1 ENS Live Breaking News

ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా కిట్లు..

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా సమయంలో ప్రజలకు సేవలు అందిస్తున్నారని జివిఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. సోమవారం నాలుగవ జోనులోని 28వ వార్డు ఫ్రంట్ లైను వ్యారియర్సుకు కరోనా కిట్లు పంపిణీ చేశారు. కెనరా బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్(సి.బి.ఇ.యు.) 71వ వ్యవస్థాపక దినోత్సవం, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సమైఖ్య ఆధ్వర్యంలో 25వ వార్షికోత్సవం సందర్భంగా ఫేస్ షీల్డ్ మాస్కులు, మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్సు, వితరణ చేసారు. సుమారు 70మంది ఫ్రంట్ లైను వ్యారియర్సుకు మేయర్  వీటిని అందించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, కరోనా రెండవ దశ చాలా ఉధృతంగా ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు చాలా జాగ్రత్తలు పాటించాలని అవసరమైతేనే బయటకు రావాలని, రద్దీ ప్రదేశాలలో తిరగరాదనీ, నిత్యం మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం. శ్రీనివాస కుమార్, ఆడారి శ్రీనివాసరావు, 28వ వార్డు కార్పొరేటర్ పల్లా అప్పలకొండ, 28వ వార్డు ఇంచార్జ్ పల్లా దుర్గా రావు తదితరులు పాల్గొన్నారు.    

Visakhapatnam

2021-05-10 15:13:40

రేపటి నుంచి కరోనా టీకా కార్యక్రమం..

శ్రీకాకుళం జిల్లాలో టీకా కార్యక్రమాన్ని మంగళవారం నుండి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు, వైద్య శాఖ అధికారులతో సోమవారం టెలికాన్ఫరెన్స్ ను జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని, ఎక్కడ ఎటువంటి సమస్య తలెత్త రాదని ఆదేశించారు. ఒక నిర్దిష్ట సమయంలో వంద మందికి మాత్రమే టీకా ఇవ్వాలని, ఆ మేరకు ఆ వంద మందికి ముందు రోజు సాయంత్రం నాటికి సమాచారం చేరవేయాలని ఆయన ఆదేశించారు. నిర్దేశిత వంద మంది మినహా ఎవరికీ టీకా వేయరాదని ఆయన స్పష్టం చేశారు. సమాచారం లేకుండా షెడ్యూలులో లేకుండా వచ్చిన వారికి ఎవ్వరికీ టీకా ఇవ్వరాదని ఆదేశించారు. టీకా కేంద్రం స్పష్టంగా తెలియజేసి, టీకాకు వచ్చిన వారికి కుర్చీలు ఏర్పాటు చేయాలని, గదులలో కూర్చోబెట్టాలని ఆయన పేర్కొన్నారు. కూర్చున్న చోటనే టీకా వేసి పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ టెస్టులు విస్తృతంగా నిర్వహించాలని, హోమ్ ఐసోలేషన్ వ్యవస్థను పర్యవేక్షించాలని ఆయన అన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి మెడికల్ కిట్లు అందాలని ఆయన పేర్కొంటూ సకాలంలో మెడికల్ కిట్లు అందించడం వల్ల ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉండదని అన్నారు. ఇంటి వద్దనే పూర్తిస్థాయిలో నయం చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. కోవిడ్ లో అందరూ చక్కని పనితీరు కనబరుస్తున్నారని ప్రశంసించారు. పాజిటివ్ కేసులు గుర్తింపు పూర్తి స్థాయిలో ఉండాలని తద్వారా జిల్లా లో కోవిడ్ నియంత్రణకు సులభం అవుతుందని అన్నారు. ఏఎన్ఎంలు యాప్ లో వివరాలను అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు.  ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే.శ్రీనివాసులు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సిహెచ్. శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-10 15:00:34

సూపరింటెండెంట్ గా డా.జాన్లీ జోసెఫ్..

 అనంతపురం జిల్లా హిందూపురం జిల్లా ఆసుపత్రి ఇంచార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ గా డా.జాన్లీ జోసెఫ్ ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇంఛార్జ్ గా వ్యవహరిస్తున్న డిప్యూటీ సివిల్ సర్జన్ డా.దివాకర్ వెంటనే జాన్లీ జోసెఫ్ కు  ఇంచార్జ్ సూపరింటెండెంటుగా  బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ సమయంలో ఆసుపత్రి నిర్వహణను మెరుగుపరిచేందుకు నూతన ఇంచార్జ్ సూపరింటెండెంట్ ను నియమించామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.  డా.జాన్లీ జోసెఫ్ హిందూపురం జిల్లా ఆసుపత్రిలో హిందూపురం జిల్లా ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (అనస్థీషియా) పని చేస్తున్నారు. డా.జాన్లీ జోసెఫ్ కు బాధ్యతలు అప్పగించిన అనంతరం డా.దివాకర్ తిరిగి రోళ్ల మండలం కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ కు డిప్యూటీ సివిల్ సర్జన్ గా విధులు నిర్వర్తించాల్సిందిగా ఉత్తర్వుల్లో ఆదేశించారు..

Hindupuram

2021-05-10 14:53:34

Anantapur

2021-05-10 14:51:05

అనంతలో ఆక్సిజన్ కొరత రానివ్వం..

