1 ENS Live Breaking News

ఆన్ లైన్ లో సింహాద్రినాధుని అర్చనలు..

విశాఖలోని సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) దేవస్థానంలో ఈనెల 16 నుంచి  ఆన్ లైన్లోనే అర్చనలు, పూజలు చేపడుతున్నట్టు ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు.  శుక్రవారం సింహాచలంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం స్వామివారికి ఆన్ లైన్ లో నే అర్చనలు, చేసి వాటి యొక్క వీడియోలను భక్తులకు తెలియజేస్తామని చెప్పారు. దానికోసం ప్రత్యేకంగా యూట్యూబు ఛానల్ ను ఏర్పాటు చేశామని, వాటి ద్వారా స్వామివారి అర్చనలు ఆన్ లైన్ లోనే తిలకించవచ్చునని ఈఓ చెప్పారు. నిత్య కల్యాణం ( ప్రతి రోజూ ఉదయం 9:30 నుంచి 10:30), గురు- ఆదివారాల్లో జరిగే స్వర్ణపుష్పార్చన (8గంటలకు ఉదయం) , ప్రతినెలా స్వాతి నక్షత్రం రోజు స్వాతి హోమం  (ఉదయం 8 గంటలకు),ప్రతి ఏకాదశి రోజు స్వర్ణతులసీదళార్చన ఆన్ లైన్లో వీక్షించవచ్చునని ఈఓ చెప్పారు. నిత్యకళ్యాణానికి 1,000(వెయ్యి రూపాయలు), స్వర్ణపుష్పార్చనకు రూ. 2,116 (రెండు వేల నూట పదహారు రూపాయలు), స్వాతి హోమానికి రూ.2,500 (రెండువేల ఐదు వందలు), స్వర్ణతులసీదళార్చనకు రూ.2,116( రెండువేల నూటపదహారు) చెల్లించాల్సి ఉంటుందన్నారు. మీ తరపున స్వామివారి కళ్యాణమండపంలో  గోత్రనామాలతో పూజలు, అర్చనలు వేద పండితులు నిర్వహిస్తారన్నారు.  ఆన్ లైన్ పూజలు, అర్చనల్లో  భాగస్వాములు కావాలనుకునే భక్తులు  దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN 0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-14 13:45:56

కరోనా రోగి భద్రతే ప్రధాన లక్ష్యం..

ప్ర‌గ‌తి భార‌త్ ఫౌండేష‌న్ ఆద్వ‌ర్యంలో విశాఖ‌ట‌పట్నంలో అత్యాధునిక హంగుల‌తో ఏర్పాటు చేసిన 300 ప‌డ‌క‌ల పూర్తి ఆక్షిజ‌న్ స‌దుపాయం కలిగిన కోవిడ్ కేర్ సెంట‌ర్ రాష్ట్రంలోని  కోవిడ్ కేర్ సెంట‌ర్లుకు ఆద‌ర్శ‌మ‌ని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీ‌నివాస్ (నాని) అన్నారు. విశాఖ‌ప‌ట్నం షీలాన‌గ‌ర్ లో వికాస్ కాలేజీలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంట‌ర్ ను రాజ్య‌స‌భ స‌బ్యులు వి విజ‌య‌సాయి రెడ్డి, మంత్రులు క‌న్న‌బాబు, అవంతి శ్రీ‌నివాస్ ల‌తో క‌లిసి ఆయ‌న శుక్ర‌వారం  ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ ప్ర‌గ‌తి భార‌త్ ట్ర‌స్టు ఏర్ప‌టు చేసిన కోవిడ్ కేర్ సెంట‌ర్ అత్యాధునిక స‌దుపాయాలు గ‌ల‌ కోవిడ్ ఆసుప‌త్రిని త‌ప‌లించేవిధంగా ఉంద‌ని అన్నారు. అత్యున్నత ప్ర‌మాణాల‌తో తీర్చిదిద్దిన ఈ కోవిడ్ కేర్ సెంట‌ర్ లోని మ‌ల్టీ టైర్ ఆక్షిజ‌న్(నాలుగు అంచెల) స‌ర‌ఫరా విధానం పేషెంటు కు ఆక్షిజ‌న్ అందించ‌డంలో పూర్తి భద్రత క‌ల్పిస్తుంద‌ని, ఎటువంటి ప‌రిస్థితిలు ఎదురైన అంత‌రాయం క‌ల‌గ‌డానికి ఆస్కారం లేద‌ని అన్నారు. రాష్ట్రంలోని అన్ని కోవిడ్ ఆసుప‌త్రులు ఈ విధానాన్ని పాటిస్తే ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని బాదాక‌ర‌ సంఘ‌ట‌న‌లు కూడా జ‌రిగి ఉండేవి కావ‌ని అన్నారు. గ‌తంలో కోవిడ్ బారిని ప‌డిన వారు పెద్ద‌గా ఆక్షిజ‌న్ అవ‌స‌రం లేకుండా కోలుకున‌నే వార‌ని  ,ప్రస్తుతం విస్తురిస్తున్న కోవిడ్ వ్యాది ప్ర‌జ‌ల ఆరోగ్యంపై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతున్న‌ద‌ని అన్నారు. గ‌తంలో కేవ‌లం 40 మెట్రిక్ ట‌న్నుల ఆక్షిజ‌న్ మాత్ర‌మే కోవిడ్ ఆసుప‌త్రుల‌ను అవ‌స‌ర‌మ‌య్యింద‌ని అయితే ప్ర‌స్థుతం సెకెండ్ వేవ్ లో 600 మెట్రిక్ ట‌న్నులు ఆక్షిజ‌న్ కూడా స‌రిపోవ‌డం లేద‌ని అన్నారు. కోవిడ్ వ్యాది ఉదృతంగా విస్తరిస్తున‌న్న నేప‌ద్యంలో ఆసుపత్రుల‌లో బెడ్స్ కొర‌త ఏర్ప‌డింద‌ని ఈ మేర‌కు ఇటువంటి కోవిడ్ కేర్ సెంట‌ర్ల సేవ‌లు ప్ర‌జ‌లు వినియోగించుకోవాల‌ని కోరారు.

