1 ENS Live Breaking News

విమ్స్ డైరెక్టర్ గా డా.కె.రాంబాబు..

విశాఖలోని విమ్స్ డైరెక్టర్ గా డా.కె.రాంబాబు శనివారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి అందిస్తున్న ఎనలేని సేవలను ప్రజలకు పూర్తిస్థాయిలో విమ్స్ ద్వారా తీసుకెళ్లేందుకు క్రుషి చేస్తానని చెప్పారు. అనంతరం విమ్స్ మినిస్టీరియల్ సిబ్బంది, వైద్యులు,  నూతన డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పరిచియం చేసుకున్నారు.  గతంలో ఇక్కడ డైరెక్టర్ గా పనిచేసిన డా.కె.సత్యవరప్రసాద్ రిలీవ్ అయ్యారు. కరోనా సెకెండ్ వేవ్ ను సమర్ధవంతంగా పనిచేసేందుకు అంతా సమిష్టిగా క్రుషిచేయాలని వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని కోరినట్టు ఆయన చెప్పారు. ఎలాంటి సమస్యలున్నా నేరుగా తన వద్దకు తీసుకురావాలని డైరెక్టర్ రాంబాబు కోరారు..

VIMS Hospital

2021-05-08 13:53:35

అనంతలో కరోనాపై చైతన్య గీతం..

కరోనా కట్టడికి జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పామిడి మండలం జి.కొట్టాల గ్రామానికి చెందిన అంజి పామిడి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 'పాయే.. పాయే' అంటూ రాసిన పాట సిడిని జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరోనా నివారణకు అవకాశం ఉంటుందన్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కలిగేందుకు 'పాయే.. పాయే' పాట ఎంతో దోహదపడుతుందన్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాయలసీమ, అనంతపురం జిల్లా యాసలో పాట రాయడం చాలా బాగుందన్నారు. కరోనాపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగేందుకు పాట దోహదపడుతుందని, పాటలో సంగీతం, భాష ఎంతో బాగుందన్నారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో ప్రజలకు అవగాహన కల్పించేలా పాట రాయడం పట్ల లిరిక్స్, మ్యూజిక్, సింగర్ అయిన అంజి పామిడిని జిల్లా కలెక్టర్ అభినందించారు. కరోనాపై అవగాహన కలిగేలా పాటలు రాసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా అంజి పామిడి మాట్లాడుతూ శనివారం రాత్రి 7 గంటలకు మధుర ఆడియో ద్వారా 'పాయే.. పాయే' అంటూ సాగిన పాట యూ టూబ్ లో విడుదలవుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ సూచనలతో కరోనా పై అవగాహన కలిగించేలా పాట రాశానని తెలిపారు.

Anantapur

2021-05-08 13:30:32

కరోనాని తరమాలంటే మాస్కుధారనే ముఖ్యం..

కరోనాను కట్టడి చేయడంలో మాస్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జిల్లా చారిత్రక కట్టడమైన టవర్ క్లాక్ కు మాస్కు కట్టి కరోనాను ఎదుర్కోవడంలో మాస్కు అవసరాన్ని తెలిపే ప్రయత్నం చేశారు. అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టవర్ క్లాక్ ఎలా అయితే జిల్లా చరిత్రలో ఒక భాగమైందో అదే విధంగా మాస్కు కూడా మన జీవితాల్లో భాగం అయినప్పుడే కరోనాను ఎదుర్కోగలమన్నారు. గతంలో ఇదే టవర్ క్లాక్ వద్ద 'మాస్కే కవచం' అనే కార్యక్రమం నిర్వహించామని, మాస్కు కేవలం కవచం మాత్రమే కాదని, కరోనాపై పోరాటంలో ఆయుధం కూడా  అన్నారు. కరోనాకు మనకు అడ్డుగోడ మాస్కు మాత్రమేనన్నారు. కరోనాకు మనం అందరం దూరంగా ఉండగలిగితే కోవిడ్ పై సగం విజయం సాధించినట్టేనన్నారు. ప్రజలంతా కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ, నిరంతరం మాస్కు ధరిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కోవిడ్ సమయంలో మాస్కుల పంపిణీ వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టిన సామాజిక కార్యకర్త అనిల్ కుమార్ ను అభినందించారు. సామాజిక కార్యకర్తలు కోవిడ్ పోరాటంలో భాగస్వాములవడం అభినందనీయమన్నారు. 

అనంతపురము నగర మేయర్ వసీం సలీం మాట్లాడుతూ రోజు రోజుకూ కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని పిలుపునిచ్చారు. 

