1 ENS Live Breaking News

విశాఖకు ఆక్సిజన్ రైలు నడపాలి..

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఆక్సిజన్‌ రవాణాకు తగినన్ని ట్యాంకర్లు అందుబాటులో లేనందున ఒడిషా నుంచి రాష్ట్రానికి ప్రాణవాయువు తరలించడానికి ప్రత్యేక ఆక్సిజన్‌ రైళ్ళను నడపాలని వైఎస్సార్‌సిపి  పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి రైల్వే బోర్డు చైర్మన్‌ సునీత్ శర్మకు విజ్ఞప్తి చేస్తూ మంగళవారం లేఖ రాశారు.  ఒడిషా నుంచి ఆక్సిజన్ రవాణాలో ఎదురవుతున్న ఆటంకాలు, ఇబ్బందులను ఆయన లేఖలో వివరించారు. సకాలంలో ఆక్సిజన్ రవాణా ద్వారా వేలాది మంది కరోనా రోగుల ప్రాణాలను కాపాడటంలో భారతీయ రైల్వేలు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఆక్సిజన్ రైళ్ళు విజయవంతం అయ్యాయని గుర్తుచేశారు.  రాష్ట్రంలో గత ఏడాది సెప్టెంబర్‌లో నమోదైన అత్యధిక కోవిడ్‌ కేసుల కంటే దాదాపు రెట్టింపు సంఖ్యలో కేసులు ఇప్పుడు రాష్ట్రాన్ని చుట్టుముట్టాయని.. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ అవసరం అపరిమితంగా పెరిగిపోయిందని పేర్కొన్నారు. కరోనా రోగుల ప్రాణాలను కాపాడటంలో ఆక్సిజన్‌ ఆవశ్యకత కీలకంగా మారిందని..  తగినంత ఆక్సిజన్ సరఫరా కేటాయింపు, రవాణా కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సాయంపైనే ఆధారపడిందని విజయసాయి రెడ్డి తన లేఖలో వివరించారు. ఆపత్కాలంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతూ ఇప్పటికే తాను ఢిల్లీలోని అనేక మంది ఉన్నతాధికారుల సహాయాన్ని అర్థించానని చెప్పారు. ఒడిషా నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్‌ రవాణా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ (పరిశ్రమలు, వాణిజ్యం) ఆర్. కరికాల్ వలవన్‌తో ఆక్సిజన్‌ రైళ్ళ నిర్వహణను సమన్వయం చేసుకునేలా రైల్వే జీఎంలకు తగిన సూచనలు చేయవలసిందిగా  విజయసాయి రెడ్డి రైల్వే బోర్డు చైర్మన్‌కు తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Visakhapatnam

2021-05-11 15:05:32

బుధవారం కోవిడ్ వేక్సినేషన్ రద్దు..

విశాఖజిల్లాలో బుధవారం కోవిడ్ వేక్సినేషన్ రద్దు చేసినట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పతివాడ సత్యసూర్యనారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. బుధవారం జిల్లాలో కోవిడ్ వేక్సినేషన్ రద్దు చేసిన అంశాన్ని ప్రజలు గమనించాలని అన్నారు. వేక్సినేషన్ తిరిగి ఎప్పుడు ప్రారంభించేది ప్రకటిస్తామని అంత వరకూ మొదటి టీకా వేయించుకున్నవారు బయటకు రావొద్దని డిఎంహెచ్ఓ కోరారు.  వాలంటీర్లు, వైద్య సిబ్బంది, మీడియా ద్వారా వేక్సినేషన్ ప్రక్రియను తెలియజేస్తామని ఆయన వివరించారు.

Visakhapatnam

2021-05-11 14:56:27

కోవిడ్ పై యుద్దంలో నోడలధికారులే కీలకం..

కోవిడ్ పై యుద్ధం చేస్తున్నామని, నోడల్ ఆఫీసర్లు బాధ్యతగా వ్యవహరించి ఈ యుద్ధంలో ప్రజలను గెలిపించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఏడీసీసీ బ్యాంకులోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం నందు ఆక్సిజన్ సంబంధిత అంశాలపై జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సమీక్ష నిర్వహించారు.ఆసుపత్రుల నిర్వహణలో నోడల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు మరింత బాధ్యతగా వ్యవహరించాలన్నారు. టెక్నికల్ అంశాల గురించి పూర్తి అవగాహన కలిగివుండి అనుకోని పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ విపత్తు సమయంలో కరోనా వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత నోడల్ ఆఫీసర్ల మీద ఉందని గుర్తుంచుకోవాలన్నారు. 

