1 ENS Live Breaking News

ప్రారంభమైన సింహాద్రి అప్పన్న దర్శనాలు..

విశాఖలోని సింహాలచంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) దర్శనాలు ఆదివారం నుంచి తిరిగి ప్రారంభం అయ్యాయి. కరోనా, చందనోత్సవం నేపథ్యంలో 15వ తేదీ వరకూ భక్తులకు దర్శనాలు నిలుపుదల చేసిన దేవస్థానం అధికారులు తిరిగి ఆదివారం దర్శనాలు ప్రారంభించడంతో  ఉదయం 7.30 నుంచి 9.30 వరకూ భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే కేవలం స్వామివారి దర్శనాలు రెండు గంటల పాటు మాత్రమే భక్తులకు అవకాశం కల్పించి ఇతర సేవలన్నీ ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు. ఆదివారం దర్శనాలు ప్రారంభం అయ్యే సమయంలోనే వర్షం పడటం స్వామివారి మహిమ గా భక్తులు వర్ణించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు దేవస్థానం అధికారులు. స్వామివారి ఆర్జిత సేవలన్నీ ఆన్ లైన్ ద్వారా వీక్షించాలని అధికారులు సూచిస్తున్నారు.

Simhachalam

2021-05-16 08:33:29

ఘనంగా ప్రారంభమైన అప్పన్న ఆన్ లైన్ పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) దేవస్థానంలో ఆదివారం నుంచి ఆన్ లైన్లోనే అర్చనలు, పూజలు చేపట్టామని ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈమేరకు ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం స్వామివారికి ఆన్ లైన్ లో నే అర్చనలు, సేవలు చేసి వాటి యొక్క వీడియోలను భక్తులకు తెలియజేస్తామని, ప్రసాదాలకు ఇంటికి పంపిస్తామని చెప్పారు. దానికోసం ప్రత్యేకంగా యూట్యూబు ఛానల్ ను ఏర్పాటు చేశామని, వాటి ద్వారా స్వామివారి అర్చనలు ఆన్ లైన్ లోనే తిలకించవచ్చునని ఈఓ చెప్పారు. నిత్య కల్యాణం ( ప్రతి రోజూ ఉదయం 9:30 నుంచి 10:30), గురు- ఆదివారాల్లో జరిగే స్వర్ణపుష్పార్చన (8గంటలకు ఉదయం) , ప్రతినెలా స్వాతి నక్షత్రం రోజు స్వాతి హోమం  (ఉదయం 8 గంటలకు),ప్రతి ఏకాదశి రోజు స్వర్ణతులసీదళార్చన ఆన్ లైన్లో వీక్షించవచ్చునని ఈఓ చెప్పారు. నిత్యకళ్యాణానికి 1,000(వెయ్యి రూపాయలు), స్వర్ణపుష్పార్చనకు రూ. 2,116 (రెండు వేల నూట పదహారు రూపాయలు), స్వాతి హోమానికి రూ.2,500 (రెండువేల ఐదు వందలు), స్వర్ణతులసీదళార్చనకు రూ.2,116( రెండువేల నూటపదహారు) చెల్లించాల్సి ఉంటుందన్నారు. మీ తరపున స్వామివారి కళ్యాణమండపంలో  గోత్రనామాలతో పూజలు, అర్చనలు వేద పండితులు నిర్వహిస్తారన్నారు.  ఆన్ లైన్ పూజలు, అర్చనల్లో  భాగస్వాములు కావాలనుకునే భక్తులు  దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-16 08:27:54

రూ.3.10లక్షల విలువైన పెండాల్స్ వితరణ..