కార్యక్రమంలో పాల్గొన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు రేపు వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేయాలని పిలుపునిచ్చారు. రేపు ఆదివారం చికెన్ షాపుల వద్ద ప్రజలు ఎక్కువ గుమిగూడే అవకాశం ఉందని, చికెన్ షాపులు మూసివేయాలని నగర కమిషనర్ పీవీవీఎస్ మూర్తి విజ్ఞప్తి చేశారు. సోమవారం నుంచి నగరంలోని బాలుర జూనియర్ కళాశాలలో కూరగాయల మార్కెట్ నిర్వహిస్తామని, ప్రజలంతా కర్ఫ్యూ, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మార్కెట్ లో కొనుగోలు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 

 కార్యక్రమంలో నగర డిఎస్పి వీర రాఘవ రెడ్డి, డిప్యూటీ మేయర్ వాసంతి సాహితి, కార్పొరేటర్లు గూడూరు మల్లికార్జున శేఖర్ బాబు సామాజిక కార్యకర్త అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు. 

Anantapur

2021-05-08 13:05:52

ప్రాధాన్యతా క్రమంలో వేక్సిన్ వేయాలి..

మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని అర్భన్ పీహెచ్సీల్లో ప్రాధాన్యతా క్రమంలో ప్రజలకు కోవిడ్ వేక్సిన్ వేయాలని మేయర్ గొలగాని హరివెంకట కుమారి వైద్యాధికారులను ఆదేశించారు.  జివిఎంసి పరిధిలోని మూడవ జోనులో 16వ వార్డులోగల మద్దిలపాలెం మాక్స్ సెంటర్లో వ్యాక్సినేషన్ సెంటర్ నుంచి ప్రజల వద్ద నండి ఫిర్యాదు రావడంతో   ఆ సెంటర్ ను  మేయర్  శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్లో వ్యాక్సినేషన్ జరిగే ప్రక్రియ, రికార్డులను పరిశీలించారు. డా. జీవన్ రాణి తో మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ కొరకు వచ్చిన వారందరికి వ్యాక్సిన్ ఇవ్వాలని డాక్టరుకు సూచించారు. ఈ సెంటరుకు 300 డోసులు వచ్చాయని, రెండవ డోస్ కొరకు వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని డాక్టరు, మేయర్ కు తెలియజేసారు. అనంతరం, మేయర్ ప్రజలతో మాట్లాడుతూ, అందరూ వరుసక్రమంలో ఉంటూ భౌతిక దూరం పాటించి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, రద్దీ ప్రదేశాలలో తిరగవద్దని ప్రజలకు సూచించారు. వ్యాక్సినేషన్ సెంటర్ల చుట్టుప్రక్కల శానిటేషన్ చేయించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలని, వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యము కలగకుండా చూడాలని ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రిని ఆదేశించారు. ఇలాంటి కష్ట సమయంలో, అందరికీ వ్యాక్సినేషన్ అందజేస్తున్న వైద్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డు కార్పొరేటర్ మొల్లి లక్ష్మి, 15వ వార్డు కార్పొరేటర్ ఎ. శ్రీవిద్య, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, డా. జీవన్ రాణి, వై.ఎస్.ఆర్. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అప్పారావు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-05-08 12:46:38

కరోనాలో ప్రైవేటు ఆసుపత్రులు సహకరించాలి..

కరోనాపై పోరాటంలో జిల్లా యంత్రాంగానికి ప్రైవేట్ ఆసుపత్రులు సహకరించాలని  జాయింట్ కలెక్టర్లు ఏ.సిరి, నిశాంత్ కుమార్ లు ప్రైవేటు ఆసుపత్రుల యజమాన్యాలను కోరారు. సమావేశం నిర్వహించారు.  ఆక్సిజన్ మానిటరింగ్ సెల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదన్నారు. అయితే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అవసరమైన మోతాదు కంటే ఎక్కువ ఆక్సిజన్ ను బుక్ చేసుకుంటున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. సాధారణ పడకలను కూడా ఆక్సిజన్ పడకలుగా చూపిస్తూ ఎక్కువ మోతాదులో సిలిండర్లు పొందుతున్నాయన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఆక్సిజన్ పక్కదారి పట్టకుండా మరిన్ని చర్యలు చేపట్టామన్నారు. ఆక్సిజన్ ఫిల్లింగ్ పాయింట్స్ వద్ద పర్యవేక్షణ కోసం డిప్యూటీ తహసీల్దార్, పోలీసులను నియమించనున్నామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తనిఖీ చేస్తామన్నారు.  కార్పొరేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, సంక్షోభ కాలంలో వ్యాపార ధోరణి వీడి మానవతా దృక్పథంతో పనిచేయాలన్నారు. 