నోడల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు ప్రతి రోజూ ఉదయం ఆసుపత్రి సిబ్బందితో సమావేశం నిర్వహించుకుని ఆరోజు విధులను వివరించాలన్నారు. ఎప్పటికప్పుడు కరోనా గురించి ప్రభుత్వం విడుదల చేస్తున్న నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఐదు గంటలకోసారి ఆసుపత్రిలను సందర్శించి సిబ్బంది విధులను సమీక్షించాలన్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారిని వెంట వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆసుపత్రి సూపరింటెండ్లకు ఆదేశించారు. 

ఆక్సిజన్ నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సర్వజన, సూపర్ స్పెషాలిటీ, క్యాన్సర్ ఆసుపత్రుల నోడల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లను జిల్లా కలెక్టర్ అదేశించారు.  
అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగించుకునేందుకు అవసరమైన కూలీలను నిరంతరం అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వారికి వసతి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. లిక్విడ్ ఆక్సిజన్ ను ఆక్సిజన్ ప్లాంట్ల దగ్గరనుంచి అవసరమైనప్పుడు తెచ్చుకునేందుకు వాహనాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. 

లిక్విడ్ ఆక్సిజన్ పైనే పూర్తిగా ఆధారపడకుండా ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. జీజీహెచ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో వెంటిలేటర్లన్నీ ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్సిజన్ వృథాను తగ్గించేందుకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ మానిటరింగ్ టీములు వెంటనే విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పీవీవీఎస్ మూర్తిని ఆదేశించారు. 

ఆసుపత్రుల్లో కోవిడ్ బాధితుల సహాయకులు ఎక్కువగా ఉంటున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. సహాయకుల సంఖ్య నియంత్రించాలని అదేశించారు.

మెరుగైన వైద్య సేవలందించండి: ఎంపీ తలారి రంగయ్య


సమావేశంలో ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ కరోనా వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు నోడల్ అధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్సిజన్ సరఫరా వినియోగంపై నిరంతరం సమీక్షించుకుంటూ ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాలన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు వార్డులను సందర్శించి కరోనా బాధితులకు మనోధైర్యాన్ని నింపాలన్నారు.

ఆక్సిజన్ మానిటరింగ్ సెల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రుల నోడల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వలు ఏ మేరకు ఉన్నాయి, ఎంత మందికి ఎంత సమయం పాటు అందించగలం, తిరిగి ఖాళీ ఆక్సిజన్ ప్లాంట్లు నింపేందుకు ట్యాంకులు ఏ సమయానికి చేరుకోగలవో నిరంతరం సమీక్షించుకుంటూ ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లిక్విడ్ ఆక్సిజన్ తో పాటు ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉంచిన ఆక్సిజన్ సిలిండర్లను కూడా ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. 


సమావేశంలో  డీఎఫ్ఓ జగన్నాథ్ సింగ్, సర్వజన/సూపర్ స్పెషాలిటీ/క్యాన్సర్ ఆసుపత్రుల నోడల్ ఆఫీసర్లు మరియి సూపరింటెండెంట్లు, డ్రగ్స్ ఏడీ రమేశ్ రెడ్డి, ఏపీ ఎస్ఎమ్ ఐడీసీ ఇంజినీర్లు, ఆనంతపురము ఆర్డిఓ గుణభూషణ్ రెడ్డి, డాక్టర్ నవీద్ తదితరులు పాల్గొన్నారు. 

Anantapur

2021-05-11 14:30:49

కోవిడ్ బాధితులకు మెరుగైన సేవలు..