విశాఖలోని సింహాలచంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న)కు ప్రభుత్వ సలహాదారు టి.వెంకటలక్ష్మీనరసింహమూర్తి రూ.3.10 లక్షల విలువైన పెండాల్స్ విరాళంగా సమర్పించారు. ఆదివారం స్వామివారి దేవస్థానంలో వీటిని ఆయన తరపున సింహాద్రి మఠం వ్యవస్థాపకులు కె. సురేంద్రస్వామి ఏఈఓ రాఘవకుమార్ కి అందజేసి రసీదు పొందారు. ఈ పెండాల్స్ ను పెడిమాంబ లైటింగ్ అండ్ సౌండ్స్ అధినేత భాస్కరరావు ఎలాంటి రుసుము తీసుకోకుండా స్వామివారికి కానుకగా వాటిని తయారు చేశారు. వేసవిలో భక్తులు సేదతీరడానికి ఈ పెండాల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని దేవస్థాన అధికారులు చెబుతున్నారు. అనంతరం దాతలకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-05-16 08:22:26

కోవిడ్ కేర్ కేంద్రాల్లో పడకల పెంపునకు చర్యలు..

ప్ర‌స్తుతం రెండో ద‌శలో ఎక్కువ‌గా కోవిడ్ పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నందున జిల్లా వ్యాప్తంగా ఉన్న కోవిడ్ కేర్ కేంద్రాల్లో (సీసీసీ) ప‌డ‌క‌ల సంఖ్య‌ను పెంచుతున్నామ‌ని,  ఆక్సిజ‌న్‌ను కూడా అందుబాటులో ఉంచుతున్నామ‌ని, సీసీసీల్లో ప‌డ‌క‌ల‌ను పెంచ‌డం వ‌ల్ల అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌లు అందిస్తున్న కోవిడ్ ఆసుప‌త్రుల‌పై ఒత్తిడి త‌గ్గుతుంద‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఉద‌యం జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) జి.రాజ‌కుమారి, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్ త‌దిత‌రుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి జేఎన్‌టీయూ కోవిడ్ కేర్ కేంద్రాన్ని సంద‌ర్శించారు. తొలుత సీసీసీలోని రిసెప్ష‌న్‌, రిజిస్ట్రేష‌న్ కేంద్రాన్ని త‌నిఖీ చేసి, అక్క‌డ ఉన్న బాధితుల‌తో మాట్లాడారు. ఎక్క‌డి నుంచి వ‌చ్చారు? ఎప్పుడు కోవిడ్ ప‌రీక్ష చేయించుకున్నారు? ఇత‌ర ప‌రీక్ష‌లు ఏమైనా చేయించుకున్నారా? ప‌స్తుతం ఏవైనా మందులు వేసుకుంటున్నారా? వంటి వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం నాగార్జున బ్లాక్‌ను సంద‌ర్శించి, అక్క‌డ రోగుల‌కు అందిస్తున్న వైద్య సేవ‌ల‌తో పాటు అవ‌స‌ర‌మైన వారికి కాన్సంట్రేట‌ర్ ద్వారా ఆక్సిజ‌న్ అందిస్తున్న తీరును ప‌రిశీలించారు. మెడికల్, ఇతర వ్యర్ధాల నిర్వహణ ప్రక్రియ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ బాధితుల‌కు భోజనాన్ని సిద్ధం చేస్తున్న వ‌శిష్ట మెస్‌ను ప‌రిశీలించి, తేలిగ్గా జీర్ణమ‌య్యే, పోష‌క విలువ‌ల‌తో కూడిన ఆహారాన్ని అందించాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. రాగి మాల్ట్‌, గుడ్లు వంటి వాటితో పాటు ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఆహారాన్ని అందించాల‌ని సూచించారు. మెడిక‌ల్‌, పారామెడిక‌ల్‌, ఇత‌ర సిబ్బందికి ఉప‌యోగిస్తున్న న‌రేంద్ర మెస్ వివ‌రాల‌ను కూడా అడిగి తెలుసుకున్నారు. ఇప్ప‌టికే జేఎన్‌టీయూలో వెయ్యి ప‌డ‌క‌లు ఉండ‌గా.. 104 కేసులు, కోవిడ్ పాజిటివ్ టీచ‌ర్స్, స‌స్పెక్ట్ కేసులు వంటివాటికోసం అద‌నంగా 400 ప‌డ‌క‌ల ఏర్పాటుకు సంబంధించిన ప‌నుల‌ను ప‌రిశీలించి, గాలి, వెలుతురు బాగా ఉండేలా చూడాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ కోవిడ్ కేర్ కేంద్రంలో ఉన్న ప్ర‌తి బాధితుడి ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించి, అవ‌స‌రానికి అనుగుణంగా వైద్య సేవ‌లు అందిస్తున్న‌ట్లు తెలిపారు. అవ‌స‌రం మేర‌కు ఆక్సిజ‌న్ అందించేందుకు కాన్సంట్రేట‌ర్ల‌ను అందుబాటులో ఉంచామ‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. క‌లెక్ట‌ర్ వెంట కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ‌, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, వికాస పీడీ కె.ల‌చ్చారావు, రెసిడెన్షియ‌ల్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ (ఆర్ఎంవో) డా. ఆర్‌.సుద‌ర్శ‌న్‌బాబు త‌దిత‌రులు ఉన్నారు.

