1 ENS Live Breaking News

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు..

కోవిడ్ వైద్య సేవ‌లు అందుతున్న తీరును ప‌రిశీలించే నిమిత్తం క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ సోమ‌వారం చీపురుప‌ల్లిలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఆసుప‌త్రుల‌ను ఆక‌స్మికంగా తనిఖీ చేశారు. ముందుగా క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌ను సంద‌ర్శించి అక్క‌డ అందుతున్న సేవ‌ల‌ను ప‌రిశీలించారు. బెడ్ల కేటాయింపు, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, వైద్య సిబ్బంది త‌దిత‌ర అంశాల‌పై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాలో, బెడ్ల కేటాయింపులో ఇబ్బందులు రాకుండా చూసుకోవాల‌ని సూచించారు. టెస్టింగ్ కిట్లు, ల్యాబ్ ప‌రిక‌రాలు, అద‌న‌పు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాల‌ని, అవ‌స‌ర‌మ‌నుకుంటే ఇండెంట్ పెట్టి తెప్పించుకోవాల‌ని చెప్పారు. బొబ్బిలిలో ఆక్సిజ‌న్ ఫిల్లింగ్ సదుపాయం క‌ల్పించామ‌ని, అవ‌స‌ర‌మైన మేర‌కు అక్క‌డ నుంచి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను తెప్పించుకోవాల‌ని వైద్యాధికారుల‌కు సూచించారు. ఆసుప‌త్రి ప‌రిస‌రాల‌లో అప‌రిశుభ్ర వాతావ‌ర‌ణం ఉండ‌టంపై స్థానిక శానిటేష‌న్ అధికారుల‌ను మంద‌లించారు. శానిటేష‌న్ ఈవోని పిలిపించి మాట్లాడారు. ఆవ‌ర‌ణలో ఉన్న చెత్త‌ను, ఇత‌ర వ్య‌ర్థాల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని ఆదేశించారు. రిసెప్ష‌న్ సెంట‌ర్లో నిత్యం సిబ్బంది అందుబాటులో ఉండాల‌ని, అలాగే కోవిడ్ వార్డు వ‌ద్ద పోలీసు సిబ్బంది 24 గంట‌లు సేవ‌లందించేలా చూసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 

శ్రీ విజ‌య ఆసుప‌త్రి వైద్యుల‌పై ఆగ్ర‌హం

అనంత‌రం స్థానిక శ్రీ విజ‌య ఆసుప‌త్రిని క‌లెక్ట‌ర్‌ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు కోవిడ్ సేవ‌లు ప్రారంభించ‌క‌పోవ‌టంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రోగుల‌ను ఎందుకు చేర్చుకోలేద‌ని ఆసుప‌త్రి వైద్యుల‌ను ఆరా తీయ‌గా.. సిబ్బంది లేర‌ని.. రావ‌డానికి ఎవ‌రూ ఆశ‌క్తి చూప‌టం లేద‌ని స‌మాధానం ఇచ్చారు. దీనిపై క‌లెక్ట‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఇంత నిర్ల‌క్ష్యంగా ఉండ‌టం ఏమాత్రం స‌రికాద‌ని వ్యాఖ్యానించారు. అద‌న‌పు సిబ్బందిని నియ‌మించుకొని 24 గంట‌ల్లో కోవిడ్ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. లేక‌పోతే ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. అక్క‌డున్న నోడ‌ల్ అధికారి రామ‌కృష్ణ‌ను పిలిపించి డీసీహెచ్ఎస్‌తో మాట్లాడి రేప‌టిక‌ల్లా విజ‌య ఆసుప‌త్రిలో కోవిడ్ సేవ‌లు అందేలా చూడాల‌ని చెప్పారు.

విజయనగరం

2021-05-03 15:16:51

రేషన్ పంపిణీ వేగంగా జరగాలి..

