1 ENS Live Breaking News

ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడ‌ట‌మే మ‌న ల‌క్ష్యం..

ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడ‌ట‌మే మ‌నంద‌రి ల‌క్ష్య‌మ‌ని, కోవిడ్ రోగుల‌పై మ‌రింత శ్ర‌ద్ద చూపాల‌ని మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అధికారుల‌ను ఆదేశించారు. కోవిడ్ ఆసుప‌త్రుల‌పై మ‌రింత ప‌ర్య‌వేక్ష‌ణ పెంచి, అద‌న‌పు వ‌స‌తులు క‌ల్పించాల‌ని కోరారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఆక్సీజ‌న్‌కు కొర‌త రాకుండా చూడాల‌ని సూచించారు. రాష్ట్రంలో ఎక్క‌డా రెమిడిసివిర్‌కు కొర‌త లేద‌ని వారు స్ప‌ష్టం చేశారు.
                  జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు ఆధ్వ‌ర్యంలో, జిల్లాలో కోవిడ్ నియంత్ర‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌లు, రోగుల‌కు అందిస్తున్న వైద్యం త‌దిత‌ర అంశాల‌పై జిల్లా అధికారుల‌తో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సోమ‌వారం జూమ్ కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ముందుగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్ర‌స్తుత ప‌రిస్థితులు, కోవిడ్ నియంత్ర‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను మంత్రుల‌కు వివ‌రించారు. కోవిడ్ మొద‌టి వేవ్‌తో పోలిస్తే, ప్ర‌స్తుతం ఇన్‌ఫెక్ష‌న్ రేటు ఎక్కువ‌గా ఉంద‌ని, రిక‌వ‌రీ రేటు కొంత త‌గ్గింద‌ని చెప్పారు. జిల్లాలోని 28 ఆసుప‌త్రుల్లో ప్ర‌స్తుతం కోవిడ్‌కు చికిత్స నందిస్తున్నామ‌న్నారు. ఏడు కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌లో 3వేల ప‌డ‌క‌ల‌ను సిద్దం చేశామ‌ని చెప్పారు. హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారికి కోవిడ్ కిట్ల పంపిణీలో మ‌న జిల్లా ప్ర‌ధ‌మ స్థానంలో ఉంద‌న్నారు. బొబ్బిలిలో కోవిడ్ ప‌రీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌తిపాద‌న పెట్టిన‌ట్టు చెప్పారు.

                    జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో ఆక్సీజ‌న్ ల‌భ్య‌త‌, ఆసుప‌త్రుల్లో వ‌స‌తులు, వాటిని మెరుగుప‌ర్చేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించారు. ప్ర‌స్తుతానికి జిల్లాలో ఆక్సీజ‌న్ కొర‌త లేద‌ని, రెండుమూడు రోజుల్లో జిల్లా కేంద్రాసుప‌త్రిలో 10 కిలోలీట‌ర్ల ట్యాంకు అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు. మందుల కొర‌త కూడా లేద‌ని చెప్పారు. జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు మాట్లాడుతూ జిల్లాలోని 28 కోవిడ్ ఆసుప‌త్రుల్లో అందిస్తున్న వైద్య ప్ర‌క్రియ‌ను వివ‌రించారు. ఆసుప‌త్రుల్లో ప‌డ‌క‌లు ఖాళీ అయిన వెంట‌నే, ప్ర‌తీ రెండు గంట‌ల‌కోసారి స‌మాచారాన్ని అప్‌డేట్ చేసి, 104 కాల్ సెంట‌ర్‌కు పంపిస్తున్నామ‌ని చెప్పారు.

                  సుదీర్గ స‌మీక్ష అనంత‌రం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ నియంత్ర‌ణ‌కు జిల్లా యంత్రాంగం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను అభినందించారు. జిల్లా అధికారులంతా స‌మిష్టిగా కృషి చేస్తున్నార‌ని అన్నారు. చిన్న‌చిన్న లోపాలను స‌రిదిద్ది, మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా వైద్యాన్ని అందించాల‌ని కోరారు. అంత‌కుముందు ప్ర‌జాప్ర‌తినిధులు లేవ‌నెత్తిన స‌మ‌స్య‌ల‌న్నిటికీ ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించారు. ప్ర‌భుత్వ స్థాయిలో చేయాల్సిన వాటిని త‌న దృష్టికి తీసుకువ‌స్తే, వాటి ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

                    రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, కోవిడ్ రోగుల‌పై మ‌రింత శ్ర‌ద్ద పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాత్రి పూట కూడా ప‌ర్య‌వేక్ష‌ణ‌ను మరింత పెంచాల‌ని సూచించారు. అవ‌స‌ర‌మైతే అద‌న‌పు సిబ్బందిని వినియోగించాల‌ని, ఎట్టి ప‌రిస్థితిలోనూ వైద్యంలో లోపం ఉండ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తీ రెండుమూడు గంట‌ల‌కు రోగి ఆరోగ్య ప‌రిస్థితిని న‌మోదు చేయాల‌న్నారు. అవ‌స‌రం అయితే ట్రైనీ న‌ర్సుల‌ను విధుల్లోకి తీసుకోవాల‌న్నారు. ఆక్సీజ‌న్‌కు ఎట్టి ప‌రిస్థితిలోనూ కొర‌త రాకూడ‌ద‌ని, దానికి త‌గ్గ ప్ర‌ణాళిక‌ను రూపొందించుకోవాల‌ని సూచించారు. రాష్ట్రంలో ఎక్క‌డా రెమిడిసివిర్ కొర‌త లేద‌ని, బ్లాక్ మార్కెట్‌ను పూర్తిగా నిరోధించామ‌ని చెప్పారు. ప్ర‌యివేటు ఆసుప్ర‌తుల్లో కూడా అన్ని వ‌స‌తులు ఉండేలా  చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. పాజిటివ్ వ‌చ్చిన వారికి, కోవిడ్ కేర్ సెంట‌ర్‌లో బెడ్ కేటాయించి, వెంట‌నే వారిని త‌ర‌లించాల‌ని ఆదేశించారు. పాజిటివ్ రిపోర్టుతో బాటే, వారికి కేటాయించిన బెడ్ వివ‌రాలు కూడా మెసేజ్ వెళ్లే ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ప్ర‌జాప్ర‌తినిధులు చెప్పిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని మంత్రి బొత్స‌ హామీ ఇచ్చారు.

