1 ENS Live Breaking News

మూడేళ్లు వరుసగా రైతు భరోసా..

వైఎస్ఆర్ రైతు భరోసా  పథకం లో   వరుసగా  3వ ఏడాది  తొలి విడత సాయం కింద రాష్ట్రంలో  52.38 లక్షల మంది  రైతులకు  రూ . 3,928.88 కోట్లు సాయం   అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.  గురువారం  తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి   ఆయన  కంప్యూటర్ లో బటన్ నొక్కి  రైతుల ఖాతాల్లో  నగదు జమ చేసారు.  ప్రస్తుతం  ఖరీఫ్ కు ముందు  మొదటి విడత కింద రూ. 7,500  అందజేస్తున్నామని  తెలిపారు.  రెండవ వాయిదా  రూ. 4000 అక్టోబరు నెలలో , మూడవ వాయిదా రూ.2000 జనవరి నెలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారని  తెలిపారు. విశాఖపట్నం నుంచి  ఈ కార్యక్రమంలో  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు , జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాల రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి  చైర్మన్ చిక్కాల రామారావు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.  అనంతరం  పర్యాటక శాఖ మంత్రి  ముత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ  వ్యవసాయం కొరకు  పెట్టుబడి సాయం కింద  రైతులకు  3వాయిదాలలో  రూ. 13,500 లు వారి ఖాతాలలోకి జమ చేస్తున్నామని తెలిపారు. అలాగే భూమిలేని కౌలు రైతులకు, దేవదాయ భూముల రైతులకు ఇనామ్ భూముల  రైతులకు, ప్రభుత్వ మరియు ఇతర భూములు  సాగు చేయుచున్న వారికి రెండు వాయిదాలలో  అక్టోబరు నెలలో రూ. 11,500/-  మరియు జనవరి నెలలో  రూ. 2000/- రైతు భరోసా కింద మంజూరు చేస్తారని  తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో 3,46,679 మంది రైతులకు  రూ. 260 కోట్లు  మరియు 39,845 మంది అటవీ భూములు కలిగిన  రైతులకు  రూ. 29.88 కోట్లు  మొత్తం రూ. 289.88 కోట్లు  వారి బ్యాంకు ఖాతాలలోకి   జమ చేసామని తెలిపారు. 

Visakhapatnam

2021-05-13 13:09:45

ఎలాంటి విపత్కర పరిస్థితైనా ఎదుర్కొంటాం..

ఎలాంటి విపత్కర పరిస్థితులునైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సన్నద్ధం గా ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు.  గురువారం పర్యాటక శాఖా మాత్యులు  అధికారులు,  వైద్యుల తో జిల్లాలో కోవిడ్ సేవల పై  కలక్టరేట్ సమావేశ మందిరము లో సమీక్ష నిర్వహించారు.   కోవిడ్ పేషెంట్లకు సేవలందించడములో ఎటువంటి సమస్యలు ఉన్నా  తెలియజేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖల తో మాట్లాడి పరి ష్కరిస్తానని తెలియ జేశారు.  ఇప్పటి వరకు ఎంత మందికి వైద్య సేవలు తీసుకుని ఆరోగ్యంగా వచ్చారో ఆ వివరాలను అడిగి తెలుసుకున్నారు.  జిల్లాలో  పడకలు సంఖ్య పెంచడానికి ఉన్న అవకాశాల పై చర్చించారు.  వివిధ ఆసుపత్రులలో పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా విషయంలో జాగ్రత్త గా ఉండాలని 24 ఆక్సిజన్ సరఫరా పేషెంట్లకు అందాలని తెలియజేశారు.  సంబంధిత సాంకేతిక నిపుణులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అప్రమత్తత తో ఉండాలని  ఆదేశించారు. జిల్లాలో ఆక్సిజన్ ఎంత అవసరమో జిఎం రామలింగరాజు ను మంత్రి అడిగి తెలుసుకున్నారు.   ఆసుపత్రులలో వెంటిలేటర్ల వివరాల పై చర్చించి ఆసుపత్రుల వారీగ ఎన్ని పడకలు, ఎన్ని వెంటిలేటర్లు, ఆక్సిజన్ పడకలు సంఖ్య, మొత్తం కేసులు, తదితర వివరాలపై చర్చించారు. 

విమ్స్ ఆసుపత్రి లో వైద్య సేవలు, డాక్టర్లు, నర్సులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సరఫరా తదితర విషయాలపై  వివరాలను డైరక్టరు డా. రాంబాబును అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.  పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. Remidiciver injections ఆసుపత్రులకు సరఫరా చేసిన పిదప వాటిని పేషెంట్లకు వినియోగించడము  పై వివరాల ను ప్రైవేట్ ఆసుపత్రుల నుండి తెప్పించు కోవాలని డ్రగ్ కంట్రోలర్‌ సహాయ సంచాలకులు రజితను ఆదేశించారు.

 Drug ఇనస్పెక్టర్లు అందరూ ' ప్రైవేటు ఆసుపత్రులలో రెమిడిసివర్ ఇంజక్షన్ల వినియోగము పై తనిఖీలు నిర్వహించాలన్నారు. రెమిడెసివర్ వినియోగానికి కొత్తగా నియమాలు ఉన్నాయని, డిఎంహెచ్ఓ ను అడిగి తెలుసుకోవాలని డ్రగ్ కంట్రోల్ ఎడిని జెసి అరుణ్ బాబు చెప్పారు.  కోవిడ్ మెటీరియల్ ప్రస్తుతం ఎంత ఉన్నది, ఇంకా ఎంత అవసరం అవుతుందని డిఎంహెచ్ఓ ను మంత్రి ప్ర శ్నించారు.  డిఎమ్ అండ్ హెచ్ ఒ వివరాలను తెలుపుతూ  కోవిడ్ మెటీరియల్ కొనుగోలుకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.. జిల్లాలో ఇప్పటి వరకు  5.22 లక్షలు మందికి మొదటి డోస్ వేయడమైనదని, 1.58 లక్షల మందికి రెండవ డోస్ వేసినట్లు తెలిపారు. 

