1 ENS Live Breaking News

అదనపు టీకాల కోసం ప్రత్యక చర్యలు..

అనంతపురం జిల్లాలో కరోనా నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఇంటింటికి ఫీవర్ సర్వే అనే దానిని నిరంతరం కొనసాగించాలని జిల్లా ఇన్ ఛార్జి మంత్రి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. గురువారం కోవిడ్ -19 (సెకండ్ వేవ్) యొక్క వ్యాప్తి మరియు నియంత్రణపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి వర్యులు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించగా..   డీసీసీబీ బ్యాంకు మీటింగ్ హాలు నుంచి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రా రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే డా.తిప్పేస్వామి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్,  అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ, జిల్లా నోడల్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖా మంత్రి  మాలగుండ్ల శంకర నారాయణ,ఎమ్మెల్సీ శమంతకమణి, గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామి రెడ్డి, మునిసిపల్ చైర్మన్లు తదితరులు వారి వారి ప్రాంతాల నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.  కోవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడానికి  వీలుగా జిల్లాకు మరో 5 టన్నుల ఆక్సిజన్ ను అదనంగా కేటాయించేందుకు  చర్యలు తీసుకుంటామని, ఆక్సిజన్ నిల్వల కోసం అవసరమైతే ట్యాంకర్లను లీజు ప్రాతిపదికన సమకూర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆయన ఆదేశించారు. అనంతపురం జిల్లా కోవిడ్ టాస్క్ ఫోర్సు తోనూ, ప్రజాప్రతినిధులతోనూ గురువారం నాడు ఆయన జూమ్ వీడియో కాన్ఫరెన్స ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ జి. చంద్రుడు జిల్లాలోని పరిస్థితులు, ప్రజలకు కల్పిస్తున్న సేవల గురించి వివరించారు.

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, కోవిడ్ నియంత్రణ చర్యల్లో అధికార యంత్రాగం మరింత చురుకుగా పాల్గొంటున్నారని అభినందించారు. జిల్లా స్థాయిలో కొన్ని కీలకమైన పోస్టుల్లో అధికారులు లేకపోవడం వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను గమనించి, వీలైనంత త్వరగా వాటిని భర్తీ చేయిస్తామన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. అంబులెన్సుల నిర్వాహకులు ఇష్టారీతిన రేట్లు వసూలు చేయకుండా, వారితో సమావేశాలు నిర్వహించి, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ధరలను నిర్ణయించాలని ఈ విషయంలో ఎటువంటి తాత్సారం చేయవద్దని జిల్లా పోలీసులను మంత్రి ఆదేశించారు. డబ్బులు ముఖ్యం కాదని మానవతా థృక్పధం ప్రధానమన్న విషయాన్ని ముఖ్యమంత్రి వైయస జగన్ మోహన్ రెడ్డి గారు పదే పదే చెపుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాగం వ్యవహరించాలన్నారు. దురదృష్ట వశాత్తూ మరణాలు సంభవించిన సందర్భాల్లో  వారి తాలూకు బంధువులు మృత దేహాలని తీసుకెళ్లని పక్షంలో వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించడంలో రాజీ పడవద్దని, ఇప్పటికే పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు, నగర పంచాయితీల కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని ఈ విషయంలో నిర్లిప్తతను సహించబోమని మంత్రి హెచ్చరించారు. కోవిడ్ కేర్ సెంటర్లలో ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్న ప్రజా ప్రతినిధుల సూచనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. స్థానికంగా ఆక్సిజన్ ఉత్పత్తికి అవకాశం ఉన్న వాటికి సంబంధించిన అనుమతులు త్వరగా మంజూరు అయ్యేలా చూస్తామన్నారు. 

జిల్లాలో ఇప్పటికే ఫీవర్ సర్వే జరుగుతున్న తీరును సమీక్షిస్తూ, ఈ రకమైన సర్వేలు నిరంతరం నిర్వహించాలని, ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి జిల్లా మొత్తంలో ఈ రకమైన సర్వే చేపట్టాలని దీనివల్ల ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందడంతో పాటు, వ్యాధి ప్రబలకుండా నియంత్రణ కూడా సులభతరమవుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, ఇతరుల అభిప్రాయాలకు అనుగుణంగా, కోవిడ్ కేర్ సెంటర్లలో ఆక్సిజన్ సదుపాయం, మందుల లభ్యత, డాక్టర్ల పర్యవేక్షణ తదితర అంశాలపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. 

Anantapur

2021-05-13 15:25:48

హామీలన్నీ నెరవేర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే..

ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలిపిన నవరత్నాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె. నారాయణస్వామి పేర్కొన్నారు. గురువారం వెలగపూడిలోని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో వరుసగా మూడవ ఏడాది వై.ఎస్.ఆర్ రైతు భరోసా - పి.ఎం. కిసాన్ పథకం కింద 2021 - 22 సంవత్సరానికి గాను మొదటి విడత లబ్ధిని రైతుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వ విప్ మరియు చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చిత్తూరు శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులుతో కలిసి విలేకరులతో మాట్లాడారు.  
     ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఇందులో భాగంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించడంతో పాటు అధునాతన పద్ధతుల ద్వారా లాభసాటి వ్యవసాయం చేయడం పై అవగాహన కల్పించడం జరుగుతున్నదని తెలిపారు. రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏటా రూ.13,500/- రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతున్నదని, రైతులకు లబ్ధి చేకూరేలా, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ కష్టపడి పని చేస్తున్న జిల్లా యంత్రాంగాన్ని, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని మంత్రి అభినందించారు.
          ప్రభుత్వ విప్ మరియు చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత సువిశాల భారతావనిలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అనేక రాష్ట్రాలలో పరిపాలించారని, రైతును రాజును చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి, మహనీయుడు దివంగత నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి అని, పాత బకాయిలను రద్దు చేసి ఉచిత విద్యుత్ ను ఇస్తూ, 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తూ, రైతు ధైర్యంగా పొలానికి వెళ్ళే పరిస్థితిని తెచ్చిన ముఖ్య మంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అని, ఆ తరువాత ఆ తండ్రి ఆశయాలకు వారసుడిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేను ఉన్నానని, రైతుల కష్టాలను తెలుసుకుని, రైతులకు భరోసాగా ఉంటూ రైతు రాజ్యాన్ని తీసుకుని వచ్చేందుకు ప్రతి ఖరీఫ్ కు, రబీకి సహాయం అందించేందుకు రైతు భరోసా పథకంను అమలు చేస్తూ రైతుల పక్షపాతిగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. 

