాన్ని కేటాయించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. ఐఓబి, ఎస్‌బిఐ, గ్రామీణ బ్యాంకుల్లో కొన్ని సాంకేతిక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, వాటి ప‌రిష్కారానికి సంబంధిత అధికారుల‌తో మాట్లాడ‌టం జ‌రిగింద‌న్నారు. బ్యాంకు ఉద్యోగుల్లో ధైర్యాన్ని నింపి, 45 ఏళ్లు పైబ‌డిన వారంద‌రికీ టీకా వేయించ‌డానికి ఎంత‌గానో స‌హ‌క‌రించిన జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఈ సంద‌ర్భంగా ఎల్‌డిఎం కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Vizianagaram Collectorate

2021-05-18 12:41:22

104 కాల్స్‌కు స‌త్వ‌ర ప‌రిష్కారం..

తూర్పుగోదావరి జిల్లాలో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి మార్గ‌నిర్దేశ‌నం మేర‌కు జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) జి.రాజ‌కుమారి నేతృత్వంలో ఏర్పాటైన ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ ద్వారా 104 కాల్స్‌కు త్వ‌రిత‌గతిన ప‌రిష్కారం ల‌భిస్తోంద‌ని, బ్యాక్‌లాగ్ కాల్స్ అనే మాట‌కు తావులేకుండా ఈ వ్య‌వ‌స్థ ప‌నిచేస్తోంద‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి, కాకినాడ అర్బ‌న్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, డీసీసీబీ ఛైర్మ‌న్ అనంత ఉద‌య్‌భాస్క‌ర్‌, జేసీ (డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి త‌దిత‌రుల‌తో క‌లిసి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ క‌లెక్ట‌రేట్‌లోని వికాస కార్యాల‌యం వ‌ద్ద‌గ‌ల బెనెడ్ క్ల‌బ్‌లో ఏర్పాటుచేసిన 104 కాల్‌సెంట‌ర్ విభాగాన్ని సంద‌ర్శించారు. విభాగం ప‌నితీరును పరిశీలించి, సిబ్బంది నుంచి వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. హోం ఐసోలేష‌న్ కిట్ల రూప‌క‌ల్ప‌న ప‌నులను ప‌రిశీలించారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ 104 కాల్స్ ప‌రిష్కారం కోసం స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్న 40 మంది సిబ్బంది, అధికారుల బృందం మొత్తాన్ని అభినందిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి బాధితునికి ప్ర‌త్యేకంగా ట్రాక్‌షీట్ రూపొందించి, నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ద్వారా అవ‌స‌ర‌మైన సేవ‌లు అందించేందుకు ఈ వ్య‌వ‌స్థ కృషిచేస్తోంద‌న్నారు. డివిజ‌న్ స్థాయిలోనూ కాల్‌సెంట‌ర్లు సేవ‌లందిస్తున్నాయ‌న్నారు. కోవిడ్ బారిన‌ప‌డినవారు ఆందోళ‌న చెంద‌కుండా, ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వైద్య స‌హాయం పొందాల‌ని, ఈ విధంగా చేస్తే త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చ‌న్నారు. కొన్ని ప్రైవేటు ఆసుప‌త్రులు అధిక ఫీజులు వ‌సూలు చేయ‌డం వ‌ల్ల అన్ని ఆసుప‌త్రుల‌కు చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని, ప్రైవేటు ఆసుప‌త్రులు ఇది సంపాద‌నకు కాకుండా స‌హాయం చేయాల్సిన స‌మ‌యంగా భావించి సేవ‌లందించాల‌ని సూచించారు. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించే వారిపై చ‌ట్ట ప‌రంగా చ‌ర్య‌లు ఉంటాయ‌ని స్పష్టం చేశారు. కోవిడ్ క‌ట్ట‌డికి ప్ర‌భుత్వ యంత్రాంగం తీసుకుంటున్న చ‌ర్య‌లు హ‌ర్ష‌ణీయంగా ఉన్నాయ‌ని, బాధితుల‌కు సేవ‌లందించే క్ర‌మంలో ప్ర‌భుత్వ ఉద్యోగులు కూడా వైర‌స్ బారిన‌ప‌డుతున్నార‌ని తెలిపారు. ఒకరు చేసిన త‌ప్పిదం వంద‌మందిని న‌ష్ట‌ప‌రుస్తుంద‌ని.. అందువ‌ల్ల ప్ర‌జ‌లంద‌రూ స్వీయ క్ర‌మ‌శిక్ష‌ణ‌తో జాగ్ర‌త్త‌లు పాటిస్తూ కోవిడ్ క‌ట్ట‌డిలో భాగ‌స్వాములు కావాల‌ని మంత్రి వేణుగోపాల‌కృష్ణ పిలుపునిచ్చారు. 
             క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ కేర్ కేంద్రాల్లో (సీసీసీ)నూ ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందుబాటులో ఉంచుతున్నామ‌ని, ఈ ఏర్పాటు వ‌ల్ల కోవిడ్ ఆసుప‌త్రుల‌పై ఒత్తిడి బాగా త‌గ్గుతోంద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం జిల్లాలోని సీసీసీల్లో దాదాపు 2000 మంది ఉన్నార‌ని తెలిపారు. గిరిజ‌న ప్రాంతాల‌కూ ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను స‌మ‌కూర్చ‌నున్న‌ట్లు వెల్లడించారు. కార్పొరేట్‌, వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌లు కూడా సామాజిక బాధ్య‌త‌గా ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, మొబైల్ వెంటిలేట‌ర్లు వంటివి అందిస్తున్నాయ‌న్నారు. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారికి ఔష‌ధాల‌తో ప్ర‌త్యేక కిట్ల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపారు. మందుల నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించే విష‌యంలో మెడిక‌ల్ దుకాణాల‌పైనా నిఘా పెట్టామ‌ని, ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు తేలితే చ‌ట్ట‌ప‌రంగా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని క‌లెక్ట‌ర్ హెచ్చ‌రించారు. కార్య‌క్ర‌మంలో వికాస పీడీ కె.ల‌చ్చారావు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Kakinada

