1 ENS Live Breaking News

తగ్గుముఖం పడుతున్న కోవిడ్ కేసులు..

కోవిడ్ పాజిటివిటీ త‌గ్గుముఖం పడుతున్న సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని..  ఈ సరళిని మున్ముందు కొన‌సాగేందుకు, రాజీ లేకుండా టెస్టింగ్‌, ప‌డ‌క‌ల సంఖ్య‌, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా సామ‌ర్థ్యాన్ని పెంచ‌డంతో పాటు అందుబాటులో ఉన్న డోసుల‌ను బ‌ట్టి వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని స‌జావుగా నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. మంగ‌ళ‌వారం సాయంత్రం క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి కోవిడ్ నివార‌ణ‌, నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌తో పాటు ధాన్యం సేక‌ర‌ణ‌, ఖ‌రీఫ్ స‌న్న‌ద్ధ‌త‌పై మీడియా స‌మావేశంలో వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ దాదాపు 4,500 వ‌ర‌కు ఉన్న ఆర్‌టీపీసీఆర్ రోజువారీ సామ‌ర్థ్యాన్ని 7,500 వ‌ర‌కు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని, కోవిడ్ ల‌క్ష‌ణాలున్న వారికి మాత్ర‌మే ఫోక‌స్డ్‌గా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. ఆక్సిజ‌న్ ల‌భ్య‌త‌, నిష్ణాతులైన వైద్యులు, ఇత‌ర సిబ్బంది ల‌భ్య‌తను బ‌ట్టి నెమ్మ‌దిగా ఆక్సిజ‌న్ ప‌డ‌క‌ల సంఖ్య‌ను క్రమంగా పెంచుతున్నామ‌ని, రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోని ఆంధ్రా పేప‌ర్ మిల్లుకు అనుసంధానంగా 300-400 ఆక్సిజ‌న్ ప‌డ‌క‌లతో చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు స‌న్నాహ‌కాలు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. పేప‌ర్‌మిల్లులో పున‌రుద్ధ‌రించిన యూనిట్ ద్వారా ఉత్ప‌త్తి అవుతున్న 15 కేఎల్ ఆక్సిజ‌న్‌ను ఈ చికిత్సా కేంద్రానికి అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు. పెద్దాపురంలోనూ ఓ యూనిట్‌ను పున‌రుద్ధ‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, ఇది అందుబాటులోకి వ‌స్తే రోజుకు 480 సిలిండ‌ర్ల మేర ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి జ‌రుగుతుంద‌న్నారు. వ్యాక్సినేష‌న్‌పై ఎలాంటి అపోహ‌లు అవ‌స‌రం లేద‌ని, కేంద్రం నుంచి అందుతున్న డోసుల మేర‌కు జిల్లాలో శాశ్వ‌త కేంద్రాల ద్వారా పంపిణీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. రెండో డోసు ఎక్కువ రోజులు పెండింగ్ ఉన్న‌వారికి తొలుత ప్రాధాన్య‌మివ్వ‌నున్నామ‌ని, వాలంటీర్ల ద్వారా టోకెన్లు పంపిణీ చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ టోకెన్లు లేకుండా ఎవ‌రూ వ్యాక్సిన్ కేంద్రాల‌కు రావొద్ద‌ని సూచించారు. రెండో డోసు పెండింగ్ ఉన్న‌వారికి వ్యాక్సినేష‌న్ పూర్త‌య్యాకే మొద‌టి డోసు పంపీణీ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. రెమిడెసివిర్ ఇంజ‌క్ష‌న్ల‌ను రోగికి ఇచ్చేందుకు స్టాండ‌ర్డ్ ప్రోటోకాల్ ఉంద‌ని, దాని ప్ర‌కారం మాత్ర‌మే ఈ ఔష‌ధం ఇవ్వాల్సి ఉంటుంద‌ని వివ‌రించారు. బ‌య‌ట జ‌రిగే అవాస్త‌వ ప్ర‌చారాల‌ను న‌మ్మి, అన‌వ‌స‌రంగా ఇంజెక్ష‌న్ కోసం వెంప‌ర్లాడ‌టం మంచిది కాద‌న్నారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు అనే తేడా లేకుండా అన్ని కోవిడ్ ఆసుప‌త్రుల్లో మెడిక‌ల్ ఆక్సిజ‌న్ కొర‌త లేకుండా చూస్తున్నామ‌ని, జేసీ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నార‌న్నారు. వివిధ కార‌ణాల వ‌ల్ల బ‌య‌ట నుంచి ట్యాంకుల ద్వారా ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు అవాంత‌రం ఏర్ప‌డిన నేప‌థ్యంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో వినియోగించుకునేందుకు జీజీహెచ్ కాకినాడ‌, జీహెచ్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో మెడిక‌ల్ ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లను సిద్ధంగా ఉంచిన‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. కోవిడ్ చికిత్స కోసం గుర్తింపులేని ఆసుప‌త్రుల్లో చేరొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు క‌లెక్ట‌ర్ సూచించారు. మీడియా ప్రజలకు వాస్తవాలు వివరించి అవగాహన, అప్రమత్తలతో విపత్తును ధైర్యంగా ఎదుర్కోనేలా సమాయత్త పరచాలని, భయాందోళనలు కల్పించ కూడదని కోరారు. 