*సీటీ స్కాన్ తప్పని సరి కాదు,
సీటీ స్కాన్ వల్ల 300 రెట్లు రేడియేషన్ విడుదల అవుతుంది: జాయింట్ కలెక్టర్ సిరి* 

జేసీ సిరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సీటీ స్కాన్ చేయాల్సిన అవసరం లేదన్నారు.  ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయినా కూడా సీటీ స్కాన్ కానీ, RT PCR పరీక్ష  కానీ అక్కర్లేదన్నారు. కేవలం పాజిటివ్ లక్షణాలు వుంటే అడ్మిట్ చేసుకోవచ్చన్నారు . ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ వైద్యం కోసం వచ్చిన ప్రతి వ్యక్తికి సీటీ స్కాన్ నిర్వహిస్తున్నాయన్నారు. సీటీ స్కాన్  వల్ల  300 రెట్లు రేడియేషన్ విడుదల చేస్తుందన్న విషయం గుర్తించాలన్నారు. 

ప్రయివేటు ఆసుపత్రులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కోవిడ్ బాధితులకు చికిత్స అందించాలన్నారు. ప్రభుత్వం ఇదివరకే కోవిడ్-19 ను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ చికిత్సలకు ధరల పట్టిక కూడా విడుదల చేసిందని... తాజాగా కేవలం కోవిడ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరినా ఆరోగ్యశ్రీ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.  ప్రభుత్వం ఆదేశాల మేరకు 50 శాతం పడకలను ఆరోగ్యశ్రీకి కేటాయించాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు  రెమిడెసివేర్ వ్యాక్సిన్ ని  ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.2400 లకే  కంపెనీల నుంచి పొందాలన్నారు. ఎక్కువ ధర చెప్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 

Anantapur

2021-05-08 12:37:06

విజయసాయి రెడ్డికి ఘన సత్కారం..

విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం అభివృద్ధికి ఎవరి స్థాయిలో వారు విశేష సేవలు అందించాలని రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వం వారంతా  ప్రభుత్వ అతిథిగృహంలో విజయ్ సాయిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా వీరంతా ఆయనను ఘనంగా సత్కరించారు. తమ సేవలను గుర్తించి కీలకమైన ప్రత్యేక ఆహ్వానితులు పదవులు అప్పగించినందుకు వీరంతా విజయసాయిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ్యులు మాట్లాడుతూ, మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ  దేవస్థానం అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. భక్తులకు మరింతగా మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.  ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ ప్రత్యేక ఆహ్వానితులు 
గంట్ల శ్రీనుబాబు, యండమూరి విజయ, దశ మంతుల మాణిక్యాలరావు, ఎస్ ఎన్ రత్నం తో పాటు, అర్బన్ పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మహాదేవ్ ఆనంద్ రావు, పార్టీ నాయకులు, గొల గాని శ్రీనివాస్ తదితరులు పాల్గున్నారు.

Siripuram

2021-05-08 11:47:24

ఆక్సిజన్ మోతాదు పూర్తిస్థాయిలో ఉండాలి..

వైద్య అధికారులు సూచనల మేరకు ఆక్సిజన్ కూడా మెడిసిన్ లాంటిది, ఎక్కువ ఇచ్చినా , తక్కువ ఇఛ్చినా మంచిది కాదు ప్రతి 2 గంటలకు బెడ్లు వద్దకు వెళ్లి డాక్టర్లు  మానిటర్ చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరిణారాయణన్ అన్నారు. శనివారం మధ్యాహ్నం స్థానిక ఆర్.డి.ఓ. కార్యాలయంలో ఆక్సిజన్ వినియోగం, టాంకర్ల రాక పై నోడల్ అధికారులతో, డాక్టర్ల తో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.  కలెక్టర్ మాట్లాడుతూ స్విమ్స్,రుయా ఆక్సిజన్ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి వేస్టేజ్ నివారణ పై ఒక రిపోర్ట్ తయారు చేయాలని, అదే పద్దతి మేరకు ప్రవేట్ లో వినియోగం జరగాలని అన్నారు. ప్రధానంగా పేషెంట్ బాత్ రూమ్ వెళ్ళినపుడు, పుడ్ తీసుకునేటప్పుడు ఆక్సీజన్  వాడకం ఆపాలి అన్నారు. పేషెంట్ కు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి, ఎక్కువైనా ప్రమాదం, తక్కువ అయినా ప్రమాదం అన్నారు. ఐసీయూలో వాడకం, స్టెబిలిటీ వున్న పేషేంట్ల ఆక్సిజన్ బెడ్లకు సిఫ్ట్ వంటివి జరగాలి అన్నారు. ప్రవేట్ ఆసుపత్రులు వాడకం ఆక్సిజన్ బెడ్ల ప్రకారం ఎంత కె.ఎల్.వాడారనే రిపోర్ట్ ప్రతి రోజు రావాలి అన్నారు. డిస్ట్రిబ్యూటర్, డీలర్స్ అమ్ముతున్న వివరాలు ఉండాలి అన్నారు. స్విమ్స్ కొత్త ట్యాన్క్ రెండు రోజుల్లో ఇంస్టాల్ కావాలని సూచించారు. రుయా, మెటర్నటీ కలిపి 25 కె.ఎల్. కెపాసిటీ వుంది, 12 కె.ఎల్. వరకు వాడకం వుంది, ఆక్సిజన్ లేదనే సమస్య తలెత్త రాదు అన్నారు. ఎప్పటికప్పుడు టాంకర్ల ట్రాకింగ్ ఉండాలి, ఆలస్యంగా లేకుండా లారీలు వచ్ఛే విధంగా చూడాలని అన్నారు. ప్రవేట్ ఆసుపత్రులు ప్రతి రోజు  ఆక్సిజన్ ఆడిట్ రిపోర్ట్ ఉండాలి అన్నారు. 