2021-05-18 12:39:39

జాగ్రత్తలు పాటించకపోతే తిష్ట వేస్తుంది..

కరోనా సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే  వైరస్ ఊపిరితీత్తుల్లో తిష్ట వేస్తుందని రాష్ట్ర రవాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.  మొదట్లో వైరస్ సోకిన 3,  5 రోజుల్లో లక్షణాలు కనిపించేవనీ, ఇప్పుడు అనేక కేసులలో ముదిరిన తర్వాతే కనిపిస్తున్నాయిని హెచ్చరించారు.  మంగళవారం  తన కార్యాలయంకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. మచిలీపట్నంకు చెందిన ఎం ఎస్ ప్రకాశరావు మంత్రి వద్ద తన సమస్యను చెప్పుకొన్నారు. తమ బంధువు ఒకరు కరోన సోకి ఆ సమస్యతో బాధపడుతున్నారని దీంతో ఆక్సిజన్ స్థాయి క్రమేపి తగ్గిపోతుందని ప్రభుత్వాసుపత్రిలో ఒక ఆక్సిజన్ బెడ్ ఇప్పించాలని కోరారు. ఈ విషయమై స్పందించిన మంత్రి , ప్రకాశరావు గారి  బంధువు పేరు వివరాలు ఫోన్ నెంబర్  వెంటనే తీసుకోవాలని తన వ్యక్తిగత కార్యదర్శి రఘురాంకు సూచించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, కోవిడ్-19 వైరస్ మానవ ఊపిరితీత్తుల్లోకి వెళ్లి..తన సామ్రాజ్యాన్ని నానాటికి  విస్తరించుకుంటుందన్నారు. తర్వాత అది ఊపిరితీత్తులు ఆక్సిజన్ గ్రహించే శక్తిని అడ్డుకుంటుందన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తిని అడ్డుకోవడమే కాకుండా.. ఊపిరితీత్తులకు రక్తాన్ని అందించే నాళాలను గడ్డకట్టిస్తుందన్నారు. ఫలితంగా శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్ సరఫరా కాదని దీంతో సమస్య తీవ్రమై రోగిని న్యుమోనియా వైపుకు దారి తీస్తుందని తెలిపారు. ఫలితంగా రక్తంలోనూ ఆక్సిజన్ శాతం తగ్గుతుందని అన్నారు. ఆక్సిమీటర్ ద్వారా ఈ మార్పును గుర్తించవచ్చని వివరించారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో, బాధితుడు తిరిగి తనంతట తానే ఊపిరి పీల్చుకొనే వరకు ఆక్సిజన్ అవసరమవుతుంది. కాబట్టి కరోనా వ్యాధి వచ్చినవారు శరీరంలో ఆక్సిజన్ శాతం మీద నిఘా పెట్టాలని అది ఎప్పుడు తగ్గుతున్నట్లు అనిపిస్తే తక్షణమే వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని మంత్రి పేర్ని నాని సూచించారు. .