అన్ని జాగ్రత్తలు తీసుకొని మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను మంత్రి కోరారు. అంతకు ముందు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి కోవిడ్ నివారణకు జిల్లాలో తీసుకుంటున్న చర్యలను మంత్రికి వివరించారు.  ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం. వేణు గోపాల రెడ్డి, పి. అరుణ్ బాబు, కె జి హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలి, AMC ఫ్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్, Dm&ho డాక్టర్ సూర్యనారాయణ, చాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ కుమార్, P D,, DRDA వి. విశ్వేశ్వరరావు, పలువురు జిల్లా అధికారులు, హాజరయ్యారు. 

            అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విలేఖరులతో మాట్లాడుతూ 79 కోవిడ్ ఆసుపత్రులకు 79 మంది నోడల్ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రులకు వచ్చే కోవిడ్ పేషెంట్లకు అడ్మిషన్లు ఇవ్వాలని  మెరుగైన వైద్యం అందించాలని సూచించినట్లు తెలిపారు.  డాక్టర్లు, నర్సులు, టెక్నికల్ సిబ్బంది, తదితరులు అవసరమైతే నియామకాలు చేసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.  ప్రైవేటు ఆసుపత్రులను డ్రగ్ కంట్రోల్ సహాయ సంచాలకులు చూస్తారని, రెమిడెసివర్ ఇంజక్షన్లు నల్లబజారుకు వెళ్లకుండా చూడాలని ఆదేశించినట్లు తెలిపారు.

జిల్లాలో ఆరోగ్యశ్రీ ఎంప్యానల్ ఆసుపత్రులు 79 ఉన్నాయని, నాన్ ఎంప్యానల్ ఆసుపత్రులు 30 ఉన్నట్లు చెప్పారు. ఈ ఆసుపత్రుల్లో 3 వేల 809 ఆరోగ్య శ్రీ పడకలు ఉన్నాయన్నారు. 108 ఆంబులెన్స్ లు జిల్లాలో 48 తమ సేవలు అందిస్తున్నాయని వివరించారు.

Visakhapatnam

2021-05-13 13:06:53

అన్నంపెట్టే రైతన్నలకు సాగు భరోసా కల్పించాలి..

రాష్ట్ర ప్రజలకు అన్నం పెట్టే రైతన్నలకు సాగులో పెట్టుబడికి భరోసా కల్పించేలా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 2021-22 సంవత్సరానికి “వై.ఎస్.ఆర్. రైతుభరోసా - పి.ఎమ్. కిసాన్” పథకంలో భాగంగా తొలివిడత నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్న సందర్భంగా గురువారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని
జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు  ఎదురవుతున్నా చెప్పిన మాట ప్రకారం ప్రకటించిన సమయానికే రైతులకు ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులను ఉద్థేశించి జిల్లా కలెక్టర్  పోల భాస్కర్
మాట్లాడుతూ జిల్లాలో 4,08,699 మంది రైతులు రూ. 306.55 కోట్ల మేరకు లబ్దిపొందుతున్నారని చెప్పారు. గత రెండేళ్ల కంటే ఈ సారి ఎక్కువ మంది రైతులు ప్రయోజనం పొందుతున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా 2019-20, 2020-21, 2021-22 సంవత్సరాలకు సంబం ధించి ఇప్పటివరకు రూ. 1,046 కోట్లు రైతుల ఖాతాల్లో
జమ అయినట్లు ఆయన వివరిం చారు. సాగులో నష్టాలవల్ల 2014 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ. 3.72 కోట్లు, 2018-19, 2019 ఖరీఫ్ కాలానికి పంటల బీమా ద్వారా రూ. 423.52 కోట్లు, సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతులకు ఖరీఫ్ 2019, రబీ 2019 కాలానికి రూ. 16.2 కోట్లు, 2020 సెప్టెం బరు నుంచి 2021 ఏప్రిల్ మధ్యకాలంలో తుఫానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల
పంటలు నష్టపోయిన రైతులకు రూ. 101.84 కోట్లు కలిపి మొత్తంగా జిల్లాలో రైతులకు ఇప్పటివరకు రూ. 1591.28 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నుంచి అందించినట్లు తెలిపారు. రైతులకు అవసర మైన సేవలను గ్రామస్థాయిలోనే వారికి అందించేలా రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని కలెక్టర్ చెప్పారు. రైతులను సం ఘటిత పరిచి మరింత మేలు చేకూరేలా వారిని రైతు ఉత్పాదక సంఘాలుగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. దీనికి తోడు సాగులో అవసరమైన సలహాలు, సూచనలను వ్యవసాయ నిపుణుల ద్వారా ఇప్పించడానికి జిల్లా కేంద్రంలో ఒక ప్రత్యేక వనరుల
కేంద్రం (డి.ఆర్.సి.) కూడా నెలకొల్పుతున్నామని తెలిపారు. మండల కేంద్రం నుంచి డి.ఆర్.సి.లోని నిపుణులతో రైతులు వీడియో ద్వారా సంభాషించి సందేహాలను నివృత్తి చేసుకునే ఈ సదుపాయాన్ని రాబోయే ఖరీఫ్ సీ జన్ కంటే ముందుగానే అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు. వ్యవసాయ సలహా కమిటీలు కూడా త్వరలోనే ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. అనంతరం రైతు
భరోసా పథకంలో లబ్దిపొందిన రైతులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు  మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసన మండలి సభ్యురాలు  పోతుల సునీత, చీరాల శాసన సభ్యులు  కరణం బలరామక్రిష్ణమూర్తి, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) జె. వెంకట మురళి, డి.సి.ఎమ్.ఎస్. ఛైర్మన్ రావి రామనాథం బాబు, రైతు నాయకులు ఆళ్ల రవీంద్ర రెడ్డి, వ్యవసాయ శాఖ జె.డి. శ్రీరామమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Ongole

2021-05-13 12:47:00

కోవిడ్ టెస్టులు మరింత పెంచాలి..