                    అంత‌కుముందు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు మాట్లాడుతూ, త‌మ దృష్టికి వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ, జిల్లాలో రోగుల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ పెంచ‌డం ద్వారా మ‌ర‌ణాల‌ను త‌గ్గించ‌వ‌చ్చ‌ని సూచించారు. ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రాలో చిన్న‌చిన్న లోపాలున్నాయ‌ని, వాటిని స‌రిదిద్దాల‌ని కోరారు. ప‌రీక్షా ఫ‌లితాల‌ను వేగంగా వెళ్ల‌డించాల‌ని సూచించారు. బొబ్బిలి ఎంఎల్ఏ శంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు మాట్లాడుతూ, బొబ్బిలి ఆసుప‌త్రిలో ప‌దిబెడ్లు ఉన్నాయ‌ని, వాటిలో కేవ‌లం 4 ప‌డ‌క‌ల‌కే ఆక్సీజ‌న్ స‌దుపాయం ఉంద‌న్నారు. మిగిలిన వాటికి కూడా ఈ సౌక‌ర్యాన్ని క‌ల్పించాల‌ని కోరారు. పార్వ‌తీపురం ఎంఎల్ఏ అల‌జంగి జోగారావు మాట్లాడుతూ, ఏరియా ఆసుప‌త్రిలో 41 బెడ్ల‌కు మాత్ర‌మే ఆక్సీజ‌న్ స‌దుపాయం ఉంద‌ని, పూర్తిగా వంద ప‌డ‌క‌ల‌కు కూడా ఈ సౌక‌ర్యాన్ని క‌ల్పించాల‌ని కోరారు. రోగుల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ ఇంకా పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వేక్సినేష‌న్‌లో ప‌ట్ట‌ణాల‌కు ప్రాధాన్య‌త‌నివ్వాల‌ని సూచించారు. గ‌జ‌ప‌తిన‌గ‌రం ఎంఎల్ఏ బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య మాట్లాడుతూ, వేక్సినేష‌న్ కేంద్రాల‌ను మండ‌లానికి రెండు చొప్పున ఏర్పాటు చేయాల‌న్నారు. క‌ర్ఫ్యూను దృష్టిలో పెట్టుకొని వేక్సిన్ వేసే స‌మ‌యాన్ని మార్చాల‌ని కోరారు. ఎంఎల్‌సి పి.సురేష్‌బాబు మాట్లాడుతూ, రాత్రి స‌మ‌యంలో రోగుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఫిర్యాదు చేశారు. సాంకేతిక నిపుణుల కొర‌త ఉంద‌ని, దానిని ప‌రిష్క‌రించాల‌ని కోరారు. ఈ స‌మ‌స్య‌ల‌న్నిటినీ ప‌రిష్క‌రిస్తామ‌ని మంత్రులు హామీ ఇచ్చారు.

              ఈ స‌మీక్షా స‌మావేశంలో జిల్లా కోవిడ్ స్పెష‌ల్ ఆఫీస‌ర్ ఎస్‌.స‌త్య‌నారాయ‌ణ‌, అర‌కు ఎంపి గొట్టేటి మాధ‌వి, ఎస్‌కోట‌ ఎంఎల్ఏ క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, స‌బ్ క‌లెక్ట‌ర్ విదేహ్ ఖ‌రే, ఐటిడిఏ పిఓ ఆర్‌.కూర్మ‌నాధ్‌, అడిష‌న‌ల్ ఎస్‌పి స‌త్య‌నారాయ‌ణ‌, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ర‌మ‌ణ‌కుమారి, ప‌లువురు ఉన్న‌తాధికారులు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, జిల్లా కోవిడ్ టాస్క్‌ఫోర్స్ టీమ్ స‌భ్యులు పాల్గొన్నారు.

విజయనగరం

2021-05-10 14:23:26

మాస్క్ లేకపోతే ఉద్యోగులకూ అనుమతిలేదు..