Tirupati

2021-05-13 15:15:23

ఆరోగ్యశ్రీలో కోవిడ్ కి చికిత్సలు చేయాల్సిందే..

ఆరోగ్య శ్రీ  ఎంపెనల్మెంట్ గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రులలో 50 శాతం మేర ఆరోగ్య శ్రీ, ఈహెచ్ ఎస్ పధకాల క్రింద కోవిడ్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులను ఆదేశించారు. గురువారం ఆరోగ్య శ్రీ పధకం  క్రింద కోవిడ్ రోగులకు చికిత్స అందించే విధంగా తాత్కాలికంగా ఆరోగ్య శ్రీ ఎంపెనల్మెంట్ గుర్తింపు పొందిన 14 ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ టెలికాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు కీర్తీ చేకూరి(అభివృధ్ధి), జి.రాజకుమారి(ఆసరా, సంక్షేమం) పాల్లొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ చికిత్స అందించే విధంగా 14 ప్రైవేట్ ఆసుపత్రులకు తాత్కాలిక ఆరోగ్య శ్రీ ఎంపెనల్మెంట్ గుర్తింపు ఇవ్వడం జరిగిందన్నారు. ఆరోగ్య శ్రీ ఎంపేనల్మెంట్ గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో తప్పనిసరగా 50 శాతం మేర ఆరోగ్య శ్రీ , ఇహెచ్ఎస్ పధకాల క్రింద కోవిడ్ సోకిన వారికి చికిత్స అందించాలన్నారు. ప్రభుత్వ మార్గనిర్దేశాలు పాటించని ఆసుపత్రుల పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో  ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయకర్తలు  డా.పి.రాథాకృష్ణ (కాకినాడ), డా. పి.వి.శ్రీనివాసు (అమలాపురం), డా. పి.ప్రియాంక (రాజమహేంద్రవరం), నోడల్ అధికారులు , ఆరోగ్యశ్రీ టీమ్ లీడర్లు, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

Kakinada

2021-05-13 15:07:56

కోవిడ్ కేంద్రాల్లో వినోద కార్యక్రమాలు..

శ్రీకాకుళం కోవిడ్ కేర్ కేంద్రాల్లో వినోద కార్యక్రమాలనునిర్వహిస్తున్నారు. పాత్రునివలస కేంద్రంలో 817 మంది కోవిడ్ బాధితులు ఉండటంతో వాళ్లందరికీ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ..మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నారు. ప్రతిరోజు యోగా నిపుణులు డాక్టర్ చిలుక లక్ష్మీ కాంత్ నేతృత్వంలో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తుండగా తాజాగా వినోద కార్యక్రమాలు ప్రారంభించారు. జిల్లా జానపద కళారూపాలు -  బుర్రకథ కార్యక్రమంతో దీన్ని ప్రారంభించారు. కోవిడ్ కేర్ కేంద్రంలో అన్ని సదుపాయాలు కల్పిస్తూ చక్కటి పర్యవేక్షణ జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. మంచి వైద్యసేవలు, తాగునీరు, పారిశుద్ధ్యం కల్పిస్తూ మంచి పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతోంది. దీంతోపాటుగా వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వలన మానసిక వినోదం పొంది కోవిడ్ అనే భావన నుండి బయటకు వచ్చి దృఢంగా మారగలరు. కోవిడ్ బాధితులు అనే ఆలోచనతో ఉండకుండా వినోద కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉన్నాయి. వినోద కార్యక్రమాలుగా నిర్వహిస్తున్న కళాజాత కార్యక్రమంలో చారిత్రక అంశాలతోపాటు సామాజిక, సాంస్కృతిక అంశాలను ప్రస్తావిస్తూ కళా బృందాలు చక్కగా వివరిస్తున్నాయి. కోవిడ్ కూడా సాధారణ జ్వరం వంటిదేనని మనం జాగ్రత్తగా ఉంటే మన దారికి చేరదని వివరించడం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ మాస్కు వదల రాదని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రపరచాలని సూచిస్తున్నారు. గత ఏడాది కూడా కళజాత కార్యక్రమాలు నిర్వహించి కోవిడ్ కేర్ కేంద్రంలో కోవిడ్ బాధితులు సాధారణ జీవితం గడిపే విధంగా జిల్లా యంత్రాంగం కృషి చేసింది. ఈ ఏడాది జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశాలకు అనుగుణంగా మరల చేపట్టినట్లు నోడల్ అధికారి కె.రవి కుమార్ తెలిపారు. 

Srikakulam

2021-05-13 14:13:33

ఆ ఇద్దరికే అప్పన్న నిజరూప దర్శనం..

విశాఖలోని సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి(సింహాద్రి అప్పన్న) చందనోత్సవం సందర్భంగా నిజరూప దర్శనం కేవలం ఇద్దరికి మాత్రమే కల్పించనున్నారు. దేవస్థాన ధర్మకర్త సంచయిత, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులకు మాత్రమే కల్పించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక జీఓ జారీచేసింది. కరోనా నేపథ్యంలో స్వామివారి చందనోత్సవం అంతా ఏకాంతంగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి చందనోత్సవం యూట్యూబు ఛానల్ ద్వారా భక్తులు చూసే సౌకర్యం కల్పిస్తున్నారు. ఇతర ఏ వీఐపీలను కూడా స్వామివారి చందనోత్సవానికి అనుమతించవద్దని ఆ జీఓలో పేర్కొనడం విశేషం. స్వామివారికి పట్టు వస్త్రాలను మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి సమర్పిస్తారు. తరువాత జరిగే స్వామివారి పూజలు, అన్ని సేవలు ఏకాంతంగానే జరగనున్నాయి.