Kakinada

2021-05-16 08:01:16

సింహాద్రి నాధుడుకి వెండి కలశం మొక్కు..

విశాఖలోని సింహాలచంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న)కు వెండి కలసం మొక్కురూపంలో అందింది. విశాఖకు చెందిన ఫణిసోమరాజు, అంజనీదేవి దంపతులు ఆదివారం రూ.75వేలు విలువ చేసే 29 గ్రాముల వెండి కలశాన్ని స్వామివారికి సమర్పించారు. దానిని ఆలయ ఏఈఓ రాఘవకుమార్ కి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వామి క్రుపతో తమ పిల్లల మొక్కు నెరవేరిందని, స్వామికి మొక్కుకున్నట్టుగా వెండి కలశాన్ని సమర్పించి తమ మొక్కు తీర్చుకున్నట్టు చెప్పారు. ఏఈఓ మాట్లాడుతూ భక్తులు ఎవరు  మొక్కులు నగదు లేదా వస్తురూపంలో సమర్పించినా రసీదు పొందాలన్నారు.  ప్రభుత్వం నిర్ధేశించి నిబంధనల ప్రకారమే స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు.

Simhachalam

2021-05-16 06:00:22

Samarlakota

2021-05-16 04:56:39

విమ్స్ లో అదనంగా మరో 200 పడకలు..

విమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న పడకలకు అదనంగా మరో 200 పడకలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విమ్స్ సంచాలకులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) ఆదేశించారు.  విమ్స్ ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవలు, పడకలు, ఆక్సిజన్, రెమిడి సివర్ సరఫరా, ఆహారము, శానిటేషన్,  సిబ్బంది, తదితర అంశాలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర మేయర్ జి. వెంకట హరి కుమారి, జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం.వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, ఎపిఇపిడిసియల్ సిఎండి నాగలక్ష్మి, వైద్య సిబ్బందితో ఆయన సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆక్సిజన్ 10 KL సరఫరా అవుతుందని, అదనంగా మరో  5 KL సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు.  ఆక్సిజన్ సరఫరాపై ప్రతి రోజు పరిశీలించి ఆక్సిజన్ నిల్వ పరిస్థితిని అధికారులకు తెలియజేయాలని, జిల్లా అధికారులతో సమన్వయంతో చేసుకోవాలని ఆక్సిజన్ మేనేజ్ మెంట్ నోడల్ అధికారులను ఆదేశించారు.  ఆక్సిజన్ సమస్య తలెత్తకుండాచూడాలని, ఆక్సిజన్ పై ఫిర్యాదులు రాకుండా చూడాలని డ్రగ్ కంట్రోల్ సహాయ సంచాలకులు రజితను ఆదేశించారు..  ఆక్సిజన్ వృధా కాకుండా నివారించేందుకు పేషెంట్లలో అవగాహన కలిగించాలని, ఇందుకు ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందికి ఆక్సిజన్ మేనేజ్ మెంట్ పై శిక్షణ ఇవ్వాలని ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్ ను ఆదేశించారు.  ఆసుపత్రిలో ఎవరైనా చేరడానికి వస్తే వారికి పడకలను కేటాయించాలని చెప్పారు.  హెల్ప్ డెస్క్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, సిప్టులు వారీగా చేస్తున్నారా లేదా, సిసి కెమేరాలను పరిశీలిస్తున్నారా అని వివరాలను అడిగి తెలుసుకున్నారు.  వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయని పర్యాటక శాఖ మంత్రి అడుగగా 280 వెంటిలేటర్లు ఉన్నాయని, ప్రస్తుతం 140 వెంటిలేటర్లు వాడుకలో ఉన్నాయన్నాయని సంచాలకులు రాంబాబు మంత్రికి వివరించారు.  ప్రతి పేషెంటుకు సమయానికి ఆహారం, మందులు సరఫరా చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ బాగా చేయాలని, శానిటేషన్ రూల్స్ ప్రకారం చేయాలని, అలా చేయకపోతే కాంట్రాక్టర్ ను మార్చాలన్నారు. వైద్యులు ఎంత మంది ఉన్నారని మంత్రి అడుగగా ఆంధ్రా మెడికల్ కళాశాల నుండి 130 మంది మిమ్స్ లో పనిచేస్తున్నట్లు ప్రిన్సిపల్ మంత్రికి వివరించారు. మృతదేహాలు తరలింపులో జాప్యం జరగకుండా ఉండాలని జివియంసి సిఎంఓ ను ఆదేశించారు. ప్రస్తుతం 6 ఆంబులెన్స్ లు ఉన్నాయని, మరిన్ని ఆంబులెన్స్ లు అద్దెకు తీసుకొని మృత దేహాలు తరలింపునకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రికి సిఎంఒ వివరించారు.  ఆసుపత్రిలో మరణించిన తరువాత ఆసుపత్రి ప్రొసీజర్ కూడా త్వరితగతిన పూర్తి చేసి మృత దేహాలను బందువులకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని విమ్స్ సంచాలకులను ఆదేశించారు.  మరణించిన తర్వాత ఏ సమస్య లేకుండా చూడాలని పర్యాటక శాఖ మంత్రి చెప్పారు.  రెమిడెసివర్ మెడికల్ షాపుల్లో దొరకడం లేదని, దీనిపై దృష్టి సారించాలని, నల్ల బజారులో విక్రయించినట్లు తెలిస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని డ్రగ్ కంట్రోల్ ఎడి రజితను ఆదేశించారు.  ప్రైవేటు ఆసుపత్రుల్లో పేషెంట్లు వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.  ప్రతి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పడకలు తప్పని సరిగా కేటాయించాలన్నారు.  విమ్స్ లో ఉన్న చిన్న చిన్న సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించి పేషెంట్లకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని సంచాలకులను ఆదేశించారు.  

VIMS Hospital

2021-05-15 16:08:06

అప్పన్న ఆన్ లైన్ విరాళాలు రూ. 15.45 లక్షలు..

