1 ENS Live Breaking News

రెమిడెసివర్ పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు..

రెమిడెసివర్ ఇంజెక్షన్ పేరిట సోషల్ మీడి యా. సామాజిక మాధ్యమాలలో  అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ యం.  హరి నారాయణన్ హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా  రెమిడిసివియర్ ఇంజక్షన్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో దొరుకుతుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారని. ఈ ఇంజక్షన్ జిల్లాలోని ఆసుపత్రుల్లో మాత్రమే దొరుకుతుందని వైద్యుల సూచన మేరకు అందించడం జరుగుతుందని, ప్రస్తు తం ఉన్న పరిస్థితుల్లో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు సామా జిక మాధ్యమాల్లో వస్తున్న  సమా చారం ను ప్రజలు నమ్మ వద్ద ని ఈ విషయం ను తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. ఈ లాంటి అసత్య వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారిపై  విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.

చిత్తూరు

2021-05-07 14:06:25

ఆరు రోజులు అప్పదర్శనాలకు సెలవు..

శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవాలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి 15 వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేసినట్టు ఈఓ సూర్యకళ తెలియజేశారు. శుక్రవారం ఆమె సింహాచలంలో మీడియాలో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో అర్చకుల విజ్ఞప్తి  మేరకు, ధర్మకర్తల మండలి ఆమోదంతో  ఆలయాన్ని (భక్తులకు) మూసివేయాల నిర్ణయించామన్నారు. కాగా స్వామివారి చందనోత్సవాన్ని ఏకాంతంగానే నిర్వహించనున్నామని చెప్పారు. స్వామివారికి జరగాల్సిన అన్ని కార్యక్రమాలూ ఉదయం ఆరాధన నుంచి రాత్రి పవళింపు వరకు యథావిథిగానే ఏకాంతంగానే జరుగుతాయన్నారు. స్వామివారి సేవలకు ఎలాంటి లోటు ఉండబోదన్న ఈఓ 10-05-21 నుంచి 15-05-21 వరకు భక్తులెవరూ సింహాచలం కొండపైకి రాకూడదని విజ్ఞప్తి చేశారు. 

సింహాచలం

2021-05-07 13:57:56

జాతి గర్వించదగ్గ యోధుడు అల్లూరి..

అతి పిన్నవయస్సులోనే స్వాతంత్ర్యం కొరకు బ్రిటీషు వారిని ఎదరించిన తొలి తరం స్వాతంత్ర్య సమరయోధులలో  అల్లూరి సీతారామరాజు ఒకరని ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం అల్లూరి వర్థంతి సంధర్బంగా సీతమ్మధారలో గల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ అతి చిన్నవయస్సులోనే 4 సంవత్సరాలపాటు బ్రిటీషు వారిని ఎదిరించి పోరాడారని తెలిపారు.  పాండ్రంగిలో జన్మించిన ఆయన ఉద్యమబాట పట్టి  బ్రిటీషు వారి దోపిడీని ఎదిరించి పోరాటంలో అశువులు బాసారని, గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో ఆయన సమాధి అయ్యారని అన్నారు. కులమతాలకు అతీతంగా ధన, మాన, ప్రాణాలను దారపోసి ఎందరో మహానుభావులు త్యాగఫలం మనం అనుభవిస్తున్నామని, ప్రతి సంవత్సరం పాండ్రంగి, కృష్ణదేవిపేటలలో అల్లూరిని  స్మరించుకొంటూ కార్యక్రమాలను ఘణంగా జరుపుకొనేవారమని, ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులలో గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా సామాన్యంగా జరుపుకోవలసి వచ్చిందన్నారు.  
అదేవిధంగా కోవిడ్ సెకెండ్ వేవ్ ఉదృతంగా ఉన్నదని, మొదటి వేవ్ వైరస్ ఎక్కువ వయసు వారికే సంక్రమించేదని,  ప్రస్తుతం  సెకెండ్ వేవ్ వైరస్ ప్రమాదకరమని, ఇది అన్నివయస్సుల వారికి సోకుతుందని, ఆక్సిజన్ లెవెల్స్ అకస్మాత్తుగా తగ్గిపోయి అత్యవసర పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.  ఆసుపత్రులలో బెడ్స్, ఆక్సిజన్ సరఫరాలను ప్రభుత్వం పెంచిందని వివరించారు.  ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో  కరోనాను ఎదుర్కొనుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.   అదేవిధంగా ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనుటకు ప్రజల సహకారం కూడా అవసరమని వ్యాధి చికిత్సకంటే నివారణ ముఖ్యమన్నారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, ప్రతి ఒక్కరు మాస్కు ధరించి, బౌతిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. 
ఈ కార్యక్రమంలో  జి.వి.యం .సి. కార్పొరేటర్లు అనిల్ కుమార్ రాజు, బాణాల శ్రీను, ఎస్.పద్మారెడ్డి, స్థానిక నాయకులు శ్రీనివాసరెడ్డి, గుడివాడ ఫృద్వి తదితరులు పాల్గొన్నారు. 

సీతమ్మధార

2021-05-07 13:48:28

రిజిస్ట్రేషన్ శాఖ పని వేళల్లో మార్పులు..

కోవిడ్ - 19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూ విధించిన దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల  పని వేళల్లో మార్పులు చేస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ కె. మన్మధరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.   తేది  5.5.2021 నుండి  18.5.2021 వ తేది వరకు కర్ఫ్యూ సందర్భంగా ఉదయం గంటలు 7.30 ని. ల నుండి మధ్యాహ్నం 2.00 గంటలు వరకు పని దినాలలో మాత్రమే కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ఒక ప్రకటనలో వివరించారు.  ఉదయం గం.లు 11.30 ని. ల నుండి మధ్యాహ్నం 2.00 గంటలు వరకు రిజిస్ట్రేషన్ చేయించుకొనే వారు తప్ప,   సాధారణ ప్రజలు ఎవరూ కార్యాలయ ఆవరణలోకి ప్రవేశించకూడదని తెలిపారు. కోవిడ్ - 19 దృష్ట్యా కర్ఫ్యూ ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పనివేళల్లో మార్పులు చేయడం జరిగిందని  ప్రజలు గమనించి సహకరించవలసినదిగా ఆయన కోరారు.

విశాఖపట్నం

2021-05-07 13:44:04

ప్రభుత్వ కార్యాలయాలు 11.30 వరకే..

రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని నిరోధించ‌డంలో భాగంగా మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్న దృష్ట్యా ప్ర‌భుత్వ కార్యాల‌యాల ప‌నివేళ‌ల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేసిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. దీనిప్ర‌కారం జిల్లాలోని జిల్లా, మండ‌ల, గ్రామ‌స్థాయిలో వుండే అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ఈనెల 18వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 8 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తాయ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. 12 గంట‌ల త‌ర్వాత కూడా ఎవ‌రైనా ఉద్యోగుల సేవ‌లు అవ‌స‌రం ఉన్న‌ట్ల‌యితే వారికి ప్ర‌త్యేక పాస్‌లు జారీ చేస్తార‌ని పేర్కొన్నారు. కోవిడ్ నిర్వ‌హ‌ణ‌లో అత్య‌వ‌స‌ర సేవ‌లు అందించాల్సిన వైద్య ఆరోగ్య‌శాఖ‌, విద్యుత్‌, మునిసిపల్ ప‌రిపాల‌న‌,  పంచాయ‌తీరాజ్ శాఖ‌ల‌కు ఈ ప‌నివేళ‌లు వ‌ర్తించ‌వ‌ని పేర్కొన్నారు. ఇత‌ర ప్ర‌భుత్వ శాఖ‌ల‌న్నీ మార్పు చేసిన ప‌నివేళ‌ల ప్ర‌కారం ప‌నిచేయాల్సి వుంటుంద‌ని తెలిపారు.

విశాఖపట్నం

2021-05-07 13:39:43

కంగారొద్దు.. గంట‌లోనే ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా..

 ఆక్సీజ‌న్‌కు ఎటువంటి కొర‌తా లేద‌ని, కేవ‌లం గంట‌లోనే ఆయా ఆసుప‌త్రుల‌కు ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్ స్ప‌ష్టం చేశారు. జిల్లా అవ‌స‌రాల‌కు స‌రిప‌డా ఉత్ప‌త్తి జ‌రుగుతోంద‌ని, ప్లాంట్లు నుంచి నేరుగా ఆక్సీజ‌న్‌ను కొనేందుకు కూడా ఆసుప‌త్రుల‌కు అనుమ‌తినిచ్చిన‌ట్లు తెలిపారు. బొబ్బిలి గ్రోత్ సెంట‌ర్‌లో సోనీ ఎంట‌ర్ ప్రైజెస్‌, శ్రీ సాయి శ్రీ‌నివాస గ్యాసెస్ మొద‌ల‌గు రెండు ప్ర‌యివేటు ఆక్సీజ‌న్ ఫిల్లింగ్ కంపెనీల‌ను, స‌బ్ క‌లెక్ట‌ర్ విదేహ్ ఖ‌రే తో క‌లిసి  శుక్ర‌వారం జెసి ప‌రిశీలించారు. ఆక్సీజ‌న్ ల‌భ్య‌త‌, ఫిల్లింగ్ సామ‌ర్థ్యాల‌ను తెలుసుకున్నారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఆక్సీజ‌న్ సిలండ‌ర్ల ఉత్ప‌త్తి ఆగ‌కుండా చూడాల‌ని యాజ‌మాన్యాల‌ను ఆదేశించారు.

                 ఈ సంద‌ర్భంగా జెసి మ‌హేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లా అవ‌స‌రాల‌కు స‌రిప‌డినంత‌గా ఆక్సీజ‌న్ సిలండ‌ర్ల ఉత్ప‌త్తి జ‌రుగుతోంద‌ని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల‌కు దాదాపు స‌మాన దూరంలో ఉన్న బొబ్బిలి నుంచి కేవ‌లం గంట‌లోనే ఎక్క‌డికైనా ఆక్సీజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేయ‌గ‌ల‌మ‌ని చెప్పారు. రోజువిడిచి రోజు జిల్లాకు 10 కిలోలీట‌ర్ల ఆక్సీజ‌న్ ట్యాంక్ వ‌స్తోంద‌ని, దీనితో రోజుకు సుమారు 500 సిలండ‌ర్ల ఫిల్లింగ్ జ‌రుగుతోంద‌ని చెప్పారు. జిల్లాలో ప్ర‌స్తుతం రోజుకు సుమారుగా 450 వ‌ర‌కూ సిలండ‌ర్లు అవ‌స‌రం అవుతున్నాయ‌ని, ఆ మేర‌కు నిరాటంకంగా ఉత్ప‌త్తి చేసేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు.  ఉత్పత్తి ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ముగ్గురు నోడ‌ల్ అధికారుల‌ను నియ‌మించామ‌ని, ఆయా ఆసుప‌త్రులు ముందుగా నోడ‌ల్ అధికారుల‌ను సంప్ర‌దించి, త‌మ‌కు కావాల్సిన ఆక్సీజ‌న్ సిలండ‌ర్ల‌ను తీసుకువెళ్లే అవ‌కాశాన్ని క‌ల్పించామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే ఇక్క‌డినుంచి పార్వ‌తీపురం ఏరియా ఆసుప‌త్రికి నేరుగా ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా అవుతోంద‌న్నారు.

                 అన్ని ప్ర‌యివేటు కార్పొరేట్ ఆసుప‌త్రులు, పిహెచ్‌సిలు, సిహెచ్‌సిల‌కు బొబ్బిలి నుంచి ఆక్సీజ‌న్ సిలండ‌ర్లు స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్లు చెప్పారు. మిమ్స్ ఆసుప‌త్రికి శ్రీ‌కాకుళం జిల్లా ర‌ణ‌స్థ‌లం నుంచి ఆక్సీజ‌న్ వ‌స్తోంద‌న్నారు. వంద ప‌డ‌క‌లు, దానికంటే ఎక్కువ‌గా ఉన్న జిల్లా కేంద్రాసుప‌త్రి, మిమ్స్ ఆసుప‌త్రి, పార్వ‌తీపురం ఏరియా ఆసుప‌త్రుల్లో ఆక్సీజ‌న్ నిల్వ కోసం జెర్మ‌న్ హేంగ‌ర్స్ ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నామ‌ని, ఈ ప్ర‌క్రియ రెండుమూడు రోజుల్లో పూర్తి అవుతోంద‌ని చెప్పారు. అందువ‌ల్ల కోవిడ్ పేషెంట్లు ఆక్సీజ‌న్ కోసం  ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని జెసి సూచించారు.

                  ఈ ప‌ర్య‌ట‌న‌లో బొబ్బిలి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎం.మ‌ల్ల‌య్య‌నాయుడు,  తాశీల్దార్ ఆర్‌. సాయికృష్ణ‌, గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల జిల్లా కో-ఆర్డినేట‌ర్ జి.అశోక్ కుమార్‌, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా నోడ‌ల్ అధికారులు ః -
జి.అశోక్ కుమార్, జిల్లా కో-ఆర్డినేట‌ర్‌, స‌చివాల‌యాలు ః 9030546667
ఆర్‌.సాయికృష్ణ‌, తాశీల్దార్‌, బొబ్బిలి ః 9618006488
ఎస్‌.వెంక‌టేశ్వ‌ర్లు, ఎస్‌డిసి, ః 8106378646

విశాఖపట్నం

2021-05-07 13:36:57

కోవిడ్ బాధిత చిన్నారులకు రక్షణ గృహం..

