1 ENS Live Breaking News

మానవతా ద్రుక్పదంతో సేవలందించాలి..

కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందేలా అధికారులు మానవతా దృక్పధంతో వ్యవహరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయనపునరుద్ఝాటించారు. కరోనా నివారణ, పలు అభివృద్థి కార్యక్రమాలపై మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క రోనా అనుమానితులకు, బాధితులకు ఏ విధ మైన సహాయం కావాలన్నా తక్షణమే స్పందించేలా ఏర్పాటుచేసిన 104 కాల్‌సెంటర్ నిర్వహణ పై కలెక్టర్, సంబంధి త సంయుక్త కలెక్టర్ ప్రత్యేక శ్రద్థ పెట్టాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సూచించారు. వైద్య సేవలు అవసరమైన వారికి మూడు గ ంటల్లోనే అవి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆపదలో వుండి 104 కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసిన వారిని తమ కుటుం బ
సభ్యులుగా భావించి వారికి అవసరవై ున వైద్యసేవలు అందేలా అధికారులు తక్షణమే స్పందించాలని సి.ఎమ్. స్పష్టం చేశారు. కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వైద్యసేవలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నందున ఆయా ఆసుపత్రుల్లో పారిశుద్థ్య నిర్వహణ, ఔషధాల లభ్యత, తగిన సంఖ్యలో వై ద్య సిబ్బంది , ఆరోగ్యశ్రీ కార్యకర్త ఉండేలా అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి దిశానిర్థేశం చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ పేషంట్లకు ఆయా యాజమాన్యాలు ఖచ్చితంగా కేటాయించేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో అవస రమైన వైద్య సిబ్బందిని తక్షణమే భర్తీ చేసుకోవాలని సి.ఎమ్. ఆదేశించారు. క రోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌ను సమకూర్చుకోవడంలో ప్రణాళికాబద్ధ ంగా వ్యవహరించాలని అన్నారు. ఆక్సిజన్ వి నియోగక్ర మంలో వృధాను అరికట్టాలని చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్లకు కూడా అవసరాన్ని బట్టి ఆక్సిజన్ అందుబాటులో వుంచాలన్నారు. రాష్ట్రంలో క రోనా మరణాలు అత్యల్ప స్థాయిలో
వుండటానికి కలెక్టర్లు, వైద్యుల నుంచి క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, ఏ.ఎన్.ఎమ్.లు, ఆశావర్కర్లు చిత్తశుద్థితో పనిచె యడమే కారణమని అభినందించారు.

కరోనా కట్టడికి కర్ఫ్యూ ఆంక్షలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు
అభివృద్థి కార్యక్రమాలను కూడా ప్రాధాన్యం ఇచ్చి చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. పేదలకు ఇటీవల ఇచ్చిన ఇళ్ల స్థలాలలో జూన్ నుంచి ఇళ్లు నిర్మించుకునేందుకు అవసరమైన ఇసుక, సిమెంటు, స్టీలు అందుబాటులో వుండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు అవసర మైన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఉపాధిహామి పథకంలో 20 కోట్ల పనిదినాలు ఈ ఆర్థిక సంవత్సరంలో కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నందున వాటిలో 80 శాతం మే, జూన్ నెలల్లోనే పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఖరీఫ్ వ్యవసాయ పనులు ముమ్మరం కావటానికి ముందే ఉపాధి హామి పనులను పెద్దఎత్తున చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని, ఈ విషయం పై ప్రకాశం జిల్లా అధికారులు మరింత దృష్టి
సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  పోల భాస్కర్, జాయింట్ కలెక్టర్లు జె.వి. మురళి (ఆర్.బి. అండ్. ఆర్.), టి.ఎస్. చేతన్ (సచివాలయాలు, అభివృద్థి), క్రిష్ణవేణి (ఆసరా, సంక్షేమం), కంద ుకూరు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ, మార్కాపురం, ఒంగోలు ఆర్.డి.ఓ.లు శేషిరెడ్డి, ప్రభాకర రెడ్డి , వ్యవసాయ శాఖ జె.డి. శ్రీరామమూర్తి, డి.పి.ఓ. నారాయణ రెడ్డి, డ్వామా పి.డి. శీనారెడ్డి, ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్.ఇ. వ ుర్థన్ అలి, పంచాయతి రాజ్ ఎస్.ఇ. కొండయ్య, డి.ఎమ్.హెచ్.ఓ. డాక్టర్
రత్నావళి, డి.సి.హెచ్.ఎస్. డాక్టర్ ఉషారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Ongole