పాజిటివ్ కేసులు ఎక్కువగా వచ్చిన మండలాల్లో కరోనా పరీక్షలు ఎక్కువ చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. గురువారం అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాజిటివ్ కేసులు ఎక్కువగా వచ్చిన మండలాల్లో పరీక్షలు ఎక్కువ చేయాలని పేర్కొంటూ ఆమదాలవలసపలాసవజ్రపుకొత్తూరు తదితర మండలాల్లో బుధవారం ఎక్కువగా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. జిల్లాలో ఫీవర్ సర్వే త్వరితగతిన నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంకా సర్వే చేయాల్సిన ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ హోమ్ ఐసోలేషన్హోమ్ క్వారంటీన్ కేసులను తప్పక పరిశీలించాలని ఆదేశించారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి మెడికల్ కిట్ లను అందజేసి యాప్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఇప్పటికీ హోమ్ క్వారంటీన్ లో దాదాపు 2300 మందిని సందర్శించనట్లు నివేదికలు చూపిస్తున్నాయని ఆయన పేర్కొంటూ తక్షణం సందర్శించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. హొమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి ఆక్సిజన్ స్థాయి,  పల్స్ స్థాయి పరిశీలించాలని పేర్కొన్నారు. హొమ్ క్వారంటీన్ లో ఉన్న వారికి కనీసం మూడు రోజులకు ఒకసారి సందర్శించాలని ఆయన అన్నారు. పలాససింగుపురంమాకివలసరావాడ తదితర ప్రాంతాల్లో ఎక్కువ మంది హోమ్ క్వారంటీన్ లో ఉన్నట్లు ఆయన చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం పక్కాగా నిర్వహించాలని ఆయన అన్నారు. జిల్లాలో ప్రస్తుతం కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ మాత్రమే జరుగుతుందని ఆయన చెప్పారు. మొదటి డోసు కోవిషీల్డ్ వేసుకున్న తర్వాత కనీసం నలభై రెండు రోజుల తరువాత మాత్రమే కోవిషీల్డ్ వాక్సినేషన్  వేయాలని ఆయన ఆదేశించారు.  56 రోజుల తర్వాత కూడా కోవిషీల్డ్ వేసుకునే అవకాశం ఉందని గమనించాలని చెప్పారు. కోవ్యాక్సిన్ జిల్లాకు త్వరలో వచ్చే అవకాశం ఉందనిమొదటి డోసు వేసుకుని కనీసం 28 రోజులు పూర్తి చేసుకున్నవారు అర్హులని తెలిపారు. కోవాక్సిన్ 42 రోజుల వరకు వేసుకోవచ్చని ఆయన సూచించారు.

        ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడారెవిన్యూ డివిజనల్ అధికారులు ఐ.కిషోర్టి.వి.ఎస్.జి కుమార్వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-13 12:39:35

ముస్లిం జర్నలిస్టులకు శ్రీనుబాబు రంజాన్ తోఫా..

సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ప్రశంసనీయం అని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి,వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు కొనియాడారు. గురువారం విశాఖలో నిరు పేద జర్నలిస్టులకు తన సొంత నిధులతో రూ. 1.60 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. రంజాన్ పర్వదినం సందర్బంగా 15 మంది (ముస్లిం) జర్నలిస్టులకు  రూ.30 వేలు అందజేశారు. ఈసందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ పదేళ్లుగా క్రమం తప్పకుండా ప్రతియేటా రంజాన్ పర్వదినం సందర్భంగా  జర్నలిస్టుల కు తనవంతు  సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రింట్, ఎలక్ట్రా నిక్ మీడియా కు చెందిన జర్నలిస్ట్ మిత్రుల తో పాటు చిన్న పత్రికలు, లోకల్ కెబుల్ టీవీల్లో పనిచేస్ఫో టో, వీడియో జర్నలిస్ట్ లకు తన వంతు సహాాయం దశల వారీగా  అందిస్తున్నామన్నారు. ఒక నిరుపేద కుటుంబానికి 60 వేలు, ఇద్దరు చిన్న పత్రిక ల ఎడిటర్ లుకు పదివేలు చొప్పున సహాయం చేసినట్టు చెప్పారు. కేవలం జర్నలిస్టు కుటుంబాలకు తోడుగా నిలవాలనే సంకల్పంతోనే  ఎందరో దాతల స్పూర్తి గా ఈ సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. గత ఏడాది కరోనా సమయం లో సుమారు రూ.12 లక్షలు వరకు వివిధ వర్గాలకు వేర్వేరు రూపాల్లో సహాయం అందచేశానన్నారు. అప్పట్లోకేవలం నిత్యా వసర వస్తువులు కోసమే 8 లక్షలు ఖర్చు చేశామన్నారు. నిరంతరం ప్రజా సేవలో కొనసాగుతున్న జర్నలిస్ట్ లును ప్రభుత్వం ఆడుకోవాలని గంట్ల కోరారు. అన్ని రకాల  సదుపాయాలు కల్పించి జర్నలిస్టులకు కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. కరోనా సమయంలో జర్నలిస్ట్ లు ఫ్రంట్ లైన్ వర్కర్స్ రూపములో నిరంతరం ప్రజలు కోసం పాటు పడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ముస్లిం జర్నలిస్టులు పాల్గొన్నారు.