ఇత‌ర రాష్ట్రాల‌తో పోల్చితే ఇక్కడ కోవిడ్ బాధితుల‌కు మెరుగైన సేవ‌లందించ‌ గ‌లుగుతున్నామ‌ని, మ‌ర‌ణాల రేటును గ‌ణ‌నీయంగా క‌ట్ట‌డి చేయ‌గ‌లిగామ‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం నుంచి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్టర్ల‌తో స్పంద‌న వీడియో కాన్ఫ‌రెన్స్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కోవిడ్ రెండో ద‌శ నివార‌ణ‌, నియంత్ర‌ణ‌, బాధితుల‌కు వైద్య స‌హాయం, న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు; గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు, ఆర్‌బీకేలు త‌దిత‌రాల‌కు శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణాలు; ఖ‌రీఫ్ స‌న్న‌ద్ధ‌త త‌దిత‌ర అంశాల‌పై ముఖ్య‌మంత్రి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ 104 కాల్ సెంట‌ర్ వ్య‌వ‌స్థ చాలా కీల‌క‌మైంద‌ని, వ‌చ్చే ప్ర‌తి కాల్‌కూ సంతృప్తిక‌ర స్థాయిలో స‌మాధాన‌మిచ్చి, వీలైనంత త్వ‌ర‌గా సేవ‌లు అందేలా చూడాల‌న్నారు. కోవిడ్ వైర‌స్ తీవ్ర‌త అధికంగా ఉన్నవారిని ర‌క్షించేందుకు అవ‌స‌ర‌మైన మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, ఒడిశా రాష్ట్రాల్లోని ఎనిమిది పాయింట్ల నుంచి తీసుకొస్తున్నామ‌ని, వేగంగా ఆక్సిజ‌న్‌ను తీసుకొచ్చేందుకు ఖాళీ ట్యాంక‌ర్ల‌ను విమానాల్లో పంపుతున్నామ‌ని వెల్ల‌డించారు. 15 వేల ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లను బుక్ చేశామ‌ని, ఈ నెల చివ‌రి నుంచి వాటి డెలివ‌రీ మొద‌ల‌వుతుంద‌ని, కోవిడ్ కేర్ కేంద్రాల‌కు వీటిని అందించ‌నున్న‌ట్లు తెలిపారు. న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు లేఅవుట్ల‌లో మౌలిక వ‌స‌తుల అభివృద్ధిని వేగ‌వంతం చేసి, ఇళ్ల నిర్మాణాల‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. రైస్‌కార్డు, ఆరోగ్య‌శ్రీ కార్డు, పెన్ష‌న్ కార్డు, ఇళ్ల ప‌ట్టాల‌కు సంబంధించి గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌కు వ‌చ్చే ద‌ర‌ఖాస్తుల‌ను నిర్దేశ ఎస్ఎల్ఏలో ప‌రిష్క‌రించేలా చూడాల‌న్నారు. మే 13న వైఎస్సార్ రైతు భ‌రోసా, మే 18న మ‌త్స్య‌కార భ‌రోసా, మే 25న పంట బీమా ప‌థ‌కం ద్వారా ల‌బ్ధిదారుల ఖాతాల్లో నేరుగా న‌గ‌దు జ‌మ‌చేసే కార్య‌క్ర‌మాల‌కు ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.

East Godavari

2021-05-11 14:29:01

సీసీసీల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి..

తూర్పుగోదావరి జిల్లాలోని జేఎన్‌టీయూ, బొమ్మూరు, బోడ‌స‌కుర్రు కోవిడ్ కేర్ కేంద్రాల్లో ప్ర‌స్తుతం 1369 మంది ఉన్నార‌ని జేసీ (డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి తెలిపారు. మంగళవారం వర్చువల్ విధానలో జెసి మీడియాతో మాట్లాడారు. కోవిండ్ కేర్  కేంద్రాల్లో అవ‌స‌రం మేర‌కు వైద్య సేవ‌లు అందించ‌డంతో పాటు ఆహారం, పారిశుద్ధ్యం విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు విషాదం చోటుచేసుకుంటే భౌతిక‌కాయాన్ని త‌ర‌లించేందుకు జిల్లాలో 32 మ‌హాప్ర‌స్థానం వాహ‌నాలు ఉన్నాయ‌ని, వీటి సేవ‌లు పొందేందుకు పైసా కూడా చెల్లించ‌న‌వ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. గౌర‌వ‌ప్ర‌దంగా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు కూడా ఏర్పాట్లు చేశామ‌న్నారు. ఎవ‌రైనా ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. జిల్లాస్థాయి క‌మాండ్ కంట్రోల్‌రూంకు ఫోన్‌చేసి, ఫిర్యాదు చేయొచ్చ‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) రాజ‌కుమారి సూచించారు.

Kakinada

2021-05-11 14:25:55

మొదటి డోస్ తీసున్నవారికే వ్యాక్సిన్..