విశాఖలోని సింహాలచంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి, ఆన్ లైన్ లో పూజలు నిర్వహించడానికి రూ.15.45లక్షలు విరాళాలు చెల్లించారని దేవస్థాన ఈఓ ఎంవీ సూర్య కళ తెలియజేశారు. శనివారం ఈ మేరకు దేవస్థానం నుంచి చందనోత్సవ ఆదాయంపై ఆమె మీడియాతో మాట్లాడారు. స్వామివారికి భక్తులు తమ గోత్రనామాలు చదవించుకోవడానికి, చందన సమర్పణకు 15 లక్షల 45వేల 630 రూపాయల సమర్పించారన్నారు. ఇందులో గోత్రనామాల పూజలకు 388 మంది రూ.1116  చొప్పున 4,33,008 రూపాయలు పంపారన్నారు. 56 మంది రూ.10,116 చొప్పున అరకేజీ చందన సమర్పణకు రూ.5,66,496 అందించారని తెలియజేశారు. 22 మంది రూ.20,116 చొప్పున కేజీ చందన సమర్పణకు రూ.4,42,552 చెల్లించారన్నారు. మిగతావన్నీ ఆన్ లైన్ డొనేషన్లు రూ. 1,03,574 వచ్చాయని వివరించారు. దేవస్థాన ప్రకటనలో భాగంగా  విరాళాలు పంపించనవారికి ఒకటి రెండు రోజుల్లోనే చందన ప్రసాదం పంపిస్తామని పేర్కొన్నారు.. కేజీ చందనం సమర్పించినవారికి శేష వస్త్రం ఇస్తున్నామని చెప్పారు.  చందన సమర్పణ, గోత్ర నామాల పూజలు రెండు, మూడు, నాలుగో దఫా చందన సమర్పణకు కూడా కొనసాగుతాయన్నారు. దాతలు ఎంతైనా చందనం సమర్పించుకోవచ్చుని చెప్పారు.  ఆన్ లైన్ పూజలు, అర్చనల్లో  భాగస్వాములు కావాలనుకునే భక్తులు  దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-15 12:05:35

డ్యూటీలకు రానివారిపై చర్యలు తీసుకోండి..

కోవిడ్ కేర్ సెంటర్లలో కోవిడ్ రోగుల పట్ల సేవాభావం చూపాలని పాడేరు ఐటిడిఏ పీఓ డా. వెంకటేశ్వర్ సలిజామల కెజిహెచ్ లోని వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందిని ఆదేశించారు.  శనివారం పిపిఈ కిట్లుధరించి సీఎస్ఆర్  కోవిడ్ బ్లాక్ లో పర్యటించారు. కోవిడ్ బాధితులను పరామర్శించారు. బాగా చూస్తున్నారా?ఎక్కడ నుంచి వచ్చారు ?ఎన్ని రోజులయ్యిందంటూ కోవిడ్ పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. కెషీట్లులు పరిశీలించి ఆక్సిజన్ స్థాయిలపై ఆరాతీశారు. కరోనా వచ్చినా అదైర్య పడొద్దంటూ పేషెంట్లకు ధైర్యం చెప్పారు.  వైద్యులు ఇచ్చిన మందులు  సమయానికి వేసుకోవాలని సూచించారు. బాధితులకు నాణ్యమైన పోషకాహారం అందించాలన్న ఆయన..భోజనం సరఫరా బాగుందని కోవిడ్ బాధితులు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. షిఫ్టు డ్యూటీ  సహాయ ప్రొఫెసర్ విధులకు హాజరు కాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు హాజరు కాని వైద్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లపై శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ డా.మైథిలి ని ఆదేశించారు. డ్యూటీ వైద్యులు,స్టాఫ్ నర్స్ లు  సక్రమంగా విధులు  నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం శానిటేషన్ చేయాలని చెప్పారు. సూపర్ స్పెషలిటీ వార్డులలో మరుగుదొడ్లు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎఫ్ ఎన్ వోలు,ఎం ఎన్ వోలు శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  సూపరింటెండెంట్ డా.పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.

King George Hospital

2021-05-15 11:42:35

రిషికేశ్ వెళ్ళిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు..