Simhachalam

2021-05-13 14:03:51

చిన్నారుల‌కోసం సంర‌క్ష‌ణా గృహాలు..

కోవిడ్  కార‌ణంగా అనాథ‌లుగా మారిన పిల్ల‌ల సంర‌క్ష‌ణ‌కు జిల్లా క‌లెక్ట‌ర్, జిల్లా బాల‌ల సంర‌క్ష‌ణ క‌మిటీ ఛైర్మ‌న్‌ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ చ‌ర్య‌లు చేప‌ట్టారు. దీనిలో భాగంగా 18 ఏళ్ల‌లోపు బాల బాలిక‌ల‌ కోసం వేర్వేరుగా రెండు సంర‌క్ష‌ణా గృహాల‌ను ఏర్పాటు చేశారు. బాలుర‌కు విజ‌య‌న‌గ‌రం కంటోన్మెంటులోని బ్రైట‌ర్ ఫ్యూచ‌ర్ సంస్థ‌లో, బాలిక‌ల‌కు బొబ్బిలి మండ‌లం కారాడ‌లోని స‌న్‌రైజ్ చిల్ట్ర‌న్ హోమ్‌లో వ‌స‌తి క‌ల్పిస్తారు. చంటిపిల్ల‌ల‌ను శిశుగృహాల్లో చేరుస్తారు. కోవిడ్ కార‌ణంగా త‌ల్లితండ్రుల‌ను కోల్పోయి, సంర‌క్ష‌కులు ఎవ‌రూ లేని పిల్ల‌ల‌కు ఈ గృహాల్లో వ‌స‌తి క‌ల్పించి, పునరావాసాన్ని ఏర్పాటు చేస్తారు. అలాగే కోవిడ్ కార‌ణంగా త‌ల్లితండ్రులు ఇద్ద‌రూ ఆసుప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్న స‌మ‌యంలో, సంర‌క్ష‌ణ‌కు ఎవ‌రూ లేని పిల్ల‌ల‌కు కూడా తాత్కాలికంగా ఈ సంర‌క్ష‌ణా గృహాల్లో వ‌స‌తి క‌ల్పిస్తారు. అయితే ఈ గృహాల‌కు వ‌చ్చే పిల్ల‌ల‌కు కోవిడ్ నెగిటివ్ రిపోర్టు త‌ప్ప‌నిస‌రి. జిల్లా బాల‌ల సంక్షేమం, సంస్క‌ర‌ణ సేవ‌లు, వీధిబాల‌ల సంక్షేమ‌శాఖ మ‌రియు మ‌హిళాభివృద్ది, శిశు సంక్షేమ‌శాఖ‌ల సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఈ సంక్షేమ గృహాలు న‌డ‌ప‌డం జ‌రుగుతుంది. జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాల మేర‌కు ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వ‌రి ఈ గృహాల‌ను సంద‌ర్శించి, వ‌స‌తుల‌ను ప‌రిశీలించారు. సంర‌క్ష‌ణ అవ‌స‌రం ఉన్న పిల్ల‌ల‌ను చైల్డ్‌లైన్ టోల్‌ఫ్రీ నెంబ‌రు 1098 లేదా మ‌హిళా హెల్ప్‌లైన్ నెం.181కి ఫోన్ చేసి, ఈ సంర‌క్ష‌ణా గృహాల్లో చేర్చాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ కోరారు.

Vizianagaram

2021-05-13 13:50:52

నెలరోజుల్లో సాధారణ స్థితికి తీసుకురావాలి..

కోవిడ్‌ను కేసుల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌డం ద్వారా నెల రోజుల్లో జిల్లాలో సాధార‌ణ ప‌రిస్థితుల‌ను తీసుకువచ్చేందుకు  కృషి చేయాల‌ని క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్  కోరారు. దీనికోసం గ్రామ‌స్థాయి నుంచి, జిల్లా స్థాయి వ‌ర‌కూ, యంత్రాంగ‌మంతా స‌మిష్టిగా కృషి చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. వైద్యారోగ్య‌శాఖాధికారులు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపిడిఓలు, తాశీల్దార్ల‌తో, క‌లెక్ట‌ర్ గురువారం జూమ్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ముందుగా జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో జ‌రుగుతున్న ఫీవ‌ర్ స‌ర్వే, వేక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను స‌మీక్షించారు.  క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ, నెల రోజుల పాటు ప‌టిష్ట‌మైన కార్యాచ‌ర‌ణ ద్వారా, వ‌చ్చేనెల ఇదే స‌మ‌యానికి కోవిడ్ కేసుల సంఖ్య‌ను రెండంకెల‌కు ప‌రిమితం చేయాల‌న్నారు. దీనికోసం రెండెంచ‌ల వ్యూహాన్ని అమ‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు. ఒక‌వైపు క‌రోనాను క‌ట్ట‌డి చేయడానికి చ‌ర్య‌లు తీసుకోవ‌డం తోపాటు, వ్యాధి సోకిన‌వారికి స‌మ‌ర్థ‌వంత‌మైన చికిత్స‌ను అందించి, పూర్తిగా న‌యం చేయ‌డం మ‌న ల‌క్ష్యాలు కావాల‌ని సూచించారు. ఇది జ‌ర‌గాలంటే, వ్యాధిప‌ట్ల ప్ర‌తీఒక్క‌రిలో అవ‌గాహ‌న పెంచాల‌ని సూచించారు. కోవిడ్ వ్యాధి నియంత్ర‌ణ‌కు కేవ‌లం అవ‌గాహ‌న ఒక్క‌టే మార్గ‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్ విధానం మ‌హారాష్ట్ర‌లో వ్యాధి నియంత్ర‌ణ‌కు మంచి ఫలితాన్ని ఇచ్చింద‌ని, అదే విధానాన్ని ఇక్క‌డ కూడా అమ‌లు చేయాల‌ని సూచించారు. ముందుగా వ్యాధి సోకిన‌వారిని గుర్తించి, వారిని క్వారంటైన్ చేయ‌డం ద్వారా వ్యాధి వ్యాప్తిచెంద‌కుండా అడ్డుకోవ‌చ్చ‌ని, దీనికి ఫీవ‌ర్ స‌ర్వే దోహ‌ద‌ప‌డుతుంద‌ని అన్నారు.