 కోవిడ్ ను దృష్టి లో పెట్టుకొని రేషన్  బియ్యాన్ని వేగంగా పంపిణీ చేయాలనీ సంయుక్త కలెక్టర్ డా. జి.సి కిషోర్ కుమార్  సూచించారు.   సోమవారం తన ఛాంబర్ లో సంబంధిత అధికారులు, ఎం. డి. యు  ఆపరేటర్ల తో రేషన్ పంపిణీ పై  సమీక్షించారు.   ఎం. డి యు ఆపరేటర్లకు  కరోనా  సోకకుండా ఉండేలా సానిటైసర్ లు, మాస్క్ లు, గ్లౌస్ లను అందజేయడం  జరిగిందని తెలిపారు. కరోనా నివారణా పద్ధతులన్నీ వినియోగిస్తూ రేషన్ పంపిణీ చేయాలన్నారు.   రెగ్యులర్ గా ఇచ్చే 5 కేజీ లతో పాటు కోవిడ్ కారణంగా అందించే మరో 5 కేజీ లను కుడా కలుపుకొని 10 కేజీ లను  ఈ నెల అందజేయాలని   ఆదేశించారు.  జిల్లాలో నున్న 6 లక్షల 95 వేల 821  కార్డు దారులకు ఈ లబ్ది చేకూరనుందని తెలిపారు. 
ఈ సమావేశం లో  రెవిన్యూ డివిజినల్ అధికారి సి.హెచ్. భవాని శంకర్, జిల్లా పౌర సరఫరాల అధికారి పాపా రావు, ఎస్.సి కార్పొరేషన్ ఈ.డి జగన్నాధ రావు,  ఎం.డి.యు ఆపరేటర్ ల ప్రతినిధులు పాల్గొన్నారు. 

కలెక్టరేట్

2021-05-03 15:12:35

104 కాల్ సెంటర్ ఆకస్మిక తనిఖీ..

104 కాల్ సెంటర్ కు వచ్చే కాల్స్ కి పరిష్కారం చూపించడంలో ఎలాంటి నిర్లక్ష్యం తగదని, ఎప్పటికప్పుడు కాల్స్ కి రెస్పాండై ఫిర్యాదులను పరిష్కరించేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని ఎన్ ఐసి భవనంలో కోవిడ్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 104 కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులను ఎటువంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సిబ్బంది పని చేయాలన్నారు. 104 కాల్ సెంటర్ కు వచ్చిన ఫిర్యాదులపై 30 నిమిషాల్లోపు సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రయారిటీ ప్రకారం పరిష్కారం చూపించాలన్నారు. 104 కాల్ సెంటర్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి చేస్తున్న పని పై క్లారిటీ ఉండాలన్నారు. ఫిర్యాదులను ఎటువంటి పెండింగ్ లేకుండా పరిష్కరించేలా పని చేయాలన్నారు. 104 ఉద్యోగులు అంత బాగా పని చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

కోవిడ్ నేపథ్యంలో కోవిడ్ ఆస్పత్రుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అవి పని చేసేలా చూడాలని, విజువల్స్ ను నిత్యం పరిశీలన చేయాలన్నారు. అన్ని కోవిడ్ ఆస్పత్రుల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా విజివల్స్ ని ఖచ్చితంగా పరిశీలించాలని, వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని పరిశీలన చేయాలన్నారు. అన్ని ఆస్పత్రుల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా విజివల్స్ 104 కాల్ సెంటర్ లో కనిపించేలా చూడాలని సూచించారు. ఏజెన్సీ వారితో మాట్లాడి కోవిడ్ ఆస్పత్రుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కోవిడ్ 19 హాస్పిటల్ యాప్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో ఏ ప్రాంతం నుంచి వచ్చిన ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయి అనేది పరిశీలించి, వెంటనే ఒక ఫిర్యాదు కూడా పెండింగ్ ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్, డి ఈ ఓ ప్రేమ్ కుమార్, సిసి టివి మానిటరింగ్ డిపిఎంఓ సురేష్, హెల్త్ సూపర్వైజర్ శ్రీధర్ మూర్తి, 104 కాల్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టరేట్

2021-05-03 15:10:56

హిందూపురంలో వైద్య సిబ్బంది నియామకం..

 కరోనా బాధితులకు మెరుగైన చికిత్సను అందించే నిమిత్తం ప్రస్తుతం సేవలు అందిస్తున్న సిబ్బందికి అదనంగా వైద్య సిబ్బందిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 
 ఒక జనరల్ డ్యూటీ డాక్టర్, ఒక పీడియాట్రిషియన్,18 మంది స్టాఫ్ నర్సులు, 10 మంది ఎఫ్ఎన్ఓ-ఎంఎన్ఓలు, 5 మంది హౌస్ సర్జన్ లతో కూడిన 32 మంది వైద్య సిబ్బందిని కలెక్టర్ నియమించారు. తాజాగా నియమించిన సిబ్బంది నేటి సాయంత్రం లోపు హిందూపురం జిల్లా ఆసుపత్రిలో విధుల్లో చేరతారని కలెక్టర్ తెలిపారు. 