       అలాగే , కరోనా టెస్టుల్లో నెగటివ్ వచ్చినవారు తమలో వైరస్ లేదని భావించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం లేదని ఫలితంగా వైరస్ నెమ్మదిగా ఊపిరితీత్తుల్లో విస్తరించి అకస్మాత్తుగా దాడి చేస్తోందని అన్నారు. సాధారణంగా మానవులు సరైన నిమిషానికి 7 లేదా 8 లీటర్ల గాలిని పీల్చి వదులుతారని  అంటే రోజుకు సుమారు 11 వేల లీటర్ల గాలిని శ్వాసిస్తారని ఇలా పీల్చేగాలిలో కేవలం 20 శాతం మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. ఇందులో ఊపిరితీత్తులు నిమిషానికి కేవలం 5 లేదా 6 మిల్లీ లీటర్ల ఆక్సిజన్ మాత్రమే దేహానికి  ఉపయోగించుకుంతుందని చెప్పారు. ఒక వేళ ఊపిరితీత్తులు పాడైతే..సాధారణం కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆక్సిజన్ గ్రహిస్తాయిని మంత్రి పేర్ని నాని చెప్పారు.  
    ఆక్సిజన్ శాతం 94 నుంచి 90 మధ్యన చూపిస్తుంటే శరీరానికి అదనంగా ఆక్సిజన్ అవసరమని, ఆ సమయంలో శరీరానికి ఎంత ఆక్సిజన్ అవసరమనేది కేవలం వైద్యులకు మాత్రమే తెలుస్తుందని కాబట్టి ఆస్పత్రిలో వైద్యుల సమక్షంలోనే ఆక్సిజన్ తీసుకోవాలని,లేకపోతే వైద్యపరంగా కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని మంత్రి అన్నారు. 
  స్థానిక చింతగుంట పాలెంకు చెందిన మాజీ కౌన్సిలర్ మిరియాల బాపనయ్య మంత్రిని కలిసి శారదానగర్, శివగంగ , ఖాలేఖాన్ పేట ప్రాంతంలో పారిశుధ్య పనులు సరిగా జరగడం లేదని చెప్పారు. ఈ విషయమై స్పందించిన మంత్రి మంత్రి పేర్ని నాని మునిసిపల్ కమీషనర్ కు ఫోన్ చేసి మాట్లాడి  ఈ సమస్యపై దృష్టి కేంద్రీకరించి ఆ ప్రాంతాలలో శానిటేషన్  మెరుగుపరచాలని ఆదేశించారు. 
   తాను ఏకాకినని, తనను చూసేవారు ఎవరూ లేరని వృద్ధాశ్రమంలో చేర్పించాలని మచిలీపట్నంకు చెందిన చల్లా బేబీ మంత్రిని ప్రాధేయపడింది. స్పందించిన ఆయన, అమ్మ మిమ్ములను అక్కడ చేర్పిస్తా.. అయితే, మీకు ముందు అనాధ సర్టిఫికేట్ , కోవిడ్ (ఆర్ టి పి సి ఆర్) పరీక్షలు చేయించిన తర్వాత వృద్ధాశ్రమంలో తప్పకుండ చేరవచ్చని అవి నేను మీకు చేయిస్తా అని మంత్రి పేర్ని నాని చెప్పారు.   

