1 ENS Live Breaking News

అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజల పాట్లు..

తూర్పుగోదావరి జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతలు చాలా ఎక్కువగా అమలవుతున్నాయి. రాత్రి సమయంలో పూర్తిగా విద్యుత్ నిలుపుదల చేస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు. జిల్లాలో చాలా మండలాల్లో అరకొరగా విద్యుత్ సరఫరా జరుగుతోంది. కరోనా కర్ఫ్యూ సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవుతున్న వేళ విద్యుత్ కోతలు ఎంతగానో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జిల్లాలోని ప్రముఖ దేవస్థానాలు ఉన్న ద్రాక్షారామం, పిఠాపురం, అన్నవరం ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగడం లేదు. పూర్తిగా లోఓల్టేజి సమస్య తలెత్తు తుంది. దీనితో మంచినీటిమోటార్లు, విద్యుత్ బల్బులు, టీవీలు కాలిపోతున్నాయి. అదే సమయంలో విద్యుత్ బిల్లులు చాలా అధికంగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోఓల్టేజీ సమస్యపై అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోతుంది. దీనితో ఓ పక్క అప్రకటిత విద్యుత్ కోతలు, మరోపక్క లోఓల్టేజి సమస్యతో జిల్లా వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సమయంలోనైనా విద్యుత్ ఉన్నతాధికారులు స్పందించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.

Kakinada

2021-05-17 02:44:14

9మంది గ్రామ వాలంటీర్లు తొలగింపు..

శ్రీకాకుళం  జిల్లాలో చేపట్టిన ఆరో విడత ఫీవర్ సర్వే లో నిర్లక్ష్యం వహించిన తొమ్మిది మంది వాలంటీర్లను తొలగిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఫీవర్ సర్వే లో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి అన్ని తప్పులు తడకలు రిపోర్టులను సమర్పించారని ఆయన తెలిపారు. తొలగింప బడిన వారిలో టెక్కలి మండలం టెక్కలి ఐదవ సచివాలయ పరిధికి చెందిన దండాసి డిల్లేశ్వర రావు,  దాసరి భారతి, దేవాది రామకృష్ణ, తోట వెంకటేష్,  బొడ్డు తులసి,  గండి రాజారెడ్డి.,  రణస్థలం మండలం నారువ సచివాలయ పరిధికి చెందిన పడగల రమణ,  భామిని మండలం బాలేరు 2 గ్రామ సచివాలయ పరిధికి చెందిన ఏ. రాజారావు,  లావేరు మండలం గుమడ గ్రామ సచివాలయానికి చెందిన గంగవరపు అప్పారావులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ తొమ్మిది మందిని తొలగిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలియజేస్తూ ఫీవర్ సర్వేను జిల్లా యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో, అంకితభావంతో నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. వాలంటీర్, ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆయన పేర్కొంటూ అనేక మంది ఇంటింటికి సర్వేకు వెళ్లకుండా నివేదికలు సమర్పిస్తున్నట్లు తెలియవచ్చిందని అందులో భాగంగా తొమ్మిదిమందిని తొలగించడం జరిగిందని అన్నారు. ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో అటువంటి వారిని తొలగించడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. మండల సర్వేలియన్స్ అధికారులు పరిస్థితులను గమనించాలని ఆయన పేర్కొంటూ అవసరమైతే మండల సర్వేలియన్స్ అధికారులపై చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

Srikakulam

2021-05-16 16:59:11

కోవిడ్ బాధితులకు ప్రగతి భారత్ భరోసా..