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్-19 దృష్ట్యా సమస్య ఎదుర్కొంటునన్న చిన్నారులకు బాలల రక్షణ గృహంలో వసతి కల్పించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ మరియు బాలల సంరక్షణ కమిటి ఛైర్మన్ జె నివాస్ తెలిపారు. ఈ మేరకు శుక్ర వారం ఒక ప్రకటన జారీ చేస్తూ కోవిడ్ భారిన పడిన చిన్నారుల తల్లిదండ్రులు ఆసుపత్రులు, కోవిడ్ కేర్ కేంద్రాల్లో చేరిగాని లేదా హోమ్ ఐసోలేషన్ లో ఉండిగాని కోలుకుంటున్నారని ఆయన అన్నారు. కోలుకున్న తరువాత పరీక్షలలో నెగిటివ్ వచ్చినప్పటికి చిన్నారుల సంరక్షణకు బంధువులు, సంరక్షకులు గాని ముందుకు రాకపోతే అటువంటి పిల్లలకు రక్షణ గృహంలో వసతి కల్పించడం జరుగుతోందని చెప్పారు. అంతేకాకుండా కోవిడ్-19తో తల్లిదండ్రులు మరణించి, సంరక్షకులు ఎవ్వరూ లేక అనాథలుగా మిగిలిన పిల్లలకు కూడా రక్షణ గృహంలో వసతి కల్పించడం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో బాలల సంక్షేమం, సంస్కరణ సేవలు, వీధి బాలల సంక్షేమ శాఖ మరియు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గల బాలల రక్షణ గృహాలలో వసతి కల్పించి, సంరక్షించడం జరుగుతుందని ఆయన వివరించారు. కోవిడ్-19 బాధిత 18 సంవత్సరం లోపు వయస్సు గల  బాలబాలికల సంరక్షణకు చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెం. 1098,  మహిళా హెల్ప్ లైన్ నెం. 181 కు సమాచారం అందించవచ్చని పేర్కొన్నారు.  తల్లిదండ్రులు కరోనా నుండి కోలుకున్న తరువాత వారి పిల్లలను నిబంధనలను అనుసరించి అప్పగించటం జరుగుతుందని ఆయన వివరించారు. తల్లిదండ్రులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

శ్రీకాకుళం

2021-05-07 13:34:11

ప్రజల రక్షణార్ధం నిత్యం రైతుబజార్లు శానిటైజేషన్..

విశాఖ అర్భన్ లోని ప్రజల రక్షణార్ధం సీతమ్మధార మండలం పరిధిలో రైతుబజార్లను కర్ఫ్యూ నేపథ్యంలో నిత్యం శానిటైజేషన్ చేస్తున్నట్టు తహశీల్దార్ జ్నానవేణి తెలియజేశారు. శుక్రవారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలకు నిత్యవసర సరుకులకు ఇబ్బంది లేకుండా క్రిష్ణాకాలేజీ మైదానం, హెచ్ బి అబ్దుల్ కలాం పార్కు, నర్సింహనగర్ డిఎల్భీ గ్రౌండ్ లలో రైతు బజార్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇరుకుగా ఉండే సీతమ్మధార రైతు బజార్ ను తాత్కాలికంగా మూసివేసినట్టు వివరించారు. జెసి ఆదేశాల మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తహశిల్దార్ వివరించారు. కరోనా కేసులు అధికంగా పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటిస్తూ రైతు బజార్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి వీటిని కూడా ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నాం 12వరకూ మాత్రమే నిర్వహిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని తహశిల్దార్ జ్నానవేణి కోరుతున్నారు.

సీతమ్మధార

2021-05-07 09:02:53

ఆక్వా రైతుల‌కు క‌ర్ఫ్యూ పాసులు..డిడి నిర్మలకుమారి

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో క‌రోనా క‌ట్ట‌డి కోసం క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్న నేప‌థ్యంలో,  ఆక్వా రైతులు, సంబంధిత కార్య‌క‌లాపాలు చేసేవారు త‌ప్ప‌నిస‌రిగా క‌ర్ఫ్యూ పాసుల‌ను తీసుకోవాల‌ని మ‌త్స్య‌శాఖ ఉప సంచాల‌కులు నిర్మ‌లాకుమారి సూచించారు.  శుక్రవారం ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, త‌మ శాఖ ద్వారా ఆర్‌డిఓలు లేదా తహశీల్దార్ల‌ నుంచి ఈ పాస్‌ల‌ను పొంద‌వ‌చ్చ‌ని చెప్పారు. క‌ర్ఫ్యూ స‌మ‌యంలో వాహ‌నాల రాక‌పోక‌ల‌ను నియంత్రణ అధికంగా వుంటుందన్నారు. ఈ తరుణంలో ఆక్వా రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఈ పాసులను జారీచేస్తుందన్నారు. షాపుల‌ను మూసివేయిస్తుండ‌టం వ‌ల్ల‌, ఆక్వా రైతులు, వ్యాపారులు, ల్యాబ్ య‌జ‌మానులు, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ య‌జ‌మానులు త‌మ రాక‌పోక‌లు సాగించేందుకు ఈ పాసులు ఉపయోగపడతాయన్నారు.

విజయనగరం

2021-05-07 07:57:26

ప్రజలు అప్రమత్తతో కరోనా కట్టడి సాధ్యం..

ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వ సూచనలు పాటిస్తే కరోనా నియంత్రణ త్వరలోనే సాధ్యపడుతుందని విశాఖ అర్భన్ తహశీల్దార్ జ్నానవేణి సూచిస్తున్నారు. అవసరం ఉంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని చెబుతున్నారు. ఈ సందర్భంగా విశాఖలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రభుత్వం ఫాక్షిక కర్ఫ్యూ కి ప్రజలు సహకరించాలని కోరారు. మధ్యాహ్నాం 12 గంటల నుంచి తెల్లవారు జాము ఆరు గంటల వరకూ అమలు చేస్తున్న కర్ఫ్యూనిఅన్ని వర్గాలు పాటించాలన్నారు. ప్రభుత్వం ఎన్నో వ్యవయప్రయాసలకోర్చి చేస్తున్న సేవలను ప్రజలు గమనించాలని కోరారు. బయటకు వెళ్లే సమయంలో కూడా గుంపులు గుంపులుగా కాకుండా సామాజిక దూరం పాటిస్తూ పనులు చూసుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ఎవరికైనా ప్రభుత్వం సూచించిన అంశాల్లో ఆరోగ్య సమస్యలు ఉంటే తక్షణమే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేయించుకొని కోవిడ్ కేర్ సెంటర్లు లేదా, హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్సలు పొందాలన్నారు. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండి..సహకరిస్తే అంతే త్వరగా కరోనా వైరస్ ను విశాఖలో శతశాతం తగ్గించడానికి అవకాశం వుంటుందన్నారు. ఇటు సిబ్బంది కూడా  ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలంటే అధికారులు, సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఖచ్చితంగా 45 సంవత్సరాలు దాటిన వారంతా కోవిడ్ వేక్సిన్ వేయించుకోవాలని, మొదటి డోసు వేయించుకున్నవారు రెండవ డోసు కూడా వేయించుకోవాలని తహశీల్దార్ జ్నానవేణి కోరారు.

విశాఖపట్నం

2021-05-07 01:57:17

ప్రణాళికా బద్ధంగా ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా..

ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రులకు ప్ర‌ణాళిక ప్ర‌కారం ఆక్సిజన్ స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని, జిల్లాలో ఎక్క‌డా ఆక్సిజ‌న్ కొర‌త లేద‌ని, సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని జిల్లా కలెక్టర్ డి.మురళీధరెడ్డి తెలిపారు. జిల్లాలో కోవిడ్ ప‌రీక్ష‌లు, రోగుల‌కు వైద్య సేవ‌లు, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ త‌దిత‌ర అంశాల‌పై గురువారం సాయంత్రం క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి వ‌ర్చువ‌ల్ విధానంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జిల్లాకు విశాఖ‌ప‌ట్నం, అంగూల్ (ఒడిశా) నుంచి ఆక్సిజ‌న్ వ‌స్తోంద‌ని.. అన్‌లోడింగ్‌, ఫిల్లింగ్ ఆధారంగా ఆసుప‌త్రుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా సిలిండ‌ర్ల‌ను అందిస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం జిల్లాలో రోజువారీ వినియోగం 33.8 కిలో లీట‌ర్లు కాగా,   సరఫరా ద్వారా 30 కిలో లీట‌ర్లు ట్యాంకులలోను, 3 కిలోలీటర్లు సిలిండర్లలలోను మొత్తంమీద రోజువారీగా 33 కిలో లీట‌ర్లు మేర ఆక్సిజ‌న్ అందుబాటులో ఉంటోంద‌ని వివ‌రించారు. ఆక్సిజ‌న్ వినియోగంలో నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించిన కాకినాడ‌లోని ఫౌండేష‌న్ ఆసుప‌త్రికి కోవిడ్ చికిత్స అనుమ‌తుల‌ను ర‌ద్దుచేశామ‌ని.. 78 కోవిడ్ నోటిఫై ఆసుప‌త్రుల‌పై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటోంద‌ని, వీటిలో ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన మ‌రికొన్ని ఆసుప‌త్రుల‌ను ఇప్ప‌టికే గుర్తించామ‌ని, వీటిని కూడా డీనోటిఫై చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఆక్సిజ‌న్‌, రెమ్‌డెసివిర్ వినియోగంతో పాటు చికిత్సా ప్ర‌మాణాల‌పై ఆడిటింగ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అవ‌స‌రానికి మించి ఆక్సిజ‌న్‌ను నిల్వ చేసి, కృత్రిమ కొర‌త సృష్టించినా, ఎక్కువ‌గా వినియోగించినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని క‌లెక్ట‌ర్ హెచ్చ‌రించారు. జిల్లాలో గురువారం ఎనిమిది వేల మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 44.68 శాతం పాజిటివిటీ న‌మోదైంద‌ని, చాలా ఫోక‌స్డ్‌గా కోవిడ్ ల‌క్ష‌ణాలున్న వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం వ‌ల్ల ఈ స్థాయిలో కేసులు న‌మోద‌య్యాయ‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని,  సాధారణ స్థాయి వ్యాప్తి 15 శాతం లోపే ఉందని  క‌లెక్ట‌ర్ తెలిపారు.
      గురువారం  కోవిడ్ ఆసుపత్రుల నుండి స్వస్థత పొంది 757 మంది డిశ్చార్జి కాగా, క్రొత్తగా 417 అడ్మిష‌న్లు జ‌రిగాయ‌ని.. దీంతో 340 ప‌డ‌క‌లు ఖాళీ అయి, అందుబాటులోకి వ‌చ్చాయ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. గిరిజ‌న ప్రాంతాల్లో పాజిటివిటీ 15 శాతం లోపే ఉన్న‌ప్ప‌టికీ స్థిరీక‌ర‌ణ‌ను దృష్టిలో ఉంచుకొని రంప‌చోడ‌వ‌రం, చింతూరులో కోవిడ్ కేర్ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని, ప్ర‌స్తుతం జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేర్ కేంద్రాలకు ఆరు వేల ప‌డ‌క‌ల సామ‌ర్థ్యం ఉన్న‌ట్లు తెలిపారు. ఈ సీసీసీల్లో ప్రస్తుతం 817 మంది ఉన్నారని, ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, డిజిట‌ల్ ఎక్స్‌రే మిష‌న్ వంటి వాటిని సిద్ధంగా ఉంచామ‌న్నారు. తొలుత పూర్తిస్థాయిలో ట్ర‌యాజింగ్ చేసిన త‌ర్వాత మాత్ర‌మే ఆసుప‌త్రులు, సీసీసీల్లో అడ్మిష‌న్లు ఇస్తున్న‌ట్లు తెలిపారు. కోవిడ్‌, కోవిడేత‌ర కారణాల వల్ల మ‌ర‌ణించిన వారికి సంబంధించి గౌర‌వప్ర‌దంగా అంతిమ సంస్కారాలు నిర్వ‌హించేందుకు విధానాన్ని నిర్థేశించామని,    ఈ అంశాన్ని జిల్లాస్థాయిలో జేసీ (సంక్షేమం) జి.రాజ‌కుమారి ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని తెలిపారు. ఈ ప్ర‌క్రియ‌లో సేవాభావంతో పాల్గొనేలా  గ్రామీణ ప్రాంతాల్లో యూత్‌క్ల‌బ్‌ల‌ను ప్రోత్స‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. యు.కొత్త‌ప‌ల్లిలో యూత్‌క్ల‌బ్ స‌భ్యులు, వాలంటీర్లు అంతిమ సంస్కారాల‌కు సంబంధించి ఇటీవల చేసిన ఓ మంచి ప్ర‌య‌త్నం ఇందుకు స్ఫూర్తి నిచ్చిందని ప్రశంసించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో 31 మ‌హాప్ర‌స్థానం వాహ‌నాల‌ను అందుబాటులోకి తెచ్చామ‌ని వెల్ల‌డించారు. గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కోవిడ్ క‌ట్ట‌డికి ప్ర‌త్యేకంగా క‌మిటీలు ఏర్పాటుచేశామ‌ని, ఇవి క్రియాశీలంగా ప‌నిచేస్తున్నాయ‌ని.. గురువారం స‌ర్పంచ్‌ల‌తో మ‌రోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వ‌హించి, ప‌రిస్థితిని స‌మీక్షించిన‌ట్లు తెలిపారు.