ఆంద్రా మెడిక‌ల్ కాలేజీ స‌హ‌కారంలో ఈ కోవిడ్ కేర్ సెంట‌ర్లో స్పెష‌లిస్టు  డాక్ట‌ర్ల‌ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని అన్నారు. ప్ర‌గ‌తి బార‌త్ ఫౌండేష‌న్ ద్వారా ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ దీని నిర్వ‌హ‌ణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్   ప్రభుత్వనికే అంద‌జేయాల‌న్న నిర్ణ‌యం అభినంద‌నీయ‌మ‌ని దీనికి,సంబందించి త‌న‌వంతు స‌హ‌కారం అందిస్తాన‌ని అన్నారు. దేశంలోని మిగ‌తా రాష్ట్రాల‌తో పోలిస్తే కోవిడ్ నియంత్ర‌ణ‌లో ఆంద్ర‌ప్ర‌దేశ్ ఎంతో మెరుగ్గా ఉంద‌ని అన్నారు.   అంత‌కు ముందు రాజ్య‌స‌భ సభ్యులు, ప్ర‌గ‌తిభార‌త్ మేనేజింగ్ ట్ర‌స్టీ విజ‌యసాయి రెడ్డి మాట్టడుతూ  ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆశ‌యాల‌కు అనుగుణంగా అత్యాధునిక హంగుల‌తో, పూర్తి సాంకేతిక‌త‌తో  ప్ర‌గ‌తి భార‌త్ ఫౌండేష‌న్ ఆద్వ‌ర్యంలో కోవిడ్ కేర్ సెంట‌ర్ ఏర్పాటు చేసామ‌ని అన్నారు. ఆక్షిజ‌న్ అంద‌క ఏ ఒక్క కోవిడ్ బాదితుడూ ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంలో విశాఖ ప్ర‌జ‌ల అవ‌స‌రాలు దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసామ‌ని అన్నారు. ఇటీవ‌ల కేజిహెచ్, మ‌రియు విమ్స్ ఆసుప‌త్రుల‌లోని కోవిడ్ వార్డులు సంద‌ర్శించ‌డంతో పాటు, వైరాల‌జీ ల్యాబ్, 104 కాల్ సెంట‌ర్ ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం కోవిడ్ కేర్ సెంట‌ర్ ఏర్పాటు చేయాల‌నే నిర్ణ‌యం తీసుకున్నామ‌ని అన్నారు. మ‌ల్టీ టైర్ ఆక్షిజ‌న్ స‌ర‌ఫ‌రా సిస్టం ద్వారా పేషెంటుకు ఆక్షిజ‌న్ స‌ర‌ఫ‌రాలో ఎట్టిప‌రిస్థితిలోనూ అంత‌రాయం క‌ల‌గ‌ద‌ని అన్నారు.  మ‌ల్టీ టైర్ ఆక్షిజ‌న్ స‌ర‌ఫ‌రా విధానిన్ని వివ‌రిస్తూ  ఒక్కొక్క‌టి 3750 క్యూబిక్ మీట‌ర్లు సామ‌ర్ద్యం గ‌ల రెండు అతిపెద్ద ఆక్షిజ‌న్ ట్యాంకులు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఆక్షిజ‌న్ ను పైపులైన్లు ద్వారా పేషెంటుకు నేరుగా అందిస్తామ‌ని అన్నారు. 

ట్యాంకుల ద్వారా స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డిన‌ట్లైతే  ఒక్కోక్క‌టి 60 లీట‌ర్లు సామ‌ర్ద్యం క‌లిగిన  200 సిలండ‌ర్లు ప్ర‌త్యామ్నాయంగా మెత్తం 2000 క్యూబిక్ మీట‌ర్లు సామ‌ర్ద్యంతో  ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని వాటి ద్వారా పైపులైన్ల‌కు స‌ర‌ఫ‌రాను వెంట‌నే పున‌రుద్ద‌రిస్తార‌ని అన్నారు. దానికి కూడా అంత‌రాయం ఏర్పాడితే ఒక్కో పేషెంటు బెడ్డు వ‌ద్ద 47 లీట‌ర్లు కెపాసిటి క‌ల్గిన సిలండ‌ర్ మెత్తం 1500 క్యూబిక్ మీట‌ర్లు సామ‌ర్ద్యంతో అందుబాటులో ఉండ‌చం జ‌రిగింద‌ని అన్నారు. మ‌రో ప్ర‌త్యామ్నాయంగా  అమెరికా నుండి తెప్పించిన‌ 250 ఆక్షిజ‌న్ కాన్సెంట్రేట‌ర్లు అందుబాటు ఉంచ‌డం జ‌రిగింద‌ని అన్నారు.   ఈవిధంగా మల్టీ టైర్ విధానాన్ని అవ‌లంబిస్తూ ఆక్షిజ‌న్ స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని అన్నారు. ఆక్షిజ‌న్ సాచురేష‌న్ 90 కంటే ఎక్కువ‌గా ఉన్న‌వారికే ఇక్క‌డ అడ్మిష‌న్ చేసుకుంటామ‌ని 90 కంటే త‌క్కువ ఉన్న‌వారిని వెంటిలేట‌ర్లు, ఐసియు అవ‌స‌రం ఉంటుంద‌ని అన్నారు. అయిటే అటువంటి రోగుల‌కు కేజిహెచ్ మ‌రియు విమ్స్ ఆసుప‌త్రుల‌కు త‌రించేందుకు అంబులెన్సులు కూడా అందుబాటు ఉంచామ‌ని అన్నారు. పేషెంటు ఆడ్మిష‌న్ కోసం వ‌చ్చిన‌పుడు రిషెప్స‌న్ వ‌ద్ద‌నే ఆక్షిజ‌న్ కాన్సెంట్రేట‌ర్లు స‌హాయంతో ఆక్షిజ‌న్ అందించి త‌దుప‌రి ప‌రీక్ష‌లు, టెస్టులు చేస్తామ‌ని అన్నారు. పేషెంటు వివ‌రాలు, బెడ్డు వివ‌రాలు రిసెప్స‌న్ వ‌ద్ద డిస్ ప్లే బోర్డు ఏర్పాటు చేసామ‌ని అన్నారు. పేషెంటు కుటుంబ స‌బ్యులు రిసెప్స‌న్ వ‌ద్ద ఏర్పాటు చేసిన‌ సిసి కెమేరా ద్వారా లోప‌ల చికిత్స పొందుతున్న త‌మ వారాకి చూడ‌వ‌చ్చ‌ని అన్నారు. ప్ర‌బుత్వం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ స‌హాకారంతో పేషెంటుకు అన్ని ర‌కాల మందుకు ఉచితంగా అందిస్తామ‌ని అన్నారు. 