2021-05-11 12:53:36

ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరాలి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలన, సేవలను సమాచారశాఖ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ఏడి తన్నీమోహన్ కు సూచించారు. మంగళవారం కొత్తగా విధుల్లోకి చేరిన ఏడీ జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  ప్రభుత్వానికి మంచి పెరు తెచ్చేలా సమాచారశాఖ సేవలు అందించాలని సూచించారు. మీడియాకు అందుబాటులో ఉండి  తాజా సమాచారాన్ని అందజేయాలన్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా దానిని మీడియా ద్వారా ప్రజలకు చేరవేయడంలో ముందుండాలన్నారు. ఎలాంటి సమస్యలున్నా తక్షణమే తన ద్రుష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏపీఆర్ ఓ డి.దుర్గాప్రసాద్, ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Ongole

2021-05-11 12:42:41

డబుల్ లేయర్ మాస్కులనే ధరించండి..

కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడానికి ప్రజలంతా రెండు లేయర్ల మాస్కులు ధరించడం ద్వారా కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడానికి అవకాశం వుంటుందనే ప్రభుత్వ సూచనను పాటించాలని తహశీల్దార్ జ్నానవేణి కోరుతున్నారు. విశాఖలో ఈ మేరకు మంగళవారం ఆమె మీడియాకి ప్రకటన విడుదల చేశారు. సాధారణ మాస్కు కంటే రెండింతలు పటిష్టంగా ఉండే మాస్కు ధరించడం ద్వారా వైరస్ దరిచేరే అవకాశం తక్కువగా వుంటుందనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటించాలన్నారు. బౌతిక దూరం పాటిస్తూ, ఎల్లప్పుడూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఏ పనిచేసినా చేతులను సబ్బుతో కడుక్కోవడంతోపాటు, నాణ్యమైన శానిటైజర్లను వినియోగించడం ద్వారా చేతులకు తెలియకుండా అంటే వైరస్ ను నాశనం చేయడానికి అవకాశం వుంటుందన్నారు. విశాఖ నగరంలో కరోనా కేసులు అధికంగా పెరుగుతున్నందున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న ఆమె ప్రజలు ప్రభుత్వానికి స్వచ్చందంగా సహకరిస్తే అనుకున్న సమయం కంటే ముందుగానే కరోనా వైరస్ ను నియంత్రించడానికి ఆస్కారం వుంటుందని జ్నానవేణి సూచిస్తున్నారు. అవసరం వుంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని, నిత్యం వేడి నీరు తీసుకుంటూ, బలవర్ధక ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చునన్నారు. అదే విధంగా యోగా ప్రాణాయామం చేయడం ద్వారా ఆక్సిజన్ లెవల్స్ ను పెంచుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు.

Visakhapatnam

2021-05-11 03:45:58

జర్నలిస్టులూ మీ ఆరోగ్యాలు జరభద్రం..

ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులంతా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, కరోనా వైరస్ సోకకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ(ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net) సంపాదకులు, అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) కోరారు. మంగళవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. సెకెండ్ వేవ్ కరోనాలో అత్యధికంగా జర్నలిస్టులు కరోనాకు బలవడం మనసుని ఎంతగానో కలచివేస్తుందన్నారు. ఇలాంటి సమయంలో మన రక్షణ మనమే తీసుకోవాలన్నారు. ప్రతీ జర్నలిస్టు విధినిర్వహణలో బయటకు వెళ్లాల్సి వస్తే డబుల్ లేయర్ వున్న మాస్కులు ధరించడంతోపాటు, చేతులకు హేండ్ గ్లౌజులు వేసుకొని బౌతిక దూరం పాటించాలన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏది పట్టుకున్నా శానిటైజర్లు వినియోగించాలన్నారు. జర్నలిస్టులపైనే వారి కుటుంబాలు ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని ప్రతీ జర్నలిస్టూ గుర్తించాలన్నారు. జర్నలిస్టులను కేంద్రం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించకపోవడం శోచనీయమన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెలింగి బాహ్య ప్రపంచంలో జరుగుతున్న సమాచారాన్ని ప్రజలకు, ప్రభుత్వాలకు సమయానికి అందిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు జర్నలిస్టులను గుర్తించకపోవడం దారుణమన్నారు. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ కరోనా టీకాలు వేయాలన్నారు. వారి కుటుంబ సభ్యులకు కూడా టీకా వేసే కార్యక్రమం ప్రభుత్వం వెంటనే చేపట్టాలన్నారు. హెల్త్ ఇన్స్యూరెన్సులు చేయడంతోపాటు, ఆరోగ్యశ్రీ కార్డులు, అక్రిడిటేషన్లు తక్షణమే మంజూరు చేయాలన్నారు. ఇప్పటి వరకూ కరోనాతో మ్రుతిచెందిన జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని తక్షణమే జర్నలిస్టుల కుటుంబాలకు అందిచాలని,  జర్నలిస్టుల బతుకులకు రాష్ట్రప్రభుత్వం భరోసా కల్పించాలని ఈఎన్ఎస్ బాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Visakhapatnam

2021-05-11 03:35:02

ప్రాధాన్యత క్రమంలో స్మార్ట్ సిటీ పనులు..

స్మార్ట్ సిటీ లో భాగంగా నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ హరి నారాయణ గారు అన్నారు. సోమవారం సాయంత్రం తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ 22 బోర్డు మీటింగ్ స్మార్ట్ సిటీ ఎం.డి. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష అధ్యక్షతన నగరపాలక వై.ఎస్. ఆర్ సమావేశ మందిరం నందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ హరి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ధి పనులకు ఆమోదముద్ర వేశారు. ముఖ్యంగా ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కొరకు గార్బేజ్ కలెక్షన్ కోసం రెండు కోట్ల రూపాయలతో కొత్త బండ్లు కు ఆమోదం తెలిపారు. నగరంలో పలు చెరువులు, గొల్లవాని గుంట, కొరమేను గుంట, పూల వానిగుంట చెరువులు సుందరీకరణ కొరకు ఎనిమిది కోట్ల రూపాయలు పనులు చేయుటకు పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగింది. వినాయక సాగర్ వద్ద మల్టీపర్పస్ ఆల్, మ్యూజికల్ ఫౌంటెన్ మరియు వాటర్ స్క్రీన్, సెంట్రల్ ఐలాండ్ మొదలగు అభివృద్ధి పనులకు ఆమోదం ఇవ్వడం మరియు మంగళం, తుకివాకం మరియు వినాయక సాగర్ సరస్సు వద్ద సోలార్ ప్లాంట్ కు ఆమోద ముద్ర వేశారు. చైర్మన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్న పనులు శరవేగంగా పూర్తి చేయాలని, పనులు ఎక్కడ ఆలస్యం జరగకుండా త్వరగా పూర్తిచేయాలని అన్నారు.

 ఈ స్మార్ట్ సిటీ బోర్డు మీటింగ్ లో వీడియో కాన్ఫరెన్స్ లో  స్మార్ట్ సిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ హరి నారాయణ, తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్మార్ట్ సిటీ ఎం. డి, నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష, స్మార్ట్ సిటీ జి.ఎం చంద్రమౌళి, ఎస్.ఈ మోహన్, యం.ఈ. చంద్రశేఖర్, డి.ఈ. కరుణాకర్ రెడ్డి,ఎయికాం బాలాజీ పాల్గొన్నారు. నగరంలో వారి వారి కార్యాలయం నుండి తిరుపతి అర్బన్ ఎస్పి వెంకటప్ప నాయుడు, తిరుమల తిరుపతి జేఈఓ సదా భార్గవి, బోర్డు మెంబర్లు రామచంద్రారెడ్డి, రమ్య శ్రీ, న్యూఢిల్లీ నుండి విశాల్ తదితరులు పాల్గొన్నారు.

Tirupati

2021-05-10 15:48:00

కోవిడ్ పరీక్షల సామర్ధ్యం పెంపు..