వ్యాక్సినేష‌న్‌కు కూప‌న్లు:
భార‌త ప్ర‌భుత్వం నుంచి అందుతున్న డోసుల మేర‌కు జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని, మే 5, 6 తేదీల్లో రెండో డోస్ పంపిణీ మాత్ర‌మే చేప‌ట్టామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. ఏడో తేదీ నుంచి చేప‌ట్టే వ్యాక్సిన్ పంపిణీకి ల‌బ్ధిదారుల‌కు స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌, వాలంటీర్ల ద్వారా ఒక‌రోజు ముందే క‌ల‌ర్ కోడ్ కూప‌న్లు అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ కూప‌న్ల‌ను నిర్దేశ వ్యాక్సిన్ కేంద్రాల‌కు తీసుకెళ్లి, టీకా వేయించుకోవాల్సి ఉంటుంద‌న్నారు. ఫ్రంట్‌లైన్‌, హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్లు, ప్ర‌భుత్వ శాఖ‌ల ఉద్యోగులు, వృద్ధుల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌నున్నామ‌ని తెలిపారు. జ‌న‌ర‌ల్ ప‌బ్లిక్‌కు సంబంధించి 45 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి మాత్ర‌మే డోసులు పంపిణీ చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. అర్హుల రిజిస్ట్రేష‌న్‌, టీకా పంపిణీ ప‌ర్య‌వేక్ష‌ణ‌కు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేశామ‌ని, అన‌ర్హుల‌కు ఎవ‌రైనా టీకా వేస్తే ఆ ఘ‌ట‌న‌తో సంబంధ‌మున్న వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఇటీవ‌ల కాకినాడ‌లో నిబంధ‌న‌లు ఉల్లంఘించిన అయిదుగురు సిబ్బందిని స‌స్పెండ్ చేసిన‌ట్లు తెలిపారు. ఇండెంట్, డీడీలు అందించిన ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు అందించేందుకు ప్ర‌స్తుతం రెమ్‌డెసివిర్ ఇంజెక్ష‌న్లు అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపారు. క్షేత్ర‌స్థాయిలో కోవిడ్ బాధితుల గుర్తింపు, హోం ఐసోలేష‌న్‌, వ్యాక్సినేష‌న్, శానిటైజేష‌న్ త‌దిత‌ర అంశాల్లో గ్రామ‌, వార్డు వాలంటీర్లు కీల‌క‌పాత్ర పోషిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు.
వైద్య‌, ఇత‌ర సేవ‌ల‌పై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌: జేసీ(ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ‌
జిల్లాలోని కోవిడ్ నోటిఫై ఆసుప‌త్రుల్లో రోగుల‌కు అందిస్తున్న వైద్య సేవ‌ల‌తోపాటు ఆక్సిజ‌న్, ముఖ్య ఔష‌ధాల వినియోగం, ఆహారం, శానిటైజేష‌న్ ప్ర‌క్రియ‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తూ లోపాల స‌వ‌ర‌ణ‌కు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని జేసీ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ప్ర‌త్యేకంగా క్షేత్ర‌స్థాయిలో ఆక్సిజ‌న్ నిల్వ‌లు, వినియోగంపై త‌నిఖీ చేసేందుకు డ్ర‌గ్ ఇన్‌స్పెక్ట‌ర్‌, వైద్య‌, పోలీస్‌, రెవెన్యూ సిబ్బందితో కూడిన మొబైల్ ఆక్సిజ‌న్ మానిట‌రింగ్ స్వ్కాడ్ ప‌నిచేస్తున్న‌ట్లు తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా స‌ర‌ఫ‌రా ఉంద‌ని ఆక్సిజ‌న్‌కు ఎక్క‌డా కొర‌త లేద‌ని, కావాల‌ని వ‌దంతులు సృష్టించే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. హెల్ప్ డెస్క్‌, వైద్య సేవ‌లు, మెడిక‌ల్ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌, ఫైర్ సేఫ్టీ, వైద్య సిబ్బంది, ఆరోగ్య‌శ్రీ అమ‌లు త‌దిత‌ర ప్ర‌మాణాల ఆధారంగా ఆసుప‌త్రుల ప‌నితీరును మ‌దిస్తున్నామ‌ని, స‌రైన ప్ర‌మాణాలు పాటించ‌ని ఆసుప‌త్రుల‌ను డీనోటిఫై చేస్తామ‌ని జేసీ వెల్ల‌డించారు.

శాశ్వ‌త వ్యాక్సినేష‌న్ కేంద్రాలు: జేసీ(డీ) కీర్తి చేకూరి
జిల్లాలో శాశ్వ‌త వ్యాక్సినేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని, వైర‌స్ ఉద్ధృత వ్యాప్తి, వేసవి నేప‌థ్యంలో ఈ కేంద్రాల్లో ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నామ‌ని జేసీ (డీ) కీర్తి చేకూరి తెలిపారు. ప్ర‌స్తుతం కోవీషీల్డ్ డోసులు అందుబాటులో ఉన్నాయ‌ని మండ‌లానికి 200-300 డోసులు చొప్పున అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు రెడ్ క‌ల‌ర్‌, 45-60 ఏళ్ల వారికి బ్లూ క‌ల‌ర్‌, 60 ఏళ్లు పైబ‌డిన వారికి గ్రీన్ క‌ల‌ర్ కూప‌న్లను స‌చివాల‌యాల వారీగా అందిస్తామ‌ని వివ‌రించారు. ఈ కూప‌న్లు పొందిన అర్హులైన వారు నిర్దేశ వ్యాక్సిన్ కేంద్రాల‌కు వెళ్లి టీకా వేయించుకోవాల్సి ఉంటుంద‌ని జేసీ కీర్తి చేకూరి తెలిపారు.



అంతిమ సంస్కారాల‌కు ప్రోటోకాల్‌: జేసీ(డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి:
కోవిడ్ ఆసుప‌త్రులు, కోవిడ్ కేర్ కేంద్రాల్లో దుర‌దృష్ట‌వ‌శాత్తు మ‌ర‌ణాలు సంభ‌విస్తే గౌర‌వ‌ప్ర‌దంగా మృత‌దేహాల త‌ర‌లింపు, అంతిమ సంస్కారాల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేకంగా నిబంధ‌న‌లు రూపొందించి, అమ‌లు చేస్తున్న‌ట్లు జేసీ (డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి తెలిపారు. ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఇప్ప‌టికే క్షేత్ర‌స్థాయి అధికారుల‌కు పంపిన‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ‌మే ఉచితంగా మృత‌దేహాన్ని త‌ర‌లించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని, అయితే ఎవ‌రైనా తామే మృత‌దేహాన్ని ప్రైవేటు వాహ‌నంలో తీసుకెళ్లి, కోవిడ్ జాగ్ర‌త్‌బల‌తో అంతిమ సంస్కారాలు నిర్వ‌హిస్తామ‌ని చెప్పిన సంద‌ర్భంలో ర‌వాణా శాఖ నిర్దేశించిన ఛార్జీల‌ను మాత్ర‌మే వ‌సూలు చేయాల్సి ఉంటుంద‌ని, ఈ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి దోపిడికి పాల్పడితే  చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. డెడ్ బాడీ త‌ర‌లింపున‌కు  వాహన అద్దె కింద రూ.1,500; డ్రైవ‌ర్ బ‌త్తా రూ.375; క్లీన‌ర్ బ‌త్తా రూ.300; ఫ్యూయ‌ల్ ఛార్జ్ ఆరు కి.మీ.ల‌కు లీట‌రు చొప్పున, అలాగే అంతిమ సంస్కారాలకు గరిష్టంగా 4,500 మాత్ర‌మే వ‌సూలు చేయాల్సి ఉంటుంద‌ని జేసీ(డబ్ల్యూ) స్ప‌ష్టం చేశారు.