ఆర్ టి పిసి ఆర్, ర్యాపిడ్, హెచ్, సి జి మెద‌ల‌గు టెస్టు చేస్తామ‌ని అన్నారు. పేషెంట్ల‌కు, డాక్ట‌ర్లు, న‌ర్సుల‌కు, ఇత‌ర సిబ్బందికి పౌష్టికాహారం ప్ర‌తిరోజు అందిస్తామ‌ని అన్నారు. మెద‌టి అంత‌స్థుకు చేరుకోడానికి లిఫ్టు స‌దుపాయం క‌ల్పించ‌నున్నామ‌ని అన్నారు. ఒక్కో ఫ్లోర్ కి 20, బాత్ రూంలు, 20 టాయిల‌ట్లు ఏర్పాటు  చేయ‌డం జ‌రిగిందిని అన్నారు. విద్యుత్ అంతరాయం ఎర్పాడితే 2 అటో స్టాట్ జ‌న‌రేట‌ర్లు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు. ఈ కేంద్రంలో 30 మంది డాక్టర్లు, 60 మంది న‌ర్సులు మ‌రయు 8 మంది టెక్నిషియ‌న్లు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆంద్రా మెడిక‌ల్ కాలేజీ యాజ‌మాన్యం  ఈ కోవిడ్ కేర్ సెంట‌ర్ కు కేటాయించ‌డం జ‌రిగింద‌ని అన్నారు. ఈ మేర‌కు వారికి కృత‌జ్ఞ‌త‌ తెలియ‌జేసారు. 30 లమంది సానిటేష‌న్ వ‌ర్క‌ర్లు పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంత‌ర‌మూ ప‌నిచేస్తార‌ని తెలిపారు. 20 అగ్నిమాపక ప‌రిక‌రాలు అందుబాటు ఉంచామ‌ని వెల్లడించారు. ఈ కోవిడ్ కేర్ సెంట‌ర్ ను ప్ర‌భుత్వం గుర్తింపు పొందిన కోవిడ్ కేర్ సెంట‌ర్ గా గుర్తించాల‌ని ఆరోగ్య శాఖా మంత్రిని కోరారు. రెమిడిస్ వేర్ మందు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర‌ నుండి కొనుగోలు చేసి అవ‌స‌ర‌మైన ప్ర‌తి పేషెంటుకు ఉచితంగా ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని అన్నారు. ప్ర‌గ‌తి భార‌త్ ఫౌండేష‌న్ త‌రుపున 30 మంది అడ్మినిష్ట్రేటివ్ స్టాఫ్   ప‌నిచేస్తార‌ని అన్నారు.

 ఈ మేర‌కు ట్ర‌స్టు స‌భ్యులు గోపినాధ్ రెడ్డి, ఉమేష్, ర‌మ‌ణ మ‌రియు బాలాజీల కృషిని కొనియాడారు. విశాఖ‌జిల్లా ఇన్చార్జి మంత్రి మ‌రియు వ్య‌వ‌సాయ మంత్రి కుర‌సాల‌ క‌న్న‌బాబు మాట్లాడుతూ విప‌త్క‌ర‌ ప‌రిస్థితుల‌లో ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డానికి ముందుకు వ‌చ్చిన ప్ర‌గ‌తి భార‌త్ షౌండేష‌న్ స‌హ‌సోపేత నిర్ణ‌యాన్ని ఆయ‌న కొనియాడారు. గ‌తంలో కోవిడ్ సంక్షోబ స‌మ‌యంలో సుమారు 70 వేల కుటుంబాల‌కు  ట్ర‌స్టు ద్వారా నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు అంద‌జేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్బంగా గుర్తు చేసారు. ప‌ర్యాట‌న శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీ‌నివాస్ మాట్లాడుతూ విశాఖ జిల్లా ప్ర‌జ‌ల‌కు నేనున్నాన‌నే భ‌రోసా రాజ్య‌స‌భ స‌బ్యులు విజ‌యాసాయి రెడ్డి క‌ల్పిస్తున్నార‌ని విప‌త్క‌ర స‌మ‌యంలోనూ నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నార‌ని కొనియాడారు. కార్యక్రమంలో విశాఖ మేయర్ హరి వెంకట కుమారి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు, ఎమ్మేల్యేలు గుడివాడ అమర్నాథ్, కరనం ధర్మశ్రీ, పెట్ల ఉమ శంకర్ గణేష్, చెట్టి పాల్గున, భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీధర్, నగర అధ్యక్షులు వంశీ కృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మళ్ళ విజయ ప్రసాద్, రెహమాన్, చింతలపూడి వెంకట్రామయ్య, ప్రగతి భారతి ట్రస్టు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Sheela Nagar

2021-05-14 11:25:48

ఆక్సిజన్ వినియోగంపై స్టేట్ కమిటీ ఏర్పాటు..

