1 ENS Live Breaking News

డ్యూటీలకు రానివారిపై చర్యలు తీసుకోండి..

కోవిడ్ కేర్ సెంటర్లలో కోవిడ్ రోగుల పట్ల సేవాభావం చూపాలని పాడేరు ఐటిడిఏ పీఓ డా. వెంకటేశ్వర్ సలిజామల కెజిహెచ్ లోని వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందిని ఆదేశించారు.  శనివారం పిపిఈ కిట్లుధరించి సీఎస్ఆర్  కోవిడ్ బ్లాక్ లో పర్యటించారు. కోవిడ్ బాధితులను పరామర్శించారు. బాగా చూస్తున్నారా?ఎక్కడ నుంచి వచ్చారు ?ఎన్ని రోజులయ్యిందంటూ కోవిడ్ పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. కెషీట్లులు పరిశీలించి ఆక్సిజన్ స్థాయిలపై ఆరాతీశారు. కరోనా వచ్చినా అదైర్య పడొద్దంటూ పేషెంట్లకు ధైర్యం చెప్పారు.  వైద్యులు ఇచ్చిన మందులు  సమయానికి వేసుకోవాలని సూచించారు. బాధితులకు నాణ్యమైన పోషకాహారం అందించాలన్న ఆయన..భోజనం సరఫరా బాగుందని కోవిడ్ బాధితులు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. షిఫ్టు డ్యూటీ  సహాయ ప్రొఫెసర్ విధులకు హాజరు కాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు హాజరు కాని వైద్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లపై శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ డా.మైథిలి ని ఆదేశించారు. డ్యూటీ వైద్యులు,స్టాఫ్ నర్స్ లు  సక్రమంగా విధులు  నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం శానిటేషన్ చేయాలని చెప్పారు. సూపర్ స్పెషలిటీ వార్డులలో మరుగుదొడ్లు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎఫ్ ఎన్ వోలు,ఎం ఎన్ వోలు శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  సూపరింటెండెంట్ డా.పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.

King George Hospital

2021-05-15 11:42:35

రిషికేశ్ వెళ్ళిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు..

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ  స్వరూపానందేంద్ర, శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర స్వాములు రిషికేశ్ వెళ్ళారు. శనివారం విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి డెహ్రాడూన్ బయలుదేరారు. అక్కడి నుంచి రోడ్డు మర్గం ద్వారా రిషికేశ్ చేరుకున్నారు. చాతుర్మాస్య దీక్ష కోసం  రిషికేశ్ వెళ్ళిన పీఠాధిపతులు అక్కడి గంగాతీరంలో ఉన్న విశాఖ శ్రీ శారదాపీఠం ఆశ్రమంలోనే సెప్టెంబరు నెలాఖరు వరకు బస చేస్తారు. రిషికేశ్ బయలుదేరే ముందు విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలోనే దేవతామూర్తులను దర్శించుకున్నారు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు.  ప్రతిఏటా తన చాతుర్మాస్య దీక్షను పవిత్ర గంగానదీ తీరంలో చేపట్టాలని పీఠాధిపతులు శ్రీ  స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి సంకల్పించారు. ఈ ఏడాది జూలై 24వ తేదీన ప్రారంభమయ్యే దీక్ష సెప్టెంబరు 20వ తేదీ వరకు ఉంటుంది. పీఠం నిర్వహణలోని జగద్గురు ఆదిశంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులు సైతం పీఠాధిపతులతో కలిసి రిషికేశ్ వెళ్లారు. కరోనా ప్రబలకుండా పగడ్బందీగా వేద విద్యార్థులకు రక్షణ చర్యలు చేపట్టారు. పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్స్, మాస్కులు ధరింపజేసి ప్రత్యేక విమానంలో రిషికేశ్ తీసుకెళ్లారు.

Pendurthi

2021-05-15 10:56:00

ఆక్సిజన్ నిల్వ పై తప్పుడు వార్తలు నమ్మొద్దు..

తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, ప్రజలను ఈ విషయమై భయాందోళనలు చెందనవసరం లేదని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్  తెలిపారు.  తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఉందని వస్తున్న వార్తలు అవాస్తవమని, స్విమ్స్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కు కొరత లేదని తెలిపారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి  ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ ద్వారా జిల్లాలోని ఆసుపత్రులలో ఆక్సిజన్ వినియోగం, ఎంత మేరకు ఇంకా అవసరం ఉన్నదనే విషయాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి స్విమ్స్, రుయా ఆసుపత్రులతో పాటు చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వ, సరఫరాకు సంబంధించిన అంశాలను జిల్లా స్థాయిలో కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఆక్సిజన్ రీఫిలింగ్ కేంద్రాల నుండి ఆసుపత్రులకు ఆక్సిజన్ ను సకాలంలో చేరేలా పోలీసు శాఖ  సహకారంతో గ్రీన్ చానల్ ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఈ విషయమై వస్తున్న వార్తలు అవాస్తవమని, ప్రజలు ఈ విషయమై భయపడవద్దని కలెక్టర్ భరోసా ఇచ్చారు.

Tirupati

2021-05-15 10:47:45

104 కాల్ సెంటర్ ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం..