కాకినాడ

2021-05-11 14:16:53

బుధవారం నుంచి కోవిడ్ వేక్సినేషన్..

విజయనగరం  జిల్లాలో బుధవారం నుంచి వేక్సినేషన్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశించారు. వైద్యారోగ్యశాఖ అధికారులతో మంగళవారం సాయంత్రం టెలికాన్ఫెరెన్స్ నిర్వహించి, వెక్సినేషన్ పై సమీక్ష జరిపారు. ఈ నెలాఖరు వరకు రెండో డోసు మాత్రమే వేయాలని ఆదేశించారు. వెక్సినేషన్ లో వైద్యారోగ్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వేక్సిన్ కేంద్రాలను మండలాలలో పిహెచ్సి ల నుంచి పాఠశాలలకు మార్చినందువల్ల, ఈ విషయాన్ని అందరికి తెలియజెయాలని సూచించారు. వేక్సిన్ కోసం వచ్చేవారికి కేంద్రాలవద్ద ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. లబ్ధిదారులకు ముందుగా ఏఎంఎం ల ద్వారా  సమాచారం ఇచ్చి, వారిని మాత్రమే కేంద్రాలకు రప్పించడం వల్ల, కేంద్రాలవద్ద రద్దీ తగ్గుతుందని, ప్రజలకు ఇబ్బందులు కూడా ఉండవని సూచించారు. జిల్లాలో కోవాగ్జిన్ కోసం 22 కేంద్రాలను, కోవిషీల్డ్ కోసం 42 వేక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ టెలీ కాన్ఫెరెన్సులో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్వీ రమణ కుమారి, డిఐవో డాక్టర్ గోపాలకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-11 14:11:26

నాడు-నేడు పనులు వేగం పెంచాలి..

నాడు - నేడు కింద చేపడుతున్న అభివృద్ధి పనులు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్ లు, గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు, పేదలందరికీ ఇల్లు కింద నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్ లతో రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ 19, ఎన్ఆర్ఈజిఎస్ పనులు, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, డా.వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ లు, వై.ఎస్.ఆర్ జలకళ, వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్ లు, నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పురోగతి,  స్పందన గ్రీవెన్స్ తదితర అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

అనంతపురం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ, తదితరులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ శాఖల కింద చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు. నాడు నేడు కింద ఆయా పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, రైతు భరోసా కేంద్రాలు భవనాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్ లు, గ్రామ సచివాలయ భవనాల నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని ఇంజనీరింగ్ శాఖల అధికారులను ఆదేశించారు.  నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు ఏర్పాటుచేసిన లేఔట్లలో నీటి సౌకర్యం, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు, పెన్షన్ కార్డు, రైస్ కార్డులను నిర్దేశిత సమయంలోపు ఖచ్చితంగా ఇచ్చేలా చూడాలని, అలాగే 90 రోజుల్లోపు దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్లను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా సచివాలయాలకు వచ్చే గ్రీవెన్స్ కు సంబంధించి ఎలాంటి పెండింగ్ ఉంచరాదని, ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ కి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ సీజన్లో కూలీలకు ఉపాధి పనులు ఎక్కువగా కల్పించాలని డ్వామా పిడిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి,  స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు వరప్రసాద్, రవీంద్ర, ఆనంద్, డిఎంఅండ్హెచ్ఓ కామేశ్వర ప్రసాద్, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, ఐసిడిఎస్ పిడి విజయలక్ష్మి, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ నీరజ, డి సి హెచ్ ఎస్ రమేష్ నాథ్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, హౌసింగ్ పిడి చంద్రమౌళి రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-05-11 14:03:52

నా పుట్టిన రోజుకి ఎవరూ రావొద్దు దయచేసి..

తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం శుభాకాంక్షలు స్వయంగా చెప్పడానికి ఎవరూ రావొద్దని ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ విజ్ఞప్తి చేశారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి అధికంగా వున్నందున తనకు శుభాకాంక్షలు వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా తెలియజెస్తే సరిపోతుందని సూచించారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉదృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని,  ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వేడుకలు చేసుకోవడం భావ్యం కాదన్నారు. మిఠాయిలకు,  పూల గుత్తులు,  దండల కోసం వెచ్చించే బదులు ఆ సొమ్ముతో నిరుపేదలకు మాస్క్ లు, శానిటైజర్స్,  ఫేస్ సీల్డ్స్ పంపిణీ చేస్తే తాను చాలా సంతోషిస్తానని పేర్కొన్నారు.  అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ తమతమ ఇళ్ళ నుంచి బయటకు రావద్దని హితవు పలికారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావలసి వస్తే తప్పనిసరిగా రెండు మాస్క్ లు ధరించి,  సామాజిక దూరం పాటిస్తూ,  శానిటైజర్ వినియోగిస్తూ కోవిడ్ నిబంధనలు ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  రాజన్న రచ్చబండ కార్యక్రమంలో కూడా ప్రజారోగ్య సమస్యలపైనే ప్రధాన దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.  వ్యక్తిగత సమస్యలతో తన వద్దకు కొద్ది రోజుల పాటు రావద్దని ఎంపి భరత్ రామ్ ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Rajahmundry

2021-05-11 13:55:08

2వ డోసు కోవిడ్ వేక్సిన్ తప్పక వేయించుకోవాలి..

రాష్ట్రప్రభుత్వం కరోనా నియంత్రణలో భాగంగా అందిస్తున్న కోవిడ్ రెండో డోసు వేక్సిన్ మొదటి వేక్సిన్ తీసుకున్నవారంతా వేయించుకోవాలని జివిఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి కోరారు.  మంగళవారం 2వ జోను పరిధిలోని 11వ వార్డులో పలు ప్రాంతాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరిలోవలోని ఎఫ్.ఆర్.యు. ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, భౌతిక దూరం పాటించాలని, విధిగా మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలలో చెత్త లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు ఆ ప్రదేశాన్ని శానిటేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పాత ఆరిలోవ, డ్రైవర్సు కోలనీ, అన్నానగర్, తోటగరువు, గాంధీ నగర్, రవీంద్ర నగర్ తదితర ప్రాంతాలలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రితో కలసి పర్యటించి, ఆయా ప్రాంతాలలో జరుగుచున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. తడి చెత్త-పొడి చెత్త సేకరించే విధానాన్ని పరిశీలించారు. ప్రజల నుండి తడి–పొడి చెత్త వేరు వేరుగా తీసుకోవాలని పారిశుధ్య సిబ్బందికి సూచించారు. గాంధీనగర్ లోని గెడ్డ నందు పూడిక తీయించాలని, రోడ్లను, కాలువలను శుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎప్పటికప్పుడు డంపింగు యార్డుకు తరలించాలని శానిటరి  ఇన్  స్పెక్టర్ ను ఆదేశించారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బంది ప్రతీ రోజూ కాలువలు, రోడ్లను శుభ్రం చేస్తున్నదీ లేనిదీ ఆరాతీసారు. తడి–పొడి చెత్తను వేరుచేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని ప్రజలకు సూచించారు. ఆయా ప్రాంతాలలో వెలగని వీధి లైట్లను యుద్ధ ప్రాతిపదికన మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం వార్డులో ప్రధాన వీధులలో “బెల్ మిస్టర్” మిషన్ ద్వారా సోడియం హైపోక్లోరైట్ చల్లే ప్రక్రియను ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రితో కలసి పరిశీలించారు.  ఈ పర్యటనలో జివిఎంసి ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, బయోలజిస్టు, శానిటరి  ఇన్  స్పెక్టర్, వార్డు శానిటరి కార్యదర్శులు, శానిటరి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Arilova

2021-05-11 13:26:53

కళింగ కోవిడ్ కేర్ కేంద్రంలో 60 బెడ్లు..