ప్ర‌స్తుతం రెండో డోస్ పెండింగ్ ఉన్న‌వారికి మాత్ర‌మే టీకా పంపిణీ చేయ‌నున్నామ‌ని గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. మంగళవారం ఆమె వర్చువల్ విధానంలో మీడియాతో మాట్లాడారు. రోజువారీ వ్యాక్సినేష‌న్‌కు సంబంధించి మీడియా ద్వారా స‌మాచారం ఇవ్వ‌నున్న‌ట్లు జేసీ  తెలిపారు. దాదాపు 67 వేల మందికి రెండో డోస్ పెండింగ్ ఉంద‌ని, ప్రాధాన్య‌త ఆధారంగా వాలంటీర్ల ద్వారా వీరికి టోకెన్లు అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. కోవీషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసును 6-8 వారాల స‌మ‌యంలో వేసుకోవ‌చ్చ‌ని, ల‌బ్ధిదారులు ఈ విష‌యాన్ని గుర్తించాల‌ని సూచించారు. ప్రైవేటు ఆసుప‌త్రుల్లో తొలి డోసు వేసుకున్న‌వారికి ప్ర‌భుత్వ కేంద్రాల్లో రెండో డోసు వేయ‌నున్న‌ట్లు తెలిపారు. వ్యాక్సినేష‌న్‌పై ఏవైనా సందేహాలుంటే గ్రామ‌, వార్డు స‌చివాల‌యాన్ని సంప్ర‌దించాల‌ని సూచించారు. ఆసుప‌త్రుల సామ‌ర్థ్యం, చికిత్సా విధానాల‌కు అనుగుణంగా రెమిడెసివిర్ ఇంజెక్ష‌న్ల‌ను అందిస్తున్న‌ట్లు జేసీ తెలిపారు.

కాకినాడ

2021-05-11 14:25:01

అవ‌స‌రం మేర‌కు ఆక్సిజ‌న్ నిల్వ‌లు..

తూర్పుగోదావరి జిల్లాలో ప్ర‌స్తుతం రోజువారీ మెడిక‌ల్ ఆక్సిజ‌న్ వినియోగం 42-45 కిలో లీట‌ర్లు కాగా.. 85 కిలో లీట‌ర్ల మేర‌కు నిల్వ‌లు ఉన్న‌ట్లు జేసీ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. మంగళవారం జెసి వర్చువల్ విధానంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాకు ఒడిశా, విశాఖ‌ప‌ట్నం నుంచి ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా అవుతోంద‌ని, ఈ ఆక్సిజ‌న్ రీఫిల్లింగ్ ప్ర‌క్రియ‌తో పాటు ఆసుప‌త్రుల‌కు స‌ర‌ఫ‌రా చేయ‌డం, స‌క్ర‌మంగా వినియోగించేలా చూసేందుకు ప్ర‌త్యేక బృందాలు ప‌నిచేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆక్సిజ‌న్‌కు కొర‌త ఉంద‌నే మాట రాకుండా చూస్తున్నామ‌ని, ఇదే స‌మ‌యంలో ఆసుప‌త్రులు ఆక్సిజ‌న్ వృథా కాకుండా చూడాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. జిల్లాలో రైతు భ‌రోసా కేంద్రాలు, ధాన్యం సేక‌ర‌ణ కేంద్రాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తూ రైతుల నుంచి మ‌ద్ద‌తు ధ‌ర‌కు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు. సోమ‌వారం 16,337 ట‌న్నుల మేర కొనుగోలు చేయ‌గా, మంగ‌ళ‌వారం దాదాపు 19 వేల ట‌న్నుల ధాన్యం కొనుగోలు జ‌రిగిన‌ట్లు తెలిపారు. బోండాలు ర‌కం ధాన్యం కొనుగోలులో ఎక్క‌డా స‌మ‌స్య‌లు లేవ‌ని, ఏవైనా సందేహాలు ఉంటే ఆర్‌బీకేలోని ధాన్యం కొనుగోలు స‌హాయ‌కుడిని సంప్ర‌దించాల‌ని సూచించారు. ఖ‌రీఫ్ స‌న్న‌ద్ధ‌త‌లో భాగంగా వారం రోజుల పాటు జిల్లా, డివిజ‌న్‌, మండ‌ల‌, గ్రామ స్థాయి అడ్వ‌యిజ‌రీ క‌మిటీల స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నామ‌ని తెలిపారు. విత్త‌నాలు, ఎరువుల‌ను అవ‌స‌రం మేర‌కు ఆర్‌బీకేల వ‌ద్ద అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు జేసీ డా. జి.ల‌క్ష్మీశ వెల్ల‌డించారు.

Kakinada

2021-05-11 14:20:08

తగ్గుముఖం పడుతున్న కోవిడ్ కేసులు..