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ  స్వరూపానందేంద్ర, శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర స్వాములు రిషికేశ్ వెళ్ళారు. శనివారం విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి డెహ్రాడూన్ బయలుదేరారు. అక్కడి నుంచి రోడ్డు మర్గం ద్వారా రిషికేశ్ చేరుకున్నారు. చాతుర్మాస్య దీక్ష కోసం  రిషికేశ్ వెళ్ళిన పీఠాధిపతులు అక్కడి గంగాతీరంలో ఉన్న విశాఖ శ్రీ శారదాపీఠం ఆశ్రమంలోనే సెప్టెంబరు నెలాఖరు వరకు బస చేస్తారు. రిషికేశ్ బయలుదేరే ముందు విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలోనే దేవతామూర్తులను దర్శించుకున్నారు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు.  ప్రతిఏటా తన చాతుర్మాస్య దీక్షను పవిత్ర గంగానదీ తీరంలో చేపట్టాలని పీఠాధిపతులు శ్రీ  స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి సంకల్పించారు. ఈ ఏడాది జూలై 24వ తేదీన ప్రారంభమయ్యే దీక్ష సెప్టెంబరు 20వ తేదీ వరకు ఉంటుంది. పీఠం నిర్వహణలోని జగద్గురు ఆదిశంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులు సైతం పీఠాధిపతులతో కలిసి రిషికేశ్ వెళ్లారు. కరోనా ప్రబలకుండా పగడ్బందీగా వేద విద్యార్థులకు రక్షణ చర్యలు చేపట్టారు. పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్స్, మాస్కులు ధరింపజేసి ప్రత్యేక విమానంలో రిషికేశ్ తీసుకెళ్లారు.

Pendurthi

2021-05-15 10:56:00

ఆక్సిజన్ నిల్వ పై తప్పుడు వార్తలు నమ్మొద్దు..

తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, ప్రజలను ఈ విషయమై భయాందోళనలు చెందనవసరం లేదని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్  తెలిపారు.  తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఉందని వస్తున్న వార్తలు అవాస్తవమని, స్విమ్స్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కు కొరత లేదని తెలిపారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి  ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ ద్వారా జిల్లాలోని ఆసుపత్రులలో ఆక్సిజన్ వినియోగం, ఎంత మేరకు ఇంకా అవసరం ఉన్నదనే విషయాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి స్విమ్స్, రుయా ఆసుపత్రులతో పాటు చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వ, సరఫరాకు సంబంధించిన అంశాలను జిల్లా స్థాయిలో కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఆక్సిజన్ రీఫిలింగ్ కేంద్రాల నుండి ఆసుపత్రులకు ఆక్సిజన్ ను సకాలంలో చేరేలా పోలీసు శాఖ  సహకారంతో గ్రీన్ చానల్ ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఈ విషయమై వస్తున్న వార్తలు అవాస్తవమని, ప్రజలు ఈ విషయమై భయపడవద్దని కలెక్టర్ భరోసా ఇచ్చారు.

Tirupati

2021-05-15 10:47:45

104 కాల్ సెంటర్ ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం..

తూర్పుగోదావరి జిల్లాలో 104 కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా డివిజన్ స్థాయిలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జి రాజకుమారి తెలిపారు. శనివారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం కోవిడ్- 19 కమాండ్ కంట్రోల్ రూమ్ లో కాకినాడ  డివిజన్ కు  సంబంధించి మహిళా పోలీసులకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో జేసీ రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసి  మాట్లాడుతూ జిల్లాలో అన్ని డివిజన్లలో  104 కాల్   సెంటర్ వ్యవస్థను ఏర్పాటు  చేయడం ద్వారా తక్కువ సమయంలో ఫిర్యాదులు పరిష్కరించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో రోజుకు అత్యధిక స్థాయిలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆమె తెలిపారు. కొవిడ్ పరీక్షలు, హోం ఐసోలేషన్, కొవిడ్ కేర్ సెంటర్, ఆస్పత్రిలో పడకల లభ్యత తదితర అంశాలపై మహిళా పోలీసులకు 104 కాల్ సెంటర్ కు వచ్చిన ఫిర్యాదులను ఏ విధంగా పరిష్కరించాలో జేసి రాజకుమారి ఈ సందర్భంగా మహిళా పోలీసులకు వివరించారు.  ఈ శిక్షణ కార్యక్రమంలో కాకినాడ రెవిన్యూ డివిజన్ కార్యాలయ పరిపాలన అధికారి, మహిళా పోలీసులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-15 10:25:28

50 ఆక్సిజన్ కాన్సన్ ట్రేట్ లు వితరణ..