 హిందూపురం జిల్లా ఆసుపత్రిలో జెనరల్ డ్యూటీ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న డా. రాజ గోపాల్ కు సహాయకుడిగా మడకశిర సీహెచ్సీ పీడియాట్రిషియన్ డా. ప్రేమ్ కుమార్ వ్యవహరించనున్నారు. హిందూపురం జిల్లా ఆసుపత్రితో పాటు కదిరి, గుంతకల్లు ఏరియా ఆస్పత్రులలోను 10 మంది ఎమ్ఎన్వోలు, ఎఫ్ఎన్ఓ ల నియామకం చేపట్టారు. గుంతకల్లు ఏరియా ఆసుపత్రిలో నలుగురు ఎమ్ఎన్వోలు, ఒక ఎఫ్ఎన్ఓ.. కదిరి ఏరియా ఆస్పత్రిలో ముగ్గురు ఎమ్ఎన్ఓలు, ఇద్దరు ఎఫ్ఎన్ఓలను నియమించడం జరిగిందన్నారు.

హిందూపురం

2021-05-03 15:09:11

కాకినాడలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి..

కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ) ఆసుప‌త్రిని  రూ.100 కోట్ల అంచ‌నా వ్య‌యంతో 100 పడకలతో నిర్మాణం చేపడుతున్నట్టు కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వ‌నాథ్ తెలిపారు. సోమ‌వారం సాంబ‌మూర్తిన‌గ‌ర్‌లో కాకినాడ అర్బ‌న్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, న‌ర‌సాపురం ఎమ్మెల్యే ఎం.ప్ర‌సాద్‌రాజుతో క‌లిసి ఎంపీ ఈఎస్ఐ నూత‌న ఆసుప‌త్రి నిర్మాణ ప‌నుల‌ను పూజ‌లు చేసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ మాట్లాడుతూ కార్మికుల ఇబ్బందులు ఈ ఆసుప‌త్రి నిర్మాణంతో తొల‌గిపోతాయ‌ని, వైద్య సేవ‌ల కోసం రాజ‌మ‌హేంద్ర‌వ‌రం వెళ్లాల్సిన బాధ త‌ప్పుతుంద‌న్నారు. కాకినాడ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఎక్కువ‌గా ప‌రిశ్ర‌మ‌లు ఉన్నాయ‌ని, వీటిలో ప‌నిచేస్తున్న కార్మికులు, వారి కుటుంబ స‌భ్యులను క‌లుపుకొని దాదాపు రెండు ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల‌కు ఈ ఆసుప‌త్రి ద్వారా సేవ‌లు అంద‌నున్న‌ట్లు వివ‌రించారు. కేంద్ర కార్మిక‌, ఉపాధి క‌ల్ప‌న శాఖా మంత్రి సురేష్‌కుమార్ గంగ్వార్ ఎంతో స‌హ‌కారం అందించార‌ని, గ‌తేడాది ఫిభ్ర‌వ‌రిలో శంకుస్థాప‌న జ‌రిగిన‌ప్ప‌టికీ టెండ‌ర్ ప్ర‌క్రియ‌, సాంకేతిక కార‌ణాల వ‌ల్ల నిర్మాణ ప‌నుల్లో జాప్యం జ‌రిగింద‌ని వివ‌రించారు. ఇప్పుడు అన్నీ సిద్ధ‌మ‌వ‌డంతో నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం వేస‌వి కాబ‌ట్టి ప‌నులు త్వ‌ర‌గా జ‌రుగుతాయ‌ని, దాదాపు 15 నెలల్లో ప‌నులు పూర్త‌య్యేలా ఇంజ‌నీర్లు ప్ర‌ణాళిక‌లు రూపొందించిన‌ట్లు ఎంపీ వెల్ల‌డించారు. 
       కాకినాడ ప‌ట్ట‌ణ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీ వంగా గీతా విశ్వ‌నాథ్ స‌హ‌కారంతో అధునాత‌న 
ఈఎస్ఐ ఆసుప‌త్రి కల సాకార‌మ‌వుతోంద‌ని, ఆమె ఎంతో ప‌ట్టుద‌ల‌తో కేంద్రంతో నిరంత‌రం సంప్ర‌దింపులు జ‌రిపి ఆసుప‌త్రి కోసం కృషిచేశార‌ని పేర్కొన్నారు. కాకినాడతో పాటు జిల్లాలోని కార్మిక సోద‌రులంద‌రూ ఆమెకు రుణ‌ప‌డి ఉంటార‌ని, ఈ ఆసుప‌త్రి ద్వారా అధునాత‌న వైద్య సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని వివ‌రించారు. ఈ ఆసుప‌త్రి క‌ల సాకారమ‌వుతుండ‌టానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌హ‌కారంతో పాటు ఎంపీ కృషి ఎంతో ఉంద‌ని ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో సెంట్ర‌ల్ పీడ‌బ్ల్యూడీ అసిస్టెంట్ ఇంజ‌నీర్ ఎన్‌.సాల్మ‌న్‌రాజు, నిర్మాణ సంస్థ ఇంజ‌నీర్ ఆంజ‌నేయులు, సైట్ ఇంజ‌నీర్ భానుప్ర‌తాప్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