తూర్పుగోదావరి జిల్లాలో 104 కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా డివిజన్ స్థాయిలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జి రాజకుమారి తెలిపారు. శనివారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం కోవిడ్- 19 కమాండ్ కంట్రోల్ రూమ్ లో కాకినాడ  డివిజన్ కు  సంబంధించి మహిళా పోలీసులకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో జేసీ రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసి  మాట్లాడుతూ జిల్లాలో అన్ని డివిజన్లలో  104 కాల్   సెంటర్ వ్యవస్థను ఏర్పాటు  చేయడం ద్వారా తక్కువ సమయంలో ఫిర్యాదులు పరిష్కరించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో రోజుకు అత్యధిక స్థాయిలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆమె తెలిపారు. కొవిడ్ పరీక్షలు, హోం ఐసోలేషన్, కొవిడ్ కేర్ సెంటర్, ఆస్పత్రిలో పడకల లభ్యత తదితర అంశాలపై మహిళా పోలీసులకు 104 కాల్ సెంటర్ కు వచ్చిన ఫిర్యాదులను ఏ విధంగా పరిష్కరించాలో జేసి రాజకుమారి ఈ సందర్భంగా మహిళా పోలీసులకు వివరించారు.  ఈ శిక్షణ కార్యక్రమంలో కాకినాడ రెవిన్యూ డివిజన్ కార్యాలయ పరిపాలన అధికారి, మహిళా పోలీసులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-15 10:25:28

50 ఆక్సిజన్ కాన్సన్ ట్రేట్ లు వితరణ..

విశాఖ  జిల్లాలో  ఆక్సిజన్ కొరతను   నివారించడానికి సురక్ష స్వచ్ఛంద సంస్థ  50 ఆక్సిజన్ కాన్ సన్  ట్రేటర్ లను కె జి హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలి కి   విరాళంగా  అందజేశారు. చైనాలో  తయారైన రూ. 25 లక్షల విలువైన  50 ఆక్సిజన్ కాన్ సన్ ట్రేటర్ లను సురక్ష సంస్థ  కార్యదర్శి నిర్మలా నందా శనివారం నాడు  విశాఖపట్నం  ఆర్డీవో పెంచల కిషోర్ సమక్షంలో  కె జి హెచ్ కు  అందజేశారు. జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తో  సురక్ష సంస్థ అధ్యక్షుడు రాజ్ గొర్ల  ఇంతకు ముందు మాట్లాడి, ఆక్సిజన్  కాన్ సన్ ట్రేటర్ లను అందజేస్తామని  తెలియజేశారని, ఆ ప్రకారమే ఇప్పుడు అందజేస్తున్నామని కార్యదర్శి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

King George Hospital

2021-05-15 09:32:36

విద్యుత్ ఉద్యోగులకు కోవిడ్ వేక్సిన్ వేయాలి..

రాష్ట్రంలోని విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగులందరికీ కోవిడ్ టీకా వేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలాకి శ్రీనివాసరావు చెప్పారు. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో ప్రజలంతా ఇంట్లోనే ఉన్నందు వలన విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుందన్నారు. ఈ సమయంలో విద్యుత్ ఉద్యోగులకు పనికూడా అధికంగా వుంటుందని అన్నారు. ఇలాంటి సమయంలో ఫీల్డుకెళ్లే సిబ్బంది, అధికారులు రక్షణార్ధం ఉద్యోగులందరికీ వేక్సిన్ వేయడం ద్వారా కాస్త భరోసా కలుగుతుందన్నారు. అంతేకాకుండా దైర్యంగా విధులు నిర్వహించడానికి వీలుపడుతుందని వివరించారు. ఈ సాంకేతిక అంశాలను ప్రభుత్వానికి తెలియజేస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్టు చెప్పారు. విధినిర్వహణలో కోవిడ్ తో మ్రుతిచెందిన విద్యుత్ ఉద్యోగులకు రూ.50లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, కోవిడ్ వైరస్ సోకిన సిబ్బంది, ఉద్యోగులు క్రెడిట్ కార్డుపై వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించాలని శ్రీనివాసరావు ఆ లేఖలో పేర్కొన్నట్టు చెప్పారు.

Visakhapatnam

2021-05-15 09:27:00

మత్స్యకార భరోసా రూ.2.95 కోట్లు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద విజయనగరం జిల్లాలోని మత్స్యకారులకు రెండుకోట్ల, 95లక్షల 30వేల రూపాయలు అందించనుందని మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి తెలియజేశారు. శనివారం ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని సముద్రతీర మండలాలైన బోగాపురం, పూసపాటిరేగ ప్రాంతాల్లో 819 బోట్లలో పనిచేసే 2953 మంది లబ్దిదారులకు మత్స్యకార బ్రుతి క్రింద ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున ఖాతాల్లోకి జమ అవుతుందన్నారు. ఈనెల 18వ తేదిన అమరావతిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆన్ లైన్ లో లబ్దిదారాల ఖాతాలోకి నేరుగా నగదు జమ అయ్యేలా ఈ కార్యక్రమాన్ని మీట నొక్కి ప్రారంభిస్తారన్నారు. ఈ మేరకు జిల్లాలోని లబ్దిదారుల జాబితా మొత్తం ఆన్ లైన్ చేసినట్టు డిడి నిర్మల కుమారి వివరించారు. 

Vizianagaram

2021-05-15 09:10:40

8నెలల గర్భిణీ.. ప్రజాసేవకే అన్నపూర్ణ..