Machilipatnam

2021-05-18 12:34:32

మత్స్యకారుల్లో భరోసా వెలుగులు..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మ‌త్స్య‌కార భ‌రోసా ప‌థ‌కంలో భాగంగా జిల్లాలో 2953 కుటుంబాల‌కు రూ.2.953 కోట్ల ఆర్థిక సాయం వారి ఖాతాల్లో జ‌మ అయ్యింది. వేట నిషేధ‌కాలంలో మ‌త్స్యకారుల సంక్షేమార్థం ప్ర‌వేశ‌పెట్టిన ఈ ప‌థ‌కం మూడో విడ‌త సాయాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం త‌న క్యాంపు కార్యాల‌యం నుంచి మీట నొక్క‌డం ద్వారా విడుద‌ల చేశారు. వ‌రుసగా మూడో ఏడాది అన‌గా 2021-22 కాలానికి గాను ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున రైతుల ఖాతాల‌కు జ‌మ చేశారు. రాష్ట్రంలో మ‌త్స్యకార సోద‌రుల సంక్షేమార్థం చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మాన్ని మంత్రులు, ల‌బ్ధిదారుల స‌మ‌క్షంలో ముఖ్య‌మంత్రి ప్రారంభించారు. రాష్ట్రం నుంచి ప‌లువురు ల‌బ్ధిదారులు మాట్లాడిన త‌ర్వాత సంబంధిత చెక్కును ముఖ్య‌మంత్రి చేతుల మీదుగా విడుద‌ల చేశారు. అనంత‌రం జిల్లాకు సంబంధించిన చెక్కును ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, క‌లెక్ట‌ర్‌, జేసీ ల‌బ్ధిదారుల‌కు అంద‌జేశారు.  ఈ సంద‌ర్భంగా జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జిల్లా నుంచి క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్‌, విజ‌య‌న‌గ‌రం ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, జేసీ కిశోర్ కుమార్‌, మ‌త్స్య‌శాఖ ఉప సంచాల‌కులు నిర్మ‌లాకుమారి, జిల్లా మ‌త్స్యకార సంఘం ప్రెసిడెంట్ బ‌ర్రె చిన‌ప్ప‌న్న‌, మ‌త్స్య‌కార నాయకులు మైల‌ప‌ల్లి న‌ర్శింహులు, ల‌బ్ధిదారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-18 11:15:31

సీఎం వైఎస్ జగన్ దృఢ సంక‌ల్పంతో ప‌నిచేస్తున్నారు..

వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో ద్రుఢ సంకల్పంతో పనిచేస్తున్నారని  నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు అన్నారు. సీఎం వీడీయో కాన్ఫరెన్సు అనంతరం జిల్లా కలెక్టర్ డా.హరిజహర్ లాల్, మత్స్యశాఖ ఉప సంచాలకుడు ఎన్.నిర్మలకుమారిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.  మ‌త్స్యకార సోద‌రుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. మ‌త్స్య‌కార భ‌రోసా ప‌థ‌కం వ‌ల్ల జిల్లాలో 2953 కుటుంబాలు ల‌బ్ధి పొందుతున్నాయ‌ని పేర్కొన్నారు. వేట నిషేధ కాలంలో గ‌త ప్ర‌భుత్వాలు అందించిన సాయంతో పోలిస్తే ఇప్పుడు అందిస్తున్న రూ.10వేలు చాలా ఎక్కువ‌ని ఉద్ధాటించారు. మ‌త్స్యకారుల‌కు నాడు వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి, ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎన్నో మంచి ప‌నులు చేశార‌ని గుర్తు చేశారు. భోగాపురం, పూస‌పాటిరేగ మండ‌లాల ప‌రిధిలోని మ‌త్స్యకారుల‌కు ఈ ఆర్థిక తోడ్పాడు ఎంతో ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంద‌ని పేర్కొన్నారు. పూస‌పాటిరేగ ప్రాంతంలో ఫిషింగ్ హార్బ‌ర్ ఏర్పాటుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. త్వ‌ర‌లోనే అది అందుబాటులోకి వ‌స్తుంద‌ని ఆకాంక్షిస్తున్నాన‌ని అన్నారు. మ‌త్స్యకారుల జీవ‌నోపాధి పెంపుద‌ల‌కు ఈ ప్ర‌భుత్వం తీవ్ర కృషి చేస్తోంద‌ని పేర్కొన్నారు. వేట నిమిత్తం దారి త‌ప్పిపోయిన మ‌త్స్య‌కారులను బంగ్లాదేశ్‌, పాకిస్థాన్ నుంచి విడిపించి తీసుకొచ్చిన ఘ‌న‌త జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌న్నారు. అలాగే జిల్లాలో ప్ర‌స్తుతం కోవిడ్ క‌ట్ట‌డికి అధికారులు చేప‌డుతున్న చ‌ర్య‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని ఎమ్మెల్యే అన్నారు. విభిన్న పద్ధ‌తులు ఆచ‌రిస్తూ కోవిడ్ సేవ‌లందిస్తున్నార‌ని కితాబిచ్చారు. మ‌రిన్నిసేవ‌లందించి ఈ మ‌హ‌మ్మారిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఈ సంద‌ర్భంగా సూచించారు. విజ‌య‌న‌గ‌రం ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, జేసీ కిశోర్ కుమార్‌,  జిల్లా మ‌త్స్యకార సంఘం ప్రెసిడెంట్ బ‌ర్రె చిన‌ప్ప‌న్న‌, మ‌త్స్య‌కార నాయకులు మైల‌ప‌ల్లి న‌ర్శింహులు, ల‌బ్ధిదారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Collectorate

2021-05-18 11:13:37

అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు..