కోవిడ్ రెండవ దశ ఉద్ధృతం ఉన్న సమయంలో ఐఎన్ఎస్ కళింగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి  శ్రీనివాసరావు కోరారు. మంగళవారం కళింగలో కోవిడ్ కేర్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. భీమిలి నియోజకవర్గంలో కోవిడ్  బాధితులను ఆదుకోవడం కోసం భీమిలి ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ల పర్యవేక్షణలో 60  బెడ్లతో పాటు 16 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశామన్నారు.  అవసరమైన అన్ని సదుపాయాలతో ఈ కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసిన ఐఎన్ఎస్ కళింగ నేవి సిబ్బందికి  మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు అందరూ స్వచ్ఛందంగా కరోనా నియంత్రణకు సహకరించాలన్నారు. ఎవరూ బయటకి రాకుండా  శానిటైజేషన్  మరియు నిత్యం మాస్కులు ధరించి కోవిడ్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్ఎస్ కళింగ చీఫ్ కమాండర్ కమడోర్ నీరజ్ ఉదయ్, డిఎంహెచ్ఓ సూర్యనారాయణ, 4వార్డు కార్పొరేటర్ దౌలపల్లి కొండబాబు, భీమిలి హెల్త్ ఆఫీసర్ సిద్దార్థ్, వైద్యాధికారులు, నేవీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఐఎన్ఎస్ కళింగ

2021-05-11 13:14:49

మరింతగా సేవలు అందించాలి..

కోవిడ్ మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన విపత్కర పరిస్థితులలో మరింతగా మానవతా దృక్పథంతో పనిచేసి రోగులకు సేవలందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను కోరారు. మంగళవారం  తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్-19, ఉపాధి హామీ పథకం, హౌసింగ్, స్పందన గ్రీవెన్స్ లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు, యంత్రాంగం కోవిడ్ నియంత్రణ నిమిత్తం సమర్థవంతంగా పనిచేసారని ప్రశంసించారు. 
104 కాల్ సెంటర్ల పనితీరు మరింతగా మెరుగు పరచాలని, కాల్ చేసిన వ్యక్తికి ఖచ్చితమైన సమాచారాన్ని అందించి, సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.  జిల్లా స్థాయి ఆక్సిజన్ సెల్ లు సమన్వయంతో పనిచేసి ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలని అన్నారు. విశాఖపట్నం నుంచి జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, రూరల్ ఎస్పీ బి.కృష్ణా రావు, అసిస్టెంట్ కలెక్టర్ అదితి సింగ్, ఎఏంసి ప్రిన్సిపాల్ డా. పి వి సుధాకర్, డిఎంహెచ్ఓ డా.సూర్య నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

కలెక్టరేట్

2021-05-11 13:08:20

శివం ఫౌండేషన్ సేవలు అభినందనీయం..