కాకినాడ

2021-05-06 15:00:21

విశాఖలో మరో 300 పడకలు సిద్ధం..

కరోనావైరస్ సోకి, ఆక్సిజన్ స్థాయిలు పడిపోయిన వారికి అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు ఆక్సిజన్ సరఫరా సదుపాయం ఉన్న 300 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ షీలానగర్‌లో ఉన్న వికాస్ విద్యానికేతన్ ప్రాంగణంలో ఏర్పాటు కానున్న ఈ కోవిడ్ వైద్య సేవల కేంద్రం పనులను గురువారం విజయసాయి రెడ్డి పర్యవేక్షించారు. ఈమధ్యనే నగరంలో కరోనా రోగులకు వైద్య సేవలు అందుతున్న తీరును విజయసాయి రెడ్డి స్వయంగా పరిశీలించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా పీపీఈ కిట్ ధరించి నేరుగా ఆస్పత్రికి వెళ్లిన విజయసాయి రెడ్డి, కరోనా రోగులతోను, వారి బంధువులతోనూ మాట్లాడి, వారి బాధలు విన్నారు. పలు సలహాలు, సూచనలు స్వీకరించారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుత కరోనా విజృంభణ, ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్న రోగులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా సేవలు అందించేందుకు సంకల్పించారు.

కోవిడ్ రోగులకు అవసరమైన అత్యవసర వైద్య సహాయాన్ని ఈ కేంద్రంలో అందజేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంగణానికి బెడ్స్ చేరగా, ఆక్సిజన్ సరఫరా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకటి, సోమవారం నాటి కల్లా పనులు కూడా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి అధికారులకు,పౌండేషన్ సభ్యులకు సూచించారు. 

దీంతో ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్న కోవిడ్ బాధితులు ఈ కేంద్రానికి వచ్చి వైద్య సేవలు పొందవచ్చు. వైద్యం, మందులతో పాటు రోగులకు మూడు పూటలా మంచి భోజనం కూడా ఇక్కడ అందించాలని విజయసాయి రెడ్డి సూచించారు. ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్న తమ వారి గురించి తమకు సమాచారం అందటం లేదని రోగుల బంధువులు పలువురు విజయసాయిరెడ్డి దృష్టికి గతంలో తీసుకువచ్చారు. దీంతో ఈ కేంద్రంలో వైద్య సేవలు పొందే రోగులకు సంబంధించిన సమాచారాన్ని వారి బంధువులకు ప్రతిరోజూ అందించే ప్రయత్నం కూడా చేయనున్నారు. 

ఖర్చుకు వెనకాడకుండా, రోగులకు మంచి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని విజయసాయి రెడ్డి చెప్పారు. అందుకొసం ఆంధ్రా మెడికల్ కాలేజీ వైద్య సిబ్బంది, జిల్లా వైద్య అధికారుల సహకారం తీసుకొనున్నట్టు చెప్పారు...ప్రతి 30 మంది రోగులకు ఒక డాక్టరు ఇద్దరు నర్సులు వారికి ఇక్కడ అందుబాటులో ఉందన్నారు. ఇలా రోజుకు మూడు స్విఫ్ట్ లలో  డాక్టర్లు, నర్సులు  కరోనా బధితులకు వైద్య సహాయం అందించనున్నారు. ఈ 300 పడకల లో పూర్తిస్థాయిలో ఆక్సిజన్ తో కూడిన మెడికల్ వైద్యం అందిస్తారు. అలాగే రోగులకు మూడు పూటలా ఆహార సదుపాయం కల్పించనున్నారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ,కిమ్స్,విమ్స్,డి.ఎమ్.హెచ్.వో వైద్యులు సిఫార్సు చేసిన రోగులతొ పాటుగా, కారోన బారినపడిన వారు నేరుగా ఈ కేంద్రానికి వచ్చి వైద్యం చేయించుకోవచ్చని ఆయన తెలిపారు.. ఎటువంటి తారతమ్యం లేకుండా కులమతాలకు అతీతంగా ఈ క్రమం ఈ కేంద్రానికి రావచ్చునని విజయసాయి రెడ్డి  వెల్లడించారు

ఈ కేంద్రంలోనే  ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ శాంపిల్ కలెక్షన్‌కు కూడా ఏర్పాట్లు చేయాలని సంకల్పించారు. ఇక్కడికి వచ్చిన రోగులకు ఉచితంగా వైద్య సదుపాయాలు అందించనున్నారు.

కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా విజయసాయి రెడ్డి విశాఖపట్నంలో అనేక కార్యక్రమాలను తొలి నుంచి నిర్వహిస్తున్నారు. 

కాగా, గురువారం విజయసాయి రెడ్డితో పాటు వికాస్ విద్యానికేతన్‌లో కోవిడ్ కేంద్రం ఏర్పాట్లను పర్యవేక్షించిన వారిలో ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సుధాకర్, డీఎంహెచ్ఓ పి సూర్యనారాయణ, జీవీఎంసీ ప్రాజెక్టు డైరెక్టర్ వై శ్రీనివాస్, ప్రగతి భారత్ ఫౌండేషన్ ప్రతినిధులు గోపినాధ్ రెడ్డి జాస్తి బాలాజీ తదితరులు ఉన్నారు.

విశాఖపట్నం

2021-05-06 14:54:02

కోవిడ్ రోగులకు రూ.350 తో బలవర్ధక ఆహారం..

కోవిడ్ సోకిన ఒక వ్యక్తికి ప్రతి రోజు రూ.350 ఖర్చుతో బలవర్ధకమైన ఆహారాన్ని అందజేస్తున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం నగర శివారులోని శిల్పారామంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ సోకిన వారికి అందించేందుకు సిద్ధం చేస్తున్న ఆహారం తయారీని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ సోకిన వారు త్వరితగతిన కోలుకునేలా డబ్బుకు, ఖర్చుకు వెనకాడకుండా నాణ్యత కలిగిన రోగనిరోధక శక్తి పెంచే ఆహారాన్ని అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. జిల్లాలో కోవిడ్ సోకిన వారికి రోగ నిరోధక శక్తి పెరిగే ఆహారాన్ని అందించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 3 కోవిడ్ ఆస్పత్రులు, 3 కోవిడ్ కేర్ సెంటర్లలో ఆహారాన్ని అందిస్తున్నామని, మిగిలిన ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఆహారాన్ని సరఫరా చేస్తున్నామన్నారు. నగరంలోని శిల్పారామంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజు 1800 మందికి పైగా కోవిడ్ సోకిన వారికి నాణ్యత కలిగిన రోగనిరోధక శక్తి పెంచే ఆహారం అందజేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కోవిడ్ 19 మెనూ ప్రకారం ఆహారాన్ని తయారుచేసి అందిస్తున్నామన్నారు.