కాకినాడ

2021-05-03 15:02:50

తూ.గో.జిల్లాలో ఆలయాలన్నీ పూర్తిగా మూత..

 కోవిడ్ రెండోద‌శలో ప్ర‌స్తుతం 30 శాతం పాజిటివిటీ ఉన్న నేప‌థ్యంలో వైర‌స్ వ్యాప్తి ఉద్ధృతిని క‌ట్ట‌డిచేసే చ‌ర్య‌ల్లో భాగంగా అన్ని దేవాల‌యాలు, ప్రార్థ‌నా మందిరాల‌ను పూర్తిగా మూసివేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, ఈ ఆదేశాలు మే 3వ తేదీ సోమ‌వారం నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం క‌లెక్ట‌రేట్‌లోని కోర్టుహాల్‌లో ఎస్‌పీ అద్నాన్ న‌యీం అస్మీతో క‌లిసి క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి వివిధ మ‌తాల పెద్ద‌ల‌తో కోవిడ్ వైర‌స్ ఉద్ధృతి నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం జిల్లాలోని ప‌రిస్థితిని వివ‌రించడంతో పాటు బాధ్య‌తాయుత వ్య‌క్తులుగా ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై స‌మ‌గ్రంగా చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ దేవాల‌యాలు, మ‌సీదులు, చ‌ర్చిలు త‌దిత‌ర ప్రార్థ‌నా స్థ‌లాలను పూర్తిగా మూసేయాల‌ని, భ‌క్తులకు అనుమ‌తి ఉండ‌ద‌ని ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌కు పూర్తి కోవిడ్ జాగ్ర‌త్త‌ల‌తో పూజారి, ఇమామ్‌, పాస్ట‌ర్ వంటి మ‌త పెద్ద‌ల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపారు. జ‌న‌ర‌ల్ ప‌బ్లిక్‌కు అనుమ‌తి ఉండ‌ద‌ని తెలుపుతూ దేవాల‌యాలు, ప్రార్థ‌నా స్థ‌లాల ప్ర‌వేశ‌ద్వారాల వ‌ద్ద సూచిక బోర్డుల‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. మ‌తప‌ర సంస్థ‌ల‌కు సంబంధించి ప‌బ్లిక్ వేలం నిర్వ‌హ‌ణ ప్ర‌క్రియ‌ను కూడా వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు. గ్రామాల్లో జాత‌ర‌లు, ఊరేగింపులు వంటివి నిర్వ‌హించ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. తాజా ఆదేశాలు త‌దుప‌రి ఉత్త‌ర్వులు వెలువ‌డే వ‌ర‌కు వ‌ర్తిస్తాయ‌ని, ఉల్లంఘించిన వారిపై విప‌త్తు నిర్వ‌హ‌ణ చ‌ట్టం-2005లోని సెక్ష‌న్ 51-60, ఐపీసీ సెక్ష‌న్ 188తో పాటు ఇత‌ర వ‌ర్తించే చ‌ట్టాల మేర‌కు క‌ఠిన క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోబ‌డ‌తామ‌ని వెల్ల‌డించారు. కాకినాడ‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎస్‌పీలు, సంబంధిత ఇత‌ర అధికారులు ఆదేశాల అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ వైర‌స్ ఏదో ఒక వైపు నుంచి దాడిచేస్తున్న ప్ర‌స్తుత విప‌త్తు స‌మ‌యంలో క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోక త‌ప్ప‌ద‌ని, ప్ర‌జ‌ల‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంద‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లుచేసేందుకు స‌హ‌క‌రించాల‌ని కోర‌గా.. అందుకు మ‌త పెద్ద‌లు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తూ అంగీకారం తెలిపారు. స‌మావేశంలో ఇన్‌ఛార్జ్ జేసీ (సంక్షేమం), డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, మైనారిటీ సంక్షేమ అధికారి పీఎస్ ప్ర‌భాక‌ర‌రావు, హిందూమత పెద్దలు సీహెచ్ వేణుగోపాల్‌, సీహెచ్ క‌న‌క‌దుర్గా ప్ర‌సాద్‌; ముస్లిం మతపెద్ద రజాక్; క్రైస్తవ మత పెద్దలు రెవరెండ్ విలియం, రెవరెండ్ జోయల్, రెవరెండ్ మిస్పా విజ‌య్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

కాకినాడ

2021-05-03 14:18:54

ప్రతీరోజూ ప్రైవేటు ఆసుపత్రుల తనిఖీ..