ఉత్తరాంధ్ర సంజీవినిగా పిల‌వ‌బ‌డుతున్న‌ షీలాన‌గ‌ర్ కోవిడ్ కేర్ సెంట‌ర్ ద్వారా కోవిడ్ భాదితులకు  భరోసా ల‌భిస్తుంది. అత్యాధునిక హంగుల‌తో, అత్యున్న‌త  ప్ర‌మాణాల‌తో ఎం.పి విజ‌య‌సాయి రెడ్డి సారథ్యంలోని ప్ర‌గ‌తి భార‌త్ ఫౌండేష‌న్ ఆధ్వర్యంలో షీలాన‌గ‌ర్ లోని వికాస్ కాలేజీలో ఏర్పాటు చేసిన 300 ప‌డ‌క‌ల ఆక్సిజ‌న్ సదుపాయం గ‌ల కోవిడ్ కేర్ సెంట‌ర్ ప్రారంభించిన రెండవ రోజుకే 110 మందికి పైగా కోవిడ్ భాదితుల‌కు ఆక్షిజ‌న్ అందించి ఊర‌ట క‌ల్పిస్తుంది. మిగ‌తా కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌కు భిన్నంగా  కార్పోరేట్ ఆసుప‌త్రుల‌కు ధీటుగా మ‌ల్టీ టైర్ ఆక్సిజ‌న్ స‌రఫ‌రా విధానంతో పేషెంట్లకు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాలో పూర్తి భద్ర‌త క‌ల్పిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశ‌యాల‌కు అనుగుణంగా ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంట‌ర్లో పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యం త్వ‌రిత గ‌తిన కోలుకునే విధంగా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.  చికిత్స పొందుతున్న కోవిడ్ భాదితుల యోగ క్షేమాలు రిసెప్షన్ వద్ద నుండే  తెలుసుకునే విధంగా సిసి కెమెరాలు,కంప్యూట‌ర్లు మెద‌ల‌గు ఏర్పాట్లపై భాదితుల స‌హాయ‌కులు సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.  శనివారం ఉదయం నుండి ఆదివారం సాయంత్రం నాటికి మెత్తం 111 మంది బాదితులు కోవిడ్ కేర్ సెంట‌ర్లో చేర‌గా అందులో 75 పురుషులు, మిగిలిన 36 మంది స్త్రీలు ఉన్నారు.  మెద‌టి రోజు 66 మంది భాదితులు చేర‌గా రెండ‌వ రోజు సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు 45 మంది భాదితులు చేరారు. డాక్ట‌ర్ల సూచ‌న‌లు మేర‌కు ఆదివారం సాయంత్రం నాటికి మెత్తం 16 మంది కోవిడ్ రోగులను మెరుగైన చికిత్స కోసం విమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అంబులెన్స్ లో ఆక్సిజ‌న్ స‌దుపాయం క‌ల్సిస్తూ వైద్య సిబ్బంది ప‌ర్య‌వేక్ష‌ణ‌తో రోగుల‌ను విమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో 9 మంది పురుషులు కాగా మిగిలిన 7 మంది స్త్రీలు. శనివారం ఇద్ద‌రికి మాత్ర‌మే విమ్స్  ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా మిగిలిన 14 మందిని ఆదివారం డాక్ట‌ర్ల సూచ‌న‌ల మేర‌కు త‌ర‌లించారు.

Visakhapatnam

2021-05-16 16:14:41

ఆక్సిజన్ నిల్వలపై అపోహలు వద్దు..

ఆక్సిజన్ నిల్వలపై అపోహలు అవసరం లేదని పటిష్ట కార్యాచరణ తో ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని జాయింట్ కలెక్టర్ హెల్త్ వీరబ్రహ్మం పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన ఆర్ డి ఓ  కనక నరసారెడ్డి తో కలిసి రీఫిలింగ్ కేంద్రాల యజమానులతో ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు ప్రస్తుతం సరఫరా అవుతున్న ఆక్సిజన్ క్వాంటిటీ పై దృష్టి సారించాలన్నారు.  జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల లో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బెడ్ లకు అనుగుణంగా ప్రాణవాయువును సరఫరా చేసేందుకు కు చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ ఆస్పత్రులను రీఫిల్లింగ్ కేంద్రాలకు అనుసంధానం చేసి  ఆస్పత్రులకు తగినంత ప్రాణవాయువు నిరంతరాయంగా అందించాలని సూచించారు. ఆక్సిజన్ నిల్వలు , వినియోగం, వృధా పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఆక్సిజన్ మేనేజ్మెంట్ పై  నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసి మంగళవారం ఉదయం లోపు కలెక్టర్ కు  నివేదిక సమర్పించారు. ప్రస్తుతం అవసరానికి సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉందన్నారు. జిల్లాలో అన్ని కోవేట్ కేర్ సెంటర్ లలోనూ ఆస్పత్రిలోనూ 18 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందన్నారు. జిల్లాకు ప్రతిరోజు 23 టన్నుల ఆక్సిజన్ ను ఇతర ప్రాంతాల  నుంచి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఆక్సిజన్ పై అనవసర అపోహలు వద్దని ప్రజలు ఈ విషయంపై భయపడాల్సిన పని లేదన్నారు.  ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ బాల ఆంజనేయులు , డ్రగ్ ఇన్స్పెక్టర్ కీర్తన ,జిల్లాలోని కోవిడ్   ఆసుపత్రుల ప్రతినిధులు , రీఫిలింగ్ కేంద్రాల యజమానులు పాల్గొన్నారు.

Tirupati

2021-05-16 16:04:01

ప‌టిష్ట వ్యూహంతో మెరుగైన ఫ‌లితాలు..