ప్ర‌భుత్వ ఉద్యోగులంతా త‌మ కార్యాల‌యాల్లో విధుల‌కు హాజ‌ర‌య్యేట‌పుడు త‌ప్ప‌నిస‌రిగా క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశించారు. ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించ‌డం, శానిటైజ‌ర్‌తో చేతులు శుభ్ర‌ప‌ర‌చుకోవ‌డం, సీట్ల మ‌ధ్య భౌతిక‌దూరం వుండేలా చూడ‌టం వంటి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు. కార్యాల‌యాల్లోకి మాస్క్ ధ‌రించ‌ని వారికి ప్ర‌వేశం క‌ల్పించ‌రాద‌ని, మాస్క్ లేని వారికి ప్ర‌వేశం లేద‌నే బోర్డులు కూడా ప్ర‌తి కార్యాల‌యం వెలుప‌ల ప్ర‌ద‌ర్శించాల‌న్నారు. జిల్లాలో ప‌లు ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఉద్యోగులు కోవిడ్ బారిన ప‌డుతున్న దృష్ట్యా ఆయా కార్యాల‌యాల్లో క‌రోనా అప్ర‌మ‌త్త‌త విష‌యంలో తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప‌రిశీలించే నిమిత్తం జిల్లా క‌లెక్ట‌ర్ సోమ‌వారం క‌లెక్ట‌రేట్ లోని విద్యా శాఖ‌, ట్ర‌జ‌రీ, రెవిన్యూ త‌దిత‌ర కార్యాల‌యాల్ని త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయా ఉద్యోగులు శానిటైజ‌ర్లు వాడుతున్న‌దీ లేనిదీ ప‌రిశీలించారు. భౌతిక దూరం పాటిస్తూ ఉద్యోగులు సీటింగ్ ఏర్పాట్లు చేసుకోవాల‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులంతా వ్యాక్సిన్ వేసుకోవాల‌ని చెప్పారు. కోవిడ్ దృష్ట్యా బ‌యో మెట్రిక్ హాజ‌రును సస్పెండ్ చేశామ‌ని, స‌మావేశాల‌కు ప్ర‌త్య‌క్షంగా పిల‌వ‌కుండా టెలికాన్ఫ‌రెన్సులు, వెబ్ కాన్ఫ‌రెన్సులు నిర్వ‌హించాల‌ని ఆదేశాలిచ్చామ‌న్నారు. దివ్యాంగులు, గ‌ర్భిణీలైన ఉద్యోగులు కార్యాల‌యానికి వ‌చ్చి ప‌నిచేయ‌కుండా ఇంటి నుంచే ప‌నిచేసేందుకు అనుమ‌తిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. కోవిడ్ రెండో వేవ్ తీవ్ర‌త దృష్ట్యా ఉద్యోగులంతా క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ త‌మ ఆరోగ్య ర‌క్ష‌ణ విష‌యంలో శ్ర‌ద్ధ చూపాల‌ని కోరారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు కూడా పాల్గొన్నారు.

విజయనగరం

2021-05-10 14:22:04

కోవిడ్ వినతులకు తక్షణ పరిష్కారం..

విజయనగరం కలెక్టరేట్ లో సోమవారం కోవిడ్ పై ప్రత్యేకంగా నిర్వహించిన టెలి స్పందన కు 24 ఫోన్ కాల్స్ వచ్చాయి.   జిల్లా కలెక్టర్  డా. ఎం. హరి జవహర్ లాల్ స్వయంగా కాల్స్ అందుకొని ప్రజల సమస్యల పై  సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రధానంగా  వాక్సినేషన్ కోసం ఎక్కువ మంది సమస్యలను విన్నవించారు.  మండలం లో నున్న అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలోను వాక్సినేషన్ వేసేలా చూడాలని, మండలం లో  ఎక్కడో ఒకే చోట వేయడం వలన వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నామని , తీరా వెళ్ళిన తర్వాత అక్కడ వాక్సిన్ అందుబాటులో లేకపోతే కష్టం అవుతుందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.  రెండవ డోస్ వేయవలసిన వారికి ముందుగా వేయాలని కొందరు కోరగా మొదటి డోస్  కూడా త్వరగా వేయాలని మరి కొందరు  కోరారు. కలెక్టర్ స్పందిస్తూ మండలాల్లో నున్న అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో వాక్సిన్ వేసే ఏర్పాట్లను చూడాలని, మొదటి డోస్ వేసుకున్న 5 నుండి 6 వారాలు పూర్తి అయిన వారికీ రెండవ డోస్ వేయడం లో ప్రాధాన్యత నివ్వాలని ఆ మేరకు ఆదేశాలు జారి చేయమని   సంయుక్త కలెక్టర్ డా. మహేష్  కుమార్ కు  సూచించారు.  అదే విధంగా మొదటి డోస్ కావాలని కోరిన వారికీ సమాధానం చెప్తూ ప్రభుత్వానికి విన్నవిస్తామని అన్నారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారంగానే వాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో  కోవిడ్ సేవలు బాగానే అందుతున్నప్పటికి ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ జరుగుతోందని, డబ్బులు ఎక్కువుగా వసూలు చేస్తున్నారని కొందరు ఫిర్యాదు చేసారు.  కలెక్టర్ స్పందిస్తూ ప్రతి ఆసుపత్రికి ఒక నోడల్ అధికారిని వేయడం జరిగిందని, వారు స్పందించకుంటే సంయుక్త కలెక్టర్ మహేష్ కుమార్ కు ఫోన్ చెయ్యవచ్చని తెలిపారు.  ప్రైవేటు ఆసుపత్రుల పై నోడల్ అధికారులు పర్యవేక్షణ సక్రమంగా ఉండేలా చూడాలని  జే.సి కు సూచించారు.  కొన్ని వార్డులలో  పారిశుధ్యం  మెరుగ్గా లేదని ఫిర్యాదు చేయగా మున్సిపల్ కమీషనర్ల   తో వెంటనే ఫోన్ లో మాట్లాడి   పారిశుధ్యం పై ప్రత్యెక దృష్టి పెట్టేలా ఆదేశాలు జారి చేసారు. పారిశుద్ద్యం పై ఒక ప్రత్యెక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమీక్షించాల్సి  ఉందని, వెంటనే టెలి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలనీ  డి. ఆర్.ఓ కు సూచించారు.  కోవిడ్ పరీక్షలు జరుగుతున్నప్పటికీ ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని కొంత మంది కాలర్స్ తెలుపగా, పరీక్షల ఇంచార్జ్  డా. గోపాల కృష్ణ తో మాట్లాడి  ఫలితాల వెల్లడి లో ఆలస్యం కాకుండా చూడాలని, 24 గంటల్లోగా తెలపాలని సూచించారు. ప్రస్తుతం అమలవుతున్న కర్ఫ్యూ బాగుందని,  దీనిని ఇంకా కొంత కాలం  కొనసాగించాలని  కొంత మంది  కోరగా, 12  గంటల వరకు సమయం ఇవ్వడం లేదని, ముందే బంద్ చేయిస్తున్నారని ,   12 వరకు గడువు ఇచ్చేలా చూడాలని   లంకా పట్నం నుండి రైతు బజార్ వర్తకులు కోరగా  మున్సిపల్ కమీషనర్ కు ఫోన్ ద్వారా మాట్లాడి వారి 12 గంటల వరకు గడువు ఇచ్చేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.           ఈ టెలి స్పందన లో  జిల్లా కోవిడ్ ప్రత్యేకాధికారి సత్యనారాయణ, సంయుక్త కలెక్టర్ డా. మహేష్ కుమార్ , సబ్ కలెక్టర్ విధే ఖరే,  జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు తదితరులు పాల్గొన్నారు.  