అనంతపురం జిల్లాలో మెడికల్ ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. సోమవారం హిందూపురం పరిధిలోని తూముకుంట వద్ద వేదిక్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరానికి ముందు కేవలం సిలిండర్ల ద్వారా మాత్రమే ఆక్సిజన్ అందించేవారమని, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో లిక్విడ్ ఆక్సిజన్ ఉన్న ఆసుపత్రి ఒకటి కూడా జిల్లాలో లేదన్నారు. ఇప్పుడు దాదాపుగా 40 వేల లీటర్ల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 13 వేల లీటర్ల చొప్పున, క్యాన్సర్ హాస్పిటల్, హిందూపురం జిల్లా హాస్పిటల్ లో 6 వేల చొప్పున, కదిరి, గుంతకల్ ఏరియా ఆసుపత్రులలో వెయ్యు లీటర్ల చొప్పున ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇవి కాకుండా జిల్లా మొత్తానికి 336 సిలిండర్లు ఉన్నాయని, పరిశ్రమలో వేరే అవసరాల కోసం ఉపయోగించే సిలిండర్లను కూడా వారితో మాట్లాడి మరో 700 సిలిండర్ ను తీసుకోవడం జరిగిందన్నారు. మొత్తం 1,000 కిపైగా సిలిండర్లను అక్కడి ఉన్న రోగులు ఆధారంగా ఆక్సిజన్ అందించేలా సిలిండర్లను నింపుకొని అందుబాటులో ఉంచామన్నారు. ఇంకా అదనపు నిల్వలు చేసుకునేందుకు గాను ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లను, స్టీల్ ప్లాంట్ యూనిట్లలో ఏవైతే మూలనపడి ఉన్నాయో ఆ యూనిట్లను తిరిగి తెరిపించడం జరిగిందన్నారు.

అందులో హిందూపురం లోని వేదిక్ ఇస్పాత్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన స్టీల్ ప్లాంటు లో యూనిట్లు ఉందని, ఈ స్టీల్ పరిశ్రమ మూతపడడంతో ఉత్పత్తి నిలిచిపోయిందని, వారి సమస్యలను పరిష్కరించి తిరిగి ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇక్కడ రోజుకు 500 సిలిండర్లు ఉత్పత్తి చేస్తున్నారని, 1000 సీలిండర్ల వరకు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. ఇంకా అదనంగా ఉత్పత్తి చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. అంతే కాకుండా సింగనమల మండలం చక్రాయపేట గ్రామంలో రోజుకు 350 సిలిండర్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం గల ప్లాంట్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాకు రెగ్యులర్ గా కర్ణాటక నుండి ఆక్సిజన్ వస్తోందని, అందులో ఎక్కడైనా సమస్యలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లాలోనే సొంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకునే ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇవే కాకుండా భవిష్యత్తులో ఏ హాస్పిటల్ కు అవసరమయ్యే ఆక్సిజన్ ను ఆ హాస్పిటల్లోనే ఉత్పత్తి చేసుకునేలా ప్లాంట్లను నిర్మించి అక్కడే ఖాళీ సిలిండర్లను నింపి అక్కకి ఉన్న ఆక్సిజన్ బెడ్లకు ఉపయోగించుకునేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇవే కాకుండా జిల్లాలో అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో, హిందూపురం జిల్లా ఆసుపత్రి, కదిరి, గుంటకల్ ఏరియా ఆస్పత్రులలో 1,000 లీటర్లు సామర్థ్యం గల ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందుకు సంబంధించి హిందూపురంలో ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయన్నారు. మిగిలిన మూడు ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పనులు ప్రారంభమవుతాయన్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ కు ఎలాంటి కొరత లేకుండా సమృద్ధిగా ఆక్సిజన్ ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎటువంటి అవకతవకలు కూడా లేకుండా ఉండేందుకు కోసం ప్రభుత్వ ఉద్యోగులను కేటాయించి ఎంత ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది, ఏఏ  ఆస్పత్రులకు అమ్ముతున్నారు, ఎంత ధరకు అమ్ముతున్నారు, ఎన్ని సిలిండర్లు వెళుతున్నాయి తదితర అంశాలను రోజువారీగా పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ను ముందుగా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఇవ్వాలని, ఆ తర్వాత జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులకు, మిగిలినవి ఇతర జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు, ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రులకు, ఇంకా మిగిలి ఉంటే ఇతర రాష్ట్రాలకు కూడా అమ్ముకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. తక్కువ సమయంలో ఇక్కడి ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు సబ్ కలెక్టర్, పరిశ్రమల శాఖ జిఎం, ఎంపీ, ఎమ్మెల్సీల సూచనల మేరకు కేవలం మూడు రోజుల్లోనే ఈ ప్లాంట్ ను పునరుద్ధరణ చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ప్రతి ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ ప్లాంట్లు ఉండేలా ఏర్పాటు చేయనున్నామన్నారు.

రాష్ట్రంలో వైద్యం అందక ఏ ఒక్కరు కూడా మరణించకూడదని అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైద్యం అందక ఏ ఒక్కరు కూడా మరణించకూడదనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ముందుకు వెళుతున్నాయన్నారు. కరోనా వ్యాధికి ముఖ్యంగా ఆక్సిజన్ చాలా అవసరమని, ఇక్కడ మూతపడిన యూనిట్లను ముందుగా గుర్తించి తెరిపించేందుకు జిల్లా కలెక్టర్ గారు వారి సమస్యలను పరిష్కరించి త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. ఇందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, పరిశ్రమల శాఖ జిఎం, తదితరులను అభినందిస్తున్నానన్నారు. అలాగే ఇక్కడ ఉత్పత్తి చేసిన ఆక్సిజన్ ను ముందుగా ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులకు, ఆ తర్వాత ఇతర జిల్లాలు మరియు రాష్ట్రాలకు అందించడం జరుగుతుందని తెలిపారన్నారు. జిల్లా ప్రజలు ఎవరు అభద్రతా భావానికి గురి కావాల్సిన పనిలేదని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని, అన్ని రకాల చర్యలను ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం తీసుకుంటోందన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండి, పోషకాహారం తీసుకుంటూ ఉండాలన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను తరిమి కొట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ నిషా0తి, పరిశ్రమల శాఖ జీఎం అజయ్ కుమార్, నోడల్ ఆఫీసర్ ప్రసన్న కుమార్, వేదిక్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ ఎండి శరత్ బుతారా, తదితరులు పాల్గొన్నారు. 