 కోవిడ్ పరీక్షల సామర్థ్యాన్ని పెంచే విధంగా నూతన యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. సోమవారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వైరాలజీ ల్యాబ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టిపిసిఆర్ (RT PCR రియల్ టైమ్ పాలిమరేస్ చైన్ రియాక్షన్) యంత్రాన్ని జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి తో కలిసి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం టీబీ బ్లాక్ లో నూతనంగా  ఏర్పాటుచేసిన 80 ఆక్సిజన్ పడకలను కలెక్టర్, జేసి, వైద్య అధికారులతో కలిసి పరిశీలించారు.
    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో రోజువారి కోవిడ్ పరీక్షల సంఖ్యను పెంచే విధంగా ఆర్టి పిసిఆర్ యంత్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ యంత్ర సహాయంతో రోజుకు 6వేలు శాంపిల్స్ ను పరీక్షించేందుకు వీలుంటుందని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా రాజమహేంద్రవరం ఆసుపత్రికి సంబంధించి మరోక యంత్రం ఏర్పాటుకు ఆర్డర్ ఇవ్వడం జరిగిందని దీనితో జిల్లాలో రోజుకు సుమారుగా 8వేలు ఆర్టి పిసిఆర్ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా జిల్లాలో ఆక్సిజన్ లభ్యత అనుగుణంగా పడకల సంఖ్యను కూడా పెంచడం జరుగుతుందన్నారు. జిల్లాలో కోవిడ్ వైద్య సేవలకు సంబంధించి  పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కి సంబంధించి పూర్తిస్థాయిలో కోవిడ్ కేసుల పర్యవేక్షణకు గాను నూతనంగా రాష్ట్ర కమాండ్ కంట్రోల్  రూమ్ నుంచి నూతన ట్రైనీ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చాంద్ ను ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందన్నారు. జిజిహెచ్ టీబీ బ్లాక్ లో జరిగే కోవిడ్ పరీక్షల కేంద్రాన్ని బాలాజీ చెరువు వద్ద ఉన్న పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కి మార్చడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
   ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిజిహెచ్ సూపరింటెండెంట్ డా. పి వెంకటబుద్ధ, ఆర్ఎమ్ఓ  గిరిధర్, జిజిహెచ్ నోడల్ అధికారి ఎం భానుప్రకాష్, ఇతర వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-10 15:45:06

చందనోత్సవానికి వడి వడిగా చందనం అరదీత..

విశాఖలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవానికి చందనం అరగదీత కార్యక్రమం వడి వడిగా సాగుతోంది. సోమవారం ఈ మేరకు 27 కిలోల చందనాన్ని అరగదీశారు. ప్రతీరోజూ అరగదీసే చందనాన్ని స్వామివారి బాంఢాగారంలో అర్చకులు ఎంతో భక్తి శ్రద్ధలతో భద్ర పరుస్తున్నారు. ఈనెల 14న వైశాఖ శుద్ధ తదియను పురస్కరించుకుని జరిగే చందనోత్సవం రోజు స్వామివారికి తొలివిడతగా చందనాన్ని సమర్పించనున్నారు. దీనికోసం నిత్యం చందనాన్ని సుగంధ పరిమలాలను సిద్దం చేస్తున్నారు. భక్తులు సమర్పించే చందనాన్ని కూడా వారిపేరుతో ఆరోజు గోత్రనామలతో పూజలు చేస్తారు.

Simhachalam

2021-05-10 15:30:08

ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా కిట్లు..

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా సమయంలో ప్రజలకు సేవలు అందిస్తున్నారని జివిఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. సోమవారం నాలుగవ జోనులోని 28వ వార్డు ఫ్రంట్ లైను వ్యారియర్సుకు కరోనా కిట్లు పంపిణీ చేశారు. కెనరా బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్(సి.బి.ఇ.యు.) 71వ వ్యవస్థాపక దినోత్సవం, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సమైఖ్య ఆధ్వర్యంలో 25వ వార్షికోత్సవం సందర్భంగా ఫేస్ షీల్డ్ మాస్కులు, మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్సు, వితరణ చేసారు. సుమారు 70మంది ఫ్రంట్ లైను వ్యారియర్సుకు మేయర్  వీటిని అందించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, కరోనా రెండవ దశ చాలా ఉధృతంగా ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు చాలా జాగ్రత్తలు పాటించాలని అవసరమైతేనే బయటకు రావాలని, రద్దీ ప్రదేశాలలో తిరగరాదనీ, నిత్యం మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం. శ్రీనివాస కుమార్, ఆడారి శ్రీనివాసరావు, 28వ వార్డు కార్పొరేటర్ పల్లా అప్పలకొండ, 28వ వార్డు ఇంచార్జ్ పల్లా దుర్గా రావు తదితరులు పాల్గొన్నారు.    