కోవిడ్ ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ నిల్వ సామ‌ర్థ్యం, అందుబాటులో ఉన్న ఆక్సిజ‌న్ ప‌రిమాణం, వినియోగం త‌దిత‌ర అంశాల‌పై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌కు రాష్ట్ర స్థాయిలో ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ ఏర్పాటైంద‌ని, ఈ వ్య‌వ‌స్థ‌కు అనుసంధానంగా జిల్లా స్థాయిలోనూ స్పెష‌ల్ సెల్ ప‌నిచేస్తోంద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం జిల్లాలోని కోవిడ్ ఆసుప‌త్రుల యాజ‌మాన్యాలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌తో జేసీ వ‌ర్చువ‌ల్ విధానంలో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఆసుప‌త్రుల్లో రోజువారీ అవ‌స‌రాల‌కు అనుగుణంగా మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను అందుబాటులో ఉంచి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌క్కుండా చూసేందుకు ప్ర‌భుత్వం ప‌ర్య‌వేక్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటుచేసింద‌న్నారు. ఆసుప‌త్రుల యాజ‌మాన్యాలు ప్ర‌తి రెండు గంట‌ల‌కు ఒక‌సారి http://pranavayuvu.ap.gov.in వెబ్‌సైట్లో మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌కు సంబంధించిన రియ‌ల్‌టైమ్ స‌మాచారాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంద‌ని వివ‌రించారు. ఈ ప్ర‌క్రియ కోసం ప్ర‌త్యేకంగా లాగిన్‌లు అందించామని, ఈ స‌మాచారాన్ని రాష్ట్రస్థాయితో పాటు జిల్లాస్థాయిలోనూ స‌మీక్షించ‌డం ద్వారా ప్ర‌భుత్వ‌, ప్రైవేటు అనే తేడా లేకుండా ప్ర‌తి కోవిడ్ ఆసుప‌త్రిలోనూ అవ‌స‌రం మేర‌కు ఆక్సిజ‌న్ అందుబాటులో ఉండేలా చూడొచ్చ‌ని పేర్కొన్నారు. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా సంస్థ‌ల రోజువారీ నిల్వ‌ల పైనా ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటుంద‌న్నారు. ఇప్ప‌టికే ఆక్సిజ‌న్‌పై ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప్ర‌తి అయిదు ఆసుప‌త్రుల‌కు ఒక ప్ర‌త్యేక అధికారి ప‌నిచేస్తున్న‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. సమావేశంలో జిల్లాలోని నోటిఫైడ్ కోవిడ్ ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-14 11:22:07

16నుంచి సింహాద్రి అప్పన్న దర్శనాలు..

విశాఖలోని సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) దేవస్థానంలో దర్శనాలను తిరిగి ప్రారంభిస్తున్నట్టు అనువంశిక ధర్మకర్త గజపతిరాజు సంచయిత, ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. శుక్రవారం ఈ మేరకు వీరు మీడియాతో మాట్లాడారు. స్వామి చందనోత్సవం వెళ్లిన రెండు రోజుల తరువాత అంటే ఈనెల 16వ తేది నుంచి ప్రతీ రోజు రెండు గంటల పాటు స్వామి దర్శనాలు కల్పించనున్నట్టు వివరించారు. ఉదయం 7.30 నుంచి 9.30 వరకూ మాత్రమే దర్శనాలు ఉంటాయన్నారు. భక్తులందరూ ప్రభుత్వం నిర్ధేశించిన కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్ధం ఆలయాన్ని సోడియం హైపోక్లోరైడ్ తో ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నట్టు వివరించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాలేనివారు స్వామి ఈహుండీ ద్వారా, యుపీఐ ఐడీ ద్వారా మొక్కులు చెల్లించుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-14 11:19:29

ఏకాంతంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహా లక్ష్మీ నృసింహ స్వామి(సింహాద్రి అప్పన్న) చందనోత్సవం వరుసగా రెండో ఏడాది ఏకాంతంగానే జరిగింది. శుక్రవారం స్వామివారి నుంచి చందనం ఒలుపులు తరువాత ఆలయ ధర్మకర్త సంచయిత గజపతి రాజు తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ రెండో దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సంచయిత మాట్లాడుతూ, స్వామివారి నిజరూప దర్శనం సర్వపాప హరమని, తమ పెద్దలు తరువాత స్వామివారిని తొలి దర్శనం చేసుకునే అవకాశం తనకు దక్కడం ఆనందంగా ఉందన్నారు. మంత్రి ముత్తం శెట్టి మాట్లాడుతూ, సింహాద్రి అప్పన్నకు కుటుం సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం దక్కడం పూర్వజన్మ సుక్రుతంగా భావిస్తున్నానని అన్నారు. ఆ స్వామి ఉగ్రరూపం కరోనాను జయించే శక్తి ఇవ్వాలని, కోవిడ్ రోగులు సత్వరమే కోలుకోవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామిని కోరుకున్నట్టు చెప్పారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తొలి విడత చందనం సమర్పించారు.

Simhachalam

2021-05-14 09:10:18

విశాఖలో అరుదైన ఘట్టం..

విశాఖలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది.. సింహాచలంలోని అప్పన్న చందనోత్సవం, రంజాన్ పండుగ, అక్షర త్రుతియలు ఒకే రోజు మే 14న రావడం. అందునా అల్లాకి శుక్రవారం అంటే ఎంతో ప్రీతికరమైన రోజు రమ్ జాన్ రావడం, శుక్రవారం రోజునే శుభ సూచికంగా అప్పన్న చందనోత్సవ నిజరూప దర్శనం, అక్షర త్రుతియ రావడం కూడా ఒక గొప్ప విషయంగా చెబుతున్నారు. అయితే ఈ మూడు పండుగలను ప్రజలు జరుపుకునే పరిస్థితి లేదు. రమ్ జాన్ పండుగను ముస్లిం సోదరులు ఇంట్లోనే చేసుకోవడం, ఇటు సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం, అక్షర త్రుతియ పూజలు కూడా భక్తులు ఇళ్లల్లో ఉండే జరుపుకోవాల్సి వచ్చింది.  ఈ కరోనా తెచ్చిన ముసలం వలనే ఈ పరిస్థితి దాపురించిందనే బాధను కూడా విశాఖ వాసులు వ్యక్తం చేయడం విశేషం..

Simhachalam

2021-05-14 04:04:54

కరోనాలోనూ ఆగని స్నేక్ రెస్క్యూ..

విశాఖలో స్నేక్ సేవర్ సొసైటీ తన సేవలను కరోనా వైరస్ అధికంగా ఉన్న సమయంలోనూ కొనసాగించడం పట్ల నగర వాసుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. అందరూ ఇంటి పట్టునే ఉన్న సమయంలో సర్పాలు వాహనాల్లోకి దూరిపోతున్నాయి. దీనితో నగర వాసులంతా స్నేక్ సేవర్ సొసైటీ నిర్వాహకు కిరణ్ ను 98491 40500 లో సంప్రదిస్తున్నారు. సర్పాల నుంచి ప్రజలను కాపడటం కోసం బాధితులు ఉండే ప్రాంతానికి వెళ్లి రెస్క్యూచేసి సర్పాలను, వాటి నుంచి ప్రజలను కాపాడుతున్నారు. శుక్రవారం సుజాతానగర్, స్టీల్ ప్లాంట్ టౌష్ లో స్కూటర్ లో దూరిన పామును చాకచక్యంగా బయటకు తీసి, దానిని క్షేమంగా అడవిలోకి విడిచి పెట్టారు. నగరపరిధిలో ఏ సమయంలోనైనా తమను సంప్రదించవచ్చునని స్నేక్ సేవర్ కిరణ కోరుతున్నారు.

Visakhapatnam Steel Plant

2021-05-14 04:01:49

మిడ్వెస్ట్ గ్రానైట్స్ సహాయం అభినందనీయం..

కరోనా బాధితులను ఆదుకునేలా సేవా గుణంతో ముందుకు రావటం గొప్ప విషయమని జిల్లా కలెక్టర్  పోల భాస్కర్ అన్నారు. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకోసం మిడ్వెస్ట్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 25 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ప్రకాశం భవనంలో కలెక్టర్‌కు అందజేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ, తీవ్ర కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్న వారికి ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రస్తుత కష్టకాలంలో దాత లు అందిస్తున్న సహకారం మరువలేనిదని కలెక్టర్ కొనియాడారు. వీరి స్ఫూర్తితో మరింత మంది ముందుకు వచ్చి సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో మిడ్వెస్ట్ గ్రానైట్స్ ప్రైవేటు లిమిటెడ్ యజమాని కొల్లారెడ్డి రామచంద్ర, జనరల్ మేనేజర్ డి.వి. అనిల్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Ongole

2021-05-13 15:47:20

అదనపు టీకాల కోసం ప్రత్యక చర్యలు..

అనంతపురం జిల్లాలో కరోనా నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఇంటింటికి ఫీవర్ సర్వే అనే దానిని నిరంతరం కొనసాగించాలని జిల్లా ఇన్ ఛార్జి మంత్రి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. గురువారం కోవిడ్ -19 (సెకండ్ వేవ్) యొక్క వ్యాప్తి మరియు నియంత్రణపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి వర్యులు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించగా..   డీసీసీబీ బ్యాంకు మీటింగ్ హాలు నుంచి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రా రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే డా.తిప్పేస్వామి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్,  అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ, జిల్లా నోడల్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖా మంత్రి  మాలగుండ్ల శంకర నారాయణ,ఎమ్మెల్సీ శమంతకమణి, గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామి రెడ్డి, మునిసిపల్ చైర్మన్లు తదితరులు వారి వారి ప్రాంతాల నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.  కోవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడానికి  వీలుగా జిల్లాకు మరో 5 టన్నుల ఆక్సిజన్ ను అదనంగా కేటాయించేందుకు  చర్యలు తీసుకుంటామని, ఆక్సిజన్ నిల్వల కోసం అవసరమైతే ట్యాంకర్లను లీజు ప్రాతిపదికన సమకూర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆయన ఆదేశించారు. అనంతపురం జిల్లా కోవిడ్ టాస్క్ ఫోర్సు తోనూ, ప్రజాప్రతినిధులతోనూ గురువారం నాడు ఆయన జూమ్ వీడియో కాన్ఫరెన్స ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ జి. చంద్రుడు జిల్లాలోని పరిస్థితులు, ప్రజలకు కల్పిస్తున్న సేవల గురించి వివరించారు.