ప్రతీ రోజు ప్రైవేటు ఆసుపత్రులను ఇన్స్పెక్ట్ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ లను జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ ఆదేశించారు.  సోమవారం ఆసుపత్రుల్లోని ఖాళీ పడకలు, ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలు గూర్చి జిల్లా జాయింట్ కలెక్టర్ - 2 పి.అరుణ్ బాబు, ఎ.ఎం.సి. ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ లతో ఆయన కలసి సమీక్షించారు.     104 కాల్ సెంటర్ రియల్ టైంలో ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, ఎన్ని పడకలు ఉన్నది, తదితర వివరాలు అప్ డేట్ గావించాలని సర్వే శాఖ ఎ. డి., మనిషా త్రిపాఠీ లను ఆదేశించారు. ఆసుపత్రుల్లో పడకలు కాలీ అయితే ఖాళీ అని చూపిస్తే అడ్మిషన్ టోకెన్లు డిఆర్డిఎ పిడి, 104 నోడల్ అధికారి విశ్వేశ్వరరావు జారీ చేస్తారని వివరించారు. ప్రైవేటు ఆసుపత్రుల జాబితాను నోటిఫై చేయాలని, అందులో కేటగిరి-ఎ శత శాతం కోవిడ్ ఆసుపత్రులని, కేటగిరి - బి 50 శాతం కోవిడ్ ఆసుపత్రులని పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్న పడకల సంఖ్య పక్కాగా తెలియాలని ఆదేశించారు. ప్రతీ రోజు ఉదయమే ప్రైవేటు ఆసుపత్రులను సందర్శించి ఏ ఆసుపత్రిలో, ఏ ఫ్లోర్ లో ఎన్ని పడకలు, ఎంత మంది పేషెంట్లు ఉన్నదీ తెలియజేయాలని డిఎంహెచ్ఓ, ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ లను ఆదేశించారు. విమ్స్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా మరింత పేంచేందుకు, పడకలపై చర్చించారు.   ఈ సమావేశంలో డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సూర్యనారాయణ, జిల్లా ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2021-05-03 14:02:38

కోవిడ్ ఆసుపత్రుల ఆక్సిజన్ కి రూ.80 లక్షలు..

విశాఖ జిల్లాలో కోవిడ్ ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపడుతున్న వివిధ జాగ్రత్తలలో భాగంగా దివీస్ ల్యాబ్ నుండి వివిధ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా నిమిత్తం జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ కు జనరల్ మేనేజర్ కోటీశ్వరరావు సుమారు 80 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.  సోమవారం కలెక్టరేట్ లోని ఆయన చాంబర్ లో అందించి, విశాఖ ఇండస్టియల్ గ్యాసెస్ నుండి వివిధ ఆసుపత్రులకు ఇప్పటికే 350 సిలిండర్లు సరఫరా చేసినట్లు తెలిపారు.  కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బలిటీ కింద ఈ ఆక్సిజన్ సిలిండర్లు ను సరఫరా చేస్తున్నట్లు వివరించారు.దివీస్ ల్యాబ్ లేటరీ నుండి సి.ఎస్.ఆర్. మేనేజర్ డి. సురేష్ కుమార్, పి. అశోక్ మరియు సీనియర్ లైజన్ కన్సల్టెంట్  వరహాలరెడ్డి గారు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2021-05-03 14:00:46

కోవిడ్ వార్డులో మెరుగైన సేవలు..