కలెక్టరేట్

2021-05-10 14:20:33

అనాధ తల్లులకు కరోనా కిట్లు పంపిణీ..

విశాఖలోని సింహాచలం  శ్రీనివాసనగర్ శ్రీ బంగారుతల్లి వృద్ధాశ్రమంలో మాతృదినోత్సం సందర్భంగా అదివారం అనాధ తల్లులకు కరోనా వైరస్ నియంత్రణ కిట్లును సామాజిక వేత్త విజినిగిరి.బాలభానుమూర్తి కె.వి.సంతోష్ కుమార్ తో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,అందరూ అన్ని వర్గాల వారికి ఈ కరోనా సమయంలో సహాయం చేస్తున్నంటే అనాధాశ్రమంలో జీవనం గడిపే వారికి తమవంతు సహకారం అందించాలని  సంకల్పించి ఈ చిన్న కార్యక్రమం చేపట్టనట్టు చెప్పారు. కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న 23 మందికి మాస్కులు, మందుల కిట్లు పంపిణీ చేశామన్నారు.  ప్రభుత్వం నిర్ధేశించిన కరోనా నిబంధనలు పాటిస్తూ వీటిని అందించామన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఈ కిట్ లోని మందులు వినియోగించాలని వారికి సూచించామని చెప్పారు.

Simhachalam

2021-05-09 07:49:39

మే నెలంతా రెండో డోసు మాత్రమే వేస్తాం..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఈ నెల 10 నుండి 31వ తేదీ వ‌ర‌కు అన్ని వ్యాక్సినేష‌న్ కేంద్రాల్లో రెండో డోసు వారికి మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ వేస్తార‌ని జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ వెల్లడించారు. మే నెల‌లో 10 నుండి నెలాఖ‌రు వ‌ర‌కు మొద‌టి డోసు వ్యాక్సిన్ వేయ‌ర‌ని తెలిపారు. ఇందు కోసం ఆన్ లైన్‌లో బుక్ చేసుకునేందుకు కూడా అవ‌కాశం లేద‌ని తెలిపారు. జూన్ మొద‌టి వారం నుండి మాత్రమే మొద‌టి డోసు వ్యాక్సినేష‌న్ మ‌ళ్లీ చేప‌డ‌తార‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన‌ట్లు తెలిపారు. మొద‌టి డోసు వ్యాక్సిన్‌ కోసం ఇప్పటికే ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న స్లాట్‌లు ర‌ద్దవుతాయ‌ని స్పష్టంచేశారు. రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవల‌సి వున్న వారంద‌రికీ వారు రెండో డోసు వ్యాక్సిన్ ఏ కేంద్రంలో ఏ తేదీన వేసుకోవాలో వారి మొబైల్ ఫోన్లకు సందేశం పంపించ‌డం లేదా ఫోన్ చేసి తెలియ‌జేస్తార‌ని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వృధాను నివారించ‌డంలో భాగంగా కొన్ని ఎంపిక చేసిన కేంద్రాల్లో మాత్రమే రెండో డోసు వ్యాక్సిన్ వేస్తార‌ని తెలిపారు. ఆయా కేంద్రంలో ఎంత మందికి వాక్సిన్ వేయాలో, ఏ ప్రాంతం వారికి వేయాలో సంబంధిత జాబితా కూడా నిర్దేశిస్తార‌ని ఆ మేర‌కు మాత్రమే వేస్తార‌ని పేర్కొన్నారు. కేవ‌లం రెండో డోసు వ్యాక్సినేష‌న్ కేంద్రాలుగా వాటిని ప‌రిగ‌ణించి రెండో డోసు వ్యాక్సిన్ అవ‌స‌ర‌మైన వారికే ఆయా కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తార‌ని తెలిపారు.  ఇక‌పై వ్యాక్సిన్ ను ఆరోగ్య కేంద్రానికి స‌మీపంలోని విశాల‌మైన ప్రదేశంలో స్కూలు, క‌ళాశాల ప్రాంగ‌ణాల్లో చేప‌డ‌తార‌ని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయాల్సిన వారంద‌రినీ గ‌దుల్లో కోవిడ్ నిబంధ‌న‌ల మేర‌కు భౌతిక దూరాన్ని పాటించి కూర్చోబెట్టి ఆరోగ్య కార్యక‌ర్తలు వారి ద‌గ్గర‌కు వెళ్లి వ్యాక్సిన్ వేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ ఒక ప్రక‌ట‌న‌లో తెలిపారు. అందువ‌ల్ల రెండో డోసు వ్యాక్సిన్ వేసుకోవ‌ల‌సిన వారెవ్వరూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, వారికి గ‌డువులోగానే రెండో డోసు వ్యాక్సిన్ వేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.  ప‌ట్టణాల్లోని అర్బన్ ఆరోగ్య కేంద్రాల వద్ద  ఏర్పాటుచేసే వ్యాక్సినేష‌న్ కేంద్రాల్లో సంబంధిత మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు వ్యాక్సిన్ వేసుకునే వారికి నీడ‌లో కూర్చొనే స‌దుపాయాలు, ఆయా కేంద్రాల వ‌ద్ద తాగునీటి స‌దుపాయం, క్యూ లైన్ల నిర్వహణకు త‌గిన స్థాయిలో పోలీసు ర‌క్షణ క‌ల్పిస్తూ ఏర్పాట్లు చేయాల‌ని క‌లెక్టర్ ఆదేశించారు.