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, కోవిడ్ నియంత్రణ చర్యల్లో అధికార యంత్రాగం మరింత చురుకుగా పాల్గొంటున్నారని అభినందించారు. జిల్లా స్థాయిలో కొన్ని కీలకమైన పోస్టుల్లో అధికారులు లేకపోవడం వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను గమనించి, వీలైనంత త్వరగా వాటిని భర్తీ చేయిస్తామన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. అంబులెన్సుల నిర్వాహకులు ఇష్టారీతిన రేట్లు వసూలు చేయకుండా, వారితో సమావేశాలు నిర్వహించి, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ధరలను నిర్ణయించాలని ఈ విషయంలో ఎటువంటి తాత్సారం చేయవద్దని జిల్లా పోలీసులను మంత్రి ఆదేశించారు. డబ్బులు ముఖ్యం కాదని మానవతా థృక్పధం ప్రధానమన్న విషయాన్ని ముఖ్యమంత్రి వైయస జగన్ మోహన్ రెడ్డి గారు పదే పదే చెపుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాగం వ్యవహరించాలన్నారు. దురదృష్ట వశాత్తూ మరణాలు సంభవించిన సందర్భాల్లో  వారి తాలూకు బంధువులు మృత దేహాలని తీసుకెళ్లని పక్షంలో వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించడంలో రాజీ పడవద్దని, ఇప్పటికే పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు, నగర పంచాయితీల కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని ఈ విషయంలో నిర్లిప్తతను సహించబోమని మంత్రి హెచ్చరించారు. కోవిడ్ కేర్ సెంటర్లలో ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్న ప్రజా ప్రతినిధుల సూచనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. స్థానికంగా ఆక్సిజన్ ఉత్పత్తికి అవకాశం ఉన్న వాటికి సంబంధించిన అనుమతులు త్వరగా మంజూరు అయ్యేలా చూస్తామన్నారు. 

జిల్లాలో ఇప్పటికే ఫీవర్ సర్వే జరుగుతున్న తీరును సమీక్షిస్తూ, ఈ రకమైన సర్వేలు నిరంతరం నిర్వహించాలని, ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి జిల్లా మొత్తంలో ఈ రకమైన సర్వే చేపట్టాలని దీనివల్ల ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందడంతో పాటు, వ్యాధి ప్రబలకుండా నియంత్రణ కూడా సులభతరమవుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, ఇతరుల అభిప్రాయాలకు అనుగుణంగా, కోవిడ్ కేర్ సెంటర్లలో ఆక్సిజన్ సదుపాయం, మందుల లభ్యత, డాక్టర్ల పర్యవేక్షణ తదితర అంశాలపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. 

Anantapur

2021-05-13 15:25:48

హామీలన్నీ నెరవేర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే..

ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలిపిన నవరత్నాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె. నారాయణస్వామి పేర్కొన్నారు. గురువారం వెలగపూడిలోని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో వరుసగా మూడవ ఏడాది వై.ఎస్.ఆర్ రైతు భరోసా - పి.ఎం. కిసాన్ పథకం కింద 2021 - 22 సంవత్సరానికి గాను మొదటి విడత లబ్ధిని రైతుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వ విప్ మరియు చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చిత్తూరు శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులుతో కలిసి విలేకరులతో మాట్లాడారు.  
     ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఇందులో భాగంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించడంతో పాటు అధునాతన పద్ధతుల ద్వారా లాభసాటి వ్యవసాయం చేయడం పై అవగాహన కల్పించడం జరుగుతున్నదని తెలిపారు. రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏటా రూ.13,500/- రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతున్నదని, రైతులకు లబ్ధి చేకూరేలా, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ కష్టపడి పని చేస్తున్న జిల్లా యంత్రాంగాన్ని, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని మంత్రి అభినందించారు.
          ప్రభుత్వ విప్ మరియు చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత సువిశాల భారతావనిలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అనేక రాష్ట్రాలలో పరిపాలించారని, రైతును రాజును చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి, మహనీయుడు దివంగత నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి అని, పాత బకాయిలను రద్దు చేసి ఉచిత విద్యుత్ ను ఇస్తూ, 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తూ, రైతు ధైర్యంగా పొలానికి వెళ్ళే పరిస్థితిని తెచ్చిన ముఖ్య మంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అని, ఆ తరువాత ఆ తండ్రి ఆశయాలకు వారసుడిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేను ఉన్నానని, రైతుల కష్టాలను తెలుసుకుని, రైతులకు భరోసాగా ఉంటూ రైతు రాజ్యాన్ని తీసుకుని వచ్చేందుకు ప్రతి ఖరీఫ్ కు, రబీకి సహాయం అందించేందుకు రైతు భరోసా పథకంను అమలు చేస్తూ రైతుల పక్షపాతిగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. 

Tirupati

2021-05-13 15:15:23

ఆరోగ్యశ్రీలో కోవిడ్ కి చికిత్సలు చేయాల్సిందే..

ఆరోగ్య శ్రీ  ఎంపెనల్మెంట్ గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రులలో 50 శాతం మేర ఆరోగ్య శ్రీ, ఈహెచ్ ఎస్ పధకాల క్రింద కోవిడ్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులను ఆదేశించారు. గురువారం ఆరోగ్య శ్రీ పధకం  క్రింద కోవిడ్ రోగులకు చికిత్స అందించే విధంగా తాత్కాలికంగా ఆరోగ్య శ్రీ ఎంపెనల్మెంట్ గుర్తింపు పొందిన 14 ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ టెలికాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు కీర్తీ చేకూరి(అభివృధ్ధి), జి.రాజకుమారి(ఆసరా, సంక్షేమం) పాల్లొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ చికిత్స అందించే విధంగా 14 ప్రైవేట్ ఆసుపత్రులకు తాత్కాలిక ఆరోగ్య శ్రీ ఎంపెనల్మెంట్ గుర్తింపు ఇవ్వడం జరిగిందన్నారు. ఆరోగ్య శ్రీ ఎంపేనల్మెంట్ గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో తప్పనిసరగా 50 శాతం మేర ఆరోగ్య శ్రీ , ఇహెచ్ఎస్ పధకాల క్రింద కోవిడ్ సోకిన వారికి చికిత్స అందించాలన్నారు. ప్రభుత్వ మార్గనిర్దేశాలు పాటించని ఆసుపత్రుల పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో  ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయకర్తలు  డా.పి.రాథాకృష్ణ (కాకినాడ), డా. పి.వి.శ్రీనివాసు (అమలాపురం), డా. పి.ప్రియాంక (రాజమహేంద్రవరం), నోడల్ అధికారులు , ఆరోగ్యశ్రీ టీమ్ లీడర్లు, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

Kakinada

2021-05-13 15:07:56

కోవిడ్ కేంద్రాల్లో వినోద కార్యక్రమాలు..