Visakhapatnam

2021-05-10 15:13:40

రేపటి నుంచి కరోనా టీకా కార్యక్రమం..

శ్రీకాకుళం జిల్లాలో టీకా కార్యక్రమాన్ని మంగళవారం నుండి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు, వైద్య శాఖ అధికారులతో సోమవారం టెలికాన్ఫరెన్స్ ను జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని, ఎక్కడ ఎటువంటి సమస్య తలెత్త రాదని ఆదేశించారు. ఒక నిర్దిష్ట సమయంలో వంద మందికి మాత్రమే టీకా ఇవ్వాలని, ఆ మేరకు ఆ వంద మందికి ముందు రోజు సాయంత్రం నాటికి సమాచారం చేరవేయాలని ఆయన ఆదేశించారు. నిర్దేశిత వంద మంది మినహా ఎవరికీ టీకా వేయరాదని ఆయన స్పష్టం చేశారు. సమాచారం లేకుండా షెడ్యూలులో లేకుండా వచ్చిన వారికి ఎవ్వరికీ టీకా ఇవ్వరాదని ఆదేశించారు. టీకా కేంద్రం స్పష్టంగా తెలియజేసి, టీకాకు వచ్చిన వారికి కుర్చీలు ఏర్పాటు చేయాలని, గదులలో కూర్చోబెట్టాలని ఆయన పేర్కొన్నారు. కూర్చున్న చోటనే టీకా వేసి పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ టెస్టులు విస్తృతంగా నిర్వహించాలని, హోమ్ ఐసోలేషన్ వ్యవస్థను పర్యవేక్షించాలని ఆయన అన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి మెడికల్ కిట్లు అందాలని ఆయన పేర్కొంటూ సకాలంలో మెడికల్ కిట్లు అందించడం వల్ల ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉండదని అన్నారు. ఇంటి వద్దనే పూర్తిస్థాయిలో నయం చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. కోవిడ్ లో అందరూ చక్కని పనితీరు కనబరుస్తున్నారని ప్రశంసించారు. పాజిటివ్ కేసులు గుర్తింపు పూర్తి స్థాయిలో ఉండాలని తద్వారా జిల్లా లో కోవిడ్ నియంత్రణకు సులభం అవుతుందని అన్నారు. ఏఎన్ఎంలు యాప్ లో వివరాలను అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు.  ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే.శ్రీనివాసులు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సిహెచ్. శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-10 15:00:34

సూపరింటెండెంట్ గా డా.జాన్లీ జోసెఫ్..

 అనంతపురం జిల్లా హిందూపురం జిల్లా ఆసుపత్రి ఇంచార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ గా డా.జాన్లీ జోసెఫ్ ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇంఛార్జ్ గా వ్యవహరిస్తున్న డిప్యూటీ సివిల్ సర్జన్ డా.దివాకర్ వెంటనే జాన్లీ జోసెఫ్ కు  ఇంచార్జ్ సూపరింటెండెంటుగా  బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ సమయంలో ఆసుపత్రి నిర్వహణను మెరుగుపరిచేందుకు నూతన ఇంచార్జ్ సూపరింటెండెంట్ ను నియమించామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.  డా.జాన్లీ జోసెఫ్ హిందూపురం జిల్లా ఆసుపత్రిలో హిందూపురం జిల్లా ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (అనస్థీషియా) పని చేస్తున్నారు. డా.జాన్లీ జోసెఫ్ కు బాధ్యతలు అప్పగించిన అనంతరం డా.దివాకర్ తిరిగి రోళ్ల మండలం కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ కు డిప్యూటీ సివిల్ సర్జన్ గా విధులు నిర్వర్తించాల్సిందిగా ఉత్తర్వుల్లో ఆదేశించారు..