               కోవిడ్ సంక్షోభ స‌మయంలో వివిధ ర‌కాల మోసాలు, దోపిడీ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని, ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని జ‌ర‌గ‌నివ్వ‌కూడ‌ద‌ని కోరారు. మోసాల‌ను అరిక‌ట్ట‌డంలో మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపిడిఓలు క్రియాశీల పాత్ర‌ను పోషించాల‌ని ఆదేశించారు. ప్ర‌యివేటు ఆసుప‌త్రులు, ల్యాబ్‌లు ఇదే అదునుగా రోగుల‌ను దోచుకొనే అవ‌కాశం ఉంద‌ని, దానిపై దృష్టి పెట్టాల‌ని సూచించారు. అలాగే అంబులెన్సులు, టెస్టులు, వేక్సిన్‌లు, ద‌హ‌న కార్య‌క్ర‌మాలు, ర‌వాణా ఛార్జీలకూ కూడా అధికంగా వ‌సూలు చేసే అవ‌కాశం ఉంద‌న్నారు. నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌ను కూడా విప‌రీతంగా పెంచే అవ‌కాశం ఉంద‌ని, వాటిని అరిక‌ట్టాల‌న్నారు. వీట‌న్నిటిపైనా క్షేత్ర‌స్థాయిలో అధికారులు దృష్టిపెట్టి, వాటిని అరిక‌ట్టాల‌ని, ప్ర‌జ‌ల‌కు భ‌రోసాను క‌ల్పించి, ప్ర‌భుత్వ యంత్రాంగంపై న‌మ్మ‌కాన్ని పెంచాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. 

Vizianagaram

2021-05-13 13:43:24

మూడేళ్లు వరుసగా రైతు భరోసా..

వైఎస్ఆర్ రైతు భరోసా  పథకం లో   వరుసగా  3వ ఏడాది  తొలి విడత సాయం కింద రాష్ట్రంలో  52.38 లక్షల మంది  రైతులకు  రూ . 3,928.88 కోట్లు సాయం   అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.  గురువారం  తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి   ఆయన  కంప్యూటర్ లో బటన్ నొక్కి  రైతుల ఖాతాల్లో  నగదు జమ చేసారు.  ప్రస్తుతం  ఖరీఫ్ కు ముందు  మొదటి విడత కింద రూ. 7,500  అందజేస్తున్నామని  తెలిపారు.  రెండవ వాయిదా  రూ. 4000 అక్టోబరు నెలలో , మూడవ వాయిదా రూ.2000 జనవరి నెలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారని  తెలిపారు. విశాఖపట్నం నుంచి  ఈ కార్యక్రమంలో  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు , జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాల రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి  చైర్మన్ చిక్కాల రామారావు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.  అనంతరం  పర్యాటక శాఖ మంత్రి  ముత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ  వ్యవసాయం కొరకు  పెట్టుబడి సాయం కింద  రైతులకు  3వాయిదాలలో  రూ. 13,500 లు వారి ఖాతాలలోకి జమ చేస్తున్నామని తెలిపారు. అలాగే భూమిలేని కౌలు రైతులకు, దేవదాయ భూముల రైతులకు ఇనామ్ భూముల  రైతులకు, ప్రభుత్వ మరియు ఇతర భూములు  సాగు చేయుచున్న వారికి రెండు వాయిదాలలో  అక్టోబరు నెలలో రూ. 11,500/-  మరియు జనవరి నెలలో  రూ. 2000/- రైతు భరోసా కింద మంజూరు చేస్తారని  తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో 3,46,679 మంది రైతులకు  రూ. 260 కోట్లు  మరియు 39,845 మంది అటవీ భూములు కలిగిన  రైతులకు  రూ. 29.88 కోట్లు  మొత్తం రూ. 289.88 కోట్లు  వారి బ్యాంకు ఖాతాలలోకి   జమ చేసామని తెలిపారు. 

Visakhapatnam

2021-05-13 13:09:45

ఎలాంటి విపత్కర పరిస్థితైనా ఎదుర్కొంటాం..

ఎలాంటి విపత్కర పరిస్థితులునైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సన్నద్ధం గా ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు.  గురువారం పర్యాటక శాఖా మాత్యులు  అధికారులు,  వైద్యుల తో జిల్లాలో కోవిడ్ సేవల పై  కలక్టరేట్ సమావేశ మందిరము లో సమీక్ష నిర్వహించారు.   కోవిడ్ పేషెంట్లకు సేవలందించడములో ఎటువంటి సమస్యలు ఉన్నా  తెలియజేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖల తో మాట్లాడి పరి ష్కరిస్తానని తెలియ జేశారు.  ఇప్పటి వరకు ఎంత మందికి వైద్య సేవలు తీసుకుని ఆరోగ్యంగా వచ్చారో ఆ వివరాలను అడిగి తెలుసుకున్నారు.  జిల్లాలో  పడకలు సంఖ్య పెంచడానికి ఉన్న అవకాశాల పై చర్చించారు.  వివిధ ఆసుపత్రులలో పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా విషయంలో జాగ్రత్త గా ఉండాలని 24 ఆక్సిజన్ సరఫరా పేషెంట్లకు అందాలని తెలియజేశారు.  సంబంధిత సాంకేతిక నిపుణులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అప్రమత్తత తో ఉండాలని  ఆదేశించారు. జిల్లాలో ఆక్సిజన్ ఎంత అవసరమో జిఎం రామలింగరాజు ను మంత్రి అడిగి తెలుసుకున్నారు.   ఆసుపత్రులలో వెంటిలేటర్ల వివరాల పై చర్చించి ఆసుపత్రుల వారీగ ఎన్ని పడకలు, ఎన్ని వెంటిలేటర్లు, ఆక్సిజన్ పడకలు సంఖ్య, మొత్తం కేసులు, తదితర వివరాలపై చర్చించారు. 