ఈసమీక్ష లో  జెసి( డి)వీరబ్రహ్మం, సబ్ కలెక్టర్ మదనపల్లి జాహ్నవి, అసిస్టెంట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జెసి ( సంక్షేమం) రాజా శేఖర్, ఆర్డీవో కనకనరసా రెడ్డి, జి.ఎం., డిఐసి ప్రతాప్ రెడ్డి, ఆరోగ్యశ్రీ కో ఆర్డినెటర్ డా. బాలాంజనేయులు, రుయా సూపరినెంట్ డా.భారతి, ప్రొఫెసర్ రోజారామణి, స్విమ్స్ ప్రొఫెసర్ డా.ఆలోక్ సమంత్ రో  ,  జి.ఎం. ప్రసన్న లక్ష్మీ, డ్రగ్ ఇన్సెపెక్టర్ కీర్తన, అధికారులు ఉన్నారు.

Tirupati

2021-05-08 11:41:32

లేవుట్లలో మౌళిక సదుపాయాలు కల్పించండి..

పేద‌ల గృహ‌నిర్మాణానికి రూపొందించిన లేఅవుట్ల‌లో మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని జాయింట్(ఆస‌రా, సంక్షేమం) జె.వెంక‌ట‌రావు ఆదేశించారు. సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో శ‌నివారం వ‌ర్చువ‌ల్ మీటింగ్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జెసి మాట్లాడుతూ, ప్ర‌భుత్వం పేద‌ల గృహ‌నిర్మాణానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త నిస్తోంద‌న్నారు. దీనిలో భాగంగా జూన్ 1 నుంచి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాల్సి ఉంద‌న్నారు. దీనికి అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని ఆదేశించారు. జిల్లాలో 846 లేఅవుట్ల‌ను రూపొందించ‌డం జ‌రిగింద‌న్నారు. వీటిలో సుమారు 294 లే అవుట్ల‌లో ఇప్ప‌టికే బోర్లు త‌వ్వ‌కం పూర్తి అయ్యింద‌ని చెప్పారు. మిగిలిన లేఅవుట్ల‌లో కూడా ఈనెల 25 నాటికే బోర్లు వేయ‌డం పూర్తి చేసి, విద్యుత్ స‌దుపాయాన్ని క‌ల్పించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ స‌మావేశంలో గృహ‌నిర్మాణ‌శాఖ పిడి ఎస్‌వి ర‌మ‌ణ‌మూర్తి, పంచాయితీరాజ్ ఎస్ఇ జిఎస్ఆర్ గుప్త‌, ఇఇ కృష్ణారావు, ఆర్‌డ‌బ్ల్యూఎస్ ఎస్ఇ ప‌ప్పు ర‌వి, ట్రాన్స్‌కో ఎస్ఇ వై.విష్ణు త‌దిత‌రులు పాల్గొన్నారు.

జెసి కార్యాలయం

2021-05-08 11:39:32

సోషల్ మీడియా వదంతులు నమ్మొద్దు..

క‌రోనా బాధితులు సోష‌ల్ మీడియాలో వ‌చ్చే అనేక ర‌కాలైన సందేశాల‌ను న‌మ్మి ఆందోళ‌న చెంద‌కుండా ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఎలాంటి ఒత్తిడుల‌కు లోనుకాకుండా వుండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ విజ్ఞ‌ప్తి చేశారు. కోవిడ్ బాధితుల‌కు మెరుగైన వైద్య స‌హాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ని పేర్కొన్నారు. జిల్లాలో కోవిడ్ వ్యాధిగ్ర‌స్తుల‌కు వైద్య స‌హాయం అందించే నిమిత్తం మూడు ర‌కాలుగా వైద్య‌సేవ‌లు అందిస్తున్నామ‌ని తెలిపారు. ఇంటివ‌ద్దే ఉంటూ కోవిడ్ చికిత్స పొందే వారికి ఫోన్ ద్వారా, ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల ద్వారా వారి ఆరోగ్య ప‌రిస్థితులు తెలుసుకుంటూ, హోం ఐసోలేష‌న్ కిట్లు అందించి త‌గిన వైద్య స‌హాయం అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఇంటివ‌ద్ద వుండేందుకు త‌గ‌ని వ‌స‌తులు లేనివారికి కోవిడ్ కేర్ సెంట‌ర్లు ఏర్పాటు చేశామ‌ని, అక్క‌డ ఐసోలేష‌న్‌లో వుంటూ కోవిడ్ నుంచి కోలుకొనేందుకు త‌గిన వైద్య సౌక‌ర్యాలు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. కోవిడ్ కు గురై తీవ్ర‌మైన ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి ఆసుప‌త్రుల్లో చేర్పించి వైద్యం అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