ఆమె పేరు అన్నపూర్ణ. సాధాసీదా ఉద్యోగం. కానీ ఆమె అందించే సేవ‌లు మాత్రం ప‌రిపూర్ణం. ప్ర‌స్తుతం ఆమె ఎనిమిదో నెల గ‌ర్భిణి. అయినా ఏమాత్రం వెన‌క‌డుగు వేయ‌కుండా.. అధైర్య‌ప‌డ‌కుండా త‌న క‌ర్తవ్యాన్ని నిర్వ‌ర్తిస్తోంది. క‌రోనాలాంటి విప‌త్క‌ర పరిస్థితుల్లో కూడా త‌న అమూల్య‌మైన సేవ‌లందిస్తూ ప్ర‌శంస‌లు పొందుతోంది. ధైర్యంగా ఉందాం.. క‌రోనాని జ‌యిద్దాం అని అందరిలో స్ఫూర్తి నింపుతున్న ఏఎన్ఎం అన్న‌పూర్ణ విజ‌య‌గాథ ఇది.  అన్న‌పూర్ణ ప్ర‌స్తుతం జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవలందిస్తోంది. వృత్తిపై నిబ‌ద్ధ‌త క‌న‌బ‌రుస్తూ మిగ‌తా వారిలో స్ఫూర్తి నింపుతోంది. రోజూ ఉద‌యమే కార్యాల‌యానికి రావటం.. త‌నకి అప్ప‌గించిన ప‌ని చేయ‌టం ఈమె ఆన‌వాయితీ. ప్ర‌స్తుతం పీహెచ్‌సీకి వ‌స్తున్న క‌రోనా రోగుల‌కు కూడా ఈమె సేవ‌లందించ‌టం హ‌ర్ష‌ణీయం. గ‌ర్భిణి కావ‌టంతో క‌రోనా విధులకు వెళ్లొద్ద‌ని వైద్యులు చెప్పినా.. త‌న ప‌ని తాను చేసుకుపోతోంది. త‌గిన‌ జాగ్ర‌త్తలు తీసుకొంటూ సాధార‌ణ రోగుల‌తో పాటు క‌రోనా రోగుల‌కు కూడా సేవ‌లందించ‌టం గ‌ర్వ‌కార‌ణం. అంతే కాదు కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో కూడా పాల్గొని వ‌చ్చిన వారికి టీకా వేస్తోంది. అమూల్య‌మైన సేవ‌లందించ‌టం ప్ర‌శంస‌నీయం. 

వైద్యులు విశ్రాంతి తీసుకోమ‌ని చెప్పినా..

అన్న‌పూర్ణ గ‌ర్భిణి కావ‌టంతో విశ్రాంతి తీసుకోమ‌ని వైద్యులు చెప్పారు. మిగ‌తా వారు చూసుకుంటారులే అని సూచించారు. అయినా ఇప్ప‌డు కాకపోతే.. మ‌రింకెప్పుడు సాయ‌ప‌డ‌తామ‌ని అన్న‌పూర్ణ నిర్ణ‌యించుకొంది. సాధార‌ణ రోగుల‌ను త‌న సొంత మ‌నుషుల వ‌లే చూసుకుంటూ సేవ‌లందిస్తోంది. అలాగే క‌రోనా టెస్టులు నిమిత్తం శాంపిల్స్ క‌లెక్ట‌ట్ చేయ‌టం.. వ్యాక్సిన్ వేయ‌టం వంటి ప‌నుల్లో భాగ‌స్వామ్య‌మ‌వుతూ మిగిలిన వారిలో స్ఫూర్తి నింపుతోంది. ఈమె అందించే నిష్ఫ‌క్ష‌పాత సేవ‌ల వ‌ల్ల మాపై కొంచెం ప‌ని భారం త‌గ్గుతోందని తోటి ఉద్యోగులు చెప్ప‌టం... అన్న‌పూర్ణ ప‌నిత‌నానికి నిద‌ర్శ‌నం. 

సేవ చేయ‌టంలో ఏదో తెలియ‌ని ఆనందం

ఎ. అన్న‌పూర్ణ‌, ఏఎన్ఎం, రావాడ రామ‌భ‌ద్రపురం పీహెచ్‌సీ వివిధ రోగాల‌తో ఆసుప‌త్రుల‌కు వ‌చ్చే వారికి సేవలందించ‌టంలో  ఏదో తెలియ‌ని ఆనందం ఉంటుంది. మ‌న‌మందించే సాయం వారికి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. వాళ్ల‌తో ఆత్మీయంగా మాట్లాడితే చాలా సంతోషిస్తారు. అప్పుడ‌ప్ప‌డు ఇబ్బందులున్నా.. క‌రోనా లాంటి స‌మ‌యంలో కూడా సేవ‌లందిస్తున్నందుకు లోలోప‌ల చాలా గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంటిలో వాళ్లు, తోటి ఉద్యోగులు నాకు అండ‌గా ఉండ‌టంతోనే ఇదంతా సాధ్య‌ప‌డింది. మా ఉన్న‌తాధికారులు ఎప్పడూ ధైర్యం చెబుతూ నా పనిలో సాయ ప‌డ‌తారు. నాకు అండ‌గా నిలుస్తున్నారు. వారికి నా ధ‌న్య‌వాదాలు.

Jiyyammavalasa

2021-05-15 06:13:10

ఈ కరోనాలో వైద్యుల పాత్ర చాలా కీలకం..