Hindupuram

2021-05-10 14:53:34

Anantapur

2021-05-10 14:51:05

అనంతలో ఆక్సిజన్ కొరత రానివ్వం..

అనంతపురం జిల్లాలో మెడికల్ ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. సోమవారం హిందూపురం పరిధిలోని తూముకుంట వద్ద వేదిక్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరానికి ముందు కేవలం సిలిండర్ల ద్వారా మాత్రమే ఆక్సిజన్ అందించేవారమని, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో లిక్విడ్ ఆక్సిజన్ ఉన్న ఆసుపత్రి ఒకటి కూడా జిల్లాలో లేదన్నారు. ఇప్పుడు దాదాపుగా 40 వేల లీటర్ల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 13 వేల లీటర్ల చొప్పున, క్యాన్సర్ హాస్పిటల్, హిందూపురం జిల్లా హాస్పిటల్ లో 6 వేల చొప్పున, కదిరి, గుంతకల్ ఏరియా ఆసుపత్రులలో వెయ్యు లీటర్ల చొప్పున ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇవి కాకుండా జిల్లా మొత్తానికి 336 సిలిండర్లు ఉన్నాయని, పరిశ్రమలో వేరే అవసరాల కోసం ఉపయోగించే సిలిండర్లను కూడా వారితో మాట్లాడి మరో 700 సిలిండర్ ను తీసుకోవడం జరిగిందన్నారు. మొత్తం 1,000 కిపైగా సిలిండర్లను అక్కడి ఉన్న రోగులు ఆధారంగా ఆక్సిజన్ అందించేలా సిలిండర్లను నింపుకొని అందుబాటులో ఉంచామన్నారు. ఇంకా అదనపు నిల్వలు చేసుకునేందుకు గాను ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లను, స్టీల్ ప్లాంట్ యూనిట్లలో ఏవైతే మూలనపడి ఉన్నాయో ఆ యూనిట్లను తిరిగి తెరిపించడం జరిగిందన్నారు.

అందులో హిందూపురం లోని వేదిక్ ఇస్పాత్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన స్టీల్ ప్లాంటు లో యూనిట్లు ఉందని, ఈ స్టీల్ పరిశ్రమ మూతపడడంతో ఉత్పత్తి నిలిచిపోయిందని, వారి సమస్యలను పరిష్కరించి తిరిగి ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇక్కడ రోజుకు 500 సిలిండర్లు ఉత్పత్తి చేస్తున్నారని, 1000 సీలిండర్ల వరకు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. ఇంకా అదనంగా ఉత్పత్తి చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. అంతే కాకుండా సింగనమల మండలం చక్రాయపేట గ్రామంలో రోజుకు 350 సిలిండర్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం గల ప్లాంట్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాకు రెగ్యులర్ గా కర్ణాటక నుండి ఆక్సిజన్ వస్తోందని, అందులో ఎక్కడైనా సమస్యలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లాలోనే సొంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకునే ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇవే కాకుండా భవిష్యత్తులో ఏ హాస్పిటల్ కు అవసరమయ్యే ఆక్సిజన్ ను ఆ హాస్పిటల్లోనే ఉత్పత్తి చేసుకునేలా ప్లాంట్లను నిర్మించి అక్కడే ఖాళీ సిలిండర్లను నింపి అక్కకి ఉన్న ఆక్సిజన్ బెడ్లకు ఉపయోగించుకునేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇవే కాకుండా జిల్లాలో అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో, హిందూపురం జిల్లా ఆసుపత్రి, కదిరి, గుంటకల్ ఏరియా ఆస్పత్రులలో 1,000 లీటర్లు సామర్థ్యం గల ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందుకు సంబంధించి హిందూపురంలో ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయన్నారు. మిగిలిన మూడు ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పనులు ప్రారంభమవుతాయన్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ కు ఎలాంటి కొరత లేకుండా సమృద్ధిగా ఆక్సిజన్ ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎటువంటి అవకతవకలు కూడా లేకుండా ఉండేందుకు కోసం ప్రభుత్వ ఉద్యోగులను కేటాయించి ఎంత ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది, ఏఏ  ఆస్పత్రులకు అమ్ముతున్నారు, ఎంత ధరకు అమ్ముతున్నారు, ఎన్ని సిలిండర్లు వెళుతున్నాయి తదితర అంశాలను రోజువారీగా పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ను ముందుగా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఇవ్వాలని, ఆ తర్వాత జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులకు, మిగిలినవి ఇతర జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు, ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రులకు, ఇంకా మిగిలి ఉంటే ఇతర రాష్ట్రాలకు కూడా అమ్ముకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. తక్కువ సమయంలో ఇక్కడి ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు సబ్ కలెక్టర్, పరిశ్రమల శాఖ జిఎం, ఎంపీ, ఎమ్మెల్సీల సూచనల మేరకు కేవలం మూడు రోజుల్లోనే ఈ ప్లాంట్ ను పునరుద్ధరణ చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ప్రతి ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ ప్లాంట్లు ఉండేలా ఏర్పాటు చేయనున్నామన్నారు.