కరోనా బాధితులను ఆదుకునేలా శివం ఫౌండేషన్ అందిస్తున్న సేవలు  అభినందనీయమని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ కొనియాడారు. దర్శి మాజీ శాసన సభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి ద్వితియ వర్థంతి సందర్భంగా శివం ఫౌండేషన్ చీమకుర్తి వారు రిమ్స్ ఆసుపత్రికి 25 ఆక్సిజన్ సిలిండర్లను కలెక్టర్ చేతులమీదుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములుకు మంగళవారం అందజేశారు. ప్రకాశం భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ కరోనా బాధితుల కోసం రిమ్స్‌లో మరో 80 పడకలు తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ చికిత్స పొందుతున్న వారికి ఈ ఆక్సిజన్ సిలిండర్లను వినియోగిస్తామని చెప్పారు. శివం ఫౌండేషన్ సేవలను స్ఫూర్తిగా తీసుకొని కోవిడ్ బాధితులకు ఉపయోగపడేలా ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మంచాలు, పరుపులను అందించేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. ఆర్థిక పరంగా సహాయం చేయాలనుకునేవారు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు. శివం ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొల్లపూడి హరి మాట్లాడుతూ సమాజ సేవే సర్వేశ్వరుని సేవగా భావించి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. రిమ్స్‌లో కోవిడ్ బాధితులకు ఉపయోగపడేలా మూడు లక్షల రూపాయల విలువైన ఈ ఆక్సిజన్ సిలిండర్లను అందజేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్థి) టి.ఎస్. చేతన్,
డి.ఎమ్.హెచ్.ఓ. రత్నావళి, రిమ్స్ డిప్యూటి సూపరింటెండెంట్ మురళీకృష్ణారెడ్డి,
ఏ.పి.ఎమ్.ఐ.డి.సి. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవి కుమార్, ఇతర అధికారులు, శివం ఫౌండేషన్
ప్రతినిధులు పాల్గొన్నారు.

PRAKASAM

2021-05-11 12:58:37

మానవతా ద్రుక్పదంతో సేవలందించాలి..

కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందేలా అధికారులు మానవతా దృక్పధంతో వ్యవహరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయనపునరుద్ఝాటించారు. కరోనా నివారణ, పలు అభివృద్థి కార్యక్రమాలపై మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క రోనా అనుమానితులకు, బాధితులకు ఏ విధ మైన సహాయం కావాలన్నా తక్షణమే స్పందించేలా ఏర్పాటుచేసిన 104 కాల్‌సెంటర్ నిర్వహణ పై కలెక్టర్, సంబంధి త సంయుక్త కలెక్టర్ ప్రత్యేక శ్రద్థ పెట్టాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సూచించారు. వైద్య సేవలు అవసరమైన వారికి మూడు గ ంటల్లోనే అవి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆపదలో వుండి 104 కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసిన వారిని తమ కుటుం బ
సభ్యులుగా భావించి వారికి అవసరవై ున వైద్యసేవలు అందేలా అధికారులు తక్షణమే స్పందించాలని సి.ఎమ్. స్పష్టం చేశారు. కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వైద్యసేవలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నందున ఆయా ఆసుపత్రుల్లో పారిశుద్థ్య నిర్వహణ, ఔషధాల లభ్యత, తగిన సంఖ్యలో వై ద్య సిబ్బంది , ఆరోగ్యశ్రీ కార్యకర్త ఉండేలా అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి దిశానిర్థేశం చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ పేషంట్లకు ఆయా యాజమాన్యాలు ఖచ్చితంగా కేటాయించేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో అవస రమైన వైద్య సిబ్బందిని తక్షణమే భర్తీ చేసుకోవాలని సి.ఎమ్. ఆదేశించారు. క రోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌ను సమకూర్చుకోవడంలో ప్రణాళికాబద్ధ ంగా వ్యవహరించాలని అన్నారు. ఆక్సిజన్ వి నియోగక్ర మంలో వృధాను అరికట్టాలని చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్లకు కూడా అవసరాన్ని బట్టి ఆక్సిజన్ అందుబాటులో వుంచాలన్నారు. రాష్ట్రంలో క రోనా మరణాలు అత్యల్ప స్థాయిలో
వుండటానికి కలెక్టర్లు, వైద్యుల నుంచి క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, ఏ.ఎన్.ఎమ్.లు, ఆశావర్కర్లు చిత్తశుద్థితో పనిచె యడమే కారణమని అభినందించారు.