విమ్స్ ఆసుపత్రి లో వైద్య సేవలు, డాక్టర్లు, నర్సులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సరఫరా తదితర విషయాలపై  వివరాలను డైరక్టరు డా. రాంబాబును అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.  పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. Remidiciver injections ఆసుపత్రులకు సరఫరా చేసిన పిదప వాటిని పేషెంట్లకు వినియోగించడము  పై వివరాల ను ప్రైవేట్ ఆసుపత్రుల నుండి తెప్పించు కోవాలని డ్రగ్ కంట్రోలర్‌ సహాయ సంచాలకులు రజితను ఆదేశించారు.

 Drug ఇనస్పెక్టర్లు అందరూ ' ప్రైవేటు ఆసుపత్రులలో రెమిడిసివర్ ఇంజక్షన్ల వినియోగము పై తనిఖీలు నిర్వహించాలన్నారు. రెమిడెసివర్ వినియోగానికి కొత్తగా నియమాలు ఉన్నాయని, డిఎంహెచ్ఓ ను అడిగి తెలుసుకోవాలని డ్రగ్ కంట్రోల్ ఎడిని జెసి అరుణ్ బాబు చెప్పారు.  కోవిడ్ మెటీరియల్ ప్రస్తుతం ఎంత ఉన్నది, ఇంకా ఎంత అవసరం అవుతుందని డిఎంహెచ్ఓ ను మంత్రి ప్ర శ్నించారు.  డిఎమ్ అండ్ హెచ్ ఒ వివరాలను తెలుపుతూ  కోవిడ్ మెటీరియల్ కొనుగోలుకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.. జిల్లాలో ఇప్పటి వరకు  5.22 లక్షలు మందికి మొదటి డోస్ వేయడమైనదని, 1.58 లక్షల మందికి రెండవ డోస్ వేసినట్లు తెలిపారు. 

అన్ని జాగ్రత్తలు తీసుకొని మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను మంత్రి కోరారు. అంతకు ముందు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి కోవిడ్ నివారణకు జిల్లాలో తీసుకుంటున్న చర్యలను మంత్రికి వివరించారు.  ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం. వేణు గోపాల రెడ్డి, పి. అరుణ్ బాబు, కె జి హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలి, AMC ఫ్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్, Dm&ho డాక్టర్ సూర్యనారాయణ, చాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ కుమార్, P D,, DRDA వి. విశ్వేశ్వరరావు, పలువురు జిల్లా అధికారులు, హాజరయ్యారు. 

            అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విలేఖరులతో మాట్లాడుతూ 79 కోవిడ్ ఆసుపత్రులకు 79 మంది నోడల్ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రులకు వచ్చే కోవిడ్ పేషెంట్లకు అడ్మిషన్లు ఇవ్వాలని  మెరుగైన వైద్యం అందించాలని సూచించినట్లు తెలిపారు.  డాక్టర్లు, నర్సులు, టెక్నికల్ సిబ్బంది, తదితరులు అవసరమైతే నియామకాలు చేసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.  ప్రైవేటు ఆసుపత్రులను డ్రగ్ కంట్రోల్ సహాయ సంచాలకులు చూస్తారని, రెమిడెసివర్ ఇంజక్షన్లు నల్లబజారుకు వెళ్లకుండా చూడాలని ఆదేశించినట్లు తెలిపారు.

జిల్లాలో ఆరోగ్యశ్రీ ఎంప్యానల్ ఆసుపత్రులు 79 ఉన్నాయని, నాన్ ఎంప్యానల్ ఆసుపత్రులు 30 ఉన్నట్లు చెప్పారు. ఈ ఆసుపత్రుల్లో 3 వేల 809 ఆరోగ్య శ్రీ పడకలు ఉన్నాయన్నారు. 108 ఆంబులెన్స్ లు జిల్లాలో 48 తమ సేవలు అందిస్తున్నాయని వివరించారు.

Visakhapatnam

2021-05-13 13:06:53

అన్నంపెట్టే రైతన్నలకు సాగు భరోసా కల్పించాలి..