కోవిడ్ ఆసుప‌త్రుల్లో క‌రోనా చికిత్స‌కు అవ‌స‌ర‌మైన రెమ్ డెసివ‌ర్ ఔష‌ధాలు, ఆక్సిజ‌న్ త‌గినంత‌గా అందుబాటులో వుండేలా ఏర్పాట్లు చేశామ‌న్నారు. ఆక్సిజ‌న్‌, కోవిడ్ ఔష‌ధాల స‌ర‌ఫ‌రాపై సోష‌ల్ మీడియాలో వ‌చ్చే సందేశాల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కలెక్ట‌ర్ కోరారు. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు వ‌స్తున్న ఇటువంటి సందేశాల‌ను చ‌దివి ఆందోళ‌న‌కు గురికావ‌ద్ద‌ని సూచించారు. కేవ‌లం ప్ర‌భుత్వ యంత్రాంగం చేసిన అధికారికంగా చేసే ప్ర‌క‌ట‌న‌లు మాత్ర‌మే విశ్వ‌సించాల‌ని కోరారు.

Vizianagaram Collectorate

2021-05-08 11:37:38

500 పడకలతో తాడిపత్రిలో తాత్కాలిక ఆసుపత్రి..

కోవిడ్ బాధితుల కోసం తాడిపత్రి అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ  సమీపంలో 500 ఆక్సిజన్ బెడ్ల తో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ పేర్కొన్నారు. శనివారం తాడిపత్రి వద్ద అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ  సమీపంలో కరోనా నేపథ్యంలో 500 ఆక్సిజన్ బెడ్ల తో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రి కోసం స్థలాన్ని మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తదితరులు పరిశీలించారు. అనంతరం తాడిపత్రి అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ లో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి, ఎంపీ, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ లో ప్రతి రోజు ఎంత కెపాసిటీ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది, ఇతర వివరాలను అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ డైరెక్టర్ జయప్రకాష్ దేవరాజ్ ను వారు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే కోవిడ్ బారిన పడుతున్నారో వారిని రక్షించుకునేందుకు, వారిని ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపచేస్తూ ఎక్కడికక్కడ కోవిడ్ బారిన పడిన వారికి నాణ్యమైన చికిత్స అందించాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కరి ప్రాణం పోకూడదని ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఏర్పాట్లు చేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కోవిడ్ సోకిన వారికి ఖర్చుకు వెనకాడకుండా చికిత్స అందించాలని రాష్ట్ర యంత్రాంగానికి, జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. తాడిపత్రి ప్రాంతంలో అత్యధికంగా ఆక్సిజన్ అందుబాటులో ఉన్న అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద 500 పడకలతో వెంటిలేటర్, ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేస్తే కోవిడ్ సోకిన వారికి ఎంతో ఉపయోగపడుతుందని భావించి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు కలిసి గత రెండు రోజులుగా పడకల ఏర్పాటుకు నిమగ్నమయ్యారన్నారు. అందులో భాగంగా అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ వారితో మాట్లాడి ఆక్సిజన్ పడకల కోసం అవసరమైన ఆక్సిజన్ ను సరఫరా చేయాలని కోరడం జరిగిందన్నారు. అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి ఆక్సిజన్ తరలింపునకు ఇబ్బందులు ఉండడంతో ఫ్యాక్టరీకి దగ్గర్లోనే 500 పడకలతో తాత్కాలిక ఆస్పత్రి నిర్మించడం భావించి ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిపుణుల అభిప్రాయాలను తీసుకొని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి ఇక్కడే 5, 6 ఎకరాల్లో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామన్నారు.  ఆక్సిజన్ పడకల కోసం అవసరమైన ఆక్సిజన్ ఫ్యాక్టరీ నుంచి తీసుకుంటూ షెడ్ల నిర్మాణం చేసి ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. కోవిడ్ సోకిన వారికి సరైన వైద్యం అందించాలనే ఆలోచనతోనే తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటుకు తామంతా ఇక్కడికి రావడం జరిగిందన్నారు. ఆసుపత్రి ఏర్పాటుకు జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు ఎంతో చొరవ తీసుకుని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడడం జరిగిందన్నారు. తాత్కాలిక ఆసుపత్రి పనులు ప్రారంభించేందుకు ఒకటి, రెండు రోజుల్లో అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.