వైద్యులు కోవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా మాత్యులు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) వైద్యులకు దిశా నిర్దేశం చేశారు.  కె.జి.హెచ్.లోని కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న సేవలు, అడ్మిషన్లు, పడకలు, ఆక్సిజన్ సరఫరా, ప్రస్తుతం వున్న  వైద్యులు, తదితర సిబ్బంది, మందులు, తదితర అంశాలపై ఆయన జిల్లా ఇన్ చార్జ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రత్యేక అధికారి జి. సాయి ప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం. వేణు గోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, కె.జి.హెచ్. వైద్యులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహిచారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పడకలు, ఆక్సిజన్ మేనేజ్ మెంట్ కు ఒక్కొక్క నోడల్ అధికారి ఉండాలన్నారు.  ఆసుపత్రిలో అవసరమైన ప్రతీ పేషెంట్ కు ఆక్సిజన్ సరఫరా ఖచ్చితంగా జరగాలని ఆయన ఆదేశించారు.  వైద్యులు, నర్సులు పేషెంట్ల బాగోగులు తెలుసుకొని ధైర్యం చెప్పాలన్నారు.  వారి సేవలు సి.సి. కెమేరాల్లో కె.జి.హెచ్. పర్యవేక్షకులు డా. మైథిలి పరిశీలించాలని ఆదేశించారు.  ఆక్సిజన్ సరఫరా ఆగకుండా నిరంతరాయంగా జరగాలని, సరఫరా స్థాయిని గమనించి మరో ట్యాంకర్ రప్పించాలన్నారు. ఆక్సిజన్ వృధా కాకుండా, వాడకంపై పేషెంట్లకు కూడా అవగాహన కల్పించాలన్నారు. ఆక్సిజన్ సరఫరాకు అవసరమైన సాంకేతిక సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.  ఆహారం నాణ్యతను మరింత పెంచాలన్నారు.  వైద్యులు మరింత శ్రమించి మానవతా దృక్పదంతో  సేవ చేయాలన్నారు..  డ్యూటీలో ఉన్న వైద్యులు, సిబ్బంది భోజనాలకు ఇళ్లకు వెలితే సమయం వృదా అవుతుందని, పేషెంట్లకు ఇచ్చే భోజనాలనే చేయాలని చెప్పారు. ఆసుపత్రుల వారీగా ఆక్సిజన్ మేనేజ్ మెంట్, తదితర అంశాలపైన వివరాలు తెలిపాలన్నారు.  కోవిడ్ విధుల్లో ఏ ఒక్కరూ నిర్లక్ష్యం, అలసత్వం కూడదన్నారు. కోవిడ్ తో కెజిహెచ్ కు వచ్చే ఏ పేషెంటుని వేచి ఉంచ వద్దని, అడ్మిషన్ చేయించుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో సంబంధిత అటెండెంట్ కు పేషెంటు యొక్క సమాచారంను హెల్ప్ డెస్క్ అందించాలన్నారు.  రెమిడెసివర్ పేషెంట్లకు అందేలా చూడాలని చెప్పారు.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల నుండి కెజిహెచ్ కు మెరుగైన వైద్యం కోసం వస్తారని,  వైద్యులు మరింత అంకిత భావంతో పనిచేసి, ప్రతి ఒక్క పేషెంటుకు పూర్తిగా వైద్య సేవలు అందించి పూర్తి ఆరోగ్యంగా కోలుకొని ఇంటికి పంపాల్సిన బాధ్యతను వైద్యులు తీసుకొని కెజిహెచ్ కు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు.  నోడల్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి గతంలో ఉన్న సమస్యలు తిరిగి పునరావృతం కాకుండా చూడాలన్నారు.   కెజిహెచ్, విమ్స్, చెస్ట్, ఇ.ఎన్.టి. ఆసుపత్రులు వారీగా పడకలు, ఆక్సిజన్ సరఫరా, వైద్యులు, సిబ్బంది, తదితర అంశాలపై ఆయన సమీక్షించి ఆసుపత్రుల్లో ఉన్న సమస్యలను గూర్చి అడిగి తెలుసుకున్నారు.  
జిల్లా ఇన్ చార్జ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ జ్ఞానాపురంలో ఉన్న అంత్యక్రియల షెడ్లు మరిన్ని తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసేందుకు జివిఎంసి కమీషనర్ తో మాట్లాడి పెంచాలని జెసిలకు సూచించారు.  మరణించిన తర్వాత అంత్యక్రియలకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు.  ఆసుపత్రుల్లో ఉన్న పేషెంట్ల సమాచారం బందువులకు తెలియజేయాలని ఆదేశించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ కెజిహెచ్ లో సూపరింటెండెంట్ కు సహాయంగా మరొకరిని నియమించాలని ప్రత్యేక అధికారి జి. సాయి ప్రసాద్ కు సూచించారు.  శానిటేషన్ సిబ్బందికి జీతాలు విషయమై మంత్రి దృష్టికి తీసుకురాగా ఇప్పటికే ఈ సమస్యను పరిష్కరించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.  
 కోవిడ్ ప్రత్యేక అధికారి జి. సాయి ప్రసాద్ మాట్లాడుతూ బెడ్ మేనేజ్ మెంట్, అడ్మిషన్లకు వచ్చే పేషెంట్లకు సమాధానం చెప్పేందుకు ఒక ప్రొఫెసర్ ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.  ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ఇపిడిసియల్ సిఎండి నాగలక్ష్మిని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఆక్సిజన్ మేనేజ్ మెంట్, ఆక్సిజన్ వృధాగా కాకుండా ఎఎంసి ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, ఎపిఎంఎస్ఐడిసి ఇఇ డి.ఎ.నాయుడు లు చూస్తారని తెలిపారు.  పేషెంట్లతో ఇంటరాక్షన్, తదితర విషయాలపై ఆయన మాట్లాడారు.  అంతకు ముందు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవలు, పడకలు, ఆక్సిజన్ సరఫరా, తదితర విషయాలపై వివరించారు.    
  ఈ సమావేశంలో ఎ.పి.ఇ.పి.డి.సి.ఎల్. సిఎండి నాగలక్ష్మి, ఐటిడిఎ పి.ఓ. ఎస్. వెంకటేశ్వర్, ఎఎంసి ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, కె.జి.హెచ్ సూపరింటెండెంట్ డా. మైథిలి, డిఎంహెచ్ఒ సూర్యనారాయణ, డిఆర్డిఎ పిడి వి. విశ్వేశ్వరరావు, విమ్స్ డైరక్టర్ రాంబాబు, చెస్ట్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్, ఇఎన్ టి సూపరింటెండెంట్, తదితర వైద్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
  అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) విలేఖరులతో మాట్లాడుతూ కెజిహెచ్ లో మొత్తం 840 పడకలు ఉన్నాయని, 1500 మంది వరకు వివిధ సిబ్బంది సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.  కోవిడ్ నివారణకు సిబ్బంది కొరత ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో తగు చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.  కెజిహెచ్ వరకు 18 టన్నుల ఆక్సిజన్  అవసరం అవుతుందన్నారు.  శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాల నుండి వివిధ వైద్య సేవలు నిమిత్తం కెజిహెచ్ కు వస్తారని అలాంటి వారికి వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఆసుపత్రికి తగినన్ని నిధులు ముఖ్యమంత్రి కేటాయించినట్లు ఆయన వివరించారు.  పడకల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు.  అంత్యక్రియల ప్లాట్ ఫారంలు పెంచమని తెలియజేసినట్లు పేర్కొన్నారు.  