Hindupuram

2021-05-10 14:34:52

అనంతకు నాలుగు ఆక్సిజన్ ప్లాంట్ లు..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాకు 4 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ లను మంజూరు చేశారని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. సోమవారం హిందూపురం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు పనులను, ఆక్సిజన్ ప్లాంట్ ను హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ నిషా0తి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒక్కో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ కెపాసిటీకి సంబంధించి ఒక నిముషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందన్నారు. దాని ద్వారా ఒక రోజులో దాదాపు 190 సిలిండర్ ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందన్నారు. హిందూపురం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి ఒక నిముషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి సరిపోతుందని ఇక్కడ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ మంజూరు చేయడం జరిగిందన్నారు. హిందూపురం తోపాటు జిల్లాలోని అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కదిరి, గుంతకల్లు ఆసుపత్రులలో కూడా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

హిందూపురం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ తో పాటు అదనంగా టిఎస్ఏ టెక్నాలజీ ద్వారా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ కు సంబంధించి సివిల్ పనులు ప్రారంభమయ్యాయన్నారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా సివిల్ పనులు జరుగుతున్నాయని, 4 రోజుల్లో సివిల్ పనులు పూర్తి చేసి బయట ఆక్సిజన్ సరఫరాపై ఆధారపడకుండా స్వంతంగా ఇక్కడే ప్లాంట్ పెట్టుకుని గాలిలో ఉన్న నీటిని తీసుకుని ఆక్సిజన్ ఉత్పత్తి చేసి ఆక్సిజన్ సరఫరా కు కావాల్సిన ఆక్సిజన్ జనరేషన్ యూనిట్ ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ లో ఏర్పాటు చేసే మిషనరీ డిఆర్డీఓ ( డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) నుంచి వస్తుందని, వారితో కూడా సమన్వయం చేసుకుంటున్నామన్నారు. సాధ్యమైనంత త్వరగా మిషనరీ వచ్చేలా చేసి ప్లాంట్ పూర్తి స్థాయిలో పనిచేసేలా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎంతో కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్

ఈ సందర్భంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. జిల్లాకు 4 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ లను మంజూరు చేశారని, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, డిఆర్డీఓ సమన్వయంతో ప్లాంట్ లను ఏర్పాటు చేసి ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తారన్నారు. దీని ద్వారా పేషంట్ లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ సరఫరా చేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడం చాలా సంతోషమన్నారు. హిందూపురం ఆస్పత్రికి వచ్చి కరోనా చికిత్స తీసుకునే వారు ఎవరు అభద్రతా భావానికి గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏర్పాటు చేసిందని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం కంకణబద్ధులై ముందుకు వెళుతోందన్నారు. అందరూ కలిసికట్టుగా కరోనాని జయించాలన్నారు. ప్రజలెవరూ భయబ్రాంతులకు గురి కారాదని, కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు.

ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జీఎం అజయ్ కుమార్, నోడల్ ఆఫీసర్ ప్రసన్న కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్, నేషనల్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

కలెక్టరేట్

2021-05-10 14:32:55

సమాచారశాఖ ఏడీగా తన్నీర్ మోహన్..

ప్రకాశం జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులుగా  తన్నీరు మోహన్ రాజు  నియమితులయ్యారు.  ఆమేరకు సంబంధిత శాఖ రాష్ట్ర కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి  సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.  ప్రస్తుతం సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న కె.మల్లేశ్వర్ సెలవుపై వెళ్తున్న నేపథ్యంలో మార్కాపురం డివిజనల్ పీఆర్ఓ గా విధులు నిర్వహిస్తున్న మోహన్ రాజు కు సహాయ సంచాలకులుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తక్షణమే మల్లీశ్వర్  నుంచి ఛార్జి తీసుకున్నారు. సహాయ సంచాలకులుగా మోహన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఆయనను మర్యాద పూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు.

Ongole

2021-05-10 14:29:34

ఆక్సిజన్, పడకల వివరాలు తెలియజేయాలి..

ప్రతీ రోజు ఆసుపత్రులకు వెళ్లి ఖాళీ పడకలు, ఆక్సిజన్ అవసరం తెలుసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాల పై  ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల వారీగా ఎన్ని ఆక్సిజన్ పడకలు ఉన్నవి, పడకల సంఖ్య, ఎంత ఆక్సిజన్ అవసరం, అక్కడ ఆక్సిజన్ నిల్వ కు అవకాశం ఉన్నదా లేదా అనే వివరాలను తెలుసుకొని తెలియజేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్, సర్వే శాఖ సహాయ సంచాలకులు  మనీషా త్రిపాటి, ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ రాజేష్ లను ఆదేశించారు. ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాలను ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ రామలింగరాజు చూసుకోవాలన్నారు. ఏ ఆసుపత్రికి చేరాల్సిన ఆక్సిజన్ ఆ ఆసుపత్రులకు చేరాలని చెప్పారు. ఆయా వాహనాల జిపిఎస్ ను ఐ. టి. వారు చూసుకుంటారని తెలిపారు. ఆక్సిజన్ సరఫరాకు మేనేజ్ మెంట్ కు ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ ఎఓకు ఆదేశించారు. ఆయా ఆసుపత్రులకు ఆక్సిజన్ అవసరాన్ని గుర్తించి సంబంధిత నోడల్ అధికారులు తెలియజేస్తారని చెప్పారు. 24*7 గంటలు ఈ కాల్ సెంటర్ పనిచేస్తుందని ఆయన వివరించారు.  ఈ సమావేశంలో ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ రామలింగరాజు, ఆర్డీఓ పెంచల కిషోర్, డిఆర్డిఎ పిడి వి. విశ్వేశ్వరరావు, డిటిసి రాజరత్నం, సర్వే శాఖ సహాయ సంచాలకులు మనీషా త్రిపాఠి, డ్రగ్ కంట్రోల్ సహాయ సంచాలకులు లావణ్య, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-05-10 14:25:45

ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడ‌ట‌మే మ‌న ల‌క్ష్యం..

ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడ‌ట‌మే మ‌నంద‌రి ల‌క్ష్య‌మ‌ని, కోవిడ్ రోగుల‌పై మ‌రింత శ్ర‌ద్ద చూపాల‌ని మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అధికారుల‌ను ఆదేశించారు. కోవిడ్ ఆసుప‌త్రుల‌పై మ‌రింత ప‌ర్య‌వేక్ష‌ణ పెంచి, అద‌న‌పు వ‌స‌తులు క‌ల్పించాల‌ని కోరారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఆక్సీజ‌న్‌కు కొర‌త రాకుండా చూడాల‌ని సూచించారు. రాష్ట్రంలో ఎక్క‌డా రెమిడిసివిర్‌కు కొర‌త లేద‌ని వారు స్ప‌ష్టం చేశారు.
                  జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు ఆధ్వ‌ర్యంలో, జిల్లాలో కోవిడ్ నియంత్ర‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌లు, రోగుల‌కు అందిస్తున్న వైద్యం త‌దిత‌ర అంశాల‌పై జిల్లా అధికారుల‌తో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సోమ‌వారం జూమ్ కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ముందుగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్ర‌స్తుత ప‌రిస్థితులు, కోవిడ్ నియంత్ర‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను మంత్రుల‌కు వివ‌రించారు. కోవిడ్ మొద‌టి వేవ్‌తో పోలిస్తే, ప్ర‌స్తుతం ఇన్‌ఫెక్ష‌న్ రేటు ఎక్కువ‌గా ఉంద‌ని, రిక‌వ‌రీ రేటు కొంత త‌గ్గింద‌ని చెప్పారు. జిల్లాలోని 28 ఆసుప‌త్రుల్లో ప్ర‌స్తుతం కోవిడ్‌కు చికిత్స నందిస్తున్నామ‌న్నారు. ఏడు కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌లో 3వేల ప‌డ‌క‌ల‌ను సిద్దం చేశామ‌ని చెప్పారు. హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారికి కోవిడ్ కిట్ల పంపిణీలో మ‌న జిల్లా ప్ర‌ధ‌మ స్థానంలో ఉంద‌న్నారు. బొబ్బిలిలో కోవిడ్ ప‌రీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌తిపాద‌న పెట్టిన‌ట్టు చెప్పారు.

                    జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో ఆక్సీజ‌న్ ల‌భ్య‌త‌, ఆసుప‌త్రుల్లో వ‌స‌తులు, వాటిని మెరుగుప‌ర్చేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించారు. ప్ర‌స్తుతానికి జిల్లాలో ఆక్సీజ‌న్ కొర‌త లేద‌ని, రెండుమూడు రోజుల్లో జిల్లా కేంద్రాసుప‌త్రిలో 10 కిలోలీట‌ర్ల ట్యాంకు అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు. మందుల కొర‌త కూడా లేద‌ని చెప్పారు. జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు మాట్లాడుతూ జిల్లాలోని 28 కోవిడ్ ఆసుప‌త్రుల్లో అందిస్తున్న వైద్య ప్ర‌క్రియ‌ను వివ‌రించారు. ఆసుప‌త్రుల్లో ప‌డ‌క‌లు ఖాళీ అయిన వెంట‌నే, ప్ర‌తీ రెండు గంట‌ల‌కోసారి స‌మాచారాన్ని అప్‌డేట్ చేసి, 104 కాల్ సెంట‌ర్‌కు పంపిస్తున్నామ‌ని చెప్పారు.

                  సుదీర్గ స‌మీక్ష అనంత‌రం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ నియంత్ర‌ణ‌కు జిల్లా యంత్రాంగం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను అభినందించారు. జిల్లా అధికారులంతా స‌మిష్టిగా కృషి చేస్తున్నార‌ని అన్నారు. చిన్న‌చిన్న లోపాలను స‌రిదిద్ది, మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా వైద్యాన్ని అందించాల‌ని కోరారు. అంత‌కుముందు ప్ర‌జాప్ర‌తినిధులు లేవ‌నెత్తిన స‌మ‌స్య‌ల‌న్నిటికీ ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించారు. ప్ర‌భుత్వ స్థాయిలో చేయాల్సిన వాటిని త‌న దృష్టికి తీసుకువ‌స్తే, వాటి ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

                    రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, కోవిడ్ రోగుల‌పై మ‌రింత శ్ర‌ద్ద పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాత్రి పూట కూడా ప‌ర్య‌వేక్ష‌ణ‌ను మరింత పెంచాల‌ని సూచించారు. అవ‌స‌ర‌మైతే అద‌న‌పు సిబ్బందిని వినియోగించాల‌ని, ఎట్టి ప‌రిస్థితిలోనూ వైద్యంలో లోపం ఉండ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తీ రెండుమూడు గంట‌ల‌కు రోగి ఆరోగ్య ప‌రిస్థితిని న‌మోదు చేయాల‌న్నారు. అవ‌స‌రం అయితే ట్రైనీ న‌ర్సుల‌ను విధుల్లోకి తీసుకోవాల‌న్నారు. ఆక్సీజ‌న్‌కు ఎట్టి ప‌రిస్థితిలోనూ కొర‌త రాకూడ‌ద‌ని, దానికి త‌గ్గ ప్ర‌ణాళిక‌ను రూపొందించుకోవాల‌ని సూచించారు. రాష్ట్రంలో ఎక్క‌డా రెమిడిసివిర్ కొర‌త లేద‌ని, బ్లాక్ మార్కెట్‌ను పూర్తిగా నిరోధించామ‌ని చెప్పారు. ప్ర‌యివేటు ఆసుప్ర‌తుల్లో కూడా అన్ని వ‌స‌తులు ఉండేలా  చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. పాజిటివ్ వ‌చ్చిన వారికి, కోవిడ్ కేర్ సెంట‌ర్‌లో బెడ్ కేటాయించి, వెంట‌నే వారిని త‌ర‌లించాల‌ని ఆదేశించారు. పాజిటివ్ రిపోర్టుతో బాటే, వారికి కేటాయించిన బెడ్ వివ‌రాలు కూడా మెసేజ్ వెళ్లే ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ప్ర‌జాప్ర‌తినిధులు చెప్పిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని మంత్రి బొత్స‌ హామీ ఇచ్చారు.