రాష్ట్రంలో అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైయస్సార్ మత్స్యకార భరోసా మూడో ఏడాది ఆర్ధిక సహాయ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు మత్స్యకారులకు వేట నిషేధ కాలమని, ఆ సమయంలో ప్రతి ఏటా పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో 1,19,875 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.119.88 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. సముద్రంపై చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు గతంలో కేవలం నాలుగు వేల రూపాయలు మాత్రమే అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద అర్హులైన మర పడవలు, యాంత్రిక పడవలతో పాటు సముద్రంలో సాంప్రదాయ పడవలపై వేట జరిపే మత్స్యకారులకు భృతి చెల్లిస్తున్నట్లు ఆయన వివరించారు. 2019 నుండి ఇప్పటి వరకు రూ. 332 కోట్లను భరోసాగా అందించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. డీజిల్ ఆయిల్ పై లీటర్ కు సబ్సిడీ రూ.6.03 నుండి రూ.9 పెంచుతూ,  ఆయిల్ పోయించుకుని సమయంలోనే రేటు తగ్గించి పోసే ఏర్పాటు చేశామని చెప్పారు. వేట చేస్తూ మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంపుదల చేసినట్లు ఆయన చెప్పారు. దాదాపు రూ.1,510 కోట్ల వ్యయంతో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్నంలలో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ప్రారంభించడం జరిగిందని,  రెండో దశలో శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖజిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప,  ప్రకాశం జిల్లా కొత్తపట్నంలలో రూ.1365.35 కోట్లతో నాలుగు ఫిషింగ్ హార్బర్ ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ హార్బర్ల ద్వారా దాదాపు 85 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఈ ఏడాది రూ.780 కోట్ల వ్యయంతో 53,550 మంది ఆక్వా రైతులకు ఇప్పటివరకు రూ.1,560 కోట్లతో లబ్ది కలిగేలా యూనిట్ కరెంటు కేవలం రూ.1.50 లకే సరఫరా  సిగేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.50.30 కోట్ల వ్యయంతో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్ లను ఏర్పాటుతో నాణ్యమైన ఉత్పత్తులు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన చేపలు, రొయ్యలు అందుబాటులోకి తీసుకువచ్చి వినియోగం పెంచడం, పౌష్టికాహార భద్రత కల్పించడంతో పాటు జనతా బజార్లకు అనుసంధానం చేసి ఆక్వా రైతులకు, మత్స్యకారుల కూడా గిట్టుబాటు ధర కల్పించాలని రూ.332.9 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో అవసరమైన అన్ని నియోజకవర్గాల్లో ఆక్వా హబ్ లు, వాటికి అనుసంధానంగా రిటైల్ దుకాణాలు ఏర్పాటు దిశగా అడుగులు వేయడం జరుగుతుందన్నారు. మొదటి విడతగా 25 ఆక్వా హబ్ లకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. 2019 నుండి ఇప్పటివరకు మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.2030.87 కోట్ల రూపాయలను 2,12,535 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సహాయంగా అందించడం జరిగిందని ఆయన చెప్పారు. మత్స్య, ఆక్వా రైతులకు సేవలు అందించేందుకు వీలుగా వెబ్ అప్లికేషన్ eMatsyakar  ప్రారంభించామని, సహాయం, ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 155251 నెంబర్ కు ఫోన్ చేయవచ్చని ఆయన తెలిపారు.