కోవిడ్ పాజిటివిటీ త‌గ్గుముఖం పడుతున్న సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని..  ఈ సరళిని మున్ముందు కొన‌సాగేందుకు, రాజీ లేకుండా టెస్టింగ్‌, ప‌డ‌క‌ల సంఖ్య‌, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా సామ‌ర్థ్యాన్ని పెంచ‌డంతో పాటు అందుబాటులో ఉన్న డోసుల‌ను బ‌ట్టి వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని స‌జావుగా నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. మంగ‌ళ‌వారం సాయంత్రం క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి కోవిడ్ నివార‌ణ‌, నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌తో పాటు ధాన్యం సేక‌ర‌ణ‌, ఖ‌రీఫ్ స‌న్న‌ద్ధ‌త‌పై మీడియా స‌మావేశంలో వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ దాదాపు 4,500 వ‌ర‌కు ఉన్న ఆర్‌టీపీసీఆర్ రోజువారీ సామ‌ర్థ్యాన్ని 7,500 వ‌ర‌కు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని, కోవిడ్ ల‌క్ష‌ణాలున్న వారికి మాత్ర‌మే ఫోక‌స్డ్‌గా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. ఆక్సిజ‌న్ ల‌భ్య‌త‌, నిష్ణాతులైన వైద్యులు, ఇత‌ర సిబ్బంది ల‌భ్య‌తను బ‌ట్టి నెమ్మ‌దిగా ఆక్సిజ‌న్ ప‌డ‌క‌ల సంఖ్య‌ను క్రమంగా పెంచుతున్నామ‌ని, రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోని ఆంధ్రా పేప‌ర్ మిల్లుకు అనుసంధానంగా 300-400 ఆక్సిజ‌న్ ప‌డ‌క‌లతో చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు స‌న్నాహ‌కాలు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. పేప‌ర్‌మిల్లులో పున‌రుద్ధ‌రించిన యూనిట్ ద్వారా ఉత్ప‌త్తి అవుతున్న 15 కేఎల్ ఆక్సిజ‌న్‌ను ఈ చికిత్సా కేంద్రానికి అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు. పెద్దాపురంలోనూ ఓ యూనిట్‌ను పున‌రుద్ధ‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, ఇది అందుబాటులోకి వ‌స్తే రోజుకు 480 సిలిండ‌ర్ల మేర ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి జ‌రుగుతుంద‌న్నారు. వ్యాక్సినేష‌న్‌పై ఎలాంటి అపోహ‌లు అవ‌స‌రం లేద‌ని, కేంద్రం నుంచి అందుతున్న డోసుల మేర‌కు జిల్లాలో శాశ్వ‌త కేంద్రాల ద్వారా పంపిణీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. రెండో డోసు ఎక్కువ రోజులు పెండింగ్ ఉన్న‌వారికి తొలుత ప్రాధాన్య‌మివ్వ‌నున్నామ‌ని, వాలంటీర్ల ద్వారా టోకెన్లు పంపిణీ చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ టోకెన్లు లేకుండా ఎవ‌రూ వ్యాక్సిన్ కేంద్రాల‌కు రావొద్ద‌ని సూచించారు. రెండో డోసు పెండింగ్ ఉన్న‌వారికి వ్యాక్సినేష‌న్ పూర్త‌య్యాకే మొద‌టి డోసు పంపీణీ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. రెమిడెసివిర్ ఇంజ‌క్ష‌న్ల‌ను రోగికి ఇచ్చేందుకు స్టాండ‌ర్డ్ ప్రోటోకాల్ ఉంద‌ని, దాని ప్ర‌కారం మాత్ర‌మే ఈ ఔష‌ధం ఇవ్వాల్సి ఉంటుంద‌ని వివ‌రించారు. బ‌య‌ట జ‌రిగే అవాస్త‌వ ప్ర‌చారాల‌ను న‌మ్మి, అన‌వ‌స‌రంగా ఇంజెక్ష‌న్ కోసం వెంప‌ర్లాడ‌టం మంచిది కాద‌న్నారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు అనే తేడా లేకుండా అన్ని కోవిడ్ ఆసుప‌త్రుల్లో మెడిక‌ల్ ఆక్సిజ‌న్ కొర‌త లేకుండా చూస్తున్నామ‌ని, జేసీ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నార‌న్నారు. వివిధ కార‌ణాల వ‌ల్ల బ‌య‌ట నుంచి ట్యాంకుల ద్వారా ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు అవాంత‌రం ఏర్ప‌డిన నేప‌థ్యంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో వినియోగించుకునేందుకు జీజీహెచ్ కాకినాడ‌, జీహెచ్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో మెడిక‌ల్ ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లను సిద్ధంగా ఉంచిన‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. కోవిడ్ చికిత్స కోసం గుర్తింపులేని ఆసుప‌త్రుల్లో చేరొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు క‌లెక్ట‌ర్ సూచించారు. మీడియా ప్రజలకు వాస్తవాలు వివరించి అవగాహన, అప్రమత్తలతో విపత్తును ధైర్యంగా ఎదుర్కోనేలా సమాయత్త పరచాలని, భయాందోళనలు కల్పించ కూడదని కోరారు. 