కె జి.హెచ్ కోవిడ్ వార్డులో  కోవిడ్ బాధితులకు  మెరుగైన వైద్య సేవలు అందించాలని కోవిడ్  నోడల్ అధికారి ,ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు సోమవారం కేజీహెచ్ నోడల్ అధికారిగా గారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా  కోవిడ్ విభాగం అధికారులతో సమీక్షించారు.
కోవిడ్ పేషేంట్లకు నాణ్యమైన  ఆహారపదార్థాలు అందించాలన్నారు. తాగునీటి ని ఎప్పటికప్పుడు సరఫరా చేయాలని సూచించారు. అన్ని కోవిడ్ వార్డుల్లో అవసరమైన వెంటిలేటర్ లు ,బెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పేషెంట్ బంధువులు ఎక్కువమంది రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పేషేంట్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సహాయక కేంద్రానికి అందించాలని పేర్కొన్నారు.
నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపట్టి వార్డులను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ప్రతి షిప్టులోను60 మంది శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వహించాలని చెప్పారు
ఇటీవల కోవిడ్ సేవలకు నియమించిన డాక్టర్లు, సిబ్బంది వెంటనే విధులకు చేరాలన్నారు.కోవిడ్ బాధితులకు నిరంతరం ఆక్సిజన్ అందించాలన్నారు. సి ఎస్ ఆర్ బ్లాక్ లో ఏర్పడ్డ చిన్న చిన్న మరమ్మతులు చేయాలని  ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ పేషెంట్ మృతి చెందితే 30 నిమిషాల్లో వార్డ్ నుంచి బయటకు తరలించాలని చెప్పారు. కోవిడ్ పరిక్షలకు నమూనాలను సేకరించి కేజీహెచ్లోనే పరీక్షలు నిర్వహించి జాప్యం చేయకుండా ఫలితాలు వెల్లడించాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సూపరింటెండెంట్ మైథిలి ఏ సి పి శిరీష  తదితరులు పాల్గొన్నారు.

కెజీహెచ్

2021-05-03 13:58:35

సీఎస్ఆర్ బ్లాక్ లో ల్యాబ్ ఏర్పాటు చేయండి..

కె.జి.హెచ్ సి.ఎస్.ఆర్. బ్లాకులో కోవిడ్ పేషెంట్లకు వైద్య సేవలు అందించడంలో ఎటువంటి లోటు పాట్లు వుండరాదని. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద కనపరచాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్  వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరు సి.ఎస్.ఆర్.బ్లాకులో వైద్య సేవలు, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ల డిశ్చార్జి, ఎక్వీప్ మెంటు , టెస్టింగ్ ఏజెన్సీ  ఏర్పాట్లు గావించిడం, తదితర అంశాలపై  చర్చించారు. సి.ఎస్.ఆర్ బ్లాకు ప్రత్యేకాధికారిగా  ఎస్. వెంకటేశ్వర్, పి.ఒ.ఐ.టి.డి.ఎ.పాడేరు ను  కలెక్టరు నియమించారు. సి.ఎస్.ఆర్.బ్లాకు లో వైద్యసేవలు, కోలుకుంటున్న పేషెంట్లు డిసార్చి గావించడం అన్ని విషయాలపై  ప్రత్యేక శ్రద్ద వహించాలని పి.ఒ. ఐ.టి.డి.ఎ.ను ఆదేశించారు. పేషెంట్లసు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు పి.పి.పి. క్రింద టెస్టింట్ ఏజెన్సీని గుర్తించాలని ఆదేశించారు. ఈ టెస్టింగ్ ఏజెన్సీని సి.ఎస్.ఆర్.బ్లాకు లోనే ఏర్పాటు గావించాలన్నారు.  పేషెంట్లను చేర్చుకునే విషయంలో టెస్టింగ్ ముఖ్యం కాదని, కోవిడ్  లక్షణాలు  వుంటే చేర్చుకుని అవసరమైన వైద్యసేవలు అందించాలని సూచించారు.  ఇ.సి.జి., ఎక్స్ రే , డయాలసిస్ మొదలగు టెక్నీషియన్స్ ను నియమించుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టరు –2 పి.అరుణ్ బాబు, ఆంధ్రా మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డా.పి.వి.సుధాకర్,  పి.ఒ. ఐ.టి.డి.ఎ. ఎస్ .వెంకటేశ్వర్ , తదితరులు హాజరయ్యారు.