క‌రోనా క‌ట్ట‌డికి ప‌టిష్ట‌మైన వ్యూహాన్ని అమ‌లు చేయ‌డం ద్వారా జిల్లాలో మెరుగైన ఫ‌లితాల‌ను సాధిస్తున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. అంద‌రి సమిష్టి కృషివ‌ల్లే ఇది సాధ్య‌ప‌డుతోంద‌ని ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. కోవిడ్ నియంత్ర‌ణ‌లో భాగంగా చేప‌ట్టిన చ‌ర్య‌ల్లో, ఇప్ప‌టికీ మ‌న జిల్లా మెరుగైన స్థానంలో ఉంద‌ని తెలిపారు.  విజ‌య‌న‌గ‌రం జిల్లాలో క‌రోనా నియంత్రణ కు స‌మిష్టి కృషి జ‌రుగుతోంద‌ని తెలిపారు. రోజుకు 3,500 నుంచి 4 వేల వ‌ర‌కూ క‌రోనా నిర్ధార‌ణా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌న్నారు.  ఈ నెల మొద‌టి వారంలో 25,416 ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌గా, 6,737 పాజిటివ్ కేసులు వ‌చ్చాయ‌ని, రెండో వారంలో 22,220 టెస్టులు నిర్వ‌హించ‌గా, 5,851 పాజిటివ్ కేసులు వ‌చ్చాయ‌ని తెలిపారు. మే నెల‌లో అత్య‌ధికంగా ఇన్‌ఫెక్ష‌న్ రేటు న‌మోదైన‌ప్ప‌టికీ, ప్ర‌స్తుతం కొద్దిగా త‌గ్గుముఖం ప‌డుతోంద‌ని చెప్పారు. ఏప్రెల్ నెల‌లో 77,352 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, 9,183 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు. వ్యాధిగ్ర‌స్తుల‌కు చికిత్స‌ను అందించడంలో వైద్యులు, సిబ్బంది చూపిస్తున్న అంకిత‌భావం, చిత్త‌శుద్ది కార‌ణంగా, జిల్లాలో రిక‌వ‌రీ రేటు అత్య‌ధికంగా స‌గ‌టున 85.7 శాతం న‌మోదవుతోంద‌ని చెప్పారు. కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌లో 95.9 శాతం, హోమ్ ఐసోలేష‌న్‌లో 83.8 శాతం, ఆసుప‌త్రుల్లో 87.3 శాతం రిక‌వ‌రీ రేటు ఉండ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని తెలిపారు.

                     జిల్లాలో ప్ర‌స్తుతం 6,662 మంది హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్నార‌ని, వీరిలో 6,115 మందికి కోవిడ్ కిట్ల‌ను పంపిణీ చేయ‌డం ద్వారా, 91.79శాతాన్ని సాధించి, మ‌న జిల్లా రాష్ట్రంలోనే ప్ర‌ధ‌మ స్థానంలో నిలిచింద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. జిల్లాలో ఫీవ‌ర్ స‌ర్వే జోరుగా జ‌రుగుతోంద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 35.23 శాతం పూర్త‌య్యింద‌న్నారు. జిల్లాలో 7,47,312 వాసాల‌కు గానూ, ఇప్ప‌టివ‌ర‌కు 2,63,248 ఆవాసాల్లో స‌ర్వే పూర్త‌య్యింద‌ని తెలిపారు. జిల్లాలో మ‌రోవైపు వేక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా జ‌రుగుతోంద‌ని, దీనికోసం 67 కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. జిల్లాలో 44 కేంద్రాల్లో కోవిషీల్డ్‌, 23 కేంద్రాల్లో కోవేగ్జిన్ వేస్తున్నార‌న్నారు. జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు 2,53,861 మందికి మొద‌టి డోసు, 102432 మందికి రెండో డేసు  వేయ‌డం జ‌రిగింద‌ని క‌లెక్ట‌ర్ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Vizianagaram

2021-05-16 11:29:21

అంటరాని తనమే నిశ్వార్ధ సేవ వైపు నడిపింది..