King George Hospital

2021-05-14 15:06:11

త్వరలోనే అందుబాటులోకి తాత్కాలిక ఆసుపత్రి..

తాడిపత్రి సమీపంలో అర్జాస్ స్టీల్ వద్ద ఏర్పాటు చేస్తున్న 500 ఆక్సిజన్ పడకల తాత్కాలిక ఆసుపత్రి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నిర్ణీత సమయానికి ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టరును మరియు సంబంధిత అధికారులను అదేశించారు. నేటి నుంచి పదిరోజుల్లో ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలన్నారు. ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారిగా ఆనంతపురము ఆర్డీవో గుణ భూషణ్ రెడ్డిని నియమించారు. రేయింబవళ్లు నిర్మాణ పనులు కొనసాగేలా చూడాలని అవసరమైతే మరింత మంది సిబ్బందిని నియమించుకోవాలన్నారు. పర్యవేక్షణ అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాడిపత్రి వద్ద తాత్కాలిక ఆసుపత్రి నిర్మిస్తున్నామన్నారు. పేరుకు మాత్రమే ఇది తాత్కాలిక ఆసుపత్రి అని, ఒక పూర్తిస్థాయి ఆసుపత్రిలో ఉండే అన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు. వైద్యులు, నర్సులు, కోవిడ్ ను ఎదుర్కొనేందుకు మందులు, కోవిడ్ బాధితులకు భోజనం-నీటి వసతి, శౌచాలయాలు, వైద్య సిబ్బందికి కావాల్సిన వసతి సౌకర్యాలు అన్నీ ఉండనున్నాయన్నారు. కోవిడ్ ను ఎదుర్కొనేందుకు ఖర్చుకు వెనకడకుండా ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం పనిచేస్తున్నాయన్నారు. ఈ పర్యవేక్షణలో జిల్లా కలెక్టరుతో పాటు జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్(రెవెన్యూ), ట్రైనీ కలెక్టర్ సూర్య తేజ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 

Tadipatri

2021-05-14 15:00:04

ప్రణాళికా బద్దంగా కోవిడ్ వ్యాక్సినేషన్..

కోవిడ్ నుంచి రక్షణ కల్పించేందుకు  జిల్లాలో 2వ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం నుంచి జిల్లాలో కోవిషీల్డ్ తో బాటు కొవేక్షిన్ టీకా కూడా వేయడం జరుగుతుందని తెలిపారు. కోవెక్సిన్ రెండో డోసు కోసం ఇటీవలే జిల్లా వ్యాప్తంగా  23 కేంద్రాలను, కోవిషీల్డ్ కోసం 43 కేంద్రాలను పాఠశాలల్లో కొత్తగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా కేంద్రాలలో శనివారం వేక్సిన్ వేయడం జరుగుతుందని తెలిపారు. నిపుణుల కమిటీ ను సంప్రదించిన తరువాత కేంద్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషన్ కాల వ్యవధిని తాజాగా పెంచిందన్నారు.  దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ కోవిషిల్డ్ కు  12 -16 వారాల కాలవ్యవది మధ్య,  అలాగే కోవాక్సిన్  కు 4 వారాలు దాటిన వారు 2వ డోస్ వేసుకోవాలన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా  కోవిన్ సాఫ్ట్ వేర్ ను మార్పు చేసి తిరిగి ఈ నెల  15వ తేదీ ( శనివారం) నుండి జిల్లాలో 2వ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.  ఏ రోజు ఎవరికి టీకా వేస్తారో , ఏ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలో..  నిర్దిష్టంగా 24 గంటల ముందే ఫోను కాల్, ఎస్.ఎం.ఎస్. ద్వారా..   జిల్లా యంత్రాంగం సమాచారం అందిస్తుందన్నారు. ఆలాగే వాలంటీర్లు, ఆశా వర్కర్ల ద్వారా  వాక్సినేషన్ స్లిప్ ను  అందచేయడం జరుగుతుందన్నారు.  సదరు సమాచారం అందుకున్న వారే సంబంధిత ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి   సంయమనం, సామాజిక, భౌతిక దూరం పాటిస్తూ.. ఫేస్ మాస్కులు, ధరించి.. స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ  టీకాలు వేయించుకోవాలన్నారు.  మిగిలిన వాళ్లకు అవకాశం వచ్చేంతవరకు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సదరు సమాచారం అందుకున్న వారే వ్యాక్సినేషన్ కేంద్రానికి హాజరవ్వాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ కోవిషీల్డ్ వేసుకొని 84 రోజులు, కోవెక్సిన్ వేసుకొని 28 రోజులు దాటిపోయినవారికి, సమాచారం రాకపోయినప్పటికీ, వేక్సిన్ కేంద్రానికి వెళ్లవచ్చని సూచించారు.