తాడిపత్రి ప్రాంతంలో 500 ఆక్సిజన్ పడకలతో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయడంవల్ల అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కరోనా సోకిన వారికి మంచి వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా యంత్రాంగాలకు లక్ష్యాలను నిర్దేశించి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటును ప్రతిఘటన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా సోకిన వారికి ఆక్సిజన్ అందించేందుకు ముందుకు వచ్చిన అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ కరోనా కట్టడి చర్యల్లో భాగంగా అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద 500 ఆక్సిజన్ పడకలతో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఆక్సిజన్ పడకలతో ఆసుపత్రి ఏర్పాటు చేయడం వల్ల కరోనా బాధితులకు ఎంతో మేలు జరుగుతుందని, ఆక్సిజన్ ను ఇతర ప్రాంతాలకు తీసుకుపోయే పరిస్థితులు లేకపోవడం వల్ల ఇక్కడ ఆసుపత్రిని ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేస్తామన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ కోవిడ్ సోకిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు వీలుగా తాడిపత్రి పరిధిలోని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద 500 ఆక్సిజన్ పడకలతో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం అవసరమైన భూమిని పరిశీలించేందుకు ఈరోజు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలతో ఇక్కడికి రావడం జరిగిందన్నారు. తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలాన్ని చూసి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ఫైనలైజ్ చేయడం జరిగిందని, అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న చర్చికి సంబంధించిన స్థలంలో ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆసుపత్రి ఏర్పాటుకు చర్చికి సంబంధించిన వారు కూడా సహృదయంతో ముందుకు వచ్చారన్నారు. త్వరలోనే ఇక్కడ తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేసి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటామని, కరోనా సోకిన వారికి మంచి వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు చర్చికి సంబంధించిన ఫాస్టర్ ఫాదర్ డేవిడ్ అర్లప్ప, చర్చి స్కూల్ హెడ్ సెలీనా సిస్టర్ లతో మాట్లాడి తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని చర్చించారు. సందర్భంగా చర్చికి చెందిన ఫాస్టర్, చర్చి స్కూల్ హెడ్ లు తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటుకు స్థలం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఇందుకు తమకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గుణ భూషణ్ రెడ్డి, పరిశ్రమల శాఖ జిఎం అజయ్ కుమార్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ ఈ వర కుమార్, తహసిల్దార్ నాగభూషణ, ఏపీ ఎమ్ ఎస్ఐ డి సి ఈఈ రాజగోపాల్ రెడ్డి, ఐనొక్స్ గ్యాస్ ప్లాంట్ ఇంచార్జి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tadipatri

2021-05-08 11:36:25

కరోనా నియంత్రణలో సర్పంచ్ లు పాల్గొనాలి..

క‌రోనాను త‌రిమికొట్టేందుకు ప్ర‌భుత్వ‌యంత్రాంగంతోపాటు ప్ర‌జాప్ర‌తినిధులంతా క‌లిసిక‌ట్టుగా కృషి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ కోరారు. కోవిడ్‌పై పోరులో స‌ర్పంచ్‌ల పాత్ర ఎంతో కీల‌క‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల స‌ర్పంచ్‌లు, పంచాయితీ అధికారుల‌తో ఆయ‌న శ‌నివారం టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి, జిల్లానుంచి క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. టెలీకాన్ఫ‌రెన్స్‌లో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, క‌రోనాను నియంత్రించాలంటే, ఈ వ్యాధిప‌ట్ల ప్ర‌తీఒక్క‌రిలో అవ‌గాహ‌న క‌ల్పించి, జాగ్ర‌త్త‌లు పాటించేలా స‌ర్పంచ్‌లు కృషి చేయాల‌న్నారు.   త‌ప్ప‌నిస‌రిగా మాస్కుల‌ను ధ‌రింప‌జేయ‌డం, త‌ర‌చూ చేతుల‌ను స‌బ్బు లేదా శానిటైజ‌ర్‌తో శుభ్రం చేసుకోవ‌డం, భౌతిక దూరాన్ని పాటించ‌డం, ఈ మూడు ముఖ్య‌మైన ప‌నులు చేస్తే క‌రోనా అంత‌మ‌వుతుంద‌న్నారు. పూర్తిగా అవ‌గాహ‌న లేకపోవ‌డం, నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ఇటీవ‌ల మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌ని చెప్పారు. అలాగే ఎవ‌రికైనా కోవిడ్ సోకితే, వారిప‌ట్ల మాన‌వ‌తా దృక్ఫ‌థాన్ని ప్ర‌ద‌ర్శించాల‌న్నారు. ల‌క్ష‌ణాలు లేనివారిని హోం ఐసోలేష‌న్‌లో ఉంచి చికిత్స చేస్తున్నామ‌ని, ఇటువంటి వారికి కోవిడ్ కిట్ల‌ను ఇంటివ‌ద్ద‌కే పంపిస్తున్నామ‌ని చెప్పారు. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారు, హౌస్ క్వారంటైన్‌లో ఉన్న‌వారు ఇళ్ల‌నుంచి బ‌య‌ట‌కు రాకుండా చూడాల‌ని స‌ర్పంచ్‌ల‌ను కోరారు.