హెల్త్ సిటీ, విమ్స్ లకు ఆక్సిజన్ సరఫరా 
జిల్లాలో హెల్త్ సిటీలోని ఆసుపత్రులు కోవిడ్  పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నాయని,  వాటికి ఆక్సిజన్ సరఫరాకు ఎటువంటి  ఇబ్బంది లేకుండా చూడాలని  డ్రగ్ ఇన్స్పెక్టర్లు రజిత, కళ్యాణిలను జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆదేశించారు. హెల్త్ సిటి ఆసుపత్రులకు  ఆక్సిజన్ అవసరాలను  దృష్టిలో  పెట్టుకొని తగు ఏర్పాట్లు గావించాలన్నారు.  విమ్స్ ఆసుపత్రిలో అన్ని పడకలకు ఆక్సిజన్ సరఫరాకు తగు ఏర్పాట్లు చేయాలని ఎ.పి.ఎమ్.ఎస్.ఐ.డి.సి. ఇ.ఇ.డి.ఎ.నాయుడును ఆదేశించారు. ఈ విషయంపై కలెక్టరు ఎ.పి.ఎమ్.ఎస్.ఐ.డి.సి. ఇ.ఇ. డి.ఎ.నాయుడును, ప్రత్యేకాధికారి ఎస్.ఎస్.ఎ.పి.ఒ.లతో చర్చించారు.

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు

వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులనన్నింటిని  ప్రతిరోజూ పరిశీలన గావించి కోవిడ్ పేషెంట్లకు అవసరమైన వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ డి.సి.హెచ్.ఎస్. లక్ష్మణ్ ను ఆదేశించారు. సదరు ఆసుపత్రులలో పడకలు, ఆక్సిజన్ , సేవలు, వివరాలను తెలియజేయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే  కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సి.హెచ్.సి.లలో వున్న పల్మనాలజిస్టలను  కె.జి.హెచ్.కు డెప్యూట్ గావించాలన్నారు.  ప్రైవేటు ఆసపత్రులను  తనిఖీ నిర్వహించాలని, నిబంధనలు ప్రకారం ఖాళీ పడకల వివరాలను 104 కాల్ సెంటర్ ఇంచార్జికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని  డి.ఎమ్ అండ్.హెచ్.ఒ.ను  ఆదేశించారు.  ప్రైవేటు ఆసుపత్రులకు  ఇచ్చిన నోటీసులపై వారి వివరాలను వెంటనే అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా.సూర్యనారాయణ, జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డా.రాజేష్ పాల్గొన్నారు.

కలెక్టరేట్

2021-05-03 13:56:02

అప్పన్న ఆలయం నిత్యం పరిశుభ్రం..

కరోనా వైరస్ కేసులు అధికంగా పెరుగుతున్న సమయంలో సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని అధికారులు అనునిత్యం పరిశుభ్రంగా ఉంచుతున్నారు. భక్తుల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో పెట్టుకొని హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. అంతేకాకుండా సామాజిక దూరాన్ని అమలు చేస్తూ..స్వామివారి దర్శనాన్ని కలిగిస్తున్నారు. వీటి కోసం దేవస్థానంలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దీనితో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ భక్తులు దేవస్థానంలో స్వామిని దర్శించుకుంటున్నారు.

సింహాచలం

2021-05-02 07:56:33

కరోనాను మనోధైర్యంతోనే తిప్పికొట్టాలి..

విశాఖలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న వేళ ప్రభుత్వ అధికారులు ప్రజలను అనుక్షణం అప్రమత్తం చేస్తున్నారు..జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ సూచనలతో ప్రతీ ఒక్క అధికారి ప్రజలను కరోనా వైరస్ నుంచి రక్షించడానికి శక్తివంచన లేకుండా క్రుషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే విశాఖ అర్భన్ తహశీల్దార్ జ్ణానవేణి కరోనా వైరస్ పట్ల ప్రజలను చైతన్య పరచడానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతూనే పలు సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా వైరస్ ను దైర్యంగా జయించడానికి ప్రతీ ఒక్కరూ మనోధైర్యంతో ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. తాను స్వయంగా చెప్పడంతోపాటు, తన కింది స్థాయి అధికారులను కూడా ప్రజల్లోకి వెళ్లే సమయంలో వారిలో దైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలకు సేవలు అందించడానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని, అవసరం లేకుండా ఎవరూ బయటకు రావొద్దని సూచిస్తున్నారు. కుటుంబాల్లోని వయసు మళ్లిన వారిని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు. కరోనా ఉన్నంత కాలం కాచిన నీళ్లను తాగాలని, మాస్కును తీయకుండా ఉండాలని, సామాజిక దూరం పాటించాలని, ఏ పనిచేసినా చేతులు సబ్బుతో పరిశుభ్రంగా చేసుకోవాలని, ఎలాంటి కరోనా లక్షణం ఉన్నా వెంటనే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారు హోం ఐసోలేషన్ కిట్లను తీసుకొని ఇంట్లో గానీ, పరిస్థితి బాగోలేకపోతే  ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందించే వైద్య సహాయాలు పొందాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ కార్యాయాలకు వచ్చే ప్రజలను కూడా ఈమె తరచుగా అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. తన కార్యాలయంలో శానిటైజర్లు ఏర్పాటు చేయడంతోపాటు, ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను అమలు చేస్తున్నారు. విశాఖ అర్భన్ తహశీల్దార్ జ్ణానవేణి కరోనా వైరస్ పట్ల చేస్తున్న ఈ ఆదర్శవంతమైన చైతన్యం, సూచనలతో పట్ల ప్రజల నుంచి మంచి స్పందన లభించడం విశేషం.