                    అంత‌కుముందు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు మాట్లాడుతూ, త‌మ దృష్టికి వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ, జిల్లాలో రోగుల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ పెంచ‌డం ద్వారా మ‌ర‌ణాల‌ను త‌గ్గించ‌వ‌చ్చ‌ని సూచించారు. ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రాలో చిన్న‌చిన్న లోపాలున్నాయ‌ని, వాటిని స‌రిదిద్దాల‌ని కోరారు. ప‌రీక్షా ఫ‌లితాల‌ను వేగంగా వెళ్ల‌డించాల‌ని సూచించారు. బొబ్బిలి ఎంఎల్ఏ శంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు మాట్లాడుతూ, బొబ్బిలి ఆసుప‌త్రిలో ప‌దిబెడ్లు ఉన్నాయ‌ని, వాటిలో కేవ‌లం 4 ప‌డ‌క‌ల‌కే ఆక్సీజ‌న్ స‌దుపాయం ఉంద‌న్నారు. మిగిలిన వాటికి కూడా ఈ సౌక‌ర్యాన్ని క‌ల్పించాల‌ని కోరారు. పార్వ‌తీపురం ఎంఎల్ఏ అల‌జంగి జోగారావు మాట్లాడుతూ, ఏరియా ఆసుప‌త్రిలో 41 బెడ్ల‌కు మాత్ర‌మే ఆక్సీజ‌న్ స‌దుపాయం ఉంద‌ని, పూర్తిగా వంద ప‌డ‌క‌ల‌కు కూడా ఈ సౌక‌ర్యాన్ని క‌ల్పించాల‌ని కోరారు. రోగుల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ ఇంకా పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వేక్సినేష‌న్‌లో ప‌ట్ట‌ణాల‌కు ప్రాధాన్య‌త‌నివ్వాల‌ని సూచించారు. గ‌జ‌ప‌తిన‌గ‌రం ఎంఎల్ఏ బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య మాట్లాడుతూ, వేక్సినేష‌న్ కేంద్రాల‌ను మండ‌లానికి రెండు చొప్పున ఏర్పాటు చేయాల‌న్నారు. క‌ర్ఫ్యూను దృష్టిలో పెట్టుకొని వేక్సిన్ వేసే స‌మ‌యాన్ని మార్చాల‌ని కోరారు. ఎంఎల్‌సి పి.సురేష్‌బాబు మాట్లాడుతూ, రాత్రి స‌మ‌యంలో రోగుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఫిర్యాదు చేశారు. సాంకేతిక నిపుణుల కొర‌త ఉంద‌ని, దానిని ప‌రిష్క‌రించాల‌ని కోరారు. ఈ స‌మ‌స్య‌ల‌న్నిటినీ ప‌రిష్క‌రిస్తామ‌ని మంత్రులు హామీ ఇచ్చారు.

              ఈ స‌మీక్షా స‌మావేశంలో జిల్లా కోవిడ్ స్పెష‌ల్ ఆఫీస‌ర్ ఎస్‌.స‌త్య‌నారాయ‌ణ‌, అర‌కు ఎంపి గొట్టేటి మాధ‌వి, ఎస్‌కోట‌ ఎంఎల్ఏ క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, స‌బ్ క‌లెక్ట‌ర్ విదేహ్ ఖ‌రే, ఐటిడిఏ పిఓ ఆర్‌.కూర్మ‌నాధ్‌, అడిష‌న‌ల్ ఎస్‌పి స‌త్య‌నారాయ‌ణ‌, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ర‌మ‌ణ‌కుమారి, ప‌లువురు ఉన్న‌తాధికారులు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, జిల్లా కోవిడ్ టాస్క్‌ఫోర్స్ టీమ్ స‌భ్యులు పాల్గొన్నారు.

విజయనగరం

2021-05-10 14:23:26

మాస్క్ లేకపోతే ఉద్యోగులకూ అనుమతిలేదు..