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 580 మందికి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 400 మందికి, క్యాన్సర్ ఆస్పత్రిలో 260 మందికి, జె ఎన్ టి యు కోవిడ్ కేర్ సెంటర్ లో 330 మందికి, శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో 70 మందికి, లేపాక్షి లోని బాలయోగి గురుకులం లో ఏర్పాటుచేసిన కోవిడ్ కేర్ సెంటర్ లో 185 మందికి కలిపి మొత్తం 1825 మందికి గురువారం ఆహారాన్ని సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 7 గంటలకు బెల్లం, పాలు కలిపి రాగిజావా అందిస్తున్నామన్నారు. అనంతరం అల్పాహారం మెనూ ప్రకారం ప్రతిరోజు ఒక రకమైన టిఫిన్ అందిస్తున్నామని, మధ్యాహ్నం ప్రతిరోజు చికెన్ కర్రీ అందిస్తున్నామని, అన్నం, చపాతి, వెజ్ కర్రీ, పప్పు కూర కూడా అందిస్తున్నామన్నారు. సాయంత్రం 4:30 గంటలకు టీ, బిస్కెట్ అందిస్తున్నామన్నారు. అలాగే రాత్రికి చికెన్ స్థానంలో ఉడికిన గుడ్లు 2 ఇస్తున్నామని, గుడ్లతో పాటు అన్నం, చపాతీ, చట్నీ, వెజ్ కర్రీ ఇస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు కోవిడ్ సోకిన వారు త్వరితగతిన కోలుకునేలా బలవర్ధకమైన, రోగనిరోధక శక్తి పెంచే ఆహారాన్ని సరైన వేళలకు కోవిడ్ 19 ఫుడ్ మెనూ చార్ట్ ప్రకారం అందిస్తున్నామన్నారు. మంచి నాణ్యత కలిగిన రోగనిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకొని కోవిడ్ సోకిన వారు త్వరితగతిన కోలుకొని వారి ఇళ్లకు చేరుకుంటున్నారన్నారు. ఆహారాన్ని ఎలాంటి ప్లాస్టిక్ వాడకం లేకుండా, పరిశుభ్రంగా ప్యాక్ చేసి కోవిడ్ సోకిన వారికి అందిస్తున్నామన్నారు. నాణ్యతలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ఆహారాన్ని తయారు చేసి అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. నాణ్యత కలిగిన ఆహారాన్ని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తయారు చేస్తూ కోవిడ్ సోకిన వారికి అందిస్తున్నారని, ఇందుకు పర్యాటక శాఖ అధికారి దీపక్, పర్యాటక శాఖ అసిస్టెంట్ మేనేజర్ శ్రీధర్, కర్నూలు, అనంతపురం జిల్లాలకు కోవిడ్ కేర్ సెంటర్ల ఇంచార్జ్ బాబూజీలను జిల్లా కలెక్టర్ అభినందించారు. కోవిడ్ సోకిన వారికి ఇలాగే నాణ్యత కలిగిన ఆహారాన్ని ఇకముందు కూడా సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. శుక్రవారం నుంచి నగరంలోని ఎస్సి బాయ్స్ హాస్టల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ సోకిన వారికి అందించే ఆహారాన్ని తయారు చేస్తామని పర్యాటక శాఖ అధికారి తెలిపారు.

అంతకు ముందు  పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ బాధితులకు భోజనం సరఫరా ఎలా జరుగుతుందో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కోవిడ్ సోకిన వారికి అందించే భోజనం నాణ్యతతో ఉందా లేదా అని తనిఖీ చేశారు. భోజనాన్ని ప్యాకింగ్ చేసి అందించడం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళలలో టిఫిన్, భోజనం మెనూ ప్రకారం అందిస్తున్నరా లేదని గిరిజన శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ సోకిన వారికి సరైన వేళలకు క్రమం తప్పకుండా నాణ్యత కలిగిన భోజనాన్ని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

అనంతపురం

2021-05-06 14:42:53

రేపటి నుంచి కర్ఫ్యూని పక్కాగా అమలు చేయాలి..

క‌ర్ఫ్యూ అమ‌లు చేయ‌డం ద్వారా క‌రోనా వ్యాప్తిని నిరోధించాల‌నే స‌దుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం రోజూ 18 గంట‌ల పాటు అమ‌లు చేయాల‌ని నిర్ణయించింద‌ని, దీనిని స‌మ‌ర్ధవంతంగా అమలుచేస్తే పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గడంతోపాటు ఆసుప‌త్రుల్లో ప‌రిస్థితులు కూడా నియంత్రణ‌లోకి వ‌స్తాయ‌ని జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. దీనిని అమ‌లు చేయ‌డంలో పోలీసు యంత్రాంగానికి ప్రజ‌లంతా స‌హ‌క‌రించి 12 గంట‌ల త‌ర్వాత ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాకుండా స్వీయ నియంత్రణ పాటించాల‌ని, వ్యాపార‌స్తులు కూడా 12 గంట‌ల స‌మ‌యానికి త‌మ వ్యాపార కార్యక‌లాపాలు నిలిపివేయాల‌ని కోరారు. ప్రజ‌లు స‌హ‌క‌రించి నిబంధ‌న‌లు పాటిస్తే కోవిడ్ వ్యాప్తిని నిరోధించ‌గ‌ల‌మ‌ని పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల తర్వాత క‌ర్ఫ్యూ అమ‌లు జ‌రుగుతున్న తీరుపై ప‌రిశీలించే నిమిత్తం న‌గ‌రంలోని ప‌లు ముఖ్య కూడ‌ళ్లు, ముఖ్య ర‌హ‌దారుల్లో క‌లెక్టర్ గురువారం అద‌న‌పు ఎస్‌.పి. స‌త్యనారాయ‌ణ‌రావుతో క‌ల‌సి ప‌ర్యటించి ఆక‌స్మిత త‌నిఖీలు చేప‌ట్టారు. ముందుగా మూడు లాంత‌ర్ల కూడ‌లి వ‌ద్దకు చేరుకొని 12-15 నిముషాల త‌ర్వాత కూడా ప‌లు షాపులు తెర‌చి వుండ‌టాన్ని గ‌మ‌నించి ఆ షాపుల వ‌ద్దకు వెళ్లి మూసివేయించారు. రోడ్డుపై తోపుడుబ‌ళ్లు వ్యాపారుల వ‌ద్దకు వెళ్లి 12 త‌ర్వాత వ్యాపారం నిర్వహించ‌డానికి వీల్లేద‌ని స్పష్టం చేశారు. 12-30 గంట‌ల స‌మ‌యానికి కూడా మూడు లాంత‌ర్ల కూడ‌లి వ‌ద్ద వాహ‌నాల ర‌ద్దీ వుండ‌టాన్ని గ‌మ‌నించి ప‌లువురు వాహ‌న‌దారుల‌ను మంద‌లించారు. ప్రభుత్వం 12 గంట‌ల త‌ర్వాత రోడ్లపై సంచ‌రించ‌రాద‌ని స్పష్టంగా ప్రక‌టించిన తర్వాత కూడా వాహ‌నాల‌పై తిర‌గ‌డం ప‌ట్ల అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎం.జి.రోడ్డు మీదుగా క‌న్యకా ప‌ర‌మేశ్వరి కూడ‌లి, పేర్ల వారి వీధి, మార్కెట్‌ ప్రాంతాల‌ను ప‌రిశీలించి తెర‌చి వున్న షాపుల‌ను మూసి వేయించారు. అనంత‌రం రింగురోడ్డు, కొత్తపేట నీళ్లటాంకు, అంబ‌టిస‌త్రం ప్రాంతాల్లో క‌లెక్టర్ ప‌ర్యటించారు.