Vizianagaram

2021-05-09 07:36:30

ప్రాధాన్యతా క్రమంలో కోవిడ్ వేక్సినేషన్..

ప్రాధాన్యతా క్రమంలో టోకెన్లు తీసుకున్నవారందరికీ కోవిడ్ వేక్సినేషన్ ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. ఆదివారం కాకినాడలోని ఆనంద‌భార‌తి స్కూల్‌, తిల‌క్ స్కూల్‌లోని వ్యాక్సినేష‌న్ కేంద్రాల‌ను ఆయన త‌నిఖీ చేశారు. ప్ర‌స్తుతం కోవిడ్ వైర‌స్ వ్యాప్తి అధికంగా ఉన్న నేప‌థ్యంలో వైర‌స్ ఒక‌రినుంచి మ‌రొక‌రికి వ్యాపించ‌కుండా టీకా కేంద్రాల వ‌ద్ద చేసిన ప్ర‌త్యేక ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. అదే విధంగా వేస‌వి నేప‌థ్యంలో ల‌బ్ధిదారుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. టీకా కేంద్రాల్లోని రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌, వ్యాక్సినేష‌న్‌, అబ్జ‌ర్వేష‌న్ గ‌దుల‌ను ప‌రిశీలించి, అక్క‌డికి వ‌చ్చిన ల‌బ్ధిదారుల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌, వాలంటీర్ల ద్వారా అందించే టోకెన్ల ఆధారంగా ల‌బ్ధిదారుల‌కు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ స‌జావుగా సాగేలా చూడాల‌ని ఆదేశించారు. కోవిడ్ రెండో ద‌శ ఉద్ధృతి నేప‌థ్యంలో ల‌బ్ధిదారులు, సిబ్బంది త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ జాగ్ర‌త్త‌లు పాటించేలా చూడాల‌న్నారు. ప్ర‌స్తుతం ఏ టీకా అందుబాటులోఉంది? ఎవ‌రికి పంపిణీ చేస్తున్నారు? ఎన్నో డోసు వేస్తున్నారు? టీకా పంపిణీ స‌మ‌యం? త‌దిత‌ర వివ‌రాల‌ను వ్యాక్సినేష‌న్ కేంద్రాల ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద ఏర్పాటు చేసిన డిస్‌ప్లే బోర్డులో ఎప్ప‌టిక‌ప్పుడు పొందుప‌ర‌చాల‌ని సూచించారు. క‌లెక్ట‌ర్ వెంట కాకినాడ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, వ్యాక్సిన్ కేంద్రం ప్ర‌త్యేక అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Kakinada

2021-05-09 07:31:22

కాన్వెంట్ జంక్షన్ ను తుమ్మెదలమెట్టగా మార్చండి..

సింహాచల అప్పన్న తుమ్మెదల రూపంలో అలనాడు తురుష్కులను తరిమికొట్టారని పురాణాలు చెబుతున్నాయని స్థానాచార్యులు డాక్టర్ టీపీ రాజగోపాల్ జివిఎంసీ మేయర్ గొలగాని వెంటక హరి కుమారి దంపతులకు వివరించారు.  ప్రస్తుతం కాన్వెంట్ జంక్షన్ పేరుతను తుమ్మెదల మెట్టగా మార్చాలని మేయర్ ను కోరారు. ఆదివారం సింహాచలం దేవస్ధానంలో స్వామివారిని మేయర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా  సింహాచల మహత్యాన్ని మేయర్ వివరించారు.  18వ శతాబ్దం తొలిభాగంలో తురుష్కులు హిందూ దేవాలయాలపై దాడి చేసిన సందర్భంలో సింహాచలం ఆలయంపైనా దాడికి వచ్చారని.. ఆ సమయంలో నిధుల కోసం  దేవాలయంలోకి ప్రవేశించి శిల్పకళలను ధ్వంసం చేశారని అన్నారు. నాటి ఆ ఆనవాళ్లును మేయర్  చూపించారు. చివరికి స్వామివారు తనను తాను కాపాడుకోవడానికి  భారీ  తుమ్మెదల రూపంలో బయలు దేరి తురుష్కుల మూకను తుమ్మెదల మెట్ట (ప్రస్తుతం కాన్వెంటు కూడలి)వరకూ తరిమి కొట్టారని ఆలయచరిత్ర చెబుతోందని వివరించారు. నిన్న మొన్నటివరకు ప్రస్తుత కాన్వెంట్ కూడలిని దుమ్మెదల మెట్టని పిలిచేవారని గుర్తు చేశారు. అయితే కాల క్రమేణా ఆ పేరు పోయి కాన్వెంట్ జంక్షన్ అని పిలుస్తున్నారని గుర్తు చేశారు. ఎంతో చరిత్ర వున్న కాన్వెంట్ జంక్షన్ ను... తుమ్మెదల మెట్టగా నామకరణం చేసి... అక్కడ స్వామివారి జ్ఞాపకార్థం బోర్డులు ఏర్పాటు చేయాలని ఆచార్యులు కోరారు. ఆ ప్రాంత విశిష్టత, స్వామివారి మహత్యం ఇప్పటి యువతకు చెప్పాలని స్థానాచార్యులు కోరగా... ఈ దిశగా తీర్మానం చేసేందుకు ప్రయత్నిస్తామని మేయర్ హామీనిచ్చారు. 

Simhachalam

2021-05-09 05:28:48

విమ్స్ డైరెక్టర్ గా డా.కె.రాంబాబు..