              క‌రోనా ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉన్న‌వారిని, ఐసోలేష‌న్‌లో ఉండే అవ‌కాశం లేనివారినీ కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌కు త‌ర‌లించాల‌న్నారు. జిల్లాలో ఏడు కేర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశామ‌ని, వీటిలో సుమారు 3వేల ప‌డ‌క‌లు సిద్దంగా ఉన్నాయ‌ని చెప్పారు. ఆక్సీజ‌న్ స్థాయిలు ప‌డిపోయిన‌వారికి, ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స‌ను అందిస్తున్నామ‌న్నారు. జిల్లో ఇప్ప‌టికే 28 కోవిడ్ ఆసుప‌త్రుల్లో ఉచితంగా చికిత్స అందిస్తున్న‌ట్లు చెప్పారు. క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌భుత్వం క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తోంద‌ని, దీనికి గ్రామ ప్ర‌థ‌మ పౌరులంతా త‌మ‌వంతు స‌హ‌కారాన్ని అందించాల‌ని కోరారు. క‌ర్ఫ్యూ స‌మ‌యంలో ప్ర‌తీ షాపు మూసివేయాల‌ని, ప్ర‌జ‌లంతా ఇళ్ల‌లోనే ఉండేలా చూడాల‌న్నారు. క‌ర్ఫ్యూ స‌డ‌లింపు స‌మ‌యంలో మాస్కును ధ‌రిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగించాల‌ని కోరారు. నిబంధ‌న‌ల‌ను పాటించ‌ని వారి వివ‌రాల‌ను రెవెన్యూ, లేదా పోలీసు అధికారుల‌కు తెలియ‌జేయాల‌ని సూచించారు.

              ప్ర‌స్తుత స‌మయంలో స‌ర్పంచ్‌లంతా పారిశుధ్యంపైనా, త్రాగునీటి స‌ర‌ఫ‌రా పైనా దృష్టి పెట్టాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. కాలువ‌ల్లో పూడిక‌ను తొల‌గించాల‌ని, గ్రామాల్లో హైపో క్లోరియం, బ్లీచింగ్ పౌడ‌ర్ పిచికారీ చేయాల‌న్నారు. వేస‌విలో గ్రామ ప్ర‌జ‌లు త్రాగునీటికి ఇబ్బంది ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ స‌మ‌యంలో వ‌డ‌గాడ్పులు ఎక్కువ‌గా ఉంటాయ‌ని, అలాగే పాముకాట్లు, తేలు కాట్లు కూడా ఎక్కువ‌గా చోటు చేసుకొనే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు. జిల్లాను హ‌రిత విజ‌య‌న‌గ‌రంగా మార్చడంలో స‌ర్పంచ్‌లు కూడా భాగ‌స్వాములు కావాల‌ని క‌లెక్ట‌ర్ పిలుపునిచ్చారు. మొక్క‌లు నాటేందుకు అవ‌కాశం ఉన్న స్థ‌లాల‌ను ఇప్ప‌టినుంచే గుర్తించి, జూన్ మొద‌టి వారంలో వ‌ర్షాలు ప‌డే స‌మ‌యానికి మొక్క‌లు నాటాల‌ని సూచించారు. ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్రం, ప‌రిపూర్ణ ఆరోగ్యం మ‌న ల‌క్ష్యాల‌ని, ఈ మ‌హాయ‌జ్ఞంలో స‌ర్పంచ్‌లంతా భాగ‌స్వాములు కావాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.

               ఈ సంద‌ర్భంగా మెర‌క‌ముడిదాం మండ‌లం గ‌ర్భాం, కొమ‌రాడ మండ‌లం చోళ్ల‌ప‌థం స‌ర్పంచ్‌లు క‌లెక్ట‌ర్‌తో మాట్లాడి, త‌మ గ్రామ స‌మ‌స్య‌ల‌ను వివ‌రించి, ప‌రిష్కారానికి క‌లెక్ట‌ర్ నుంచి హామీని పొందారు. కాన్ఫ‌రెన్స్‌లో స‌ర్పంచ్‌ల‌తోపాటు ఇఓపిఆర్‌డిలు, పంచాయితీ అధికారులు, సుమారు 500 మంది స‌ర్పంచ్‌లు పాల్గొన్నారు.

Vizianagaram Collectorate

2021-05-08 11:28:27

ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత రానివ్వకండి..