విశాఖ  జిల్లాలో  ఆక్సిజన్ కొరతను   నివారించడానికి సురక్ష స్వచ్ఛంద సంస్థ  50 ఆక్సిజన్ కాన్ సన్  ట్రేటర్ లను కె జి హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలి కి   విరాళంగా  అందజేశారు. చైనాలో  తయారైన రూ. 25 లక్షల విలువైన  50 ఆక్సిజన్ కాన్ సన్ ట్రేటర్ లను సురక్ష సంస్థ  కార్యదర్శి నిర్మలా నందా శనివారం నాడు  విశాఖపట్నం  ఆర్డీవో పెంచల కిషోర్ సమక్షంలో  కె జి హెచ్ కు  అందజేశారు. జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తో  సురక్ష సంస్థ అధ్యక్షుడు రాజ్ గొర్ల  ఇంతకు ముందు మాట్లాడి, ఆక్సిజన్  కాన్ సన్ ట్రేటర్ లను అందజేస్తామని  తెలియజేశారని, ఆ ప్రకారమే ఇప్పుడు అందజేస్తున్నామని కార్యదర్శి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

King George Hospital

2021-05-15 09:32:36

విద్యుత్ ఉద్యోగులకు కోవిడ్ వేక్సిన్ వేయాలి..

రాష్ట్రంలోని విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగులందరికీ కోవిడ్ టీకా వేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలాకి శ్రీనివాసరావు చెప్పారు. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో ప్రజలంతా ఇంట్లోనే ఉన్నందు వలన విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుందన్నారు. ఈ సమయంలో విద్యుత్ ఉద్యోగులకు పనికూడా అధికంగా వుంటుందని అన్నారు. ఇలాంటి సమయంలో ఫీల్డుకెళ్లే సిబ్బంది, అధికారులు రక్షణార్ధం ఉద్యోగులందరికీ వేక్సిన్ వేయడం ద్వారా కాస్త భరోసా కలుగుతుందన్నారు. అంతేకాకుండా దైర్యంగా విధులు నిర్వహించడానికి వీలుపడుతుందని వివరించారు. ఈ సాంకేతిక అంశాలను ప్రభుత్వానికి తెలియజేస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్టు చెప్పారు. విధినిర్వహణలో కోవిడ్ తో మ్రుతిచెందిన విద్యుత్ ఉద్యోగులకు రూ.50లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, కోవిడ్ వైరస్ సోకిన సిబ్బంది, ఉద్యోగులు క్రెడిట్ కార్డుపై వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించాలని శ్రీనివాసరావు ఆ లేఖలో పేర్కొన్నట్టు చెప్పారు.

Visakhapatnam

2021-05-15 09:27:00

మత్స్యకార భరోసా రూ.2.95 కోట్లు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద విజయనగరం జిల్లాలోని మత్స్యకారులకు రెండుకోట్ల, 95లక్షల 30వేల రూపాయలు అందించనుందని మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి తెలియజేశారు. శనివారం ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని సముద్రతీర మండలాలైన బోగాపురం, పూసపాటిరేగ ప్రాంతాల్లో 819 బోట్లలో పనిచేసే 2953 మంది లబ్దిదారులకు మత్స్యకార బ్రుతి క్రింద ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున ఖాతాల్లోకి జమ అవుతుందన్నారు. ఈనెల 18వ తేదిన అమరావతిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆన్ లైన్ లో లబ్దిదారాల ఖాతాలోకి నేరుగా నగదు జమ అయ్యేలా ఈ కార్యక్రమాన్ని మీట నొక్కి ప్రారంభిస్తారన్నారు. ఈ మేరకు జిల్లాలోని లబ్దిదారుల జాబితా మొత్తం ఆన్ లైన్ చేసినట్టు డిడి నిర్మల కుమారి వివరించారు. 

Vizianagaram

2021-05-15 09:10:40