శ్రీకాకుళం కోవిడ్ కేర్ కేంద్రాల్లో వినోద కార్యక్రమాలనునిర్వహిస్తున్నారు. పాత్రునివలస కేంద్రంలో 817 మంది కోవిడ్ బాధితులు ఉండటంతో వాళ్లందరికీ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ..మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నారు. ప్రతిరోజు యోగా నిపుణులు డాక్టర్ చిలుక లక్ష్మీ కాంత్ నేతృత్వంలో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తుండగా తాజాగా వినోద కార్యక్రమాలు ప్రారంభించారు. జిల్లా జానపద కళారూపాలు -  బుర్రకథ కార్యక్రమంతో దీన్ని ప్రారంభించారు. కోవిడ్ కేర్ కేంద్రంలో అన్ని సదుపాయాలు కల్పిస్తూ చక్కటి పర్యవేక్షణ జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. మంచి వైద్యసేవలు, తాగునీరు, పారిశుద్ధ్యం కల్పిస్తూ మంచి పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతోంది. దీంతోపాటుగా వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వలన మానసిక వినోదం పొంది కోవిడ్ అనే భావన నుండి బయటకు వచ్చి దృఢంగా మారగలరు. కోవిడ్ బాధితులు అనే ఆలోచనతో ఉండకుండా వినోద కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉన్నాయి. వినోద కార్యక్రమాలుగా నిర్వహిస్తున్న కళాజాత కార్యక్రమంలో చారిత్రక అంశాలతోపాటు సామాజిక, సాంస్కృతిక అంశాలను ప్రస్తావిస్తూ కళా బృందాలు చక్కగా వివరిస్తున్నాయి. కోవిడ్ కూడా సాధారణ జ్వరం వంటిదేనని మనం జాగ్రత్తగా ఉంటే మన దారికి చేరదని వివరించడం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ మాస్కు వదల రాదని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రపరచాలని సూచిస్తున్నారు. గత ఏడాది కూడా కళజాత కార్యక్రమాలు నిర్వహించి కోవిడ్ కేర్ కేంద్రంలో కోవిడ్ బాధితులు సాధారణ జీవితం గడిపే విధంగా జిల్లా యంత్రాంగం కృషి చేసింది. ఈ ఏడాది జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశాలకు అనుగుణంగా మరల చేపట్టినట్లు నోడల్ అధికారి కె.రవి కుమార్ తెలిపారు. 

Srikakulam

2021-05-13 14:13:33

ఆ ఇద్దరికే అప్పన్న నిజరూప దర్శనం..

విశాఖలోని సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి(సింహాద్రి అప్పన్న) చందనోత్సవం సందర్భంగా నిజరూప దర్శనం కేవలం ఇద్దరికి మాత్రమే కల్పించనున్నారు. దేవస్థాన ధర్మకర్త సంచయిత, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులకు మాత్రమే కల్పించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక జీఓ జారీచేసింది. కరోనా నేపథ్యంలో స్వామివారి చందనోత్సవం అంతా ఏకాంతంగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి చందనోత్సవం యూట్యూబు ఛానల్ ద్వారా భక్తులు చూసే సౌకర్యం కల్పిస్తున్నారు. ఇతర ఏ వీఐపీలను కూడా స్వామివారి చందనోత్సవానికి అనుమతించవద్దని ఆ జీఓలో పేర్కొనడం విశేషం. స్వామివారికి పట్టు వస్త్రాలను మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి సమర్పిస్తారు. తరువాత జరిగే స్వామివారి పూజలు, అన్ని సేవలు ఏకాంతంగానే జరగనున్నాయి.

Simhachalam

2021-05-13 14:03:51

చిన్నారుల‌కోసం సంర‌క్ష‌ణా గృహాలు..

కోవిడ్  కార‌ణంగా అనాథ‌లుగా మారిన పిల్ల‌ల సంర‌క్ష‌ణ‌కు జిల్లా క‌లెక్ట‌ర్, జిల్లా బాల‌ల సంర‌క్ష‌ణ క‌మిటీ ఛైర్మ‌న్‌ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ చ‌ర్య‌లు చేప‌ట్టారు. దీనిలో భాగంగా 18 ఏళ్ల‌లోపు బాల బాలిక‌ల‌ కోసం వేర్వేరుగా రెండు సంర‌క్ష‌ణా గృహాల‌ను ఏర్పాటు చేశారు. బాలుర‌కు విజ‌య‌న‌గ‌రం కంటోన్మెంటులోని బ్రైట‌ర్ ఫ్యూచ‌ర్ సంస్థ‌లో, బాలిక‌ల‌కు బొబ్బిలి మండ‌లం కారాడ‌లోని స‌న్‌రైజ్ చిల్ట్ర‌న్ హోమ్‌లో వ‌స‌తి క‌ల్పిస్తారు. చంటిపిల్ల‌ల‌ను శిశుగృహాల్లో చేరుస్తారు. కోవిడ్ కార‌ణంగా త‌ల్లితండ్రుల‌ను కోల్పోయి, సంర‌క్ష‌కులు ఎవ‌రూ లేని పిల్ల‌ల‌కు ఈ గృహాల్లో వ‌స‌తి క‌ల్పించి, పునరావాసాన్ని ఏర్పాటు చేస్తారు. అలాగే కోవిడ్ కార‌ణంగా త‌ల్లితండ్రులు ఇద్ద‌రూ ఆసుప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్న స‌మ‌యంలో, సంర‌క్ష‌ణ‌కు ఎవ‌రూ లేని పిల్ల‌ల‌కు కూడా తాత్కాలికంగా ఈ సంర‌క్ష‌ణా గృహాల్లో వ‌స‌తి క‌ల్పిస్తారు. అయితే ఈ గృహాల‌కు వ‌చ్చే పిల్ల‌ల‌కు కోవిడ్ నెగిటివ్ రిపోర్టు త‌ప్ప‌నిస‌రి. జిల్లా బాల‌ల సంక్షేమం, సంస్క‌ర‌ణ సేవ‌లు, వీధిబాల‌ల సంక్షేమ‌శాఖ మ‌రియు మ‌హిళాభివృద్ది, శిశు సంక్షేమ‌శాఖ‌ల సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఈ సంక్షేమ గృహాలు న‌డ‌ప‌డం జ‌రుగుతుంది. జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాల మేర‌కు ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వ‌రి ఈ గృహాల‌ను సంద‌ర్శించి, వ‌స‌తుల‌ను ప‌రిశీలించారు. సంర‌క్ష‌ణ అవ‌స‌రం ఉన్న పిల్ల‌ల‌ను చైల్డ్‌లైన్ టోల్‌ఫ్రీ నెంబ‌రు 1098 లేదా మ‌హిళా హెల్ప్‌లైన్ నెం.181కి ఫోన్ చేసి, ఈ సంర‌క్ష‌ణా గృహాల్లో చేర్చాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ కోరారు.