రాష్ట్రంలో వైద్యం అందక ఏ ఒక్కరు కూడా మరణించకూడదని అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైద్యం అందక ఏ ఒక్కరు కూడా మరణించకూడదనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ముందుకు వెళుతున్నాయన్నారు. కరోనా వ్యాధికి ముఖ్యంగా ఆక్సిజన్ చాలా అవసరమని, ఇక్కడ మూతపడిన యూనిట్లను ముందుగా గుర్తించి తెరిపించేందుకు జిల్లా కలెక్టర్ గారు వారి సమస్యలను పరిష్కరించి త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. ఇందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, పరిశ్రమల శాఖ జిఎం, తదితరులను అభినందిస్తున్నానన్నారు. అలాగే ఇక్కడ ఉత్పత్తి చేసిన ఆక్సిజన్ ను ముందుగా ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులకు, ఆ తర్వాత ఇతర జిల్లాలు మరియు రాష్ట్రాలకు అందించడం జరుగుతుందని తెలిపారన్నారు. జిల్లా ప్రజలు ఎవరు అభద్రతా భావానికి గురి కావాల్సిన పనిలేదని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని, అన్ని రకాల చర్యలను ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం తీసుకుంటోందన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండి, పోషకాహారం తీసుకుంటూ ఉండాలన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను తరిమి కొట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ నిషా0తి, పరిశ్రమల శాఖ జీఎం అజయ్ కుమార్, నోడల్ ఆఫీసర్ ప్రసన్న కుమార్, వేదిక్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ ఎండి శరత్ బుతారా, తదితరులు పాల్గొన్నారు. 

Hindupuram

2021-05-10 14:34:52

అనంతకు నాలుగు ఆక్సిజన్ ప్లాంట్ లు..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాకు 4 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ లను మంజూరు చేశారని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. సోమవారం హిందూపురం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు పనులను, ఆక్సిజన్ ప్లాంట్ ను హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ నిషా0తి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒక్కో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ కెపాసిటీకి సంబంధించి ఒక నిముషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందన్నారు. దాని ద్వారా ఒక రోజులో దాదాపు 190 సిలిండర్ ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందన్నారు. హిందూపురం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి ఒక నిముషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి సరిపోతుందని ఇక్కడ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ మంజూరు చేయడం జరిగిందన్నారు. హిందూపురం తోపాటు జిల్లాలోని అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కదిరి, గుంతకల్లు ఆసుపత్రులలో కూడా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

హిందూపురం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ తో పాటు అదనంగా టిఎస్ఏ టెక్నాలజీ ద్వారా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ కు సంబంధించి సివిల్ పనులు ప్రారంభమయ్యాయన్నారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా సివిల్ పనులు జరుగుతున్నాయని, 4 రోజుల్లో సివిల్ పనులు పూర్తి చేసి బయట ఆక్సిజన్ సరఫరాపై ఆధారపడకుండా స్వంతంగా ఇక్కడే ప్లాంట్ పెట్టుకుని గాలిలో ఉన్న నీటిని తీసుకుని ఆక్సిజన్ ఉత్పత్తి చేసి ఆక్సిజన్ సరఫరా కు కావాల్సిన ఆక్సిజన్ జనరేషన్ యూనిట్ ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ లో ఏర్పాటు చేసే మిషనరీ డిఆర్డీఓ ( డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) నుంచి వస్తుందని, వారితో కూడా సమన్వయం చేసుకుంటున్నామన్నారు. సాధ్యమైనంత త్వరగా మిషనరీ వచ్చేలా చేసి ప్లాంట్ పూర్తి స్థాయిలో పనిచేసేలా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎంతో కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్