          జిల్లా కలెక్టర్ జె నివాస్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ జిల్లాలో  4,698 అర్హమైన బోట్లకు సంబంధించి 16,630 మంది మత్స్యకారులకు వైయస్సార్ మత్స్యకార భరోసా క్రింద లబ్ధి చేకూరుతుందన్నారు. ఇందులో భాగంగా రణస్థలం మండలంలో 801 బొట్లకు సంబంధించి 2424 మంది, ఎచ్చెర్ల మండలంలో 537 బోట్లు,  1937 మంది లబ్ధిదారులు.,  శ్రీకాకుళంలో 339 బోట్లు,  1074 మంది., గారలో 551 బోట్లు, 2054 మంది., పొలాకిలో 375 బోట్లు, 1504 మంది.,  సంతబొమ్మాలిలో 323 బోట్లు 1310 మంది.,  మందస మండలంలో 67 బోట్లు 230 మంది.,  వజ్రపుకొత్తూరులో 515 బోట్లు 1881 మంది.,  సోంపేటలో 434 బోట్లు 1610 మంది,  కవిటి లో 638 బోట్లు 2163 మంది, ఇచ్చాపురంలో 118 బోట్లు 443 మంది లబ్ధిదారులు ఉన్నారని ఆయన చెప్పారు.

          ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మందస మండలం నేల గంగువాడకు చెందిన పొట్టి ధర్మారావు మాట్లాడుతూ వివిధ పథకాల క్రింద ఆర్ధిక సహాయం అందిందన్నారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు చూస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి లాంఛనంగా చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి.వి. శ్రీనివాసరావు, మత్స్యకార సహకార సంఘం అధ్యక్షులు కోనాడ నర్సింగరావు, నెయ్యిల సంఘ ప్రెసిడెంట్ పాండ్రంకి మురళీకృష్ణ, మత్స్యకార నాయకులు మైలపల్లి పోలీస్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-18 10:39:54

బుడగట్ల పాలెంలో ఫిష్షింగ్ హార్బర్..

మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే  లక్ష్యంగా ఈ ఏడాదే ఎచ్చెర్ల మండలం బుడగట్ల పాలెంలో ఫిషింగ్ హార్బర్ పనులు మొదలు పెడతామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వేట నిషేధంతో ఉపాధి కోల్పోతున్న గంగపుత్రులకు భృతి కల్పించేందుకు మత్స్యకార భరోసా పథకం కింద రూ.10 వేలు సీఎం జగన్ అమరావతి నుంచి ప్రారంభించిన కార్యక్రమానికి ఆయన శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుంచి హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ మత్స్యకార భరోసా పథకం కింద వారి ఖాతాల్లోనే సొమ్ములు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ఒకవైపు కరోనా, మరోవైపు వేట నిషేధంతో ఇళ్లకే పరిమితమైన మత్స్య కారులకు ప్రభుత్వసాయం ఉపశమనం కలిగిస్తుందని అన్నారు.  జిల్లాలో 11 తీర ప్రాంత మండలాలలోని 16630 మంది గంగపుత్రులకు రూ.16కోట్ల 63 లక్షలు విడుదల చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో 193 కి. మీ. మేర సువిశాల తీరప్రాంతం ఉందని వేలాది మంది వేట పైనే ఆధారపడి జీవిస్తున్నారని, మత్స్యకారులు సొంతగా పడవలు సమ కూర్చుకుంటే వారికి ప్రయోజనం సమకూరుతుందని వివరించారు. వజ్రపుకొత్తూరు లో జెట్టీ నిర్మాణం త్వరలోనే పూర్తి అవుతుందని అన్నారు. భవనపడులో గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు వివరించారు. పశ్చిమ గోదావరిలో మత్స్యకార  యూనివర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ  కార్యక్రమంలో  కలెక్టర్ జె నివాస్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఫిషరీస్ జె.డి టీవీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-18 10:38:06

24 నుంచి అప్నన్న హుండీ లెక్కంపు..

విశాఖలోని సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవస్థానం హుండీ లెక్కింపు ఈనెల 24వ తేది నుంచి 26 వరకూ మూడు రోజులు చేపట్టున్నట్టు ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. మంగళవారం ఆమె దేవస్థానంలో మీడియాతో మాట్లాడారు.  స్వామివారి హుండీ లెక్కింపు బుధవారం ఉదయం 7.30గంలకు ప్రారంభమవుతుందన్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కోవిడ్ నియమ నిబంధనలు పూర్తి స్థాయిలో పాటిస్తూ సింహగిరిపైన బేడామండపంలో  హుండీల లెక్కింపు జరుగుతందన్నారు. ఈ మేరకు బేడా మండపాన్ని ముందుగానే సోడియం హైపోక్లోరైడ్ ద్రవాణంతో శుద్ధి చేపట్టనున్నట్టు కూడా చెప్పారు. 

Simhachalam

2021-05-18 10:14:54