అమ్మ ఒడే అతని బడి.. అమ్మ గోరు ముద్దలు పెడ్తూ చెప్పిన  మంచి మాటలే అతని బుద్ది బలం.. అంతకు మించి పలకా బలపం పట్టింది లేదు.. తన నిజ జీవితంలో ఏ పుస్తకాలనూ చదవని అతని మస్తకం ప్రపంచాన్నిఎంతో చక్కగా చదివింది.. కళ్లముందు కదలాడిన అంటరాని తనం తనసేవకు తొలిమొట్టు అయ్యింది.. నాటి నుంచి నేటి వరకూ వెను తిరిగి చూడకుండా తన సేవలు కొనసాగిస్తూనే ఉన్నాడా ఆటోవాలా.. ఆ మంచి మనిషికోసం తెలుసుకుంటే.. తూర్పు గోదావరి జిల్లా శంఖవరంలో ఆటో డ్రైవర్ గా జీవనాన్ని గడుపుతూ "దళిత ప్రజా ఐక్య వేదిక సేవా సంఘం శంఖవరం" సభ్యునిగా తన ప్రాంత స్వజనులకు ఇతోధిక సేవలందిస్తున్న బూర్తి దుర్గాప్రసాద్ (9030117096)కు భారత రత్న డాక్టర్  భీమారావ్ రామ్ జీ అంబేద్కర్ " పే బ్యాక్ టు సొసైటీ " సిద్దాంతం బాగా వంట బట్టింది.. శంఖవరంలోని తన నివాసిత ప్రాంతమైన అంబేద్కర్ నగర్ పరిధిలోని ఏ గర్భిణీ మహిళనైనా సమయానుకూలతలతో సంబంధం లేకుండా తన ఆటోలో ఆస్పత్రులకు ఉచితంగా తరలించి, వెనుకకు తీసుకు వచ్చేందుకు ముందుకు వచ్చి తన ఉదారతను చాటు కుంటున్నాడు. శంఖవరంలోని అంబేద్కర్ నగర్ నుంచి శంఖవరం, రౌతులపూడి, కత్తిపూడి, తుని, పిఠాపురం, కాకినాడలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఉచితంగా గర్భిణీ స్త్రీలను తరలిస్తూ ఇప్పటికి నెల రోజులుగా ఉచిత సేవలను అందిస్తూ అభినందనలను అందుకున్నాడు. కరోనా వైరస్ తన విశ్వరూపం చూపిస్తున్న సమయంలో కూడా  తన ఈ ఉచిత సేవలు పొందగోరే వారి కోసం తన ఆటోపై ప్లెక్సీని ప్రదర్శించి మరీ సేవలు చేస్తున్నాడు.. ఇదే విషయమై దుర్గాప్రసాద్ ను కదిలించినపుడు తన హృదయాన్ని కదిలించిన ఓ సంఘటనను వివరించాడు. నాతవరం మండలంలోని ఓ కుగ్రామంలో ఓ దళిత గర్భిణీ మహిళను ఆస్పత్రికి తరలించేందుకు ఉన్నత సామాజిక వర్గాల ఆటో వాలాలు అంగీకరించలేదని అన్నారు. అ సమయంలో గత్యంతరం లేక ఆ గర్భిణీ పశువుల పాకలో నాలుగు చీర పరదాల మాటున ఓ అభినవ బిడ్డకు జన్మనిచ్చిన సంఘటనను స్వయంగా చూసిన తనను ఎంతగానో కలచివేసిందన్నాడు.. నాడు ఆ తల్లి ఆ పశువులశాలో పడ్డ  ప్రసవ క(న)ష్టం తన దళితవాడలోని ఏ గర్భిణీకి రాకూడదనే స్థిర నిర్ణయంతో తాను ఈ సేవ చేయడానికి ముందుకి వచ్చానని చెప్పుకొచ్చాడు. 73ఏళ్ల స్వతంత్ర్య భారతదేశంలో ఇంకా అంటరాతి తనం ఉండటం కడు శోచనీయమని, మనుషులంతా ఒక్కటే నని అంతా భావించాలని కోరుతున్నాడు. సబ్ కా మాలిక్ ఏక్ హై..అని అంతా అనే రోజు రావాలని, అంభేత్కర్ కలలుగన్న భారత దేశాన్ని చూడాలని అనుకుంటున్నానని చెప్పాడు కళ్లు చమర్చుతూ..!

Sankhavaram

2021-05-16 11:15:48

ఆ మంచిపనికి మేమూ సాయం చేస్తామన్నారు..