ఈ సందర్భంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. జిల్లాకు 4 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ లను మంజూరు చేశారని, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, డిఆర్డీఓ సమన్వయంతో ప్లాంట్ లను ఏర్పాటు చేసి ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తారన్నారు. దీని ద్వారా పేషంట్ లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ సరఫరా చేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడం చాలా సంతోషమన్నారు. హిందూపురం ఆస్పత్రికి వచ్చి కరోనా చికిత్స తీసుకునే వారు ఎవరు అభద్రతా భావానికి గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏర్పాటు చేసిందని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం కంకణబద్ధులై ముందుకు వెళుతోందన్నారు. అందరూ కలిసికట్టుగా కరోనాని జయించాలన్నారు. ప్రజలెవరూ భయబ్రాంతులకు గురి కారాదని, కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు.

ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జీఎం అజయ్ కుమార్, నోడల్ ఆఫీసర్ ప్రసన్న కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్, నేషనల్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

కలెక్టరేట్

2021-05-10 14:32:55

సమాచారశాఖ ఏడీగా తన్నీర్ మోహన్..

ప్రకాశం జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులుగా  తన్నీరు మోహన్ రాజు  నియమితులయ్యారు.  ఆమేరకు సంబంధిత శాఖ రాష్ట్ర కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి  సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.  ప్రస్తుతం సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న కె.మల్లేశ్వర్ సెలవుపై వెళ్తున్న నేపథ్యంలో మార్కాపురం డివిజనల్ పీఆర్ఓ గా విధులు నిర్వహిస్తున్న మోహన్ రాజు కు సహాయ సంచాలకులుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తక్షణమే మల్లీశ్వర్  నుంచి ఛార్జి తీసుకున్నారు. సహాయ సంచాలకులుగా మోహన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఆయనను మర్యాద పూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు.

Ongole

2021-05-10 14:29:34

ఆక్సిజన్, పడకల వివరాలు తెలియజేయాలి..

ప్రతీ రోజు ఆసుపత్రులకు వెళ్లి ఖాళీ పడకలు, ఆక్సిజన్ అవసరం తెలుసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాల పై  ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల వారీగా ఎన్ని ఆక్సిజన్ పడకలు ఉన్నవి, పడకల సంఖ్య, ఎంత ఆక్సిజన్ అవసరం, అక్కడ ఆక్సిజన్ నిల్వ కు అవకాశం ఉన్నదా లేదా అనే వివరాలను తెలుసుకొని తెలియజేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్, సర్వే శాఖ సహాయ సంచాలకులు  మనీషా త్రిపాటి, ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ రాజేష్ లను ఆదేశించారు. ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాలను ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ రామలింగరాజు చూసుకోవాలన్నారు. ఏ ఆసుపత్రికి చేరాల్సిన ఆక్సిజన్ ఆ ఆసుపత్రులకు చేరాలని చెప్పారు. ఆయా వాహనాల జిపిఎస్ ను ఐ. టి. వారు చూసుకుంటారని తెలిపారు. ఆక్సిజన్ సరఫరాకు మేనేజ్ మెంట్ కు ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ ఎఓకు ఆదేశించారు. ఆయా ఆసుపత్రులకు ఆక్సిజన్ అవసరాన్ని గుర్తించి సంబంధిత నోడల్ అధికారులు తెలియజేస్తారని చెప్పారు. 24*7 గంటలు ఈ కాల్ సెంటర్ పనిచేస్తుందని ఆయన వివరించారు.  ఈ సమావేశంలో ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ రామలింగరాజు, ఆర్డీఓ పెంచల కిషోర్, డిఆర్డిఎ పిడి వి. విశ్వేశ్వరరావు, డిటిసి రాజరత్నం, సర్వే శాఖ సహాయ సంచాలకులు మనీషా త్రిపాఠి, డ్రగ్ కంట్రోల్ సహాయ సంచాలకులు లావణ్య, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-05-10 14:25:45