రాష్ట్ర ప్రజలకు అన్నం పెట్టే రైతన్నలకు సాగులో పెట్టుబడికి భరోసా కల్పించేలా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 2021-22 సంవత్సరానికి “వై.ఎస్.ఆర్. రైతుభరోసా - పి.ఎమ్. కిసాన్” పథకంలో భాగంగా తొలివిడత నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్న సందర్భంగా గురువారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని
జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు  ఎదురవుతున్నా చెప్పిన మాట ప్రకారం ప్రకటించిన సమయానికే రైతులకు ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులను ఉద్థేశించి జిల్లా కలెక్టర్  పోల భాస్కర్
మాట్లాడుతూ జిల్లాలో 4,08,699 మంది రైతులు రూ. 306.55 కోట్ల మేరకు లబ్దిపొందుతున్నారని చెప్పారు. గత రెండేళ్ల కంటే ఈ సారి ఎక్కువ మంది రైతులు ప్రయోజనం పొందుతున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా 2019-20, 2020-21, 2021-22 సంవత్సరాలకు సంబం ధించి ఇప్పటివరకు రూ. 1,046 కోట్లు రైతుల ఖాతాల్లో
జమ అయినట్లు ఆయన వివరిం చారు. సాగులో నష్టాలవల్ల 2014 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ. 3.72 కోట్లు, 2018-19, 2019 ఖరీఫ్ కాలానికి పంటల బీమా ద్వారా రూ. 423.52 కోట్లు, సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతులకు ఖరీఫ్ 2019, రబీ 2019 కాలానికి రూ. 16.2 కోట్లు, 2020 సెప్టెం బరు నుంచి 2021 ఏప్రిల్ మధ్యకాలంలో తుఫానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల
పంటలు నష్టపోయిన రైతులకు రూ. 101.84 కోట్లు కలిపి మొత్తంగా జిల్లాలో రైతులకు ఇప్పటివరకు రూ. 1591.28 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నుంచి అందించినట్లు తెలిపారు. రైతులకు అవసర మైన సేవలను గ్రామస్థాయిలోనే వారికి అందించేలా రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని కలెక్టర్ చెప్పారు. రైతులను సం ఘటిత పరిచి మరింత మేలు చేకూరేలా వారిని రైతు ఉత్పాదక సంఘాలుగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. దీనికి తోడు సాగులో అవసరమైన సలహాలు, సూచనలను వ్యవసాయ నిపుణుల ద్వారా ఇప్పించడానికి జిల్లా కేంద్రంలో ఒక ప్రత్యేక వనరుల
కేంద్రం (డి.ఆర్.సి.) కూడా నెలకొల్పుతున్నామని తెలిపారు. మండల కేంద్రం నుంచి డి.ఆర్.సి.లోని నిపుణులతో రైతులు వీడియో ద్వారా సంభాషించి సందేహాలను నివృత్తి చేసుకునే ఈ సదుపాయాన్ని రాబోయే ఖరీఫ్ సీ జన్ కంటే ముందుగానే అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు. వ్యవసాయ సలహా కమిటీలు కూడా త్వరలోనే ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. అనంతరం రైతు
భరోసా పథకంలో లబ్దిపొందిన రైతులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు  మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసన మండలి సభ్యురాలు  పోతుల సునీత, చీరాల శాసన సభ్యులు  కరణం బలరామక్రిష్ణమూర్తి, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) జె. వెంకట మురళి, డి.సి.ఎమ్.ఎస్. ఛైర్మన్ రావి రామనాథం బాబు, రైతు నాయకులు ఆళ్ల రవీంద్ర రెడ్డి, వ్యవసాయ శాఖ జె.డి. శ్రీరామమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Ongole

2021-05-13 12:47:00

కోవిడ్ టెస్టులు మరింత పెంచాలి..

పాజిటివ్ కేసులు ఎక్కువగా వచ్చిన మండలాల్లో కరోనా పరీక్షలు ఎక్కువ చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. గురువారం అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాజిటివ్ కేసులు ఎక్కువగా వచ్చిన మండలాల్లో పరీక్షలు ఎక్కువ చేయాలని పేర్కొంటూ ఆమదాలవలసపలాసవజ్రపుకొత్తూరు తదితర మండలాల్లో బుధవారం ఎక్కువగా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. జిల్లాలో ఫీవర్ సర్వే త్వరితగతిన నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంకా సర్వే చేయాల్సిన ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ హోమ్ ఐసోలేషన్హోమ్ క్వారంటీన్ కేసులను తప్పక పరిశీలించాలని ఆదేశించారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి మెడికల్ కిట్ లను అందజేసి యాప్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఇప్పటికీ హోమ్ క్వారంటీన్ లో దాదాపు 2300 మందిని సందర్శించనట్లు నివేదికలు చూపిస్తున్నాయని ఆయన పేర్కొంటూ తక్షణం సందర్శించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. హొమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి ఆక్సిజన్ స్థాయి,  పల్స్ స్థాయి పరిశీలించాలని పేర్కొన్నారు. హొమ్ క్వారంటీన్ లో ఉన్న వారికి కనీసం మూడు రోజులకు ఒకసారి సందర్శించాలని ఆయన అన్నారు. పలాససింగుపురంమాకివలసరావాడ తదితర ప్రాంతాల్లో ఎక్కువ మంది హోమ్ క్వారంటీన్ లో ఉన్నట్లు ఆయన చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం పక్కాగా నిర్వహించాలని ఆయన అన్నారు. జిల్లాలో ప్రస్తుతం కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ మాత్రమే జరుగుతుందని ఆయన చెప్పారు. మొదటి డోసు కోవిషీల్డ్ వేసుకున్న తర్వాత కనీసం నలభై రెండు రోజుల తరువాత మాత్రమే కోవిషీల్డ్ వాక్సినేషన్  వేయాలని ఆయన ఆదేశించారు.  56 రోజుల తర్వాత కూడా కోవిషీల్డ్ వేసుకునే అవకాశం ఉందని గమనించాలని చెప్పారు. కోవ్యాక్సిన్ జిల్లాకు త్వరలో వచ్చే అవకాశం ఉందనిమొదటి డోసు వేసుకుని కనీసం 28 రోజులు పూర్తి చేసుకున్నవారు అర్హులని తెలిపారు. కోవాక్సిన్ 42 రోజుల వరకు వేసుకోవచ్చని ఆయన సూచించారు.

        ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడారెవిన్యూ డివిజనల్ అధికారులు ఐ.కిషోర్టి.వి.ఎస్.జి కుమార్వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-13 12:39:35

ముస్లిం జర్నలిస్టులకు శ్రీనుబాబు రంజాన్ తోఫా..

సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ప్రశంసనీయం అని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి,వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు కొనియాడారు. గురువారం విశాఖలో నిరు పేద జర్నలిస్టులకు తన సొంత నిధులతో రూ. 1.60 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. రంజాన్ పర్వదినం సందర్బంగా 15 మంది (ముస్లిం) జర్నలిస్టులకు  రూ.30 వేలు అందజేశారు. ఈసందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ పదేళ్లుగా క్రమం తప్పకుండా ప్రతియేటా రంజాన్ పర్వదినం సందర్భంగా  జర్నలిస్టుల కు తనవంతు  సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రింట్, ఎలక్ట్రా నిక్ మీడియా కు చెందిన జర్నలిస్ట్ మిత్రుల తో పాటు చిన్న పత్రికలు, లోకల్ కెబుల్ టీవీల్లో పనిచేస్ఫో టో, వీడియో జర్నలిస్ట్ లకు తన వంతు సహాాయం దశల వారీగా  అందిస్తున్నామన్నారు. ఒక నిరుపేద కుటుంబానికి 60 వేలు, ఇద్దరు చిన్న పత్రిక ల ఎడిటర్ లుకు పదివేలు చొప్పున సహాయం చేసినట్టు చెప్పారు. కేవలం జర్నలిస్టు కుటుంబాలకు తోడుగా నిలవాలనే సంకల్పంతోనే  ఎందరో దాతల స్పూర్తి గా ఈ సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. గత ఏడాది కరోనా సమయం లో సుమారు రూ.12 లక్షలు వరకు వివిధ వర్గాలకు వేర్వేరు రూపాల్లో సహాయం అందచేశానన్నారు. అప్పట్లోకేవలం నిత్యా వసర వస్తువులు కోసమే 8 లక్షలు ఖర్చు చేశామన్నారు. నిరంతరం ప్రజా సేవలో కొనసాగుతున్న జర్నలిస్ట్ లును ప్రభుత్వం ఆడుకోవాలని గంట్ల కోరారు. అన్ని రకాల  సదుపాయాలు కల్పించి జర్నలిస్టులకు కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. కరోనా సమయంలో జర్నలిస్ట్ లు ఫ్రంట్ లైన్ వర్కర్స్ రూపములో నిరంతరం ప్రజలు కోసం పాటు పడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ముస్లిం జర్నలిస్టులు పాల్గొన్నారు.

Akkayyapalem

2021-05-13 07:16:57

టోకెన్లు ఉన్నవారే 2వ డోసు వేక్సినేషన్ కి వెళ్లాలి..

విశాఖనగరంలో కోవిడ్ వేక్సినేషన్ కు సంబంధించి వార్డు వాలంటీర్లు టోకెన్లు జారీ చేసిన వారు మాత్రమే టీకా కేంద్రాలకు వెళ్లాలని అర్భన్ తహశీల్దార్ జ్నానవేణి కోరుతున్నారు. బుధవారం విశాఖలో ఈ మేరకు మీడియా ద్వారా ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. సీతమ్మధార మండలంలో స్వర్ణభారతి స్టేడియం, అక్కయ్యపాలెం, చినవాల్తేరు ప్రాంతంలో వేక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతుందన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం రెండవ డోసు టీకా మాత్రమే వేస్తున్నందున వారు మాత్రమే టీకా కోసం వెళ్లాలన్నారు. వేక్సినేషన్ కేంద్రాల వద్ద కూడా బౌతిక దూరం పాటిస్తూ, డబుల్ లేయర్ మాస్కులు ధరంచాలని, శానిటైజర్లు వినియోగించాలని తహశీల్దార్ ప్రజలకు సూచిస్తున్నారు. కరోనా వైరస్ భారిన పడకుండా టీకా వేయించుకునే సమయంలో  ప్రభుత్వం నిర్ధేశించిన సూచనలు పాటించడం ద్వారా సజావుగా రెండవ డోసు టీకా వేక్సినేషన్ సజావుగా జరుగుతుందన్నారు. వేక్సినేషన్ కేంద్రాల్లో ప్రభుత్వం అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసినట్టు జ్నానవేణి వివరించారు.

Visakhapatnam

2021-05-12 16:14:21

గురువారం 3వ విడత రైతు భరోసా..

మూడవ సంవత్సరం మొదటి విడత కార్యక్రమము గురువారం జరుగుతుందని వ్యవసాయ శాఖ ఇన్ ఛార్జ్ సంయుక్త సంచాలకులు కె.రాబర్ట్ పాల్ తెలిపారు. బుధవారం ఒక ప్రకటన జారీ చేస్తూ "వై.యస్.ఆర్ రైతు భరోసా -  పి.ఎం.కిసాన్ పథకం" కింద అర్హులైన రైతులకుఅర్హులైన సాగుదార్లకుకౌలు రైతులకు ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పునఅయిదేళ్లలో రూ. 67,500 అందించడం జరుగుతోందని చెప్పారు.  రాష్ట్రములో ఎస్సీఎస్టీబీసీమైనారిటీ కౌలు రైతులకుదేవాదాయఅటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా  రైతు భరోసాగా  సహాయాన్ని అందించడం జరుగుతోందని వివరించారు. రైతు భరోసా సొమ్మును "వై.యస్.ఆర్ రైతు భరోసా పి.ఎం.కిసాన్ పథకం" క్రింద మొదట విడతగా ఖరీప్ పంట వేసి ముందు మే నెలలో రూ.7,500, రెండో విడతగా- అక్టోబరులో ఖరీఫ్ పంట కోతకు లేదా రబీ అవసరాలకు రూ.4000; మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే వేళసంక్రాంతి పండగ సందర్భముగా రూ. 2,000 అందించడం జరుగుతోందని చెప్పారు. 2021-22 సంవత్సరం (మూడవ సంవత్సరం మొదటి విడత)లో పథకం క్రింద మొదటి విడతగా శ్రీకాకుళం జిల్లాలో 3,90,988 రైతు కుటుంబాలకు రూ. 293.24 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇందులో రూ.216.87 కోట్లు వై.యస్.ఆర్ రైతు భరోసా కిందరూ 76.37 కోట్లు పి. ఎం. కిసాన్ పథకం కింద జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

 

ఈ పధకం కింద గత 2 సంవత్సరాలలో శ్రీకాకుళం జిల్లాలో  2019-20 సంవత్సరములో 3.34 లక్షల రైతు కుటుంబాలకు రూ.450.98 కోట్లు ఆర్ధిక సహాయంగా అందిచడం జరిగిందని, 2020 - 21 సంవత్సరంలో 3.81 లక్షల రైతు కుటుంబాలకు రూ.509 కోట్లు ఆర్ధిక సహాయం అందిచడం జరిగిందని ఆయన వివరించారు.