ప్ర‌భుత్వ ఉద్యోగులంతా త‌మ కార్యాల‌యాల్లో విధుల‌కు హాజ‌ర‌య్యేట‌పుడు త‌ప్ప‌నిస‌రిగా క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశించారు. ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించ‌డం, శానిటైజ‌ర్‌తో చేతులు శుభ్ర‌ప‌ర‌చుకోవ‌డం, సీట్ల మ‌ధ్య భౌతిక‌దూరం వుండేలా చూడ‌టం వంటి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు. కార్యాల‌యాల్లోకి మాస్క్ ధ‌రించ‌ని వారికి ప్ర‌వేశం క‌ల్పించ‌రాద‌ని, మాస్క్ లేని వారికి ప్ర‌వేశం లేద‌నే బోర్డులు కూడా ప్ర‌తి కార్యాల‌యం వెలుప‌ల ప్ర‌ద‌ర్శించాల‌న్నారు. జిల్లాలో ప‌లు ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఉద్యోగులు కోవిడ్ బారిన ప‌డుతున్న దృష్ట్యా ఆయా కార్యాల‌యాల్లో క‌రోనా అప్ర‌మ‌త్త‌త విష‌యంలో తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప‌రిశీలించే నిమిత్తం జిల్లా క‌లెక్ట‌ర్ సోమ‌వారం క‌లెక్ట‌రేట్ లోని విద్యా శాఖ‌, ట్ర‌జ‌రీ, రెవిన్యూ త‌దిత‌ర కార్యాల‌యాల్ని త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయా ఉద్యోగులు శానిటైజ‌ర్లు వాడుతున్న‌దీ లేనిదీ ప‌రిశీలించారు. భౌతిక దూరం పాటిస్తూ ఉద్యోగులు సీటింగ్ ఏర్పాట్లు చేసుకోవాల‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులంతా వ్యాక్సిన్ వేసుకోవాల‌ని చెప్పారు. కోవిడ్ దృష్ట్యా బ‌యో మెట్రిక్ హాజ‌రును సస్పెండ్ చేశామ‌ని, స‌మావేశాల‌కు ప్ర‌త్య‌క్షంగా పిల‌వ‌కుండా టెలికాన్ఫ‌రెన్సులు, వెబ్ కాన్ఫ‌రెన్సులు నిర్వ‌హించాల‌ని ఆదేశాలిచ్చామ‌న్నారు. దివ్యాంగులు, గ‌ర్భిణీలైన ఉద్యోగులు కార్యాల‌యానికి వ‌చ్చి ప‌నిచేయ‌కుండా ఇంటి నుంచే ప‌నిచేసేందుకు అనుమ‌తిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. కోవిడ్ రెండో వేవ్ తీవ్ర‌త దృష్ట్యా ఉద్యోగులంతా క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ త‌మ ఆరోగ్య ర‌క్ష‌ణ విష‌యంలో శ్ర‌ద్ధ చూపాల‌ని కోరారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు కూడా పాల్గొన్నారు.

విజయనగరం

2021-05-10 14:22:04

కోవిడ్ వినతులకు తక్షణ పరిష్కారం..

విజయనగరం కలెక్టరేట్ లో సోమవారం కోవిడ్ పై ప్రత్యేకంగా నిర్వహించిన టెలి స్పందన కు 24 ఫోన్ కాల్స్ వచ్చాయి.   జిల్లా కలెక్టర్  డా. ఎం. హరి జవహర్ లాల్ స్వయంగా కాల్స్ అందుకొని ప్రజల సమస్యల పై  సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రధానంగా  వాక్సినేషన్ కోసం ఎక్కువ మంది సమస్యలను విన్నవించారు.  మండలం లో నున్న అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలోను వాక్సినేషన్ వేసేలా చూడాలని, మండలం లో  ఎక్కడో ఒకే చోట వేయడం వలన వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నామని , తీరా వెళ్ళిన తర్వాత అక్కడ వాక్సిన్ అందుబాటులో లేకపోతే కష్టం అవుతుందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.  రెండవ డోస్ వేయవలసిన వారికి ముందుగా వేయాలని కొందరు కోరగా మొదటి డోస్  కూడా త్వరగా వేయాలని మరి కొందరు  కోరారు. కలెక్టర్ స్పందిస్తూ మండలాల్లో నున్న అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో వాక్సిన్ వేసే ఏర్పాట్లను చూడాలని, మొదటి డోస్ వేసుకున్న 5 నుండి 6 వారాలు పూర్తి అయిన వారికీ రెండవ డోస్ వేయడం లో ప్రాధాన్యత నివ్వాలని ఆ మేరకు ఆదేశాలు జారి చేయమని   సంయుక్త కలెక్టర్ డా. మహేష్  కుమార్ కు  సూచించారు.  అదే విధంగా మొదటి డోస్ కావాలని కోరిన వారికీ సమాధానం చెప్తూ ప్రభుత్వానికి విన్నవిస్తామని అన్నారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారంగానే వాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో  కోవిడ్ సేవలు బాగానే అందుతున్నప్పటికి ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ జరుగుతోందని, డబ్బులు ఎక్కువుగా వసూలు చేస్తున్నారని కొందరు ఫిర్యాదు చేసారు.  కలెక్టర్ స్పందిస్తూ ప్రతి ఆసుపత్రికి ఒక నోడల్ అధికారిని వేయడం జరిగిందని, వారు స్పందించకుంటే సంయుక్త కలెక్టర్ మహేష్ కుమార్ కు ఫోన్ చెయ్యవచ్చని తెలిపారు.  ప్రైవేటు ఆసుపత్రుల పై నోడల్ అధికారులు పర్యవేక్షణ సక్రమంగా ఉండేలా చూడాలని  జే.సి కు సూచించారు.  కొన్ని వార్డులలో  పారిశుధ్యం  మెరుగ్గా లేదని ఫిర్యాదు చేయగా మున్సిపల్ కమీషనర్ల   తో వెంటనే ఫోన్ లో మాట్లాడి   పారిశుధ్యం పై ప్రత్యెక దృష్టి పెట్టేలా ఆదేశాలు జారి చేసారు. పారిశుద్ద్యం పై ఒక ప్రత్యెక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమీక్షించాల్సి  ఉందని, వెంటనే టెలి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలనీ  డి. ఆర్.ఓ కు సూచించారు.  కోవిడ్ పరీక్షలు జరుగుతున్నప్పటికీ ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని కొంత మంది కాలర్స్ తెలుపగా, పరీక్షల ఇంచార్జ్  డా. గోపాల కృష్ణ తో మాట్లాడి  ఫలితాల వెల్లడి లో ఆలస్యం కాకుండా చూడాలని, 24 గంటల్లోగా తెలపాలని సూచించారు. ప్రస్తుతం అమలవుతున్న కర్ఫ్యూ బాగుందని,  దీనిని ఇంకా కొంత కాలం  కొనసాగించాలని  కొంత మంది  కోరగా, 12  గంటల వరకు సమయం ఇవ్వడం లేదని, ముందే బంద్ చేయిస్తున్నారని ,   12 వరకు గడువు ఇచ్చేలా చూడాలని   లంకా పట్నం నుండి రైతు బజార్ వర్తకులు కోరగా  మున్సిపల్ కమీషనర్ కు ఫోన్ ద్వారా మాట్లాడి వారి 12 గంటల వరకు గడువు ఇచ్చేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.           ఈ టెలి స్పందన లో  జిల్లా కోవిడ్ ప్రత్యేకాధికారి సత్యనారాయణ, సంయుక్త కలెక్టర్ డా. మహేష్ కుమార్ , సబ్ కలెక్టర్ విధే ఖరే,  జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు తదితరులు పాల్గొన్నారు.  