ఆక్సిజన్ కొరత రానివ్వకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి చెప్పారు. శనివారం కాకినాడ జిజిహెచ్ లో పర్యటంటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  రెండు వారాల క్రితం 1.7 కేఎల్ పీయస్ఎ యూనిట్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. మరో వారం రోజుల్లో 10 కేయల్  సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ సిలిండర్ ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.  దీని ద్వారా జిల్లాలో ఎక్కడ ఆక్సిజన్ కొరతా లేకుండా ఉంటుందన్నారు. ఆక్సిజన్ కొరత రానివ్వకుండా ఉన్న దానిని దుర్వినియోగం చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు.   అనంతరం జిజిహెచ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఆవరణంలో ఏర్పాటు చేయనున్న 10 కేల్  సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటును కలెక్టర్, జెసి పరిశీలించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.పి వెంకట బుద్ధ, ఆర్ఎమ్ఓ డా.ఈ గిరిధర్, జిజిహెచ్ నోడల్ అధికారి ఎమ్ .భాను ప్రకాష్ , ఇతర వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-08 11:26:13

ఆసుపత్రుల సామర్ధ్యాన్ని పెంచండి..

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి  సంబంధించి ఎక్కువ సంఖ్యలో కోవిడ్ కేసులు వస్తున్నందున పడకల సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. శనివారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి  ఈఎన్టీ బ్లాక్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను, కోవిడ్ వార్డులను జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, వైద్య అధికారులతో కలిసి కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిజిహెచ్ కు వస్తున్న కోవిడ్ కేసుల సంఖ్యకు అనుగుణంగా పడకల సామర్ధ్యాన్ని పెంచడానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కోవిడ్ సోకి, జిజిహెచ్ లో వైద్యం పొందిన 5 రోజుల తర్వాత ఆరోగ్యం స్థిరంగా ఉన్నవారిని కోవిడ్ కేర్ సెంటర్లకు లేదా డిశ్చార్జి చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కోవిడ్ వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలు, వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.పి వెంకట బుద్ధ, ఆర్ఎమ్ఓ డా.ఈ గిరిధర్, జిజిహెచ్ నోడల్ అధికారి ఎమ్ .భాను ప్రకాష్ , ఇతర వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-08 11:23:16

కరోనా సేవకు పాహనోక్ ముందడుగు..

విశాఖ మహానగరంలో కరోనా కేసులు పెరుగుతున్న ద్రుష్ట్యా తమవంతు సహకారం అందించేందుకు జీవీఎంసీ 45 వ వార్డు కార్పొరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపాహనోక్  ముందుకొచ్చారు. విశాఖలో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు  విజయ సాయి రెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి భారతి ఫౌండేషన్  ద్వారా కరోనా రోగుల కోసం నిర్వహిస్తున్న 200 పడకల ఆక్సిజన్ సెంటర్ కు రూ. 5 లక్షల అందజేశారు. 
ఈ సందర్భంగా సాయి రెడ్డి మాట్లాడుతూ ప్రగతి భారతి ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగస్వాముల అయ్యేందుకు ఎవరైనా ముందుకు రావచ్చన్నారు. ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అందరూ ఐక్యం కావాలని కోరిన ఆయన కరోనా రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు.  జీవీఎంసీ డిప్యూటీ  ఫ్లోర్ లీడర్ హనోకు మాట్లాడుతూ తన తల్లి, తన సోదరుడు కరోనా వలనే మరణించారని, ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అందరం ఐక్యంగా పోరాటం చేయాలనే సదుద్దేశంతోనే తాను ఈసేవకు ముందుకు వచ్చానన్నారు. 

Siripuram

2021-05-08 09:35:11

అప్పన్న చందన సమర్పణకు విరాళం..

విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 14న చందనోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ఏడాది పొడవునా సుగంధభరిత చందనము లో ఉండే స్వామి ఒక్క వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తారు. కరోనా  నేపథ్యంలో ఈ ఏడాది  ఏకాంతంగానే స్వామికి సేవలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సింహాద్రి నాధుడు చందన ప్రసాదం సమర్పణకు భక్తుల నుంచి  ఆలయ వర్గాలు విరాళాలు కోరుతున్నాయి. ఈ మేరకు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు దంపతులు స్వామిని దర్శించుకుని మూడు కేజీలు చందన సమర్పణకు విరాళం అందజేశారు. రూ.60.348 వేల చెక్ రూపములో ఆలయ  ఏ ఈఓ రాఘవ కుమార్ కు అందజేశారు. అందరి సహకారముతో ఉత్సవాలు మరింత  విజయవంతం అవుతాయని శ్రీను బాబు ఆకాంక్షించారు. ఈ కార్య క్రమంలో స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ఆలయ పురోహితులు అలంకారి కరి సీతారామాచార్యులు,  అర్చకులు రాజీవ్ లోచన, సూపరెండెంట్ దాసరి బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Simhachalam

2021-05-08 09:27:57