కరోనా విలయతాండవం చేస్తున్నవేళ రోగులకు ఒకపూట భోజనం పెట్టాలనుకున్న ఆ అన్నదాత ఆలోచనకు మరో నలుగురు యువకులు తోడయ్యారు.. అనుకున్నదే తడవుగా చేయి చేయి కలిపి 300 మందికి ఆకలి తీర్చారు.. ఈ అరుదైన అన్నదాన కార్యక్రమానికి  ఆదివారం కాకినాడ జనరల్ హాస్పిటల్ వేదికైతే.. ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ప్రధాన సాక్షిగా నిలిచింది..  కరోనాతో బాధపడుతున్న రోగులకు, వారికి సహాయం ఉండటానికి వచ్చిన వారికి, రోగులకు వైద్యసేవ చేసే ఆసుపత్రి సిబ్బందికి ఆహార పొట్లాలు అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు ఆ యువకులు. ఎక్కువ మందికి అన్నదానం చేద్దామనుకున్న శంఖవరం గ్రామసచివాలయం-1లో సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్న వీర్ల సురేష్ కి మరో దాత శ్రీనివాస్ తోడయ్యారు. ఆదివారం ఆసుపత్రిలో అన్నదానం చేద్దామని శుక్రవారమే ప్లాన్ చేసుకున్నారు. దానికోసం భోజనాలు స్వయంగా చేయిద్దామని భావించి సతీష్ అనే వంటలు వండే వ్యక్తిని సంప్రదిస్తే.. మీరు నిరుపేదలకు ఆకలి తీర్చే మంచి కార్యక్రమం చేస్తున్నారు.. విపత్కర సమయంలో మీరు చేసే మంచిపనిలో నన్నూ భాగస్వామిని కానీయండంటూ ఆహారాన్ని మొత్తం ఉచితంగానే తయారు చేసి అందించాడాయన.. ఇపుడు వండిన ఆహారాన్ని ఆసుపత్రికి తరలించాలి.. ఆటో కోసం చూస్తున్న సమయంలో డ్రైవర్ వెంకట అప్పలనాయుడు తారస పడ్డాడు.. ఇన్ని అన్నం పొట్లాలు ఎక్కడ దించాలని అని ప్రశ్నించాడు ఆటో డ్రైవర్.. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు అన్నదానం చేస్తున్నాం టైమవుతుంది త్వరగా వెళ్లాలి అని చెప్పారు.. అంత మంది ఆకలి తీరుస్తున్నారు.. నేనూ మీ సేవకు తోడవుతాను నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వొద్దు, నేనూ కూడా మీతో పాటే అందరికీ అన్నం పంచుతాను నాకూ ఓ అవకాశం ఇవ్వండి అని అడిగాడు.. చక్కగా ప్యాకింగ్ చేసిన ఆహార పొట్లాలు మొత్తం నా ఆటోలో వేసేయండి నేనే తీసుకు వస్తానంటూ వండిన అన్నం ప్యాకెట్లు మొత్తం ఆసుపత్రికి హుటా హుటీన తరలించేశారు.. తీరా అక్కడ అన్నం అందరికీ పంచాలి.. ఆసుపత్రి సిబ్బంది అంతా విధుల్లో ఉన్నారు..కోవిడ్ కావడంతో ఎవరూ అందుబాటులో ఎవరూ లేరు.. సహాయం కోసం వెతుకున్న సమయంలో  రాబిన్ హుడ్ ఆర్మీ బ్రుందం సభ్యులు వి.రామ్, ఎ.లలిత్ సాయిలు వీరికి తోడయ్యారు.. అంతే చక చకా ఆసుపత్రిలో రోగులతోపాటు, సిబ్బందికి కడుపునిండా అన్నం పెట్టి దాహం తీర్చారు.. ఈ సమయంలో ప్రభుత్వం సూచించిన కరోనా నిబంధనలు(మొహానికి మాస్కులు, చేతికి హేండ్ గ్లౌజులు, చూట్టూ శానిటషన్ మధ్య మధ్యలో శానిటైజర్ తోశుభ్రం) పాటించారు ఆ యువకులంతా.. అక్కడ ఆహార పొట్లాలు తీసుకున్న ప్రతీ ఒక్కరూ ఆ ఐదురుగురు యువకుల వైపు చూస్తూ మీరంతా చల్లగా ఉండాలి బాబు, కష్టకాలంలో కడుపునిండా అన్నం పెట్టారంటూ నిండైన హ్రుదయంతో దీవించారు. దానికి ఆ యువకులు బదులిస్తూ.. సీఎం వైఎస్. జగన్మోహనరెడ్డి అలుపెరగ కుండా ప్రజలను ఈ కరోనా వైరస్ నుంచి కాపాడటానికి ఎంతో శ్రమిస్తున్నారు.. వైద్యం అందిస్తున్నారు, అన్నం పెడుతున్నారు, వైద్యసిబ్బందితో సేవలు చేస్తున్నారు, అంతలా ఆయన శ్రమిస్తున్న తీరు మాలో స్పూర్తి నింపి ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రేరేపించింది అంటూ వారికి బదులిచ్చారు యువకులు.. ఐదుగురు యువకులు ఆసుపత్రిలో రోగుల  కడుపు నింపడం కోసం చేసిన అన్నదాన కార్యక్రమం విజయవంతం అయ్యింది.. ఈ అన్నదాన కార్యక్రమం, యువకులు సేవతో ముందుకి వచ్చిన తీరు అక్కడి అధికారులను, వెద్య సిబ్బంది,  కరోనా రోగుల సహాయకులను ఎంతగానో ఆలోచింపజేసింది. ఇంతటి మంచి కార్యక్రమాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net పాఠకుల ముందుకి తీసుకు వచ్చింది. ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మంచిని పాటించిన ఈ యువ అన్నదాతల స్పూర్తితో మరింత మంది ఈ కరోనా సమయంలో ముందికి వచ్చి సాయమందిలన్నదే ప్రధాన ఉద్దేశ్యం..జైహింద్..! 

Kakinada

2021-05-16 10:58:55

ప్రారంభమైన సింహాద్రి అప్పన్న దర్శనాలు..

విశాఖలోని సింహాలచంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) దర్శనాలు ఆదివారం నుంచి తిరిగి ప్రారంభం అయ్యాయి. కరోనా, చందనోత్సవం నేపథ్యంలో 15వ తేదీ వరకూ భక్తులకు దర్శనాలు నిలుపుదల చేసిన దేవస్థానం అధికారులు తిరిగి ఆదివారం దర్శనాలు ప్రారంభించడంతో  ఉదయం 7.30 నుంచి 9.30 వరకూ భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే కేవలం స్వామివారి దర్శనాలు రెండు గంటల పాటు మాత్రమే భక్తులకు అవకాశం కల్పించి ఇతర సేవలన్నీ ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు. ఆదివారం దర్శనాలు ప్రారంభం అయ్యే సమయంలోనే వర్షం పడటం స్వామివారి మహిమ గా భక్తులు వర్ణించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు దేవస్థానం అధికారులు. స్వామివారి ఆర్జిత సేవలన్నీ ఆన్ లైన్ ద్వారా వీక్షించాలని అధికారులు సూచిస్తున్నారు.