Akkayyapalem

2021-05-13 07:16:57

టోకెన్లు ఉన్నవారే 2వ డోసు వేక్సినేషన్ కి వెళ్లాలి..

విశాఖనగరంలో కోవిడ్ వేక్సినేషన్ కు సంబంధించి వార్డు వాలంటీర్లు టోకెన్లు జారీ చేసిన వారు మాత్రమే టీకా కేంద్రాలకు వెళ్లాలని అర్భన్ తహశీల్దార్ జ్నానవేణి కోరుతున్నారు. బుధవారం విశాఖలో ఈ మేరకు మీడియా ద్వారా ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. సీతమ్మధార మండలంలో స్వర్ణభారతి స్టేడియం, అక్కయ్యపాలెం, చినవాల్తేరు ప్రాంతంలో వేక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతుందన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం రెండవ డోసు టీకా మాత్రమే వేస్తున్నందున వారు మాత్రమే టీకా కోసం వెళ్లాలన్నారు. వేక్సినేషన్ కేంద్రాల వద్ద కూడా బౌతిక దూరం పాటిస్తూ, డబుల్ లేయర్ మాస్కులు ధరంచాలని, శానిటైజర్లు వినియోగించాలని తహశీల్దార్ ప్రజలకు సూచిస్తున్నారు. కరోనా వైరస్ భారిన పడకుండా టీకా వేయించుకునే సమయంలో  ప్రభుత్వం నిర్ధేశించిన సూచనలు పాటించడం ద్వారా సజావుగా రెండవ డోసు టీకా వేక్సినేషన్ సజావుగా జరుగుతుందన్నారు. వేక్సినేషన్ కేంద్రాల్లో ప్రభుత్వం అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసినట్టు జ్నానవేణి వివరించారు.

Visakhapatnam

2021-05-12 16:14:21

గురువారం 3వ విడత రైతు భరోసా..

మూడవ సంవత్సరం మొదటి విడత కార్యక్రమము గురువారం జరుగుతుందని వ్యవసాయ శాఖ ఇన్ ఛార్జ్ సంయుక్త సంచాలకులు కె.రాబర్ట్ పాల్ తెలిపారు. బుధవారం ఒక ప్రకటన జారీ చేస్తూ "వై.యస్.ఆర్ రైతు భరోసా -  పి.ఎం.కిసాన్ పథకం" కింద అర్హులైన రైతులకుఅర్హులైన సాగుదార్లకుకౌలు రైతులకు ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పునఅయిదేళ్లలో రూ. 67,500 అందించడం జరుగుతోందని చెప్పారు.  రాష్ట్రములో ఎస్సీఎస్టీబీసీమైనారిటీ కౌలు రైతులకుదేవాదాయఅటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా  రైతు భరోసాగా  సహాయాన్ని అందించడం జరుగుతోందని వివరించారు. రైతు భరోసా సొమ్మును "వై.యస్.ఆర్ రైతు భరోసా పి.ఎం.కిసాన్ పథకం" క్రింద మొదట విడతగా ఖరీప్ పంట వేసి ముందు మే నెలలో రూ.7,500, రెండో విడతగా- అక్టోబరులో ఖరీఫ్ పంట కోతకు లేదా రబీ అవసరాలకు రూ.4000; మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే వేళసంక్రాంతి పండగ సందర్భముగా రూ. 2,000 అందించడం జరుగుతోందని చెప్పారు. 2021-22 సంవత్సరం (మూడవ సంవత్సరం మొదటి విడత)లో పథకం క్రింద మొదటి విడతగా శ్రీకాకుళం జిల్లాలో 3,90,988 రైతు కుటుంబాలకు రూ. 293.24 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇందులో రూ.216.87 కోట్లు వై.యస్.ఆర్ రైతు భరోసా కిందరూ 76.37 కోట్లు పి. ఎం. కిసాన్ పథకం కింద జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

 

ఈ పధకం కింద గత 2 సంవత్సరాలలో శ్రీకాకుళం జిల్లాలో  2019-20 సంవత్సరములో 3.34 లక్షల రైతు కుటుంబాలకు రూ.450.98 కోట్లు ఆర్ధిక సహాయంగా అందిచడం జరిగిందని, 2020 - 21 సంవత్సరంలో 3.81 లక్షల రైతు కుటుంబాలకు రూ.509 కోట్లు ఆర్ధిక సహాయం అందిచడం జరిగిందని ఆయన వివరించారు.

Srikakulam

2021-05-12 15:58:55

ప్రతీ 2గంటలకు ఆక్సిజన్ లెవల్స్ అందించాలి..