కాకినాడ

2021-05-11 14:16:53

బుధవారం నుంచి కోవిడ్ వేక్సినేషన్..

విజయనగరం  జిల్లాలో బుధవారం నుంచి వేక్సినేషన్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశించారు. వైద్యారోగ్యశాఖ అధికారులతో మంగళవారం సాయంత్రం టెలికాన్ఫెరెన్స్ నిర్వహించి, వెక్సినేషన్ పై సమీక్ష జరిపారు. ఈ నెలాఖరు వరకు రెండో డోసు మాత్రమే వేయాలని ఆదేశించారు. వెక్సినేషన్ లో వైద్యారోగ్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వేక్సిన్ కేంద్రాలను మండలాలలో పిహెచ్సి ల నుంచి పాఠశాలలకు మార్చినందువల్ల, ఈ విషయాన్ని అందరికి తెలియజెయాలని సూచించారు. వేక్సిన్ కోసం వచ్చేవారికి కేంద్రాలవద్ద ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. లబ్ధిదారులకు ముందుగా ఏఎంఎం ల ద్వారా  సమాచారం ఇచ్చి, వారిని మాత్రమే కేంద్రాలకు రప్పించడం వల్ల, కేంద్రాలవద్ద రద్దీ తగ్గుతుందని, ప్రజలకు ఇబ్బందులు కూడా ఉండవని సూచించారు. జిల్లాలో కోవాగ్జిన్ కోసం 22 కేంద్రాలను, కోవిషీల్డ్ కోసం 42 వేక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ టెలీ కాన్ఫెరెన్సులో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్వీ రమణ కుమారి, డిఐవో డాక్టర్ గోపాలకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-11 14:11:26

నాడు-నేడు పనులు వేగం పెంచాలి..

నాడు - నేడు కింద చేపడుతున్న అభివృద్ధి పనులు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్ లు, గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు, పేదలందరికీ ఇల్లు కింద నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్ లతో రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ 19, ఎన్ఆర్ఈజిఎస్ పనులు, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, డా.వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ లు, వై.ఎస్.ఆర్ జలకళ, వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్ లు, నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పురోగతి,  స్పందన గ్రీవెన్స్ తదితర అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

అనంతపురం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ, తదితరులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ శాఖల కింద చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు. నాడు నేడు కింద ఆయా పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, రైతు భరోసా కేంద్రాలు భవనాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్ లు, గ్రామ సచివాలయ భవనాల నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని ఇంజనీరింగ్ శాఖల అధికారులను ఆదేశించారు.  నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు ఏర్పాటుచేసిన లేఔట్లలో నీటి సౌకర్యం, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు, పెన్షన్ కార్డు, రైస్ కార్డులను నిర్దేశిత సమయంలోపు ఖచ్చితంగా ఇచ్చేలా చూడాలని, అలాగే 90 రోజుల్లోపు దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్లను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా సచివాలయాలకు వచ్చే గ్రీవెన్స్ కు సంబంధించి ఎలాంటి పెండింగ్ ఉంచరాదని, ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ కి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ సీజన్లో కూలీలకు ఉపాధి పనులు ఎక్కువగా కల్పించాలని డ్వామా పిడిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి,  స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు వరప్రసాద్, రవీంద్ర, ఆనంద్, డిఎంఅండ్హెచ్ఓ కామేశ్వర ప్రసాద్, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, ఐసిడిఎస్ పిడి విజయలక్ష్మి, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ నీరజ, డి సి హెచ్ ఎస్ రమేష్ నాథ్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, హౌసింగ్ పిడి చంద్రమౌళి రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-05-11 14:03:52

నా పుట్టిన రోజుకి ఎవరూ రావొద్దు దయచేసి..

తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం శుభాకాంక్షలు స్వయంగా చెప్పడానికి ఎవరూ రావొద్దని ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ విజ్ఞప్తి చేశారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి అధికంగా వున్నందున తనకు శుభాకాంక్షలు వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా తెలియజెస్తే సరిపోతుందని సూచించారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉదృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని,  ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వేడుకలు చేసుకోవడం భావ్యం కాదన్నారు. మిఠాయిలకు,  పూల గుత్తులు,  దండల కోసం వెచ్చించే బదులు ఆ సొమ్ముతో నిరుపేదలకు మాస్క్ లు, శానిటైజర్స్,  ఫేస్ సీల్డ్స్ పంపిణీ చేస్తే తాను చాలా సంతోషిస్తానని పేర్కొన్నారు.  అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ తమతమ ఇళ్ళ నుంచి బయటకు రావద్దని హితవు పలికారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావలసి వస్తే తప్పనిసరిగా రెండు మాస్క్ లు ధరించి,  సామాజిక దూరం పాటిస్తూ,  శానిటైజర్ వినియోగిస్తూ కోవిడ్ నిబంధనలు ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  రాజన్న రచ్చబండ కార్యక్రమంలో కూడా ప్రజారోగ్య సమస్యలపైనే ప్రధాన దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.  వ్యక్తిగత సమస్యలతో తన వద్దకు కొద్ది రోజుల పాటు రావద్దని ఎంపి భరత్ రామ్ ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Rajahmundry

2021-05-11 13:55:08

2వ డోసు కోవిడ్ వేక్సిన్ తప్పక వేయించుకోవాలి..

రాష్ట్రప్రభుత్వం కరోనా నియంత్రణలో భాగంగా అందిస్తున్న కోవిడ్ రెండో డోసు వేక్సిన్ మొదటి వేక్సిన్ తీసుకున్నవారంతా వేయించుకోవాలని జివిఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి కోరారు.  మంగళవారం 2వ జోను పరిధిలోని 11వ వార్డులో పలు ప్రాంతాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరిలోవలోని ఎఫ్.ఆర్.యు. ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, భౌతిక దూరం పాటించాలని, విధిగా మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలలో చెత్త లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు ఆ ప్రదేశాన్ని శానిటేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పాత ఆరిలోవ, డ్రైవర్సు కోలనీ, అన్నానగర్, తోటగరువు, గాంధీ నగర్, రవీంద్ర నగర్ తదితర ప్రాంతాలలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రితో కలసి పర్యటించి, ఆయా ప్రాంతాలలో జరుగుచున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. తడి చెత్త-పొడి చెత్త సేకరించే విధానాన్ని పరిశీలించారు. ప్రజల నుండి తడి–పొడి చెత్త వేరు వేరుగా తీసుకోవాలని పారిశుధ్య సిబ్బందికి సూచించారు. గాంధీనగర్ లోని గెడ్డ నందు పూడిక తీయించాలని, రోడ్లను, కాలువలను శుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎప్పటికప్పుడు డంపింగు యార్డుకు తరలించాలని శానిటరి  ఇన్  స్పెక్టర్ ను ఆదేశించారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బంది ప్రతీ రోజూ కాలువలు, రోడ్లను శుభ్రం చేస్తున్నదీ లేనిదీ ఆరాతీసారు. తడి–పొడి చెత్తను వేరుచేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని ప్రజలకు సూచించారు. ఆయా ప్రాంతాలలో వెలగని వీధి లైట్లను యుద్ధ ప్రాతిపదికన మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం వార్డులో ప్రధాన వీధులలో “బెల్ మిస్టర్” మిషన్ ద్వారా సోడియం హైపోక్లోరైట్ చల్లే ప్రక్రియను ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రితో కలసి పరిశీలించారు.  ఈ పర్యటనలో జివిఎంసి ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, బయోలజిస్టు, శానిటరి  ఇన్  స్పెక్టర్, వార్డు శానిటరి కార్యదర్శులు, శానిటరి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Arilova

2021-05-11 13:26:53

కళింగ కోవిడ్ కేర్ కేంద్రంలో 60 బెడ్లు..