విశాఖలోని విమ్స్ డైరెక్టర్ గా డా.కె.రాంబాబు శనివారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి అందిస్తున్న ఎనలేని సేవలను ప్రజలకు పూర్తిస్థాయిలో విమ్స్ ద్వారా తీసుకెళ్లేందుకు క్రుషి చేస్తానని చెప్పారు. అనంతరం విమ్స్ మినిస్టీరియల్ సిబ్బంది, వైద్యులు,  నూతన డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పరిచియం చేసుకున్నారు.  గతంలో ఇక్కడ డైరెక్టర్ గా పనిచేసిన డా.కె.సత్యవరప్రసాద్ రిలీవ్ అయ్యారు. కరోనా సెకెండ్ వేవ్ ను సమర్ధవంతంగా పనిచేసేందుకు అంతా సమిష్టిగా క్రుషిచేయాలని వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని కోరినట్టు ఆయన చెప్పారు. ఎలాంటి సమస్యలున్నా నేరుగా తన వద్దకు తీసుకురావాలని డైరెక్టర్ రాంబాబు కోరారు..

VIMS Hospital

2021-05-08 13:53:35

అనంతలో కరోనాపై చైతన్య గీతం..

కరోనా కట్టడికి జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పామిడి మండలం జి.కొట్టాల గ్రామానికి చెందిన అంజి పామిడి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 'పాయే.. పాయే' అంటూ రాసిన పాట సిడిని జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరోనా నివారణకు అవకాశం ఉంటుందన్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కలిగేందుకు 'పాయే.. పాయే' పాట ఎంతో దోహదపడుతుందన్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాయలసీమ, అనంతపురం జిల్లా యాసలో పాట రాయడం చాలా బాగుందన్నారు. కరోనాపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగేందుకు పాట దోహదపడుతుందని, పాటలో సంగీతం, భాష ఎంతో బాగుందన్నారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో ప్రజలకు అవగాహన కల్పించేలా పాట రాయడం పట్ల లిరిక్స్, మ్యూజిక్, సింగర్ అయిన అంజి పామిడిని జిల్లా కలెక్టర్ అభినందించారు. కరోనాపై అవగాహన కలిగేలా పాటలు రాసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా అంజి పామిడి మాట్లాడుతూ శనివారం రాత్రి 7 గంటలకు మధుర ఆడియో ద్వారా 'పాయే.. పాయే' అంటూ సాగిన పాట యూ టూబ్ లో విడుదలవుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ సూచనలతో కరోనా పై అవగాహన కలిగించేలా పాట రాశానని తెలిపారు.

Anantapur

2021-05-08 13:30:32

కరోనాని తరమాలంటే మాస్కుధారనే ముఖ్యం..

కరోనాను కట్టడి చేయడంలో మాస్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జిల్లా చారిత్రక కట్టడమైన టవర్ క్లాక్ కు మాస్కు కట్టి కరోనాను ఎదుర్కోవడంలో మాస్కు అవసరాన్ని తెలిపే ప్రయత్నం చేశారు. అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టవర్ క్లాక్ ఎలా అయితే జిల్లా చరిత్రలో ఒక భాగమైందో అదే విధంగా మాస్కు కూడా మన జీవితాల్లో భాగం అయినప్పుడే కరోనాను ఎదుర్కోగలమన్నారు. గతంలో ఇదే టవర్ క్లాక్ వద్ద 'మాస్కే కవచం' అనే కార్యక్రమం నిర్వహించామని, మాస్కు కేవలం కవచం మాత్రమే కాదని, కరోనాపై పోరాటంలో ఆయుధం కూడా  అన్నారు. కరోనాకు మనకు అడ్డుగోడ మాస్కు మాత్రమేనన్నారు. కరోనాకు మనం అందరం దూరంగా ఉండగలిగితే కోవిడ్ పై సగం విజయం సాధించినట్టేనన్నారు. ప్రజలంతా కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ, నిరంతరం మాస్కు ధరిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కోవిడ్ సమయంలో మాస్కుల పంపిణీ వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టిన సామాజిక కార్యకర్త అనిల్ కుమార్ ను అభినందించారు. సామాజిక కార్యకర్తలు కోవిడ్ పోరాటంలో భాగస్వాములవడం అభినందనీయమన్నారు. 

అనంతపురము నగర మేయర్ వసీం సలీం మాట్లాడుతూ రోజు రోజుకూ కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని పిలుపునిచ్చారు. 

కార్యక్రమంలో పాల్గొన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు రేపు వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేయాలని పిలుపునిచ్చారు. రేపు ఆదివారం చికెన్ షాపుల వద్ద ప్రజలు ఎక్కువ గుమిగూడే అవకాశం ఉందని, చికెన్ షాపులు మూసివేయాలని నగర కమిషనర్ పీవీవీఎస్ మూర్తి విజ్ఞప్తి చేశారు. సోమవారం నుంచి నగరంలోని బాలుర జూనియర్ కళాశాలలో కూరగాయల మార్కెట్ నిర్వహిస్తామని, ప్రజలంతా కర్ఫ్యూ, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మార్కెట్ లో కొనుగోలు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 

 కార్యక్రమంలో నగర డిఎస్పి వీర రాఘవ రెడ్డి, డిప్యూటీ మేయర్ వాసంతి సాహితి, కార్పొరేటర్లు గూడూరు మల్లికార్జున శేఖర్ బాబు సామాజిక కార్యకర్త అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు. 

Anantapur

2021-05-08 13:05:52

ప్రాధాన్యతా క్రమంలో వేక్సిన్ వేయాలి..

మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని అర్భన్ పీహెచ్సీల్లో ప్రాధాన్యతా క్రమంలో ప్రజలకు కోవిడ్ వేక్సిన్ వేయాలని మేయర్ గొలగాని హరివెంకట కుమారి వైద్యాధికారులను ఆదేశించారు.  జివిఎంసి పరిధిలోని మూడవ జోనులో 16వ వార్డులోగల మద్దిలపాలెం మాక్స్ సెంటర్లో వ్యాక్సినేషన్ సెంటర్ నుంచి ప్రజల వద్ద నండి ఫిర్యాదు రావడంతో   ఆ సెంటర్ ను  మేయర్  శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్లో వ్యాక్సినేషన్ జరిగే ప్రక్రియ, రికార్డులను పరిశీలించారు. డా. జీవన్ రాణి తో మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ కొరకు వచ్చిన వారందరికి వ్యాక్సిన్ ఇవ్వాలని డాక్టరుకు సూచించారు. ఈ సెంటరుకు 300 డోసులు వచ్చాయని, రెండవ డోస్ కొరకు వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని డాక్టరు, మేయర్ కు తెలియజేసారు. అనంతరం, మేయర్ ప్రజలతో మాట్లాడుతూ, అందరూ వరుసక్రమంలో ఉంటూ భౌతిక దూరం పాటించి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, రద్దీ ప్రదేశాలలో తిరగవద్దని ప్రజలకు సూచించారు. వ్యాక్సినేషన్ సెంటర్ల చుట్టుప్రక్కల శానిటేషన్ చేయించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలని, వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యము కలగకుండా చూడాలని ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రిని ఆదేశించారు. ఇలాంటి కష్ట సమయంలో, అందరికీ వ్యాక్సినేషన్ అందజేస్తున్న వైద్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డు కార్పొరేటర్ మొల్లి లక్ష్మి, 15వ వార్డు కార్పొరేటర్ ఎ. శ్రీవిద్య, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, డా. జీవన్ రాణి, వై.ఎస్.ఆర్. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అప్పారావు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-05-08 12:46:38

కరోనాలో ప్రైవేటు ఆసుపత్రులు సహకరించాలి..

కరోనాపై పోరాటంలో జిల్లా యంత్రాంగానికి ప్రైవేట్ ఆసుపత్రులు సహకరించాలని  జాయింట్ కలెక్టర్లు ఏ.సిరి, నిశాంత్ కుమార్ లు ప్రైవేటు ఆసుపత్రుల యజమాన్యాలను కోరారు. సమావేశం నిర్వహించారు.  ఆక్సిజన్ మానిటరింగ్ సెల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదన్నారు. అయితే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అవసరమైన మోతాదు కంటే ఎక్కువ ఆక్సిజన్ ను బుక్ చేసుకుంటున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. సాధారణ పడకలను కూడా ఆక్సిజన్ పడకలుగా చూపిస్తూ ఎక్కువ మోతాదులో సిలిండర్లు పొందుతున్నాయన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఆక్సిజన్ పక్కదారి పట్టకుండా మరిన్ని చర్యలు చేపట్టామన్నారు. ఆక్సిజన్ ఫిల్లింగ్ పాయింట్స్ వద్ద పర్యవేక్షణ కోసం డిప్యూటీ తహసీల్దార్, పోలీసులను నియమించనున్నామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తనిఖీ చేస్తామన్నారు.  కార్పొరేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, సంక్షోభ కాలంలో వ్యాపార ధోరణి వీడి మానవతా దృక్పథంతో పనిచేయాలన్నారు. 


*సీటీ స్కాన్ తప్పని సరి కాదు,
సీటీ స్కాన్ వల్ల 300 రెట్లు రేడియేషన్ విడుదల అవుతుంది: జాయింట్ కలెక్టర్ సిరి* 

జేసీ సిరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సీటీ స్కాన్ చేయాల్సిన అవసరం లేదన్నారు.  ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయినా కూడా సీటీ స్కాన్ కానీ, RT PCR పరీక్ష  కానీ అక్కర్లేదన్నారు. కేవలం పాజిటివ్ లక్షణాలు వుంటే అడ్మిట్ చేసుకోవచ్చన్నారు . ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ వైద్యం కోసం వచ్చిన ప్రతి వ్యక్తికి సీటీ స్కాన్ నిర్వహిస్తున్నాయన్నారు. సీటీ స్కాన్  వల్ల  300 రెట్లు రేడియేషన్ విడుదల చేస్తుందన్న విషయం గుర్తించాలన్నారు. 

ప్రయివేటు ఆసుపత్రులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కోవిడ్ బాధితులకు చికిత్స అందించాలన్నారు. ప్రభుత్వం ఇదివరకే కోవిడ్-19 ను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ చికిత్సలకు ధరల పట్టిక కూడా విడుదల చేసిందని... తాజాగా కేవలం కోవిడ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరినా ఆరోగ్యశ్రీ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.  ప్రభుత్వం ఆదేశాల మేరకు 50 శాతం పడకలను ఆరోగ్యశ్రీకి కేటాయించాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు  రెమిడెసివేర్ వ్యాక్సిన్ ని  ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.2400 లకే  కంపెనీల నుంచి పొందాలన్నారు. ఎక్కువ ధర చెప్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 

Anantapur

2021-05-08 12:37:06

విజయసాయి రెడ్డికి ఘన సత్కారం..

విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం అభివృద్ధికి ఎవరి స్థాయిలో వారు విశేష సేవలు అందించాలని రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వం వారంతా  ప్రభుత్వ అతిథిగృహంలో విజయ్ సాయిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా వీరంతా ఆయనను ఘనంగా సత్కరించారు. తమ సేవలను గుర్తించి కీలకమైన ప్రత్యేక ఆహ్వానితులు పదవులు అప్పగించినందుకు వీరంతా విజయసాయిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ్యులు మాట్లాడుతూ, మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ  దేవస్థానం అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. భక్తులకు మరింతగా మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.  ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ ప్రత్యేక ఆహ్వానితులు 
గంట్ల శ్రీనుబాబు, యండమూరి విజయ, దశ మంతుల మాణిక్యాలరావు, ఎస్ ఎన్ రత్నం తో పాటు, అర్బన్ పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మహాదేవ్ ఆనంద్ రావు, పార్టీ నాయకులు, గొల గాని శ్రీనివాస్ తదితరులు పాల్గున్నారు.