Simhachalam

2021-05-16 08:33:29

ఘనంగా ప్రారంభమైన అప్పన్న ఆన్ లైన్ పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) దేవస్థానంలో ఆదివారం నుంచి ఆన్ లైన్లోనే అర్చనలు, పూజలు చేపట్టామని ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈమేరకు ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం స్వామివారికి ఆన్ లైన్ లో నే అర్చనలు, సేవలు చేసి వాటి యొక్క వీడియోలను భక్తులకు తెలియజేస్తామని, ప్రసాదాలకు ఇంటికి పంపిస్తామని చెప్పారు. దానికోసం ప్రత్యేకంగా యూట్యూబు ఛానల్ ను ఏర్పాటు చేశామని, వాటి ద్వారా స్వామివారి అర్చనలు ఆన్ లైన్ లోనే తిలకించవచ్చునని ఈఓ చెప్పారు. నిత్య కల్యాణం ( ప్రతి రోజూ ఉదయం 9:30 నుంచి 10:30), గురు- ఆదివారాల్లో జరిగే స్వర్ణపుష్పార్చన (8గంటలకు ఉదయం) , ప్రతినెలా స్వాతి నక్షత్రం రోజు స్వాతి హోమం  (ఉదయం 8 గంటలకు),ప్రతి ఏకాదశి రోజు స్వర్ణతులసీదళార్చన ఆన్ లైన్లో వీక్షించవచ్చునని ఈఓ చెప్పారు. నిత్యకళ్యాణానికి 1,000(వెయ్యి రూపాయలు), స్వర్ణపుష్పార్చనకు రూ. 2,116 (రెండు వేల నూట పదహారు రూపాయలు), స్వాతి హోమానికి రూ.2,500 (రెండువేల ఐదు వందలు), స్వర్ణతులసీదళార్చనకు రూ.2,116( రెండువేల నూటపదహారు) చెల్లించాల్సి ఉంటుందన్నారు. మీ తరపున స్వామివారి కళ్యాణమండపంలో  గోత్రనామాలతో పూజలు, అర్చనలు వేద పండితులు నిర్వహిస్తారన్నారు.  ఆన్ లైన్ పూజలు, అర్చనల్లో  భాగస్వాములు కావాలనుకునే భక్తులు  దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-16 08:27:54

రూ.3.10లక్షల విలువైన పెండాల్స్ వితరణ..

విశాఖలోని సింహాలచంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న)కు ప్రభుత్వ సలహాదారు టి.వెంకటలక్ష్మీనరసింహమూర్తి రూ.3.10 లక్షల విలువైన పెండాల్స్ విరాళంగా సమర్పించారు. ఆదివారం స్వామివారి దేవస్థానంలో వీటిని ఆయన తరపున సింహాద్రి మఠం వ్యవస్థాపకులు కె. సురేంద్రస్వామి ఏఈఓ రాఘవకుమార్ కి అందజేసి రసీదు పొందారు. ఈ పెండాల్స్ ను పెడిమాంబ లైటింగ్ అండ్ సౌండ్స్ అధినేత భాస్కరరావు ఎలాంటి రుసుము తీసుకోకుండా స్వామివారికి కానుకగా వాటిని తయారు చేశారు. వేసవిలో భక్తులు సేదతీరడానికి ఈ పెండాల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని దేవస్థాన అధికారులు చెబుతున్నారు. అనంతరం దాతలకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-05-16 08:22:26

కోవిడ్ కేర్ కేంద్రాల్లో పడకల పెంపునకు చర్యలు..