Srikakulam

2021-05-12 15:58:55

ప్రతీ 2గంటలకు ఆక్సిజన్ లెవల్స్ అందించాలి..

ఆక్సిజన్ వార్ రూమ్ ఏర్పాటు చేసి ఆక్సిజన్ నోడల్ అధికారులకు శిక్షణ ఇచ్చాము, భాద్యతతో ఆక్సిజన్ నిల్వలు ప్రతి రెండు గంటలకు తెలిపాలి, భాద్యతతో  ఆక్సిజన్ కొరత వల్ల ప్రాణాలు పోకుండా  కాపాడాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆర్దిఓ కార్యాలయంలో  జిల్లా వ్యాప్తంగా వున్న  ఆక్సిజన్ నోడల్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షకు , అర్బన్ ఎస్.పి. వెంకట అప్పలనాయుడు , జెసి హెల్త్ వీరబ్రహ్మం , సబ్ కలెక్టర్ మదనపల్లి జాహ్నవి  , అర్దిఓ లు తిరుపతి కనక నరసా రెడ్డి, చిత్తూరు రేణుకా పాల్గొన్నారు. 
కలెక్టర్ మాట్లాడుతూ నోడల్ అధికారులకు కేటాయించిన ప్రవేట్, ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ నోటిఫై ఆక్సిజన్ బెడ్లు, ఐసియు బెడ్ల సంఖ్య, అందుబాటులో వున్న బల్క్ సిలిండర్లు వివరాలు మీదగ్గర వుండాలి అన్నారు. ఆసుపత్రుల ఆక్సిజన్ అవసరాలు  మదనపల్లి డివిజన్ లో కనీసం 9 గంటలు, తిరుపతి డివిజన్ లో 6 గంటలు, లిక్విడ్ గ్యాస్ టాంకర్ల  విషయంలో 12 గంటల నిల్వలు వుండేలా చూడాలని అన్నారు. జిల్లాలో లిక్విడ్ గ్యాస్ వాడుతున్నది స్విమ్స్, రుయా, డి.హెచ్.చిత్తూరు, అమర , పి.ఇ.ఎస్. లు మాత్రమేనని అన్నారు.  టాంకర్ల రాక విషయంలో ట్రాకింగ్ వుండాలని, పోలిస్ గ్రీన్ చానల్ ఏర్పాటు తో సాకాలంలో చేరుకునేలా అప్రమత్తం చేయాల్సి వుంటుందని అన్నారు. ఆక్సిజన్ అవసరాలను రాష్ట్ర స్థాయిలో అసిస్టెంట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జి.ఎం.డి.ఐ.సి. ప్రతాప్ రెడ్డి మానిటర్ చేసి లిక్విడ్ గ్యాస్ ట్యాంకర్లు రాక చూస్తారని తెలిపారు. ఏర్పేడు కృష్ణ ఫిల్లింగ్  కూడా విశాఖ నుండి లిక్విడ్ గ్యాస్ ట్యాంకర్లు వస్తే  బల్క్ సిలిండర్లు ఫిల్ చేస్తారు అన్నారు. రేషనైలేజన్ వుండాలి, అత్యవసరం అయితే అందించే విధంగా,  నిరతరం ఆక్సిజన్ నోడల్ అధికారులు అప్రమత్తంగా వుండాలని సూచించారు. డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్ , అర్దిఒలకు అవసరాలు తెపాలని సూచించారు. 
జేసి హెల్త్ , అర్దిఓ తిరుపతి వారు  మాట్లాడుతూ నిన్న ప్రత్యేకంగా డేటా ఎలా సేకరించాలని రియల్ టైం డేటా వుండేలా  శిక్షణ ఇచ్చామని అన్నారు. వెబ్ మాడ్యులర్ సిద్దం అవుతున్నదని డేటా ప్రతి రెండు గంటలకు ఆసుపత్రుల ఆక్సిజన్ లెవల్స్ అప్ లోడ్ జరగాలని అన్నారు. 
అర్బన్ ఎస్.పి. మాట్లాడుతూ లిక్విడ్ గ్యాస్ ట్యాంకర్లు విశాఖ , పెరంబదూరు వచ్చే ట్రాకింగ్ వివరాలు ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ అందించాలని, ఎస్కార్ట్ ఏర్పాటుతో అంతరాయం కలగకుండా చేరేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. 
ఈ సమీక్షలో డి.ఎస్.పి.లు సుధాకర్ రెడ్డి, చంద్ర శేఖర్, ట్రాన్స్ పోర్ట్ అధికారులు,  తహసిల్దార్ విజయసింహా రెడ్డి , ఎ.ఎస్.ఓ.మధుసూదన్ , ఎపిఎం ఐ డి సి , ఈఈ ధనంజయ రెడ్డి, రుయా ఆర్ ఎం ఓ హరికృష్ణ ,ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినెటర్ డా.బాలాంజనేయులు, డ్రగ్ కంట్రోల్ అధికారిని కీర్తన, నోడల అధికారులు గా నియమింపబడిన సి.ఎస్.డి.లు, శ్యామ్ ప్రసాద్, సురేంద్ర, మల్లిఖార్జున రావు, గంగయ్య, మురళి మోహన్,  యుగంధర్ , మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. 

Tirupati

2021-05-12 15:55:04