ఆక్సిజన్ వార్ రూమ్ ఏర్పాటు చేసి ఆక్సిజన్ నోడల్ అధికారులకు శిక్షణ ఇచ్చాము, భాద్యతతో ఆక్సిజన్ నిల్వలు ప్రతి రెండు గంటలకు తెలిపాలి, భాద్యతతో  ఆక్సిజన్ కొరత వల్ల ప్రాణాలు పోకుండా  కాపాడాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆర్దిఓ కార్యాలయంలో  జిల్లా వ్యాప్తంగా వున్న  ఆక్సిజన్ నోడల్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షకు , అర్బన్ ఎస్.పి. వెంకట అప్పలనాయుడు , జెసి హెల్త్ వీరబ్రహ్మం , సబ్ కలెక్టర్ మదనపల్లి జాహ్నవి  , అర్దిఓ లు తిరుపతి కనక నరసా రెడ్డి, చిత్తూరు రేణుకా పాల్గొన్నారు. 
కలెక్టర్ మాట్లాడుతూ నోడల్ అధికారులకు కేటాయించిన ప్రవేట్, ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ నోటిఫై ఆక్సిజన్ బెడ్లు, ఐసియు బెడ్ల సంఖ్య, అందుబాటులో వున్న బల్క్ సిలిండర్లు వివరాలు మీదగ్గర వుండాలి అన్నారు. ఆసుపత్రుల ఆక్సిజన్ అవసరాలు  మదనపల్లి డివిజన్ లో కనీసం 9 గంటలు, తిరుపతి డివిజన్ లో 6 గంటలు, లిక్విడ్ గ్యాస్ టాంకర్ల  విషయంలో 12 గంటల నిల్వలు వుండేలా చూడాలని అన్నారు. జిల్లాలో లిక్విడ్ గ్యాస్ వాడుతున్నది స్విమ్స్, రుయా, డి.హెచ్.చిత్తూరు, అమర , పి.ఇ.ఎస్. లు మాత్రమేనని అన్నారు.  టాంకర్ల రాక విషయంలో ట్రాకింగ్ వుండాలని, పోలిస్ గ్రీన్ చానల్ ఏర్పాటు తో సాకాలంలో చేరుకునేలా అప్రమత్తం చేయాల్సి వుంటుందని అన్నారు. ఆక్సిజన్ అవసరాలను రాష్ట్ర స్థాయిలో అసిస్టెంట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జి.ఎం.డి.ఐ.సి. ప్రతాప్ రెడ్డి మానిటర్ చేసి లిక్విడ్ గ్యాస్ ట్యాంకర్లు రాక చూస్తారని తెలిపారు. ఏర్పేడు కృష్ణ ఫిల్లింగ్  కూడా విశాఖ నుండి లిక్విడ్ గ్యాస్ ట్యాంకర్లు వస్తే  బల్క్ సిలిండర్లు ఫిల్ చేస్తారు అన్నారు. రేషనైలేజన్ వుండాలి, అత్యవసరం అయితే అందించే విధంగా,  నిరతరం ఆక్సిజన్ నోడల్ అధికారులు అప్రమత్తంగా వుండాలని సూచించారు. డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్ , అర్దిఒలకు అవసరాలు తెపాలని సూచించారు. 
జేసి హెల్త్ , అర్దిఓ తిరుపతి వారు  మాట్లాడుతూ నిన్న ప్రత్యేకంగా డేటా ఎలా సేకరించాలని రియల్ టైం డేటా వుండేలా  శిక్షణ ఇచ్చామని అన్నారు. వెబ్ మాడ్యులర్ సిద్దం అవుతున్నదని డేటా ప్రతి రెండు గంటలకు ఆసుపత్రుల ఆక్సిజన్ లెవల్స్ అప్ లోడ్ జరగాలని అన్నారు. 
అర్బన్ ఎస్.పి. మాట్లాడుతూ లిక్విడ్ గ్యాస్ ట్యాంకర్లు విశాఖ , పెరంబదూరు వచ్చే ట్రాకింగ్ వివరాలు ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ అందించాలని, ఎస్కార్ట్ ఏర్పాటుతో అంతరాయం కలగకుండా చేరేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. 
ఈ సమీక్షలో డి.ఎస్.పి.లు సుధాకర్ రెడ్డి, చంద్ర శేఖర్, ట్రాన్స్ పోర్ట్ అధికారులు,  తహసిల్దార్ విజయసింహా రెడ్డి , ఎ.ఎస్.ఓ.మధుసూదన్ , ఎపిఎం ఐ డి సి , ఈఈ ధనంజయ రెడ్డి, రుయా ఆర్ ఎం ఓ హరికృష్ణ ,ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినెటర్ డా.బాలాంజనేయులు, డ్రగ్ కంట్రోల్ అధికారిని కీర్తన, నోడల అధికారులు గా నియమింపబడిన సి.ఎస్.డి.లు, శ్యామ్ ప్రసాద్, సురేంద్ర, మల్లిఖార్జున రావు, గంగయ్య, మురళి మోహన్,  యుగంధర్ , మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. 

Tirupati

2021-05-12 15:55:04

ఉద్యోగులకు, జర్నలిస్టులకు ప్రత్యేక బెడ్లు..

కోవిడ్ సోకిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయ శాఖ అధికారులు, పోలీసులు, జర్నలిస్టులకు పడకలు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు.   కరోనా బారిన పడిన అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయ శాఖ అధికారులు, పోలీసులు, జర్నలిస్టులకు అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు బత్తలపల్లి ఆర్డీటీ, అనంతపురము సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో ఒక్కో ఆసుపత్రిలో 30 పడకల చొప్పున మొత్తం 60 పడకలు కేటాయించామన్నారు. సెకండ్ వేవ్ లో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, కోవిడ్ విధులు నిర్వహిస్తున్న వీరు కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతుండటంతో ఆసుపత్రులలో వీరికి కొన్ని పడకలు రిజర్వ్ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 
 

Anantapur

2021-05-12 15:51:45

తేరన్నపల్లి చిన్నారులకు సురక్షిత ఆశ్రయం..