కరోనా కట్టడికి కర్ఫ్యూ ఆంక్షలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు
అభివృద్థి కార్యక్రమాలను కూడా ప్రాధాన్యం ఇచ్చి చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. పేదలకు ఇటీవల ఇచ్చిన ఇళ్ల స్థలాలలో జూన్ నుంచి ఇళ్లు నిర్మించుకునేందుకు అవసరమైన ఇసుక, సిమెంటు, స్టీలు అందుబాటులో వుండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు అవసర మైన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఉపాధిహామి పథకంలో 20 కోట్ల పనిదినాలు ఈ ఆర్థిక సంవత్సరంలో కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నందున వాటిలో 80 శాతం మే, జూన్ నెలల్లోనే పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఖరీఫ్ వ్యవసాయ పనులు ముమ్మరం కావటానికి ముందే ఉపాధి హామి పనులను పెద్దఎత్తున చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని, ఈ విషయం పై ప్రకాశం జిల్లా అధికారులు మరింత దృష్టి
సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  పోల భాస్కర్, జాయింట్ కలెక్టర్లు జె.వి. మురళి (ఆర్.బి. అండ్. ఆర్.), టి.ఎస్. చేతన్ (సచివాలయాలు, అభివృద్థి), క్రిష్ణవేణి (ఆసరా, సంక్షేమం), కంద ుకూరు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ, మార్కాపురం, ఒంగోలు ఆర్.డి.ఓ.లు శేషిరెడ్డి, ప్రభాకర రెడ్డి , వ్యవసాయ శాఖ జె.డి. శ్రీరామమూర్తి, డి.పి.ఓ. నారాయణ రెడ్డి, డ్వామా పి.డి. శీనారెడ్డి, ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్.ఇ. వ ుర్థన్ అలి, పంచాయతి రాజ్ ఎస్.ఇ. కొండయ్య, డి.ఎమ్.హెచ్.ఓ. డాక్టర్
రత్నావళి, డి.సి.హెచ్.ఎస్. డాక్టర్ ఉషారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Ongole

2021-05-11 12:53:36

ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరాలి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలన, సేవలను సమాచారశాఖ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ఏడి తన్నీమోహన్ కు సూచించారు. మంగళవారం కొత్తగా విధుల్లోకి చేరిన ఏడీ జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  ప్రభుత్వానికి మంచి పెరు తెచ్చేలా సమాచారశాఖ సేవలు అందించాలని సూచించారు. మీడియాకు అందుబాటులో ఉండి  తాజా సమాచారాన్ని అందజేయాలన్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా దానిని మీడియా ద్వారా ప్రజలకు చేరవేయడంలో ముందుండాలన్నారు. ఎలాంటి సమస్యలున్నా తక్షణమే తన ద్రుష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏపీఆర్ ఓ డి.దుర్గాప్రసాద్, ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Ongole

2021-05-11 12:42:41

డబుల్ లేయర్ మాస్కులనే ధరించండి..

కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడానికి ప్రజలంతా రెండు లేయర్ల మాస్కులు ధరించడం ద్వారా కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడానికి అవకాశం వుంటుందనే ప్రభుత్వ సూచనను పాటించాలని తహశీల్దార్ జ్నానవేణి కోరుతున్నారు. విశాఖలో ఈ మేరకు మంగళవారం ఆమె మీడియాకి ప్రకటన విడుదల చేశారు. సాధారణ మాస్కు కంటే రెండింతలు పటిష్టంగా ఉండే మాస్కు ధరించడం ద్వారా వైరస్ దరిచేరే అవకాశం తక్కువగా వుంటుందనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటించాలన్నారు. బౌతిక దూరం పాటిస్తూ, ఎల్లప్పుడూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఏ పనిచేసినా చేతులను సబ్బుతో కడుక్కోవడంతోపాటు, నాణ్యమైన శానిటైజర్లను వినియోగించడం ద్వారా చేతులకు తెలియకుండా అంటే వైరస్ ను నాశనం చేయడానికి అవకాశం వుంటుందన్నారు. విశాఖ నగరంలో కరోనా కేసులు అధికంగా పెరుగుతున్నందున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న ఆమె ప్రజలు ప్రభుత్వానికి స్వచ్చందంగా సహకరిస్తే అనుకున్న సమయం కంటే ముందుగానే కరోనా వైరస్ ను నియంత్రించడానికి ఆస్కారం వుంటుందని జ్నానవేణి సూచిస్తున్నారు. అవసరం వుంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని, నిత్యం వేడి నీరు తీసుకుంటూ, బలవర్ధక ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చునన్నారు. అదే విధంగా యోగా ప్రాణాయామం చేయడం ద్వారా ఆక్సిజన్ లెవల్స్ ను పెంచుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు.

Visakhapatnam

2021-05-11 03:45:58

జర్నలిస్టులూ మీ ఆరోగ్యాలు జరభద్రం..

ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులంతా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, కరోనా వైరస్ సోకకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ(ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net) సంపాదకులు, అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) కోరారు. మంగళవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. సెకెండ్ వేవ్ కరోనాలో అత్యధికంగా జర్నలిస్టులు కరోనాకు బలవడం మనసుని ఎంతగానో కలచివేస్తుందన్నారు. ఇలాంటి సమయంలో మన రక్షణ మనమే తీసుకోవాలన్నారు. ప్రతీ జర్నలిస్టు విధినిర్వహణలో బయటకు వెళ్లాల్సి వస్తే డబుల్ లేయర్ వున్న మాస్కులు ధరించడంతోపాటు, చేతులకు హేండ్ గ్లౌజులు వేసుకొని బౌతిక దూరం పాటించాలన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏది పట్టుకున్నా శానిటైజర్లు వినియోగించాలన్నారు. జర్నలిస్టులపైనే వారి కుటుంబాలు ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని ప్రతీ జర్నలిస్టూ గుర్తించాలన్నారు. జర్నలిస్టులను కేంద్రం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించకపోవడం శోచనీయమన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెలింగి బాహ్య ప్రపంచంలో జరుగుతున్న సమాచారాన్ని ప్రజలకు, ప్రభుత్వాలకు సమయానికి అందిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు జర్నలిస్టులను గుర్తించకపోవడం దారుణమన్నారు. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ కరోనా టీకాలు వేయాలన్నారు. వారి కుటుంబ సభ్యులకు కూడా టీకా వేసే కార్యక్రమం ప్రభుత్వం వెంటనే చేపట్టాలన్నారు. హెల్త్ ఇన్స్యూరెన్సులు చేయడంతోపాటు, ఆరోగ్యశ్రీ కార్డులు, అక్రిడిటేషన్లు తక్షణమే మంజూరు చేయాలన్నారు. ఇప్పటి వరకూ కరోనాతో మ్రుతిచెందిన జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని తక్షణమే జర్నలిస్టుల కుటుంబాలకు అందిచాలని,  జర్నలిస్టుల బతుకులకు రాష్ట్రప్రభుత్వం భరోసా కల్పించాలని ఈఎన్ఎస్ బాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Visakhapatnam

2021-05-11 03:35:02

ప్రాధాన్యత క్రమంలో స్మార్ట్ సిటీ పనులు..

స్మార్ట్ సిటీ లో భాగంగా నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ హరి నారాయణ గారు అన్నారు. సోమవారం సాయంత్రం తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ 22 బోర్డు మీటింగ్ స్మార్ట్ సిటీ ఎం.డి. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష అధ్యక్షతన నగరపాలక వై.ఎస్. ఆర్ సమావేశ మందిరం నందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ హరి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ధి పనులకు ఆమోదముద్ర వేశారు. ముఖ్యంగా ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కొరకు గార్బేజ్ కలెక్షన్ కోసం రెండు కోట్ల రూపాయలతో కొత్త బండ్లు కు ఆమోదం తెలిపారు. నగరంలో పలు చెరువులు, గొల్లవాని గుంట, కొరమేను గుంట, పూల వానిగుంట చెరువులు సుందరీకరణ కొరకు ఎనిమిది కోట్ల రూపాయలు పనులు చేయుటకు పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగింది. వినాయక సాగర్ వద్ద మల్టీపర్పస్ ఆల్, మ్యూజికల్ ఫౌంటెన్ మరియు వాటర్ స్క్రీన్, సెంట్రల్ ఐలాండ్ మొదలగు అభివృద్ధి పనులకు ఆమోదం ఇవ్వడం మరియు మంగళం, తుకివాకం మరియు వినాయక సాగర్ సరస్సు వద్ద సోలార్ ప్లాంట్ కు ఆమోద ముద్ర వేశారు. చైర్మన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్న పనులు శరవేగంగా పూర్తి చేయాలని, పనులు ఎక్కడ ఆలస్యం జరగకుండా త్వరగా పూర్తిచేయాలని అన్నారు.