 
శుక్రవారం నుంచి మ‌రింత క‌ఠినంగా ఆంక్షలు అమ‌లు జ‌రిగేలా చ‌ర్యలు చేప‌ట్టాల‌ని క‌లెక్టర్ ఈ సంద‌ర్భంగా పోలీసు అధికారుల‌కు సూచించారు. ఉద‌యం 11.30 గంట‌ల నుంచే మైకుల ద్వారా షాపులు మూసివేయాల‌నే విష‌యాన్ని ప్రచారం చేసి అన్ని మార్కెట్లను సంద‌ర్శించి ద‌గ్గర వుండి షాపులు మూసి వేయించాల‌న్నారు. రెవిన్యూ అధికారులతో బృందాలుగా ఏర్పడి అన్ని ప్రాంతాల్లోనూ 12 గంట‌ల‌కు అన్ని షాపులు ఖ‌చ్చితంగా మూసివేసేలా చ‌ర్యలు చేప‌ట్టాల‌న్నారు. నిబంధ‌న‌ల‌కు అతిక్రమించే వారిపై కేసులు న‌మోదు చేయాల‌ని ఆదేశించారు. ఈ ప‌ర్యట‌న‌లో ట్రాఫిక్ డి.ఎస్‌.పి. ఎల్‌.మోహ‌న‌రావు, త‌హ‌శీల్దార్ ప్రభాక‌ర‌రావు, సిఐలు శ్రీ‌నివాస్‌, మంగ‌వేణి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకొనే రాష్ట్ర ప్రభుత్వం క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తోంద‌న్నారు. ప్రజ‌లంతా తు.చ‌.త‌ప్పకుండా ఈ నిబంధ‌న‌ల‌న్నీ పాటించాల‌న్నారు.  కోవిడ్ రెండో వేవ్ చాలా త్వర‌గా వ్యాప్తి చెందుతోంద‌ని అందువ‌ల్ల ప్రజ‌లంతా అప్రమ‌త్తంగా వుంటూ బాధ్యత‌గా వ్యవ‌హ‌రించాల‌న్నారు. బ్యాంకు సేవ‌లు, జాతీయ ర‌హ‌దారుల ప‌నులు, విద్యుత్ స‌ర‌ఫ‌రా, మెడిక‌ల్ షాపులు, తాగునీటి స‌ర‌ఫ‌రా వంటి కొన్ని ర‌కాల అత్యవ‌స‌ర సేవల‌ను క‌ర్ఫ్యూ నుంచి మిన‌హాయింపులు ఇవ్వడం జ‌రిగింద‌న్నారు.

 
జిల్లాలో కోవిడ్ బాధితుల‌కు మూడు ర‌కాల వైద్య సేవ‌లు అందిస్తున్నామ‌ని జిల్లా క‌లెక్టర్ డా.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ చెప్పారు. ఇంట్లోనే వుంటూ వైద్యసేవ‌లు పొందేవారికి ఫోన్‌ద్వారా  వారి ఆరోగ్య ప‌రిస్థితిని ప్రతిరోజూ ప‌ర్యవేక్షిస్తున్నామ‌ని, ఇంట్లో ఐసోలేష‌న్‌లో వుండేందుకు సౌక‌ర్యాలు లేని వారికి కోవిడ్ కేర్ సెంట‌ర్లలో చేర్పించి చికిత్స అందిస్తున్నామ‌ని, ఆసుప‌త్రి సేవ‌లు అవ‌స‌ర‌మైన వారిని ఆయా కోవిడ్ ఆసుప‌త్రుల్లో చేర్పించి వైద్యస‌హాయం అందిస్తున్నట్టు చెప్పారు. కోవిడ్ సోక‌కుండా ప్రతిఒక్కరూ త‌మ‌వంతుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి స్వగ్రామాల‌కు చేరుకొనే వ‌ల‌స కార్మికుల‌కు ప్రభుత్వ ప‌రంగా స‌హాయం అందించేందుకు చ‌ర్యలు చేప‌డుతున్నట్టు జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ చెప్పారు. వారికి నిత్యావ‌స‌ర స‌రుకులు అందించ‌డం, క్వారంటైన్ కేంద్రాల్లో వారికి అవ‌స‌ర‌మైన భోజ‌నం, ఇత‌ర వ‌స‌తులు క‌ల్పించ‌డం వంటి చ‌ర్యలు చేప‌డ‌తామ‌ని, గ్రామాల్లో అవ‌స‌ర‌మైన వారికి ప‌నులు కూడా క‌ల్పిస్తామ‌న్నారు.

విజయనగరం

2021-05-06 14:35:33

కంటైన్మెంట్ జోన్ల కోసం మ్యాపింగ్ చేయాలి..

కోవిడ్ కంటైన్మెంటు జోన్లలో పర్యవేక్షణకు వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని మేపింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. కంటైన్మెంటు జోన్లను పకడ్బందీగా నిర్వహించాలని, కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. గురువారం మండల ప్రత్యేక అధికారులు, వైద్య శాఖ అధికారులు, వైద్య అధికారులతో టెలీ కాన్ఫరెన్సును కలెక్టర్ నిర్వహించారు. ఒక సచివాలయ ఉద్యోగికి కనీసం ముగ్గురు వాలంటిర్లను మ్యాప్ చేయాలని, ఆ ముగ్గురు పనులను సచివాలయ ఉద్యోగి పర్యవేక్షించాలని అన్నారు. ప్రతి రోజూ ఆర్.డి.ఓలు, సంబంధిత సర్విలెన్స్ అధికారులు, ఎం.పి.హెచ్.ఏలతో చొప్పున సమీక్షించాలని ఆయన ఆదేశించారు. ప్రతి కంటైన్మెంట్ జోన్ లో ఒక సచివాలయ ఉద్యోగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. హై పాజిటివిటీ నమోదు అవుతున్న మండలాలలో రెండు వందలకు తగ్గకుండా టెస్టులు చేయాలని ఆయన ఆదేశించారు. ప్రతి పట్టణ ప్రాంతంలో రెండు వందల నుండి 250 కి తగ్గకుండా టెస్టులు చేయాలని పేర్కొన్నారు. హోమ్ ఐసోలేషన్ కిట్స్ పంపిణీ జరగాలని, వాటిని యాప్ లో అప్ లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు.  ఈ టెలీ కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గరోడా, రెవిన్యూ డివిజనల్ అధికారులు ఐ.కిషోర్, టి.వి.ఎస్.జి.కుమార్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం

2021-05-06 10:06:21