కలెక్టరేట్

2021-05-10 14:20:33

అనాధ తల్లులకు కరోనా కిట్లు పంపిణీ..

విశాఖలోని సింహాచలం  శ్రీనివాసనగర్ శ్రీ బంగారుతల్లి వృద్ధాశ్రమంలో మాతృదినోత్సం సందర్భంగా అదివారం అనాధ తల్లులకు కరోనా వైరస్ నియంత్రణ కిట్లును సామాజిక వేత్త విజినిగిరి.బాలభానుమూర్తి కె.వి.సంతోష్ కుమార్ తో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,అందరూ అన్ని వర్గాల వారికి ఈ కరోనా సమయంలో సహాయం చేస్తున్నంటే అనాధాశ్రమంలో జీవనం గడిపే వారికి తమవంతు సహకారం అందించాలని  సంకల్పించి ఈ చిన్న కార్యక్రమం చేపట్టనట్టు చెప్పారు. కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న 23 మందికి మాస్కులు, మందుల కిట్లు పంపిణీ చేశామన్నారు.  ప్రభుత్వం నిర్ధేశించిన కరోనా నిబంధనలు పాటిస్తూ వీటిని అందించామన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఈ కిట్ లోని మందులు వినియోగించాలని వారికి సూచించామని చెప్పారు.

Simhachalam

2021-05-09 07:49:39

మే నెలంతా రెండో డోసు మాత్రమే వేస్తాం..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఈ నెల 10 నుండి 31వ తేదీ వ‌ర‌కు అన్ని వ్యాక్సినేష‌న్ కేంద్రాల్లో రెండో డోసు వారికి మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ వేస్తార‌ని జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ వెల్లడించారు. మే నెల‌లో 10 నుండి నెలాఖ‌రు వ‌ర‌కు మొద‌టి డోసు వ్యాక్సిన్ వేయ‌ర‌ని తెలిపారు. ఇందు కోసం ఆన్ లైన్‌లో బుక్ చేసుకునేందుకు కూడా అవ‌కాశం లేద‌ని తెలిపారు. జూన్ మొద‌టి వారం నుండి మాత్రమే మొద‌టి డోసు వ్యాక్సినేష‌న్ మ‌ళ్లీ చేప‌డ‌తార‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన‌ట్లు తెలిపారు. మొద‌టి డోసు వ్యాక్సిన్‌ కోసం ఇప్పటికే ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న స్లాట్‌లు ర‌ద్దవుతాయ‌ని స్పష్టంచేశారు. రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవల‌సి వున్న వారంద‌రికీ వారు రెండో డోసు వ్యాక్సిన్ ఏ కేంద్రంలో ఏ తేదీన వేసుకోవాలో వారి మొబైల్ ఫోన్లకు సందేశం పంపించ‌డం లేదా ఫోన్ చేసి తెలియ‌జేస్తార‌ని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వృధాను నివారించ‌డంలో భాగంగా కొన్ని ఎంపిక చేసిన కేంద్రాల్లో మాత్రమే రెండో డోసు వ్యాక్సిన్ వేస్తార‌ని తెలిపారు. ఆయా కేంద్రంలో ఎంత మందికి వాక్సిన్ వేయాలో, ఏ ప్రాంతం వారికి వేయాలో సంబంధిత జాబితా కూడా నిర్దేశిస్తార‌ని ఆ మేర‌కు మాత్రమే వేస్తార‌ని పేర్కొన్నారు. కేవ‌లం రెండో డోసు వ్యాక్సినేష‌న్ కేంద్రాలుగా వాటిని ప‌రిగ‌ణించి రెండో డోసు వ్యాక్సిన్ అవ‌స‌ర‌మైన వారికే ఆయా కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తార‌ని తెలిపారు.  ఇక‌పై వ్యాక్సిన్ ను ఆరోగ్య కేంద్రానికి స‌మీపంలోని విశాల‌మైన ప్రదేశంలో స్కూలు, క‌ళాశాల ప్రాంగ‌ణాల్లో చేప‌డ‌తార‌ని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయాల్సిన వారంద‌రినీ గ‌దుల్లో కోవిడ్ నిబంధ‌న‌ల మేర‌కు భౌతిక దూరాన్ని పాటించి కూర్చోబెట్టి ఆరోగ్య కార్యక‌ర్తలు వారి ద‌గ్గర‌కు వెళ్లి వ్యాక్సిన్ వేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ ఒక ప్రక‌ట‌న‌లో తెలిపారు. అందువ‌ల్ల రెండో డోసు వ్యాక్సిన్ వేసుకోవ‌ల‌సిన వారెవ్వరూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, వారికి గ‌డువులోగానే రెండో డోసు వ్యాక్సిన్ వేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.  ప‌ట్టణాల్లోని అర్బన్ ఆరోగ్య కేంద్రాల వద్ద  ఏర్పాటుచేసే వ్యాక్సినేష‌న్ కేంద్రాల్లో సంబంధిత మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు వ్యాక్సిన్ వేసుకునే వారికి నీడ‌లో కూర్చొనే స‌దుపాయాలు, ఆయా కేంద్రాల వ‌ద్ద తాగునీటి స‌దుపాయం, క్యూ లైన్ల నిర్వహణకు త‌గిన స్థాయిలో పోలీసు ర‌క్షణ క‌ల్పిస్తూ ఏర్పాట్లు చేయాల‌ని క‌లెక్టర్ ఆదేశించారు.