 ఈ స్మార్ట్ సిటీ బోర్డు మీటింగ్ లో వీడియో కాన్ఫరెన్స్ లో  స్మార్ట్ సిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ హరి నారాయణ, తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్మార్ట్ సిటీ ఎం. డి, నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష, స్మార్ట్ సిటీ జి.ఎం చంద్రమౌళి, ఎస్.ఈ మోహన్, యం.ఈ. చంద్రశేఖర్, డి.ఈ. కరుణాకర్ రెడ్డి,ఎయికాం బాలాజీ పాల్గొన్నారు. నగరంలో వారి వారి కార్యాలయం నుండి తిరుపతి అర్బన్ ఎస్పి వెంకటప్ప నాయుడు, తిరుమల తిరుపతి జేఈఓ సదా భార్గవి, బోర్డు మెంబర్లు రామచంద్రారెడ్డి, రమ్య శ్రీ, న్యూఢిల్లీ నుండి విశాల్ తదితరులు పాల్గొన్నారు.

Tirupati

2021-05-10 15:48:00

కోవిడ్ పరీక్షల సామర్ధ్యం పెంపు..

 కోవిడ్ పరీక్షల సామర్థ్యాన్ని పెంచే విధంగా నూతన యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. సోమవారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వైరాలజీ ల్యాబ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టిపిసిఆర్ (RT PCR రియల్ టైమ్ పాలిమరేస్ చైన్ రియాక్షన్) యంత్రాన్ని జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి తో కలిసి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం టీబీ బ్లాక్ లో నూతనంగా  ఏర్పాటుచేసిన 80 ఆక్సిజన్ పడకలను కలెక్టర్, జేసి, వైద్య అధికారులతో కలిసి పరిశీలించారు.
    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో రోజువారి కోవిడ్ పరీక్షల సంఖ్యను పెంచే విధంగా ఆర్టి పిసిఆర్ యంత్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ యంత్ర సహాయంతో రోజుకు 6వేలు శాంపిల్స్ ను పరీక్షించేందుకు వీలుంటుందని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా రాజమహేంద్రవరం ఆసుపత్రికి సంబంధించి మరోక యంత్రం ఏర్పాటుకు ఆర్డర్ ఇవ్వడం జరిగిందని దీనితో జిల్లాలో రోజుకు సుమారుగా 8వేలు ఆర్టి పిసిఆర్ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా జిల్లాలో ఆక్సిజన్ లభ్యత అనుగుణంగా పడకల సంఖ్యను కూడా పెంచడం జరుగుతుందన్నారు. జిల్లాలో కోవిడ్ వైద్య సేవలకు సంబంధించి  పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కి సంబంధించి పూర్తిస్థాయిలో కోవిడ్ కేసుల పర్యవేక్షణకు గాను నూతనంగా రాష్ట్ర కమాండ్ కంట్రోల్  రూమ్ నుంచి నూతన ట్రైనీ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చాంద్ ను ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందన్నారు. జిజిహెచ్ టీబీ బ్లాక్ లో జరిగే కోవిడ్ పరీక్షల కేంద్రాన్ని బాలాజీ చెరువు వద్ద ఉన్న పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కి మార్చడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
   ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిజిహెచ్ సూపరింటెండెంట్ డా. పి వెంకటబుద్ధ, ఆర్ఎమ్ఓ  గిరిధర్, జిజిహెచ్ నోడల్ అధికారి ఎం భానుప్రకాష్, ఇతర వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-10 15:45:06

చందనోత్సవానికి వడి వడిగా చందనం అరదీత..

విశాఖలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవానికి చందనం అరగదీత కార్యక్రమం వడి వడిగా సాగుతోంది. సోమవారం ఈ మేరకు 27 కిలోల చందనాన్ని అరగదీశారు. ప్రతీరోజూ అరగదీసే చందనాన్ని స్వామివారి బాంఢాగారంలో అర్చకులు ఎంతో భక్తి శ్రద్ధలతో భద్ర పరుస్తున్నారు. ఈనెల 14న వైశాఖ శుద్ధ తదియను పురస్కరించుకుని జరిగే చందనోత్సవం రోజు స్వామివారికి తొలివిడతగా చందనాన్ని సమర్పించనున్నారు. దీనికోసం నిత్యం చందనాన్ని సుగంధ పరిమలాలను సిద్దం చేస్తున్నారు. భక్తులు సమర్పించే చందనాన్ని కూడా వారిపేరుతో ఆరోజు గోత్రనామలతో పూజలు చేస్తారు.

Simhachalam

2021-05-10 15:30:08