Siripuram

2021-05-08 11:47:24

ఆక్సిజన్ మోతాదు పూర్తిస్థాయిలో ఉండాలి..

వైద్య అధికారులు సూచనల మేరకు ఆక్సిజన్ కూడా మెడిసిన్ లాంటిది, ఎక్కువ ఇచ్చినా , తక్కువ ఇఛ్చినా మంచిది కాదు ప్రతి 2 గంటలకు బెడ్లు వద్దకు వెళ్లి డాక్టర్లు  మానిటర్ చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరిణారాయణన్ అన్నారు. శనివారం మధ్యాహ్నం స్థానిక ఆర్.డి.ఓ. కార్యాలయంలో ఆక్సిజన్ వినియోగం, టాంకర్ల రాక పై నోడల్ అధికారులతో, డాక్టర్ల తో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.  కలెక్టర్ మాట్లాడుతూ స్విమ్స్,రుయా ఆక్సిజన్ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి వేస్టేజ్ నివారణ పై ఒక రిపోర్ట్ తయారు చేయాలని, అదే పద్దతి మేరకు ప్రవేట్ లో వినియోగం జరగాలని అన్నారు. ప్రధానంగా పేషెంట్ బాత్ రూమ్ వెళ్ళినపుడు, పుడ్ తీసుకునేటప్పుడు ఆక్సీజన్  వాడకం ఆపాలి అన్నారు. పేషెంట్ కు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి, ఎక్కువైనా ప్రమాదం, తక్కువ అయినా ప్రమాదం అన్నారు. ఐసీయూలో వాడకం, స్టెబిలిటీ వున్న పేషేంట్ల ఆక్సిజన్ బెడ్లకు సిఫ్ట్ వంటివి జరగాలి అన్నారు. ప్రవేట్ ఆసుపత్రులు వాడకం ఆక్సిజన్ బెడ్ల ప్రకారం ఎంత కె.ఎల్.వాడారనే రిపోర్ట్ ప్రతి రోజు రావాలి అన్నారు. డిస్ట్రిబ్యూటర్, డీలర్స్ అమ్ముతున్న వివరాలు ఉండాలి అన్నారు. స్విమ్స్ కొత్త ట్యాన్క్ రెండు రోజుల్లో ఇంస్టాల్ కావాలని సూచించారు. రుయా, మెటర్నటీ కలిపి 25 కె.ఎల్. కెపాసిటీ వుంది, 12 కె.ఎల్. వరకు వాడకం వుంది, ఆక్సిజన్ లేదనే సమస్య తలెత్త రాదు అన్నారు. ఎప్పటికప్పుడు టాంకర్ల ట్రాకింగ్ ఉండాలి, ఆలస్యంగా లేకుండా లారీలు వచ్ఛే విధంగా చూడాలని అన్నారు. ప్రవేట్ ఆసుపత్రులు ప్రతి రోజు  ఆక్సిజన్ ఆడిట్ రిపోర్ట్ ఉండాలి అన్నారు. 

ఈసమీక్ష లో  జెసి( డి)వీరబ్రహ్మం, సబ్ కలెక్టర్ మదనపల్లి జాహ్నవి, అసిస్టెంట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జెసి ( సంక్షేమం) రాజా శేఖర్, ఆర్డీవో కనకనరసా రెడ్డి, జి.ఎం., డిఐసి ప్రతాప్ రెడ్డి, ఆరోగ్యశ్రీ కో ఆర్డినెటర్ డా. బాలాంజనేయులు, రుయా సూపరినెంట్ డా.భారతి, ప్రొఫెసర్ రోజారామణి, స్విమ్స్ ప్రొఫెసర్ డా.ఆలోక్ సమంత్ రో  ,  జి.ఎం. ప్రసన్న లక్ష్మీ, డ్రగ్ ఇన్సెపెక్టర్ కీర్తన, అధికారులు ఉన్నారు.

Tirupati

2021-05-08 11:41:32

లేవుట్లలో మౌళిక సదుపాయాలు కల్పించండి..

పేద‌ల గృహ‌నిర్మాణానికి రూపొందించిన లేఅవుట్ల‌లో మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని జాయింట్(ఆస‌రా, సంక్షేమం) జె.వెంక‌ట‌రావు ఆదేశించారు. సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో శ‌నివారం వ‌ర్చువ‌ల్ మీటింగ్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జెసి మాట్లాడుతూ, ప్ర‌భుత్వం పేద‌ల గృహ‌నిర్మాణానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త నిస్తోంద‌న్నారు. దీనిలో భాగంగా జూన్ 1 నుంచి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాల్సి ఉంద‌న్నారు. దీనికి అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని ఆదేశించారు. జిల్లాలో 846 లేఅవుట్ల‌ను రూపొందించ‌డం జ‌రిగింద‌న్నారు. వీటిలో సుమారు 294 లే అవుట్ల‌లో ఇప్ప‌టికే బోర్లు త‌వ్వ‌కం పూర్తి అయ్యింద‌ని చెప్పారు. మిగిలిన లేఅవుట్ల‌లో కూడా ఈనెల 25 నాటికే బోర్లు వేయ‌డం పూర్తి చేసి, విద్యుత్ స‌దుపాయాన్ని క‌ల్పించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ స‌మావేశంలో గృహ‌నిర్మాణ‌శాఖ పిడి ఎస్‌వి ర‌మ‌ణ‌మూర్తి, పంచాయితీరాజ్ ఎస్ఇ జిఎస్ఆర్ గుప్త‌, ఇఇ కృష్ణారావు, ఆర్‌డ‌బ్ల్యూఎస్ ఎస్ఇ ప‌ప్పు ర‌వి, ట్రాన్స్‌కో ఎస్ఇ వై.విష్ణు త‌దిత‌రులు పాల్గొన్నారు.

జెసి కార్యాలయం

2021-05-08 11:39:32