Vizianagaram

2021-05-14 14:52:48

మ‌నోధైర్య‌మే..మ‌హాబ‌లం..

మందులు క‌న్నా.. మాత్ర‌ల క‌న్నా.. మ‌నోధైర్య‌మే గొప్ప‌ది.. దాన్ని కోల్పోకండి.. ధైర్యంగా ఉండండి.. అంటూ క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ క‌రోనా రోగుల‌కు ధైర్యం చెప్పారు. వారిలో ఆత్మ‌విశ్వాసం నింపేందుకు ప్ర‌య‌త్నించారు. మీకేం కాదు.. మీ వెంట మేమున్నాం అని భ‌రోసా ఇచ్చారు. జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల్లో మ‌నోధైర్యం నింపేందుకు క‌లెక్ట‌ర్ శుక్ర‌వారం జూమ్ యాప్ ద్వారా వారితో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని మ‌హారాజా, మిమ్స్ ఆసుప‌త్రుల్లో కోవిడ్‌ చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య‌సేవ‌లు, భోజ‌న వ‌స‌తి, టాయిలెట్ల ప‌రిశుభ్ర‌త త‌దిత‌ర అంశాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయా ఆసుప‌త్రుల్లోని వార్డుల్లో వైద్య సేవ‌లందిస్తున్న వైద్యుల సాయంతో చికిత్స పొందుతున్న రోగుల‌తో మాట్లాడారు. ముందుగా స్థానిక మ‌హారాజ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఎం. జ‌గదీష్‌, హ‌రిదుర్గ‌, మ‌రొక మ‌హిళ‌తో కాసేపు మాట్లాడారు. అక్క‌డ అందుతున్నసేవ‌ల‌పై ఆరా తీశారు. టాయిలెట్లు శుభ్రంగా ఉండ‌టం లేద‌ని ఒక వ్యాధిగ్ర‌స్తురాలు తెలుప‌గా వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ డా. సీతారామ‌రాజుని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. అనంత‌రం మిమ్స్ ఆసుప‌త్రిలో ఉన్న మ‌రో ముగ్గురు రోగుల‌తో మాట్లాడి అక్క‌డ ప‌రిస్థితిని స‌మీక్షించారు. చిన్న పిల్ల‌ల వార్డులో ఉన్న డా. అనూష శ్రీ‌ని అక్క‌డ వ‌స‌తుల గురించి అడిగి తెలుసుకున్నారు. మందులు ఇండెంట్ ప్ర‌కారం రావ‌టం లేద‌ని ఆమె చెప్ప‌గా ఉన్నతాధికారుల‌తో మాట్లాడి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుతామ‌ని జేసీ మ‌హేష్ కుమార్ బ‌దులిచ్చారు. అలాగే వైద్యులు రోజూ వ‌చ్చి బోర్లా ప‌డుకోబెడుతున్నారా అని మిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎన్‌. త్రినాథ్‌ని అడిగి తెలుసుకున్నారు. అక్క‌డ అందుతున్న సేవ‌లు ఎలా ఉన్నాయ‌ని ఆరా తీశారు.

కాన్ఫ‌రెన్స్‌లో కలెక్ట‌ర్‌, జేసీలతోపాటు డీఎం & హెచ్‌వో పి. ర‌మ‌ణ కుమారి, డీసీహెచ్ఎస్ నాగ‌భూష‌ణ‌రావు, మ‌హారాజ జిల్లా ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ డా. సీతారామ‌రాజు, మిమ్స్ డైరెక్ట‌ర్ డా. భాస్క‌ర రాజు, వైద్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-14 14:20:41

దాతలు మరింతగా ముందుకి రావాలి..