కోవిడ్ రెండవ దశ ఉద్ధృతం ఉన్న సమయంలో ఐఎన్ఎస్ కళింగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి  శ్రీనివాసరావు కోరారు. మంగళవారం కళింగలో కోవిడ్ కేర్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. భీమిలి నియోజకవర్గంలో కోవిడ్  బాధితులను ఆదుకోవడం కోసం భీమిలి ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ల పర్యవేక్షణలో 60  బెడ్లతో పాటు 16 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశామన్నారు.  అవసరమైన అన్ని సదుపాయాలతో ఈ కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసిన ఐఎన్ఎస్ కళింగ నేవి సిబ్బందికి  మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు అందరూ స్వచ్ఛందంగా కరోనా నియంత్రణకు సహకరించాలన్నారు. ఎవరూ బయటకి రాకుండా  శానిటైజేషన్  మరియు నిత్యం మాస్కులు ధరించి కోవిడ్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్ఎస్ కళింగ చీఫ్ కమాండర్ కమడోర్ నీరజ్ ఉదయ్, డిఎంహెచ్ఓ సూర్యనారాయణ, 4వార్డు కార్పొరేటర్ దౌలపల్లి కొండబాబు, భీమిలి హెల్త్ ఆఫీసర్ సిద్దార్థ్, వైద్యాధికారులు, నేవీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఐఎన్ఎస్ కళింగ

2021-05-11 13:14:49

మరింతగా సేవలు అందించాలి..

కోవిడ్ మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన విపత్కర పరిస్థితులలో మరింతగా మానవతా దృక్పథంతో పనిచేసి రోగులకు సేవలందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను కోరారు. మంగళవారం  తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్-19, ఉపాధి హామీ పథకం, హౌసింగ్, స్పందన గ్రీవెన్స్ లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు, యంత్రాంగం కోవిడ్ నియంత్రణ నిమిత్తం సమర్థవంతంగా పనిచేసారని ప్రశంసించారు. 
104 కాల్ సెంటర్ల పనితీరు మరింతగా మెరుగు పరచాలని, కాల్ చేసిన వ్యక్తికి ఖచ్చితమైన సమాచారాన్ని అందించి, సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.  జిల్లా స్థాయి ఆక్సిజన్ సెల్ లు సమన్వయంతో పనిచేసి ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలని అన్నారు. విశాఖపట్నం నుంచి జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, రూరల్ ఎస్పీ బి.కృష్ణా రావు, అసిస్టెంట్ కలెక్టర్ అదితి సింగ్, ఎఏంసి ప్రిన్సిపాల్ డా. పి వి సుధాకర్, డిఎంహెచ్ఓ డా.సూర్య నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

కలెక్టరేట్

2021-05-11 13:08:20

శివం ఫౌండేషన్ సేవలు అభినందనీయం..

కరోనా బాధితులను ఆదుకునేలా శివం ఫౌండేషన్ అందిస్తున్న సేవలు  అభినందనీయమని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ కొనియాడారు. దర్శి మాజీ శాసన సభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి ద్వితియ వర్థంతి సందర్భంగా శివం ఫౌండేషన్ చీమకుర్తి వారు రిమ్స్ ఆసుపత్రికి 25 ఆక్సిజన్ సిలిండర్లను కలెక్టర్ చేతులమీదుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములుకు మంగళవారం అందజేశారు. ప్రకాశం భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ కరోనా బాధితుల కోసం రిమ్స్‌లో మరో 80 పడకలు తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ చికిత్స పొందుతున్న వారికి ఈ ఆక్సిజన్ సిలిండర్లను వినియోగిస్తామని చెప్పారు. శివం ఫౌండేషన్ సేవలను స్ఫూర్తిగా తీసుకొని కోవిడ్ బాధితులకు ఉపయోగపడేలా ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మంచాలు, పరుపులను అందించేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. ఆర్థిక పరంగా సహాయం చేయాలనుకునేవారు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు. శివం ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొల్లపూడి హరి మాట్లాడుతూ సమాజ సేవే సర్వేశ్వరుని సేవగా భావించి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. రిమ్స్‌లో కోవిడ్ బాధితులకు ఉపయోగపడేలా మూడు లక్షల రూపాయల విలువైన ఈ ఆక్సిజన్ సిలిండర్లను అందజేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్థి) టి.ఎస్. చేతన్,
డి.ఎమ్.హెచ్.ఓ. రత్నావళి, రిమ్స్ డిప్యూటి సూపరింటెండెంట్ మురళీకృష్ణారెడ్డి,
ఏ.పి.ఎమ్.ఐ.డి.సి. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవి కుమార్, ఇతర అధికారులు, శివం ఫౌండేషన్
ప్రతినిధులు పాల్గొన్నారు.

PRAKASAM

2021-05-11 12:58:37