విశాఖపట్నం

2021-05-02 04:28:15

అప్పటి వరకూ ఆర్టీఓ పనులకు బ్రేక్..

 విజయనగరం రవాణా శాఖ కార్యాలయంలో, లెర్నర్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహన సంబంధిత ఫిట్నెస్,  ఇతర పనులు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు రవాణా శాఖ ఉప కమిషనర్ సి.హెచ్. శ్రీదేవి తెలిపారు. కరోనా రెండో విడత విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రవాణా కమిషనరు ఆదేశాలు జారీ చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ సోమవారం అనగా 3.5.2021 నుంచి 31.5.2021 వరకూ రవాణా శాఖ కార్యాలయంలో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఉన్నత అధికారుల నుంచి వచ్చే తదుపరి ఆదేశాల మేరకు కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఆమె వివరించారు. ప్రజలకు అవసరమైన సమాచారం కోసం ఆదినారాయణ ఆర్టీవో  9154294202,  కృష్ణమోహన్ ఏవో 9848528305, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ జె.రాంకుమార్ 9154294411 , ఎం.బుచ్చిరాజు 9154294412 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు.

విజయనగరం

2021-05-01 16:35:38

కోవిడ్ బిల్లులు సమర్పించాలి..

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ మొదటి విడత బిల్లులు తక్షణం సమర్పించాలని జిల్లా కలెక్టర్   జె నివాస్ ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేస్తూ మొదటి విడత కోవిడ్ సమయంలో వివిధ సామగ్రి పంపిణీ చేసిన ఏజెన్సీలు బిల్లులు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. గతంలోనూ బిల్లులు సమర్పించాలని కోరడం జరిగిందని, అయితే ఇప్పటి వరకు కొన్ని ఏజెన్సీలు బిల్లులు సమర్పించలేదని ఆయన అన్నారు. బిల్లులు సమర్పించుటకు చివరి అవకాశం కల్పిస్తున్నామని ఆయన స్పష్టం చేసారు. బిల్లులను మే 5వ తేదీ నాటికి సమర్పించాలని, గడువు దాటిన తరువాత సమర్పించిన బిల్లులు పరిగణనలోకి తీసుకోవడం జరగదని ఆయన స్పష్టం చేసారు.

శ్రీకాకుళం

2021-05-01 16:32:55

పిల్లల ఆరోగ్యం కోసమైనా వాయిదా వేయండి..

ఆంధ్రప్రదేశ్ లో విపరీతంగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో 10వ తరగతి, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని సామాజికవేత్త, ప్రముఖ న్యాయవాది రహిమున్నీసాబేగమ్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, కరోనా కేసులు అధికంగా మారుతున్న వేళ విద్యార్ధుల పరీక్షలను రద్దు చేయాలని, కుదరకపోతే వాయిదా వేయాలన్నారు. ప్రస్తుతం రోజుకు వేలల్లో కేసులు, పదుల సంఖ్యలో మరణాలు పెరుగుతున్నాయని ఆమె గుర్తు చేశారు. విశాఖలో సాధారణ ప్రజలతోపాటు చిన్నపిల్లలు కూడా కరోనా వైరస్ భారిన పడి మ్రుత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం ప్రభుత్వం. ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేయడం ద్వారా విద్యార్ధులు మరింతగా పరీక్షలకు సిద్ధం కావడానికి కూడా ఆస్కారం వుంటుందని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. పెద్దలను వెంటాడుతున్న కరోనా రేపు పిల్లలను కూడా పట్టి పీడిస్తుందని, ప్రభుత్వం తక్షణమే పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలన్నారు. చాలా చోట్ల ఉపాధ్యాయులు కూడా ఈ కరోనా భారిన పడి మరణిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సత్వరమే నిర్ణయం వెనక్కి  తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆమె కోరారు.

విశాఖపట్నం

2021-05-01 16:10:07