కోవిడ్ రెండోద‌శ ఉద్ధృతి నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు ఆప‌న్న‌హ‌స్తం అందించ‌డం సామాజిక బాధ్య‌త‌గా భావించి జిల్లాలోని ప‌లు వ్యాపార, వాణిజ్య సంస్థ‌లు ముందుకొచ్చి జీజీహెచ్‌లో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం అభినంద‌నీయ‌మ‌ని, ఇదే స్ఫూర్తితో మ‌రికొంత‌మంది దాత‌లు ముందుకొచ్చి కోవిడ్ నివార‌ణ‌, నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌కు స‌హ‌క‌రించాల‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ పిలుపునిచ్చారు. శుక్ర‌వారం సాయంత్రం కాకినాడ జీజీహెచ్‌లో దేవీ ఫిష‌రీస్ లిమిటెడ్ ప్ర‌తినిధులు.. మంత్రి వేణుగోపాల‌కృష్ణ‌, క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి, జేసీ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ‌, జేసీ (డీ) కీర్తి చేకూరి త‌దిత‌రుల చేతుల మీదుగా దాదాపు రూ.21 ల‌క్ష‌ల విలువైన వైద్య సామాగ్రిని జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డా. ఆర్‌.మ‌హాల‌క్ష్మికి జేశారు. అదే విధంగా రిల‌యెన్స్ ఇండ‌స్ట్రీస్ రూ.35 ల‌క్ష‌ల వ్య‌యంతో ఏర్పాటు చేసిన ప‌ది కేఎల్ సామ‌ర్థ్య‌మున్న ఆక్సిజ‌న్ ట్యాంక్‌ను, ఈఎన్‌టీ బ్లాక్ వ‌ద్ద ఆధునికీక‌రించిన ట్ర‌యాజ్ సెంట‌ర్‌లోని 24 ప‌డ‌క‌ల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్ర‌స్తుతం దేశ‌మంతా కోవిడ్ భ‌యాందోళ‌న‌ల‌తో ఉంద‌ని, ఇలాంటి ప‌రిస్థితిలో గౌర‌వ ముఖ్య‌మంత్రి ఆదేశాల‌కు అనుగుణంగా అత్య‌ధిక జ‌నాభా గ‌ల జిల్లాలో అధికార యంత్రాంగం ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ‌తో కోవిడ్ క‌ట్ట‌డికి, రోగుల‌కు మెరుగైన వైద్య స‌హాయం అందించేందుకు కృషిచేస్తోంద‌ని పేర్కొన్నారు. 24X7 ప‌నిచేస్తూ ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితినైనా ఎదుర్కొనేలా వైద్య‌, ఆరోగ్య శాఖతో పాటు వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది కృషిచేస్తున్నార‌న్నారు. జీజీహెచ్‌లో ఇప్ప‌టికే 20 కేఎల్ స్టోరేజ్ సామ‌ర్థ్య‌మున్న ఆక్సిజ‌న్ ట్యాంక్ ఉంద‌ని, ప్ర‌స్తుతం మ‌రో ప‌ది కేఎల్ సామ‌ర్థ్యమున్న ట్యాంక్ అందుబాటులోకి రావ‌డం వ‌ల్ల ఆసుప‌త్రి మొత్తానికి ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని వివ‌రించారు. ఈ కొత్త ట్యాంకును యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ప‌ది రోజుల్లోనే ఏర్పాటుచేయ‌డం అభినంద‌నీయమ‌ని పేర్కొన్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి సైతం జీజీహెచ్‌కు వైద్యం కోసం వ‌స్తున్నార‌ని, ఈ నేప‌థ్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్య‌త (సీఎస్ఆర్‌)గా సంస్థ‌లు ముందుకొచ్చి స‌హాయ‌మందించాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల్లో కోవిడ్‌పై ఉన్న భ‌యాందోళ‌న‌ల‌ను తొల‌గించి, అవ‌గాహ‌న క‌ల్పించి కోవిడ్ మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు స‌హ‌క‌రించాల‌ని మీడియాకు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ సూచించారు.

104 సేవ‌ల విస్త‌ర‌ణ‌కు కృషి: క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి:
క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ రెండోద‌శ ప్రారంభ‌మైన త‌ర్వాత అత్య‌ధికంగా ప్ర‌స్తుతం రోజుకు దాదాపు 3,500 పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని,  దాదాపు 30 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయ‌న్నారు. ఈ నేప‌థ్యంలో అందుబాటులో ఉన్న వ‌న‌రుల‌ను అత్యంత స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని, అవ‌స‌రం మేర‌కు వివిధ ప్రాంతాల్లో కోవిడ్ చికిత్స‌కు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఇటీవ‌ల రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఈఎస్ఐ ఆసుప‌త్రిని సంద‌ర్శించామ‌ని, సోమ‌వారం నాటికి క‌నీసం 50 ప‌డ‌క‌ల‌ను అందుబాటులోకి తేవాల‌నే ల‌క్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని కోవిడ్ ఆసుప‌త్రుల్లోనూ అనుభ‌వ‌మున్న జిల్లాస్థ‌యి అధికారుల‌తో ఇటీవ‌ల త‌నిఖీలు నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని, ప్ర‌ధానంగా ఆరోగ్య‌శ్రీ ద్వారా 50 శాతం ప‌డ‌క‌లు, రెమ్‌డెసివిర్ స‌క్ర‌మ వినియోగం, నాన్ ఆరోగ్య‌శ్రీ రోగుల నుంచి ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల ప్ర‌కారం ఫీజుల వ‌సూలు త‌దిత‌ర అంశాల‌ను క్షుణ్నంగా త‌నిఖీ చేసిన‌ట్లు తెలిపారు. నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌కు  పాల్ప‌డేవారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి వెనుకాడ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. 104 కాల్‌సెంట‌ర్ సేవ‌ల‌కు సంబంధించి రాష్ట్రంలో ఎక్క‌డా లేని విధంగా జిల్లాలో రోజుకు 1500 వ‌ర‌కు ఫోన్‌కాల్స్ వ‌స్తున్నాయ‌ని, తాజాగా 104 సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రించేందుకు వీలుగా మ‌హిళా పోలీసుల‌కు శిక్ష‌ణ ఇచ్చామన్నారు. పాజిటివ్ వ‌చ్చిన ప్ర‌తి రోగితో మాట్లాడి వారి ఆరోగ్య ప‌రిస్థితికి అనుగుణంగా ఐసోలేష‌న్‌కిట్ అందించ‌డం లేదా సీసీసీ, ఆసుప‌త్రి అడ్మిష‌న్ త‌దిత‌ర సేవ‌లు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. డివిజ‌న్ స్థాయిలోనూ కాల్‌సెంట‌ర్ల‌ను ఏర్పాటుచేసి, కోవిడ్ బాధితుల్లో మ‌నోధైర్యం నింపి, వేగంగా కొలుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌లు కోసం వ‌చ్చేవారికి ప‌డ‌క‌లు అందుబాటులో ఉండేలా ఎప్ప‌టిక‌ప్పుడు రోగుల ఆరోగ్య ప‌రిస్థితిని స‌మీక్షించి, ఆరోగ్యం బాగున్న‌వారిని డిశ్చార్జ్ లేదా సీసీసీకి పంపించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. రోగుల బంధువులు కూడా ఈ విష‌యంలో స‌హ‌క‌రించాల‌ని కోరారు. ముంబ‌యి కార్పొరేష‌న్‌లో కోవిడ్ క‌ట్ట‌డి, రోగులకు వైద్య, ఇత‌ర సేవ‌లు అందిస్తున్న తీరును అధ్య‌య‌నం చేశామ‌ని.. సాధ్యాసాధ్యాల‌ను బ‌ట్టి జిల్లాలోనూ ముంబ‌యి మోడ‌ల్ అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. అనంత‌రం జీజీహెచ్‌లో కోవిడ్ సేవ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్న హెడ్‌న‌ర్స్‌, స్టాఫ్‌న‌ర్స్‌, ఫార్మ‌సిస్టు, ఇత‌ర సిబ్బంది మొత్తం 19 మందిని మంత్రి, క‌లెక్ట‌ర్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ శాలువాల‌తో స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ట్రెయినీ క‌లెక్ట‌ర్ గీతాంజ‌లిశ‌ర్మ‌, జీజీహెచ్ కోవిడ్ నోడ‌ల్ అధికారి సూర్య ప్ర‌వీణ్‌చాంద్‌, జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డా. ఆర్‌.మ‌హాలక్ష్మి, ఆర్ఎంవో డా. ఇ.గిరిధ‌ర్‌, ఆసుప‌త్రి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2021-05-14 14:15:46