Vizianagaram

2021-05-13 13:50:52

నెలరోజుల్లో సాధారణ స్థితికి తీసుకురావాలి..

కోవిడ్‌ను కేసుల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌డం ద్వారా నెల రోజుల్లో జిల్లాలో సాధార‌ణ ప‌రిస్థితుల‌ను తీసుకువచ్చేందుకు  కృషి చేయాల‌ని క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్  కోరారు. దీనికోసం గ్రామ‌స్థాయి నుంచి, జిల్లా స్థాయి వ‌ర‌కూ, యంత్రాంగ‌మంతా స‌మిష్టిగా కృషి చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. వైద్యారోగ్య‌శాఖాధికారులు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపిడిఓలు, తాశీల్దార్ల‌తో, క‌లెక్ట‌ర్ గురువారం జూమ్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ముందుగా జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో జ‌రుగుతున్న ఫీవ‌ర్ స‌ర్వే, వేక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను స‌మీక్షించారు.  క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ, నెల రోజుల పాటు ప‌టిష్ట‌మైన కార్యాచ‌ర‌ణ ద్వారా, వ‌చ్చేనెల ఇదే స‌మ‌యానికి కోవిడ్ కేసుల సంఖ్య‌ను రెండంకెల‌కు ప‌రిమితం చేయాల‌న్నారు. దీనికోసం రెండెంచ‌ల వ్యూహాన్ని అమ‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు. ఒక‌వైపు క‌రోనాను క‌ట్ట‌డి చేయడానికి చ‌ర్య‌లు తీసుకోవ‌డం తోపాటు, వ్యాధి సోకిన‌వారికి స‌మ‌ర్థ‌వంత‌మైన చికిత్స‌ను అందించి, పూర్తిగా న‌యం చేయ‌డం మ‌న ల‌క్ష్యాలు కావాల‌ని సూచించారు. ఇది జ‌ర‌గాలంటే, వ్యాధిప‌ట్ల ప్ర‌తీఒక్క‌రిలో అవ‌గాహ‌న పెంచాల‌ని సూచించారు. కోవిడ్ వ్యాధి నియంత్ర‌ణ‌కు కేవ‌లం అవ‌గాహ‌న ఒక్క‌టే మార్గ‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్ విధానం మ‌హారాష్ట్ర‌లో వ్యాధి నియంత్ర‌ణ‌కు మంచి ఫలితాన్ని ఇచ్చింద‌ని, అదే విధానాన్ని ఇక్క‌డ కూడా అమ‌లు చేయాల‌ని సూచించారు. ముందుగా వ్యాధి సోకిన‌వారిని గుర్తించి, వారిని క్వారంటైన్ చేయ‌డం ద్వారా వ్యాధి వ్యాప్తిచెంద‌కుండా అడ్డుకోవ‌చ్చ‌ని, దీనికి ఫీవ‌ర్ స‌ర్వే దోహ‌ద‌ప‌డుతుంద‌ని అన్నారు.

               కోవిడ్ సంక్షోభ స‌మయంలో వివిధ ర‌కాల మోసాలు, దోపిడీ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని, ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని జ‌ర‌గ‌నివ్వ‌కూడ‌ద‌ని కోరారు. మోసాల‌ను అరిక‌ట్ట‌డంలో మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపిడిఓలు క్రియాశీల పాత్ర‌ను పోషించాల‌ని ఆదేశించారు. ప్ర‌యివేటు ఆసుప‌త్రులు, ల్యాబ్‌లు ఇదే అదునుగా రోగుల‌ను దోచుకొనే అవ‌కాశం ఉంద‌ని, దానిపై దృష్టి పెట్టాల‌ని సూచించారు. అలాగే అంబులెన్సులు, టెస్టులు, వేక్సిన్‌లు, ద‌హ‌న కార్య‌క్ర‌మాలు, ర‌వాణా ఛార్జీలకూ కూడా అధికంగా వ‌సూలు చేసే అవ‌కాశం ఉంద‌న్నారు. నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌ను కూడా విప‌రీతంగా పెంచే అవ‌కాశం ఉంద‌ని, వాటిని అరిక‌ట్టాల‌న్నారు. వీట‌న్నిటిపైనా క్షేత్ర‌స్థాయిలో అధికారులు దృష్టిపెట్టి, వాటిని అరిక‌ట్టాల‌ని, ప్ర‌జ‌ల‌కు భ‌రోసాను క‌ల్పించి, ప్ర‌భుత్వ యంత్రాంగంపై న‌మ్మ‌కాన్ని పెంచాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. 

Vizianagaram

2021-05-13 13:43:24