ప్ర‌స్తుతం రెండో ద‌శలో ఎక్కువ‌గా కోవిడ్ పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నందున జిల్లా వ్యాప్తంగా ఉన్న కోవిడ్ కేర్ కేంద్రాల్లో (సీసీసీ) ప‌డ‌క‌ల సంఖ్య‌ను పెంచుతున్నామ‌ని,  ఆక్సిజ‌న్‌ను కూడా అందుబాటులో ఉంచుతున్నామ‌ని, సీసీసీల్లో ప‌డ‌క‌ల‌ను పెంచ‌డం వ‌ల్ల అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌లు అందిస్తున్న కోవిడ్ ఆసుప‌త్రుల‌పై ఒత్తిడి త‌గ్గుతుంద‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఉద‌యం జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) జి.రాజ‌కుమారి, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్ త‌దిత‌రుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి జేఎన్‌టీయూ కోవిడ్ కేర్ కేంద్రాన్ని సంద‌ర్శించారు. తొలుత సీసీసీలోని రిసెప్ష‌న్‌, రిజిస్ట్రేష‌న్ కేంద్రాన్ని త‌నిఖీ చేసి, అక్క‌డ ఉన్న బాధితుల‌తో మాట్లాడారు. ఎక్క‌డి నుంచి వ‌చ్చారు? ఎప్పుడు కోవిడ్ ప‌రీక్ష చేయించుకున్నారు? ఇత‌ర ప‌రీక్ష‌లు ఏమైనా చేయించుకున్నారా? ప‌స్తుతం ఏవైనా మందులు వేసుకుంటున్నారా? వంటి వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం నాగార్జున బ్లాక్‌ను సంద‌ర్శించి, అక్క‌డ రోగుల‌కు అందిస్తున్న వైద్య సేవ‌ల‌తో పాటు అవ‌స‌ర‌మైన వారికి కాన్సంట్రేట‌ర్ ద్వారా ఆక్సిజ‌న్ అందిస్తున్న తీరును ప‌రిశీలించారు. మెడికల్, ఇతర వ్యర్ధాల నిర్వహణ ప్రక్రియ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ బాధితుల‌కు భోజనాన్ని సిద్ధం చేస్తున్న వ‌శిష్ట మెస్‌ను ప‌రిశీలించి, తేలిగ్గా జీర్ణమ‌య్యే, పోష‌క విలువ‌ల‌తో కూడిన ఆహారాన్ని అందించాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. రాగి మాల్ట్‌, గుడ్లు వంటి వాటితో పాటు ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఆహారాన్ని అందించాల‌ని సూచించారు. మెడిక‌ల్‌, పారామెడిక‌ల్‌, ఇత‌ర సిబ్బందికి ఉప‌యోగిస్తున్న న‌రేంద్ర మెస్ వివ‌రాల‌ను కూడా అడిగి తెలుసుకున్నారు. ఇప్ప‌టికే జేఎన్‌టీయూలో వెయ్యి ప‌డ‌క‌లు ఉండ‌గా.. 104 కేసులు, కోవిడ్ పాజిటివ్ టీచ‌ర్స్, స‌స్పెక్ట్ కేసులు వంటివాటికోసం అద‌నంగా 400 ప‌డ‌క‌ల ఏర్పాటుకు సంబంధించిన ప‌నుల‌ను ప‌రిశీలించి, గాలి, వెలుతురు బాగా ఉండేలా చూడాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ కోవిడ్ కేర్ కేంద్రంలో ఉన్న ప్ర‌తి బాధితుడి ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించి, అవ‌స‌రానికి అనుగుణంగా వైద్య సేవ‌లు అందిస్తున్న‌ట్లు తెలిపారు. అవ‌స‌రం మేర‌కు ఆక్సిజ‌న్ అందించేందుకు కాన్సంట్రేట‌ర్ల‌ను అందుబాటులో ఉంచామ‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. క‌లెక్ట‌ర్ వెంట కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ‌, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, వికాస పీడీ కె.ల‌చ్చారావు, రెసిడెన్షియ‌ల్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ (ఆర్ఎంవో) డా. ఆర్‌.సుద‌ర్శ‌న్‌బాబు త‌దిత‌రులు ఉన్నారు.

Kakinada

2021-05-16 08:01:16

సింహాద్రి నాధుడుకి వెండి కలశం మొక్కు..

విశాఖలోని సింహాలచంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న)కు వెండి కలసం మొక్కురూపంలో అందింది. విశాఖకు చెందిన ఫణిసోమరాజు, అంజనీదేవి దంపతులు ఆదివారం రూ.75వేలు విలువ చేసే 29 గ్రాముల వెండి కలశాన్ని స్వామివారికి సమర్పించారు. దానిని ఆలయ ఏఈఓ రాఘవకుమార్ కి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వామి క్రుపతో తమ పిల్లల మొక్కు నెరవేరిందని, స్వామికి మొక్కుకున్నట్టుగా వెండి కలశాన్ని సమర్పించి తమ మొక్కు తీర్చుకున్నట్టు చెప్పారు. ఏఈఓ మాట్లాడుతూ భక్తులు ఎవరు  మొక్కులు నగదు లేదా వస్తురూపంలో సమర్పించినా రసీదు పొందాలన్నారు.  ప్రభుత్వం నిర్ధేశించి నిబంధనల ప్రకారమే స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు.

Simhachalam

2021-05-16 06:00:22

Samarlakota

2021-05-16 04:56:39

విమ్స్ లో అదనంగా మరో 200 పడకలు..

విమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న పడకలకు అదనంగా మరో 200 పడకలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విమ్స్ సంచాలకులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) ఆదేశించారు.  విమ్స్ ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవలు, పడకలు, ఆక్సిజన్, రెమిడి సివర్ సరఫరా, ఆహారము, శానిటేషన్,  సిబ్బంది, తదితర అంశాలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర మేయర్ జి. వెంకట హరి కుమారి, జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం.వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, ఎపిఇపిడిసియల్ సిఎండి నాగలక్ష్మి, వైద్య సిబ్బందితో ఆయన సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆక్సిజన్ 10 KL సరఫరా అవుతుందని, అదనంగా మరో  5 KL సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు.  ఆక్సిజన్ సరఫరాపై ప్రతి రోజు పరిశీలించి ఆక్సిజన్ నిల్వ పరిస్థితిని అధికారులకు తెలియజేయాలని, జిల్లా అధికారులతో సమన్వయంతో చేసుకోవాలని ఆక్సిజన్ మేనేజ్ మెంట్ నోడల్ అధికారులను ఆదేశించారు.  ఆక్సిజన్ సమస్య తలెత్తకుండాచూడాలని, ఆక్సిజన్ పై ఫిర్యాదులు రాకుండా చూడాలని డ్రగ్ కంట్రోల్ సహాయ సంచాలకులు రజితను ఆదేశించారు..  ఆక్సిజన్ వృధా కాకుండా నివారించేందుకు పేషెంట్లలో అవగాహన కలిగించాలని, ఇందుకు ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందికి ఆక్సిజన్ మేనేజ్ మెంట్ పై శిక్షణ ఇవ్వాలని ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్ ను ఆదేశించారు.  ఆసుపత్రిలో ఎవరైనా చేరడానికి వస్తే వారికి పడకలను కేటాయించాలని చెప్పారు.  హెల్ప్ డెస్క్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, సిప్టులు వారీగా చేస్తున్నారా లేదా, సిసి కెమేరాలను పరిశీలిస్తున్నారా అని వివరాలను అడిగి తెలుసుకున్నారు.  వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయని పర్యాటక శాఖ మంత్రి అడుగగా 280 వెంటిలేటర్లు ఉన్నాయని, ప్రస్తుతం 140 వెంటిలేటర్లు వాడుకలో ఉన్నాయన్నాయని సంచాలకులు రాంబాబు మంత్రికి వివరించారు.  ప్రతి పేషెంటుకు సమయానికి ఆహారం, మందులు సరఫరా చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ బాగా చేయాలని, శానిటేషన్ రూల్స్ ప్రకారం చేయాలని, అలా చేయకపోతే కాంట్రాక్టర్ ను మార్చాలన్నారు. వైద్యులు ఎంత మంది ఉన్నారని మంత్రి అడుగగా ఆంధ్రా మెడికల్ కళాశాల నుండి 130 మంది మిమ్స్ లో పనిచేస్తున్నట్లు ప్రిన్సిపల్ మంత్రికి వివరించారు. మృతదేహాలు తరలింపులో జాప్యం జరగకుండా ఉండాలని జివియంసి సిఎంఓ ను ఆదేశించారు. ప్రస్తుతం 6 ఆంబులెన్స్ లు ఉన్నాయని, మరిన్ని ఆంబులెన్స్ లు అద్దెకు తీసుకొని మృత దేహాలు తరలింపునకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రికి సిఎంఒ వివరించారు.  ఆసుపత్రిలో మరణించిన తరువాత ఆసుపత్రి ప్రొసీజర్ కూడా త్వరితగతిన పూర్తి చేసి మృత దేహాలను బందువులకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని విమ్స్ సంచాలకులను ఆదేశించారు.  మరణించిన తర్వాత ఏ సమస్య లేకుండా చూడాలని పర్యాటక శాఖ మంత్రి చెప్పారు.  రెమిడెసివర్ మెడికల్ షాపుల్లో దొరకడం లేదని, దీనిపై దృష్టి సారించాలని, నల్ల బజారులో విక్రయించినట్లు తెలిస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని డ్రగ్ కంట్రోల్ ఎడి రజితను ఆదేశించారు.  ప్రైవేటు ఆసుపత్రుల్లో పేషెంట్లు వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.  ప్రతి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పడకలు తప్పని సరిగా కేటాయించాలన్నారు.  విమ్స్ లో ఉన్న చిన్న చిన్న సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించి పేషెంట్లకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని సంచాలకులను ఆదేశించారు.  

VIMS Hospital

2021-05-15 16:08:06

అప్పన్న ఆన్ లైన్ విరాళాలు రూ. 15.45 లక్షలు..

విశాఖలోని సింహాలచంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి, ఆన్ లైన్ లో పూజలు నిర్వహించడానికి రూ.15.45లక్షలు విరాళాలు చెల్లించారని దేవస్థాన ఈఓ ఎంవీ సూర్య కళ తెలియజేశారు. శనివారం ఈ మేరకు దేవస్థానం నుంచి చందనోత్సవ ఆదాయంపై ఆమె మీడియాతో మాట్లాడారు. స్వామివారికి భక్తులు తమ గోత్రనామాలు చదవించుకోవడానికి, చందన సమర్పణకు 15 లక్షల 45వేల 630 రూపాయల సమర్పించారన్నారు. ఇందులో గోత్రనామాల పూజలకు 388 మంది రూ.1116  చొప్పున 4,33,008 రూపాయలు పంపారన్నారు. 56 మంది రూ.10,116 చొప్పున అరకేజీ చందన సమర్పణకు రూ.5,66,496 అందించారని తెలియజేశారు. 22 మంది రూ.20,116 చొప్పున కేజీ చందన సమర్పణకు రూ.4,42,552 చెల్లించారన్నారు. మిగతావన్నీ ఆన్ లైన్ డొనేషన్లు రూ. 1,03,574 వచ్చాయని వివరించారు. దేవస్థాన ప్రకటనలో భాగంగా  విరాళాలు పంపించనవారికి ఒకటి రెండు రోజుల్లోనే చందన ప్రసాదం పంపిస్తామని పేర్కొన్నారు.. కేజీ చందనం సమర్పించినవారికి శేష వస్త్రం ఇస్తున్నామని చెప్పారు.  చందన సమర్పణ, గోత్ర నామాల పూజలు రెండు, మూడు, నాలుగో దఫా చందన సమర్పణకు కూడా కొనసాగుతాయన్నారు. దాతలు ఎంతైనా చందనం సమర్పించుకోవచ్చుని చెప్పారు.  ఆన్ లైన్ పూజలు, అర్చనల్లో  భాగస్వాములు కావాలనుకునే భక్తులు  దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-15 12:05:35