రేపు కోవ్యాక్సిన్ రెండవ డోసు మాత్రమే..

శ్రీకాకుళం జిల్లాలో శనివారం కోవాక్సిన్ టీకా ఇవ్వనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.సి.చంద్ర నాయక్ మరియు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కే.అప్పారావు సంయుక్తంగా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ కో వ్యాక్సిన్ రెండవ డోసుకు అర్హులైన వారికి మాత్రమే శనివారం రెండవ డోసు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన హెల్త్ వర్కర్లు,  ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45 సంవత్సరాల వయసు పైబడిన సాధారణ ప్రజానీకం ఈ టీకాను తీసుకోవచ్చని వారు కోరారు. టీకాను శ్రీకాకుళం, ఆముదాలవలస, పాతర్ల పల్లి,  పొగిరి, పొన్నాడ, పొలాకి పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో పాఠశాలలు, కళాశాలల్లో టీకా ఇవ్వడం జరుగుతుందని వారు వివరించారు. రోజుకు వంద మందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుందని, ఆ వంద మందికి ముందుగా సమాచారం అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు. కోవిషీల్డు వ్యాక్సిన్ అందుబాటులో లేదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.

Srikakulam

2021-05-14 14:06:25

సోంపేట తహశీల్దార్ సేవలు ప్రశంసనీయం..

సోంపేట తహశీల్దార్ గురు ప్రసాద్ సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. శుక్రవారం సంబంధిత అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరూ మంచి పని చేస్తున్నారని ఆయన పేర్కొంటూ సోంపేట తహశీల్దార్ సకాలంలో స్పందించి అంబులెన్స్ డ్రైవర్ గా మారి ఆస్పత్రికి కోవిడ్ బాధితుని చేర్చడం ఎంతో ఊరట ఇచ్చిన అంశమని అన్నారు. కోవిడ్ లో అందిస్తున్న సేవలు చిరస్మరణీయంగా మిగిలిపోతాయని, ఇతరులకు స్పూర్తిదాయకంగా ఉంటాయని ఆయన అన్నారు. ప్రస్తుతం అందరూ మంచి పనితీరును కనబరుస్తున్నారని అయితే కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించడంలో విఫలమైతే ఇప్పటి వరకు పడిన కష్టం  వృథా అవుతుందని ఆయన అన్నారు. కర్ఫ్యూ సమయంలో కేసులు తగ్గాయని, ఇదే సమయాన్ని అదునుగా తీసుకోవాలని ఆయన సూచించారు.  ప్రతి మండలంలో కనీసం 30, 40 మంది వరకు కరోనా లక్షణాలతో ఉండేవారు ఉంటారని వారిని గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించడంలో విఫలమైతే మిగతా వారికి వ్యాప్తి చేసే అవకాశాలు అధికంగా ఉంటాయని గమనించాలని ఆయన పేర్కొన్నారు. 

ఎక్కడైతే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది కోవిడ్ బాధితులను గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కోవిడ్ సర్వేలియన్స్ అధికారులతో డివిజనల్ అధికారులు సమావేశం నిర్వహించి ఫీవర్ సర్వే పరిస్థితులు పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. ఐదు కంటే తక్కువ కేసులు గుర్తించిన వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అవసరమైతే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి సచివాలయానికి వాలంటీర్లతో మేపింగ్ చేయాలని ఆయన సూచించారు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని ఇంకా మెరుగైన పరిస్థితి కి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జిల్లాలో ఒక్క కేసును కూడా వదిలి పెట్టరాదని జిల్లా కలెక్టర్ చెప్పారు. మండల స్థాయిలో చేపడుతున్న కోవిడ్ సేవలను ప్రజలకు తెలియజేయాలని, తద్వారా ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న అంశాలను గూర్చి అందరికీ అవగాహన కలుగుతుందని అన్నారు.  జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ హొమ్ ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ బాధితులను పరిశీలించాలని అన్నారు. మెడికల్ కిట్లను అందజేయాలని ఆయన సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సబ్ కలెక్టర్  సూరజ్ ధనుంజయ గరోడా, రెవిన్యూ డివిజనల్ అధికారులు ఐ. కిషోర్, టి.వి.ఎస్.జి.కుమార్,  మండల ప్రత్యేక అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-14 13:55:02