కరోనా కేసులు రోజురోజుకూ  పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. తాడిపత్రి మండలం తేరన్నపల్లిలో తల్లిదండ్రులకు కరోనా సోకడంతో, ఇంట్లో ఒంటరిగా వున్న ముగ్గురు పిల్లల బాధ్యతను బాలల సంరక్షణ సమితికి అప్పగించామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. 12 ఏళ్ల వయసు గల బాలుడు, ఐదేళ్లు, మూడేళ్ల వయసుగల బాలికలను ప్రస్తుతం బుక్కరాయముద్రంలోని ఆర్డీటీ సంరక్షణ కేంద్రానికి తరలించామన్నారు. ముగ్గురు పిల్లలకు కరోనా సోకలేదని, సంరక్షణ కేంద్రంలో సురక్షితంగా ఉన్నారని తల్లిదండ్రులకు తెలిపామన్నారు. పిల్లలకు కరోనా సోకకుండా బాలల సంరక్షణ కేంద్రాలు (సిసిఐ) అన్ని జాగ్రత్తలు పాటించాలని ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మిని ఆదేశించారు. పిల్లలకు, సిబ్బందికి అవసరమైన మాస్కులు, శానిటైజర్లు, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. తల్లిదండ్రులు కోవిడ్ బారిన పడితే వారి పిల్లలను సంరక్షించేందుకు  ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అలాంటి బాధిత పిల్లలు ఉంటే 1098, 181 వంటి హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలన్నారు. బాల బాలికలకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని కరోనా రాకుండా పిల్లలను కాపాడుతున్నామని వివరించారు. 

కోవిడ్ 19 వైరస్ సోకి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న లేదా మరణించిన తల్లిదండ్రుల పిల్లలకు తాత్కాలిక వసతి కల్పించడం కోసం రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ,  బాలల సంక్షేమ శాఖ సూచనల మేరకు జిల్లా కలెక్టర్ అనుమతితో  బుక్కరాయ సముద్రం నందుగల ఆర్డీటీ పాఠశాలలో   బాలికలకు, బాలురకు ప్రత్యేకంగా అన్ని సౌకర్యాలతో కూడిన తాత్కాలిక  వసతిని ఏర్పాటు చేశామని ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మి తెలిపారు. 

 సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో బాల, బాలికలకు ప్రత్యేక సంరక్షణ  కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పిల్లల సంరక్షణపై సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఇప్పటికే తగిన ఆదేశాలిచ్చారన్నారు.

Tadipatri

2021-05-12 15:48:40

చోలపాదం నీటి సమస్యకు పరిష్కారం..

విజ‌య‌న‌గ‌రం జిల్లా కొమ‌రాడ మండ‌లం చోల‌పాదం గ్రామంలో త‌లెత్తిన తాగునీటి స‌మ‌స్య ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు జిల్లా గ్రామీణ నీటిపారుద‌ల శాఖ ఎస్‌.ఈ. ర‌వికుమార్ బుధ‌వారం తెలిపారు. గ్రామానికి నీటి స‌ర‌ఫ‌రా చేసే పంపుసెట్‌కు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టామ‌ని, వ‌న‌ధార గ్రామ ప‌రిధిలో ఉన్న‌ పంపుసెట్‌కు ట్రయిల్ ర‌న్ కూడా వేయించామ‌ని చెప్పారు. ఇటీవ‌ల వివిధ ప‌త్రిక‌ల్లో గ్రామ తాగునీటి స‌మ‌స్య‌పై వ‌చ్చిన‌ వార్త‌లపై స్పందించి స్థానిక అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసి స‌మ‌స్య‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించామ‌ని వివ‌రించారు. దీనిపై చోల‌పాదం గ్రామ ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నార‌ని పేర్కొన్నారు.

చోలపాదం

2021-05-12 15:46:28

కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాం..

రాష్ట్రంతో పాటు మొత్తం దేశాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న కోవిడ్ రెండో దశలో బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్నారని, దీన్ని కొనసాగిస్తూ విపత్తును ఎదుర్కొనేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన వర్చువల్ విధానంలో కోవిడ్‌పై ఏర్పాటైన జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ స‌మావేశానికి ఉప ముఖ్య‌మంత్రి శ్రీకాకుళం క్యాంపు కార్యాల‌యం నుంచి పాల్గొన్నారు. తొలుత కలెక్టర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి జిల్లాలో కోవిడ్ కట్టడితో పాటు రోగులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లాలోని అన్ని డివిజన్లలో గత వారం రోజుల్లో పాజిటివిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్టీపీసీఆర్, ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల ద్వారా రోజుకు ఎనిమిది వేల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రధానంగా ఫోకస్డ్ టెస్టింగ్‌పై దృష్టిసారిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ఆక్సిజన్ కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, జీజీహెచ్‌లో ఇటీవల 1.7 కేఎల్ పీఎస్ఏ యూనిట్‌ను ప్రారంభించామని, 10 కేఎల్ సామర్థ్యమున్న ఆక్సిజన్ ట్యాంకును ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. పెద్దాపురంలో రోజుకు నాలుగు కిలోలీటర్ల ఉత్పత్తి సామర్థ్యమున్న ఆక్సిజన్ యూనిట్ పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నామని, ఆంధ్రా పేప‌ర్‌మిల్లులో 15 కేఎల్ సామర్థ్యమున్న ఆక్సిజన్ ప్లాంటు కార్యకలాపాలు రెండు రోజుల ముందు పునఃప్రారంభమైనట్లు తెలిపారు. రాజోలులో నేరుగా గాలి నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే పీఎస్ఏ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నామని.. మోరి, కపిలేశ్వరపురంలోనూ కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ లభ్యతతో వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే 6000 పడకల సామర్థ్యంతో సేవలందిస్తున్న బోడసకుర్రు, కాకినాడ జేఎన్టీయూ, బొమ్మూరు కోవిడ్ కేర్ కేంద్రాలతో పాటు ఎటపాక, రంప‌చోడ‌వ‌రం డివిజన్లలోనూ సీసీసీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అవసరం మేరకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందుబాటులో ఉంచుతామని, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సహాయం చేసేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలు ముందుకొచ్చాయన్నారు. జిల్లాలో ఈ నెలాఖరుకు రెండో డోసు పెండింగ్ ఉన్నవారికి వ్యాక్సినేషన్ పూర్తిచేసేందుకు శాశ్వత టీకా కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామని, వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు టోకెన్లు అందిస్తున్నామని కలెక్టర్ వివరించారు.

          అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న వనరులను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ బాధితులకు వైద్య, ఇతర సేవలు అందేలా చూడాలని, విపత్తును ఎదుర్కోవడమనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్‌రెడ్డి నిరంతరం కోవిడ్ నియంత్రణ, నివారణ చర్యలపై ఆలోచిస్తూ బాధితుల ప్రాణాలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. జిల్లాలో నమోదవుతున్న కేసులకు అనుగుణంగా ఆక్సిజన్ పడకలు, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ సరఫరా సామర్థ్యాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి, సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుంటూ కోవిడ్ నియంత్రణ, నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విషయంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్తోందని, ఎప్పటికప్పుడు లోటుపాట్లను గుర్తించి, పరిష్కరిస్తూ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచించారు. 104 వ్య‌వ‌స్థ ద్వారా బాధితుల‌కు స‌కాలంలో సేవ‌లు అందేలా చూడాల‌ని సూచించారు. వ్యాక్సినేష‌న్‌పై ఎలాంటి అపోహ‌లు వ‌ద్ద‌ని, కేంద్రం నుంచి వ‌స్తున్న డోసులను బ‌ట్టి కార్య‌క్ర‌మం స‌జావుగా సాగుతుంద‌ని  తెలిపారు. కోవిడ్ కట్టడిలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో పాటు జిల్లాస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కీలకంగా వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. కమిటీలో ప్రజాప్రతినిధులు అందించే విలువైన సూచనలను స్వీకరించి, అమలుచేసేందుకు కృషిచేయనున్నట్లు ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. రెమ్‌డెసివిర్‌పై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాల్సి ఉందని, స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం మాత్రమే ఈ ఔషధాన్ని అవసరం మేరకు వినియోగించాలే తప్ప ఇష్టమొచ్చినట్లు ఉపయోగించకూడదని బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం 24X7 పనిచేస్తోందని, తాము కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలేవైనా ఉంటే గుర్తించి, పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. రంపచోడవరం, ఎటపాక డివిజన్లో బాధితుల అవసరాలు తీర్చేలా పీఎస్ఏ ఆక్సిజన్ యూనిట్లు ఏర్పాటుచేస్తే  బాగుంటుందని మంత్రి పేర్కొన్నారు.

      జిల్లాస్థాయిలో పరీక్షలు, బాధితులకు వైద్య సేవలు, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ వినియోగంపై నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఉండటంతో మంచి ఫలితాలు వస్తున్నాయని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా మరింత మందికి సేవలు అందించాల్సి ఉందన్నారు. ప్రజల్లో కోవిడ్‌ను ఎదుర్కోవడంపై మరింత అవగాహన కల్పించాలని ఎంపీ సూచించారు. కోవిడ్ కేర్ కేంద్రాల్లో ఉన్నవారికి సరైన కౌన్సెలింగ్ ఇచ్చి, బాధితుల్లో ధైర్యం నింపి మహమ్మారి నుంచి బయటపడేలా చూడాలని అమలాపురం ఎంపీ చింతా అనూరాధ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో గ్రామ, వార్డు వాలంటీర్లు మరింత కీలకంగా వ్యహరించేలా చూడాలని సూచించారు. క్రిటికల్ కేర్ చికిత్స‌కు ఆక్సిజన్ ఆన్ వీల్స్ కార్యక్రమం సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భర‌త్‌రాం సూచించారు. ఇప్పటికే తాము జగనన్న ప్రాణవాయు రథచక్రాలు వ్యవస్థపై దృష్టిసారించామని తెలిపారు.   ఆధునికీకరణ చర్యల ద్వారా ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ వైద్య సేవలు, ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా, కాన్సంట్రేటర్ల అందుబాటు, అత్యవసర వినియోగ ఔషధాలు; పడకల పెంపు, టెస్టింగ్, వ్యాక్సినేషన్, చమురు సంస్థల సీఎస్ఆర్ కార్యకలాపాల పెంపు, భౌతికకాయాల తరలింపు, గౌరవప్రద అంతిమ సంస్కారాలు తదితరాలపై ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, కొత్తపేట ఎమ్మెల్యే చిర్లజగ్గిరెడ్డి, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, అనపర్తి ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణరెడ్డి, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, మండపేట ఎమ్మెల్యే  వి.జోగేశ్వరరావు పలు సూచనలు చేశారు. వీటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ మురళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులతో పాటు జేసీ (ఆర్) డా. జి.లక్ష్మీశ, జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (డబ్ల్యూ) జి.రాజకుమారి, అమలాపురం స‌బ్‌క‌లెక్ట‌ర్ హిమాన్షు కౌశిక్, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి, ఐటీడీఏ పీవోలు, మునిసిపల్ కమిషనర్లు, వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-12 15:43:38

ఆక్సిజన్ ప్లాంట్ త్వరలో అందుబాటులోకి..