Vizianagaram

2021-05-09 07:36:30

ప్రాధాన్యతా క్రమంలో కోవిడ్ వేక్సినేషన్..

ప్రాధాన్యతా క్రమంలో టోకెన్లు తీసుకున్నవారందరికీ కోవిడ్ వేక్సినేషన్ ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. ఆదివారం కాకినాడలోని ఆనంద‌భార‌తి స్కూల్‌, తిల‌క్ స్కూల్‌లోని వ్యాక్సినేష‌న్ కేంద్రాల‌ను ఆయన త‌నిఖీ చేశారు. ప్ర‌స్తుతం కోవిడ్ వైర‌స్ వ్యాప్తి అధికంగా ఉన్న నేప‌థ్యంలో వైర‌స్ ఒక‌రినుంచి మ‌రొక‌రికి వ్యాపించ‌కుండా టీకా కేంద్రాల వ‌ద్ద చేసిన ప్ర‌త్యేక ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. అదే విధంగా వేస‌వి నేప‌థ్యంలో ల‌బ్ధిదారుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. టీకా కేంద్రాల్లోని రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌, వ్యాక్సినేష‌న్‌, అబ్జ‌ర్వేష‌న్ గ‌దుల‌ను ప‌రిశీలించి, అక్క‌డికి వ‌చ్చిన ల‌బ్ధిదారుల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌, వాలంటీర్ల ద్వారా అందించే టోకెన్ల ఆధారంగా ల‌బ్ధిదారుల‌కు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ స‌జావుగా సాగేలా చూడాల‌ని ఆదేశించారు. కోవిడ్ రెండో ద‌శ ఉద్ధృతి నేప‌థ్యంలో ల‌బ్ధిదారులు, సిబ్బంది త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ జాగ్ర‌త్త‌లు పాటించేలా చూడాల‌న్నారు. ప్ర‌స్తుతం ఏ టీకా అందుబాటులోఉంది? ఎవ‌రికి పంపిణీ చేస్తున్నారు? ఎన్నో డోసు వేస్తున్నారు? టీకా పంపిణీ స‌మ‌యం? త‌దిత‌ర వివ‌రాల‌ను వ్యాక్సినేష‌న్ కేంద్రాల ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద ఏర్పాటు చేసిన డిస్‌ప్లే బోర్డులో ఎప్ప‌టిక‌ప్పుడు పొందుప‌ర‌చాల‌ని సూచించారు. క‌లెక్ట‌ర్ వెంట కాకినాడ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, వ్యాక్సిన్ కేంద్రం ప్ర‌త్యేక అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Kakinada

2021-05-09 07:31:22

కాన్వెంట్ జంక్షన్ ను తుమ్మెదలమెట్టగా మార్చండి..

సింహాచల అప్పన్న తుమ్మెదల రూపంలో అలనాడు తురుష్కులను తరిమికొట్టారని పురాణాలు చెబుతున్నాయని స్థానాచార్యులు డాక్టర్ టీపీ రాజగోపాల్ జివిఎంసీ మేయర్ గొలగాని వెంటక హరి కుమారి దంపతులకు వివరించారు.  ప్రస్తుతం కాన్వెంట్ జంక్షన్ పేరుతను తుమ్మెదల మెట్టగా మార్చాలని మేయర్ ను కోరారు. ఆదివారం సింహాచలం దేవస్ధానంలో స్వామివారిని మేయర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా  సింహాచల మహత్యాన్ని మేయర్ వివరించారు.  18వ శతాబ్దం తొలిభాగంలో తురుష్కులు హిందూ దేవాలయాలపై దాడి చేసిన సందర్భంలో సింహాచలం ఆలయంపైనా దాడికి వచ్చారని.. ఆ సమయంలో నిధుల కోసం  దేవాలయంలోకి ప్రవేశించి శిల్పకళలను ధ్వంసం చేశారని అన్నారు. నాటి ఆ ఆనవాళ్లును మేయర్  చూపించారు. చివరికి స్వామివారు తనను తాను కాపాడుకోవడానికి  భారీ  తుమ్మెదల రూపంలో బయలు దేరి తురుష్కుల మూకను తుమ్మెదల మెట్ట (ప్రస్తుతం కాన్వెంటు కూడలి)వరకూ తరిమి కొట్టారని ఆలయచరిత్ర చెబుతోందని వివరించారు. నిన్న మొన్నటివరకు ప్రస్తుత కాన్వెంట్ కూడలిని దుమ్మెదల మెట్టని పిలిచేవారని గుర్తు చేశారు. అయితే కాల క్రమేణా ఆ పేరు పోయి కాన్వెంట్ జంక్షన్ అని పిలుస్తున్నారని గుర్తు చేశారు. ఎంతో చరిత్ర వున్న కాన్వెంట్ జంక్షన్ ను... తుమ్మెదల మెట్టగా నామకరణం చేసి... అక్కడ స్వామివారి జ్ఞాపకార్థం బోర్డులు ఏర్పాటు చేయాలని ఆచార్యులు కోరారు. ఆ ప్రాంత విశిష్టత, స్వామివారి మహత్యం ఇప్పటి యువతకు చెప్పాలని స్థానాచార్యులు కోరగా... ఈ దిశగా తీర్మానం చేసేందుకు ప్రయత్నిస్తామని మేయర్ హామీనిచ్చారు. 

Simhachalam

2021-05-09 05:28:48