పెద్దాపురం మున్సిపాలిటీ పరిధిలో మూతబడిన ఆక్సీజన్ జనరేషన్ ప్లాంట్ ను పునరుధ్ధరించే విధంగా యుధ్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మిశ పేర్కొన్నారు. ఆక్సీజన్ జనరేషన్ ప్లాంట్ పునరుధ్ధరణ పనులపై జాయింట్ కలెక్టర్ లక్ష్మిశ, ఐటిడిఏ పిఓ ప్రవీణ్ ఆదిత్య, పెద్దాపురం ఆర్.డి.ఓ. ఎస్.మల్లిబాబు, ఎస్.ఇ., ఆర్.డబ్ల్యూ.ఎస్. టి.గాయత్రీ దేవి, ఎస్.ఇ., ఏ.పి.ఎస్.పి.ఇ.పి.డి.సి.ఎల్., వేదాంత, మేఘా ఇంజనీరింగ్ ప్రతినధులతో బుధవారం జూమ్ యాప్ ద్వారా వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ బాధితులకు అవసరమైన ఆక్సీజన్ సామర్ధ్యం పేంచే విధంగా పెద్దాపురంలో మూసివేసిన ఆక్సీజన్ జనరేటర్ ప్లాంట్ పునరుధ్ధరణ కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన సహాయం వివిధ సంస్ధల నుండి తీసుకొనే విధంగా కార్యాచరణ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. 2014 నుండి మూసి వేయాబడిన ఆక్సీజన్ ప్లాంట్ ను పునరుధ్ధరించుకోవడంలో భాగంగా అవసరమైన సాంకేతిక పరికరాలను ఆయా సంస్ధల నుండి రప్పించే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వేతాంద, మేఘా ఇంజనీరింగ్ సంస్ధల సహకారం తీసుకొంటున్నామన్నారు. ప్లాంట్ కు కావలసిన విద్యుత్, నీటి సరఫరాను ఆయా విభాగాల సూపరింటెండెంట్ ఇంజనీర్లు పర్యవేక్షించే విధంగా సూచించడం జరిగిందన్నారు. ఈ పనులు 2 రోజుల్లో పూర్తి చేయాలని ఎస్.ఇ., ఆర్.డబ్ల్యూ.ఎస్., ఎస్.ఇ., ఏపిఎస్.పి.డి.సి. ఇంజనీర్లకు జేసి సూచించారు. వేదాంత ప్రతినిధి ముత్తు కుమార్ స్వామి ప్లాంట్ పునరుధ్ధరణకు అవసరమైన సాంకేతిక నిపుణులను సప్లై చేస్తున్నట్లు జూమ్ విసి ద్వారా తెలిపారు. అదే విధంగా మేఘా ఇంజనీరింగ్ సంస్ధ ప్రతినిధి రాజేష్ మాట్లాడుతూ కిర్లోస్కర్ కంప్రెషన్ సాంకేతిక నిపుణులు అవసరమైన హెల్పర్లు ఏర్పాటు చేసి విధంగా సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు.  జిల్లాలో కోవిడ్ బాధితులకు ఆక్సీజన్ సరఫరా పూర్తి స్ధాయిలో అందించే విధంగా వివిధ శాఖలతో పాటు ఇతర రంగాలకు చెందిన వారి సమన్వయంతో పనులు పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పిఓ ఐటిడిఏ ప్రవీణ్ ఆదిత్య , పెద్దాపురం ఆర్.డి.ఓ. ఎస్.మల్లిబాబు, ప్లాంట్ పునరుధ్ధణ పనులు పర్యవేక్షిస్తున్నారని జేసి లక్ష్మిశ పేర్కొన్నారు. 

Peddapuram

2021-05-12 15:41:33

ప్లాంట్ ను నిత్యం పరిశీలించాలి..

ఆక్సిజన్ ట్యాంకు నుండి ఆయా వార్డులకు సరఫరా అవుతున్న ఆక్సిజన్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని కోవిడ్ ప్రత్యేక అధికారి జి. సాయి ప్రసాద్ కెజిహెచ్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. కెజిహెచ్ లో ఉన్న ఆక్సిజన్ ట్యాంకును జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి తో కలసి ఆయన బుధవారం పరిశీలించారు. ట్యాంకు నుండి ఆయా వార్డులకు సరఫరా అవుతున్నపుడు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఆక్సిజన్ అయిపోతున్న సమయానికి అందుబాటులో  ఉన్న మరో నిల్వ  ట్యాంకుకు అనుసంధానించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు దానిని తిరిగి ఆక్సిజన్ తో నింపాలని చెప్పారు. పేషెంట్లకు ఆక్సిజన్ ఆగిపోకుండా నిరంతరం సరఫరా చేయాలన్నారు.   ఈ పరిశీలనలో కెజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలి, ఆర్. ఎం. ఓ. అంజిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-05-12 15:40:09

2వ డోసుగా కోవీషీల్డ్ వేక్సిన్ మాత్రమే..

విశాఖజిల్లాలో ఎంపిక చేసిన 37 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో రెండవ డోసుగా కోవిషీల్డు వ్యాక్సిన్ మాత్రమే అందిస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పతివాడ సత్యసూర్యనారాయణ తెలియజేశారు. విశాఖలో బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మొదటి డోసు వేసుకున్న వారికి మాత్రమే రెండవ డోసు వేస్తున్నట్టు చెప్పారు. ఎవరికీ మొదటి డోసు వేయడం లేదన్నారు. ఈ విషయాన్ని గమనించి కేవలం టోకెన్లు పొందిన లేదా మెసేజ్ వచ్చిన వారు రెండవ వేక్సిన్ వేయించుకోవడానికి మాత్రమే రావాలని ఆయన కోరారు. చాలా మంది మొదటి డోసు వేయమని కేంద్రాలకు వస్తున్నారని, కానీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రెండవ డోసు మాత్రమే వేస్తున్నట్టు డిఎంహెచ్ఓ తెలియజేశారు. 

Visakhapatnam

2021-05-12 15:38:52